Wednesday, January 31, 2024

ఎంపీ... 'ఇజ్జత్‌' తీసుకున్నావు కదరా.!

ఎంపీ... 'ఇజ్జత్‌' తీసుకున్నావు కదరా.!
● బీఆర్‌ఎస్‌ ఎంపీ పార్థసారథి వేలకోట్ల నిర్వాకం
● 'సాయిసింధు ఫౌండేషన్‌' మాటున ఘరానా దోపిడీ 
● హైకోర్టు వద్దన్నా రూ.4 వేల కోట్ల విలువైన భూమి ధారాదత్తం
● ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున..
● రూ.30 లక్షలకే లీజుకు కట్టబెట్టిన గత ప్రభుత్వం
● గత సర్కారు రహస్య జీఓలతో దొంగలాట 

Courtesy / Source by :
(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు మీ, 9440000009)

ఐటీ కారిడార్‌లో అత్యంత ఖరీదైన స్థలం అది..! హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 15 ఎకరాల భూమిని గత సర్కారు తమ ఎంపీకి కారు నిసిగ్గుగా, నిర్లజ్జగా, నిస్సంకోచంగా.. చౌకగా కట్టబెట్టింది. రూ.4 వేల కోట్ల విలువైన భూమిని.. ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇచ్చింది. అంతేకాదు.. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌కు ఎన్నికలకు ముందు గోప్యంగా చీకట్లో జారీ చేసిన జీఓ ద్వారా ఈ భూమిని ధారాదత్తం చేసింది.

ఇదేం దిగజారుడు..:
ఈ వ్యవహారంలో గత సర్కారు ఎంతలా దిగజారిందంటే.. హైకోర్టు జీఓను కొట్టివేసినా.. లీజు కేటాయింపులను రద్దు చేస్తూ.. పునఃపరిశీలించాలని ఆదేశించినా పెడచెవిన పెట్టింది. పైగా.. లీజు నిబంధనలకు సంబంధించిన జీఓలకు సవరణలు చేసి, కొత్త జీఓ ద్వారా మళ్లీ పార్థసారథిరెడ్డి ట్రస్టీగా ఉన్న సంస్థకు భూములను 'వాళ్ళమ్మ మొగుడు'దని కట్టబెట్టింది.

అసలేం జరిగింది..?:
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై.. బీఆర్‌ఎస్‌ (అప్పట్లో టీఆర్‌ఎస్‌) అధికార పగ్గాలు చేపట్టిన మూణ్నెల్లకే.. అంటే 2014 సెప్టెంబరులో హెటిరో డ్రగ్స్‌ కంపెనీ ఎండీ పార్థసారథి రెడ్డి ఎవరికీ అనుమానం రాకుండా 'సాయిసింధు ఫౌండేషన్‌' పేరుతో ఒక చారిటబుల్‌ ట్రస్ట్‌ను నెలకొల్పారు. ఆ ట్రస్టు పేరుతో తాము క్యాన్సర్‌ జనరల్‌ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు ప్రభుత్వానికి విన్నవించారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని హైటెక్స్‌ వెళ్లే మార్గంలోని 'ఇజ్జత్‌ నగర్‌'లో 15.48 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలంటూ విజ్ఞప్తి చేశారు. 1989లో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి లీజుకు ఇచ్చిన తరహాలోనే.. ఏడాదికి రూ.50 వేల చొప్పున చెల్లించేలా భూమిని కేటాయించాలని కోరారు. అందుకు ప్రతిగా.. తమ ఆస్పత్రిలో కూడా 25% మంది ఇన్‌ పేషెంట్లు, 40% మంది ఔట్‌ పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రతిపాదించారు.

వేలం వేయకుండా...:
అప్పటికే పార్థసారధిరెడ్డి ట్రస్టు అడిగిన స్థలాన్ని వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వనరుల సంస్థ(టీఎస్‌ఐఐసీ) నిర్ణయించింది. దీంతో.. 'ఇజ్జత్‌'నగర్‌కు బదులుగా.. ఆ పక్కనే ఉన్న ఖానామెట్‌లో స్థలం కేటాయించాలని బీఆర్‌ఎస్‌ సర్కారు నిర్ణయించింది.

