Monday, August 2, 2021

ప్రభుత్వంపై రిటైర్డ్ IPS ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : 02/08/2021

ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

ఈమధ్యే వీఆర్ఎస్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. రాష్ట్రంలో రా‘బందు’లున్నంత కాలం విలువైన ప్రాణాలు పోతాయని అన్నారు. నిన్న జమ్మికుంటలో నిరుద్యోగి సూసైడ్ పై స్పందించిన ఆయన సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

ఆర్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్

నీళ్లు-నిధులు-నియామకాలు అన్న నినాదంతో గద్దెనెక్కి ఏటా లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి ప్రాజెక్టుల (కొత్త సచివాలయం తో సహా) స్కెచ్ లు వేసి వేల కోట్లను దోచుకుంటున్న రా’బందు’లున్నంతకాలం తెలంగాణ గడ్డలో విలువైన ప్రాణాలు ఇట్లపోతనే ఉంటై. శ్రమ ఎవరిది..? సిరి ఎవరిది..?

No comments:

Post a Comment