అత్యున్నత ప్రాధాన్యత' పేరుతో..:
ఖానామెట్‌ సర్వేనంబరు 41/14/2లో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించాలంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏకు 'అత్యున్నత ప్రాధాన్యత' కింద ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అప్పట్లో శేరిలింగంపల్లి తహసీల్దార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆ భూమి విలువైనదని.. మార్కెట్‌ ధర ప్రకారం ఎకరాకు రూ.33.7 కోట్ల చొప్పున రూ.505.5 కోట్ల విలువ ఉంటుందని పేర్కొంటూ ప్రభుత్వానికి 'నోట్‌' పంపించారు. అప్పటి రాజేంద్రనగర్‌ ఆర్డీఓ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మమ్మల్నేం చేస్తారు...?
('ఆకులు పీకలేరు' అని రాస్తే బాగుండదని..):
నాటి కేసీఆర్‌ సర్కారు వెనక్కి తగ్గలేదు. సాయిసింధు ఫౌండేషన్‌ ట్రస్టుకు ఆ భూముల లీజులకు సంబంధించిన ఉత్తర్వు జీఓ 571 ప్రకారం కేటాయించాలని నిర్ణయించింది. ఆ ఉత్తర్వును 2015లో సవరిస్తూ.. జీఓ 218ను విడుదల చేసింది. ఆ సవరణల్లో సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు భూమిని లీజుకు ఇస్తే.. సంబంధిత భూమి విలువలో 10శాతాన్ని ఏడాది లీజుగా చెల్లించాలనే విషయాన్ని చేర్చింది. అంటే.. ప్రభుత్వ భూమి విలువ రూ.505.5 కోట్లు కాగా.. అందులో 10%.. అంటే.. రూ.50కోట్ల చొప్పున లీజును చెల్లించాలి. 60 ఏళ్లకు లీజుకు ఇచ్చేలా.. ఐదేళ్లకోసారి లీజు విలువను 10% చొప్పున పెంచుతూ వెళ్లాలని స్పష్టం చేసింది. 

ఆ జీఓను కూడా ప్రభుత్వం తుంగలోకి తొక్కుతూ..:
ఏడాదికి ఎకరాకు రూ.1.47 లక్షల చొప్పున చెల్లించేలా పార్థసారథిరెడ్డి ట్రస్టుకు లీజుకు ఆ భూమిని కట్టబెడుతూ 2018 మార్చి 22న జీఓ 59ని విడుదల చేసింది.

హైకోర్టు ఆదేశాలా..మాకేం లెక్క..:
జీఓ 59 ప్రకారం సాయిసింధు ఫౌండేషన్‌ ట్రస్టుకు భూకేటాయింపుపై 2018లోనే డాక్టర్‌ ఊర్మిళ పింగ్లే, మరొకరు హైకోర్టులో సవాలు చేశారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న హైకోర్టు.. చవక లీజుపై ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. 2023 జూన్‌ 5న తుదితీర్పునిస్తూ.. జీఓ 59ని రద్దు చేసింది. భూకేటాయింపు పాలసీకి సంబంధించిన జీఓ 218ను పునఃసమీక్షించి, నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘‘ప్రజల ఆస్తులకు, వనరులకు ప్రభుత్వాలు ట్రస్టీగానే వ్యవహరించాలి. ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేప్పుడు.. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి’’ అంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోలేదు.

జీఓల మాటున కుమ్మేయటమే..!:
పార్థసారథిరెడ్డి ట్రస్టుకు లీజును కట్టబెట్టేందుకే మొగ్గుచూపింది. మరోమారు లీజు నిబంధనలను సవరించింది. ఆ మేరకు 2023 ఆగస్టు 11న జీఓ 99 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో.. ‘‘సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు భూములను తక్కువ ధరకు ఇచ్చే విచక్షణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది’’ అనే పదాన్ని చేర్చింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందే.. అంటే.. 2023 సెప్టెంబరు 25న జీఓ 140 ద్వారా సాయిసింధు ఫౌండేషన్‌కు విలువైన భూమిని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఏడాదికి రూ.50 కోట్ల మేర లీజు చెల్లించాలని, ప్రతి ఐదేళ్లకోసారి లీజుమొత్తాన్ని 10% మేర పెంచాలని సర్కారు జారీ చేసిన నిబంధనలు చెబుతున్నా.. ‘విచక్షణ అధికారం’ పేరుతో బీఆర్‌ఎస్‌ సర్కారు ఏడాదికి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున.. 15.4 ఎకరాలకు రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇస్తున్నట్లు జీఓ140లో స్పష్టం చేసింది. గతంలో ఈ వ్యవహారం రచ్చగా మారి, హైకోర్టుదాకా వెళ్లడంతో కాస్త జాగ్రత్తపడ్డ బీఆర్‌ఎస్‌ సర్కారు.. ఈ జీవోను గోప్యంగా పెట్టడం గమనార్హం..! నిజానికి ఆ భూముల విలువ 2023 కల్లా ఎనిమిదింతలు పెరిగాయి. ఖానామెట్‌లో ఎకరా మార్కెట్‌ విలువ రూ.300 కోట్ల దాకా ఉంది. ఈ లెక్కన రూ.4 వేల కోట్ల విలువైన భూములను ఏడాదికి రూ.30 లక్షలు చెల్లించేలా.. 60 ఏళ్లకు బీఆర్‌ఎస్‌ సర్కారు పార్థసారధిరెడ్డి ట్రస్టుకు ధారాదత్తం చేసింది.

చివరిగా...:
ఏదో ఒకరోజున చావటం ఖాయం. పాడెక్కటం ఖాయం.  అప్పుడు ఒక్క రూపాయి కూడా వెంటరాదని తెలిసినా... ఏందిరా మీ బతుకులు.. చెడ.!

హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి

Hyderabad: హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి

హైదరాబాద్ సీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kotha Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీచేశారు..

ఒకేసారి 85 మంది సిబ్బందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇందులో హోంగార్డ్ స్థాయి నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు అందరూ ఉన్నారు. వారిని ఏఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్‌ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఒక పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారి. బదిలీలతో పంజాగుట్ట పీఎస్ ఖాళీ అవడంతో..ఇతర స్టేషన్‌ల నుంచి 82 మంది కొత్త సిబ్బందిని నియమించారు..

పంజాగుట్ట పోలీసులపై ముందు నుంచీ పలు ఆరోపణలున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు పలు కీలక విషయాలను గత ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. పోలీస్ స్టేషన్ నుంచి పలు కీలక విషయాలు బయటకు పొక్కడంపై హైదరాబాద్ సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు..

Telangana Government Calendar Released

Hon'ble Chief Minister Sri @Revanth_Anumula released the #Telangana Government Calendar at Dr. B. R. Ambedkar Telangana State Secretariat today. Minister for Roads & Buildings Sri @KomatireddyKVR, @TelanganaCS Smt. Santhi Kumari, Principal Secretary Home Sri Jitender, Commissioner Printing & Stationary Sri Anjani Kumar were present on this occasion.

https://twitter.com/TelanganaCMO/status/1752327853364986123?t=Xl5gl8e__mbPSqWCUjqu4w&s=19


Monday, January 29, 2024

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ మెస్ ఛార్జీలు, పెండింగ్ స్కాలర్ షిప్స్,ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి.. SFI

ప్రచురణార్ధం/ప్రసారర్ధం:
తేదీ: 29-01-2024,
*మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా*

విషయం:-  *రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ మెస్ ఛార్జీలు, పెండింగ్ స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్, విడుదల చేయాలని, విద్య రంగా సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ మందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది*

*మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు*

ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.కార్తీక్, రాథోడ్ సంతోష్  మాట్లాడుతూ......*
తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం కాలంగా వసతి గృహాలు, గురుకులాలు, కెజిబివిలు ,ఆశ్రమ పాఠశాలు, కళాశాల హాస్టల్స్ సంబంధించిన మెస్ బిల్లులు సమారు 6,300 కోట్లు పెండింగులో ఉన్నాయి. వాటిని  విడుదల చేయలేదు హెచ్చరించారు.గత ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో  విడుదల చేయాలని కోరిన ఫలితం లేకుండా పోయింది. అలాగే గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు కూడా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. వార్డెన్లు అప్పులు తీసుకుని వచ్చి హస్టల్స్ నడుపుతున్నారు. దీనివల్ల పేద విద్యార్థులు చదువుకుంటున్న వసతిగృహాలకు నాణ్యమైన భోజనం, వసతి కల్పించకపోవడం సిగ్గుచేటు అన్నారు. అలాగే గత ఆరు సంవత్సరాల నుండి రాష్ట్రంలో 7800కోట్ల స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల కాకపోవడం వల్ల పేద బడుగు బలహీన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక సార్లు ఉద్యమాలు చేసిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 14 లక్షల మంది విద్యార్థులు తమ ఫీజులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. చేశారు.జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెడతామని గత ప్రభుత్వం అనేక సార్లు హామీ ఇచ్చి విద్యార్థులను మోసం చేసింది.ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వసతి కళాశాలలో కల్పించాలని కోరుతున్నాము. మేడ్చల్ జిల్లాలో కొన్ని మండలాల్లో స్విఫ్ట్ వైస్ గా నడుస్తున్న జూనియర్, డిగ్రీ కళాశాలలను  రెగ్యులర్గా నడిపేటట్టు చూడాలి. జూనియర్ కళాశాల లేని మండలాలకు నూతన జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలి. మేడ్చల్ నియోజవర్గాల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత బిల్డింగ్ లేకుండానే మూడు రూములలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడపడం సిగ్గుచేటు అన్నారు.వెంటనే సొంత భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లాలో గుర్తింపు లేకుండా నడుపుతున్న ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లని ప్రవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ గుర్తింపు లేకుండా కూడా చలామణి అవుతున్నాయి. ఈ సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ పూర్తికాకముందే ఇంటర్మీడియట్ ప్రవేట్, కార్పొరేట్ విద్యా సంస్థ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మా కళాశాలలో అడ్మిషన్ తీసుకోండి అని ఒత్తడీలు పెడుతున్నారు. అలాంటి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా ము. మేడ్చల్ జిల్లాలో ఖాళీగా ఉన్న డీఈవో ఎంఈఓ టీచర్స్ వర్కర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్య రంగ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాన్ని రూప పొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.
 ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సుమంత్, వంశీ, మనీకండు,జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్, జిల్లా కమిటీ సభ్యులు శ్యామ్ రావు, కార్తీక్,అవినాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అనుదీప్, శివసాయి,మనీష్,అజయ్,గిరిధర్,రాకేష్, భూపతి తదితరులు పాల్గొన్నారు.

ధన్యవాదములతో....

రాథోడ్ సంతోష్
ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి
9618604620

Saturday, January 27, 2024

_జనం 'ఛీ' కొట్టి నా..:_

*_ఒక్క ట్వీట్‌లోనే బోలెడంత ఫ్రస్ట్రేషన్..!_*
_* కేటీయార్ పూనకాలు లోడింగ్.!_
_* మదిలో 11 ఎకరాల తన్నలాట_
_* కేటీఆర్‌కు ఎందుకంత ఉరుకులాట..?_
_* నేతలపై కేసులు.!_

*_(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_*

కేటీయార్ చేసిన ఒక ట్వీట్‌లో ఎన్నో భావాలు. అసలు ఒక ట్వీట్‌లో ఇన్నిరకాల ఉద్వేగాల్ని ప్రదర్శించవచ్చునని సకల నెటిజనం హాశ్చర్యపోయే ట్వీట్ ఇది. కేటీయార్ నిజంగా గ్రేట్.!

*_జనం 'ఛీ' కొట్టి నా..:_*
ఎంత ఖర్చుపెట్టినా, ఎంత మభ్యపెట్టినా జనం 'ఛీ' కొట్టి ఒకవైపు అధికారం పోయిన మంట. జైలులో వేసినా, ఎంత తొక్కాలని చూసినా అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న దృశ్యం పదే పదే మదిలో మెదులుతూ ఒకటే 'దుగ్ధ'. తరుముకొస్తున్న కాళేశ్వరం విజిలెన్స్ కేసుతో ఎక్కడ బండారాలన్నీ బట్టబయలవుతాయోనని ఒకవైపు భయం. 500 కోట్ల రెరా బాలకృష్ణుడు ఏం బయట పెడతాడోనని మరోవైపు సందేహం. ధరణి పాపాలన్నీ పుట్ట పగిలినట్టు పగులుతాయేమోనని ఇంకోవైపు ఆందోళన.

*_ఆయనేం బయటపెడతాడో..?_*
నిరుద్యోగుల ఆశల్ని కూల్చిన టీఎస్పీఎస్సీ ఘోరాల చిట్టా తెర మీదకు వచ్చి ఆ మాజీ ఐపీఎస్ మహేందర్‌రెడ్డి ఎవరిని ఫిక్స్ చేస్తాడోనని ఇదో ఫ్రస్ట్రేషన్. ఇంటర్ బోర్డులో 'గ్లోబరినా అరాచకాలు, కాలిపోయిన విద్యార్థుల బతుకుల కారకులు బయటపడితే ఎలా..?' అనే ప్రశ్నార్థకం.? స్మితలు, అరవిందులు సరెండర్ అయిపోతే ఇంకేం బాగోతాలు రట్టవుతాయేమోనని అసహనం.!

*_రూ.1000 కోట్ల విలువైన 11 ఎకరాల పంచాయితీ_*
నామమాత్రపు ధరకు 1000 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిపై కోర్టులో విచారణపైనే కాదు. ఇరువైపులా బీజేపీ, కాంగ్రెస్ కొరడాలు పట్టుకుని తరుముతుంటే ఇక పార్టీ భవిష్యత్తు ఏమిటనే అనిశ్చితి.! సందిగ్ధత..! ఇలా చెబుతూ పోతే... ఎన్నో, ఎన్నెన్నో.! అన్నింటికీ ఈ రేవంతుడే కారణం అన్నట్టుగా.. సహించలేక, ఆగలేక, భరించలేక వ్యక్తిగత దాడి. అక్షరాలా ఇది పూర్ ట్వీట్. చీప్ టేస్ట్..!

*_వేపమండల ట్విట్లు_*
'కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలా మాను వినురా సుమతీ' అనే పద్యాన్ని, దాని తాత్పర్యాన్ని ఓ ట్వీట్ చేశాడు కేటీయార్. పేరు పెట్టకపోయినా అది రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తుందనేది అందరికీ తెలుసు. దావోస్‌లో రేవంత్ భాషను వెక్కిరిస్తారు. తన ఆహార్యాన్ని వెక్కిరిస్తారు. రేవంత్ ప్రతి అడుగునూ లక్ష్యం చేసుకుంటారు. రెండు నెలలకే ఎందుకింత శివాలు, పూనకాలు, ఊగిపోవడాలు.. ఈ ట్వీట్ల వేపమండలు..

*_అహంకారం కాదు.. వినయం ఉండాలి:_*
పేపర్ల లీకేజీలతో నిరుద్యోగుల కొంపలు కాలిస్తే, మహిళా గవర్నర్‌ను నానారకాలుగా అవమానిస్తే..! అదే గవర్నర్ ఎమ్మెల్సీల భర్తీ ఫైల్ కూడా తిప్పికొడితే..! ఇదే రేవంత్ వెళ్లి సింపుల్‌గా టీఎస్పీఎస్సీ, ఎమ్మెల్సీల ఫైళ్లను క్లియర్ చేయించుకోవడం చూస్తుంటేనే కేటీఆర్‌కు మండిపోతున్నట్టుంది. '420 హామీలు' అని ఎంత వెక్కిరించినా, పోయేముందు ఏడు లక్షల అప్పులతో చిప్ప చేతికిచ్చినా ఒక్కొక్క హామీని అమలు చేస్తుంటే ఎక్కడో మండుతూ.. మాడిపోతున్నట్టుంది. కదా..! కేటీఆర్

*_ఆ మాడు వాసనే..:_*
కాలుతున్న ఆ వాసనే ఇప్పుడు ట్వీట్లలో వ్యాపిస్తోంది. అంత ఫ్రస్ట్రేషన్ అవసరమా..?

*_కేటీఆర్‌కు ఎందుకంత ఉరుకులాట..?_*
త్వరలో మన ప్రభుత్వం వస్తుందంటూ ఈ ప్రభుత్వాన్ని కూల్చేసే కొత్త కుట్రల సంకేతాల్ని జనంలోకి వదలడం అవసరమా..? కాంగ్రెస్ ప్రజావ్యతిరేకంగా పరిపాలిస్తే ఇదే జనం తమ తీర్పు చెబుతారుగా రాబోయే ఎన్నికల్లో… కేటీఆర్‌కు ఎందుకంత ఉరుకులాట..? పోనీ, ఇదే కాంగ్రెస్ ఇదే ట్వీట్‌కు ఇలా కౌంటర్ చేస్తే..?

*_‘‘అవును, కేటీయార్, నువ్వు చెప్పింది అక్షరసత్యం… తెలంగాణ రాగానే కనకపు సింహాసనమున ప్రజలు కుర్చీలో కూర్చోబెట్టారు, కానీ వెనుకటి గుణం మానలేదు..! ప్రజలు మొన్న ఛీకొట్టి తరిమినా సరే అదే వెనుకటి గుణం..’’ అని తిప్పికొడితే..?_* అసలే రేవంత్ కొంత డిఫరెంట్.. మెత్తమెత్తటి జానారెడ్డి కాదు..! ఈంట్‌కా జవాబ్ పత్తర్‌సే దేనేవాలా..! సో, కాస్త ఆగండి బ్రదర్… రేవంత్ మార్క్ తవ్వకాలు ఇంకా జన్వాడ గెస్ట్ హౌజ్ దాకా రానేలేదు కదా..!!

*_వీళ్లే కదా..!:_*
మోడీని ఎడాపెడా తిడుతూ.. ఇప్పుడు ముఖ్యమంత్రిని తిడుతూ.. గవర్నర్‌ను అవమానిస్తూ.. గతంలో కేసీయార్ మీద పల్లెత్తు మాట మాట్లాడితే మాత్రం, ఒక ముఖ్యమంత్రిని 'అన్నేసి మాటలనొచ్చా' అని సన్నాయి నొక్కులు నొక్కింది…!! హలో సారూ… రేవంత్ శునకం అంటున్నావు సరే, జనం కోరినట్టే కాపలా కుక్కలా ఉంటానన్నది ఎవరు..? ఆ కుక్క ఎవరు.? పేరేంటి.?

https://telanganawatch.in/article.php?data=a-lot-of-frustration-in-one-tweet

Friday, January 26, 2024

*పురస్కారం అందుకున్న గంటలోనే... హఠాన్మరణం*

*పురస్కారం అందుకున్న గంటలోనే... హఠాన్మరణం*

*గుండెపోటుతో ఆదిలాబాద్‌ బల్దియా మేనేజరు దివాకర్‌ మృతి*

ఆదిలాబాద్‌ : పురస్కారం అందుకున్న ఆనందంలో ఉండగానే ఆయన ఆయువు తీరింది. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూరు పట్టణానికి చెందిన దివాకర్‌(56) ఆదిలాబాద్‌ బల్దియాలో మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నారు.ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన ఆయన జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంటికి వెళ్లాక గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టినప్పటి నుంచే వైకల్యం కారణంగా వీల్‌ఛైర్‌కే పరిమితమైన ఆయనకు 2004లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. పదేళ్లకు పైగా ఆదిలాబాద్‌ బల్దియాలోనే విధులు నిర్వహించడంతో అక్కడే స్థిరపడ్డారు. భార్య నాగలక్ష్మి, కుమారులు సాయి (సాప్ట్‌వేర్‌), గిరిధర్‌ (ఆర్మీ ఉద్యోగి). పురపాలక అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌, కమిషనర్‌ ఎ.శైలజ, బల్దియా అధికారులు, సిబ్బంది భౌతిక కాయానికి నివాళులర్పించారు.

*V.S. జీవన్*

Thursday, January 25, 2024

TSPSC చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి.... గవర్నర్ ఆమోదం

*TSPSC చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి.... గవర్నర్ ఆమోదం*

హైదరాబాద్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం నిర్ణయం తీసుకున్నారు.అలాగే టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా రిటైరర్డ్‌ ఐఏఎస్‌ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్‌ ఉల్లా ఖాన్‌, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పోస్టింగ్‌ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్‌ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్‌ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు.ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్ణాపురంలో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్‌ పోలీస్‌ సర్వీస్‌ అధికారి. ఏఎప్పీగా మొదలైన ఆయన కెరీర్‌ డీజీపీగా పదవీ విరమణ పొందారు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీవిరమణ తర్వాత 2017 నవంబర్‌ 12న ఇన్‌ఛార్జి డీజీపీగా నియమితుడయ్యారు. 2018 ఏప్రిల్‌10న పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. మహేందర్‌రెడ్డి 2022 డిసెంబర్‌లో డీజీపీగా పదవీ విరమణ పొందారు. మూడేళ్లకు పైగా తన పదవీ కాలంలో ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ కీలకంగా వ్యవహరించారు. అందుకే 2020లో ఏప్రిల్‌ 8న దేశంలోని టాప్‌ 25 ఐపీఎస్‌ అధికారులతో జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. 

మహేందర్‌రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైనా.. ఈ ఏడాది డిసెంబర్‌ వరకే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే.. కమిషన్‌ నిబంధనల ప్రకారం.. 62 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

*V.S. జీవన్*

ఉద్యమ నేతకు ప్రభుత్వ గౌరవం ఇదీ

*ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్...*

*గవర్నర్ కోటాలో పదవి* 

 *ఉద్యమ నేతకు ప్రభుత్వ గౌరవం ఇదీ..*
 
 తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. తెలంగాణ ప్రభుత్వం మరో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించింది. ప్రొఫెసర్ కోదండరామ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. కోదండరామ్‌తో పాటు అమరుల్లా ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసింది. వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర తెలపడంతో ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక పదవి దక్కింది

*V.S. జీవన్*

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

*రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్*

*పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం*

*నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి కొండప్పకు పద్మశ్రీ*

*దాసరి కొండప్ప బుర్రవీణ వాయిద్యకారుడు*

*ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ*

*కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఉమామహేశ్వరి*

*యక్షగానకళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ(తెలంగాణ)*

*34 మందికి పద్మశ్రీ అవార్డులు*.   CRM

Wednesday, January 24, 2024

కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు

జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని వారి నివాసంలో.. కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమం), శ్రీ వేణుగోపాల్ రావు గారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు (ప్రజా వ్యవహారాలు), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లు రవి గారు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, శ్రీ బల్మూరి వెంకట్ గార్లు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులను మరియు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి గారు అభినందించారు.

దావోస్ పర్యటనలో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడం పై సీఎం శ్రీ రేవంత్ రెడ్డికి వారంతా అభినందనలు తెలిపారు.

https://twitter.com/INCTelangana/status/1749975906884747447?t=v9aAQj0WoClL6kmLi36fdw&s=19

Tuesday, January 23, 2024

*⚡ఫిబ్ర‌వ‌రి నుంచే 200యూనిట్ల ఉచిత విద్యుత్⚡*

*⚡ఫిబ్ర‌వ‌రి నుంచే 200యూనిట్ల ఉచిత విద్యుత్⚡*

రాష్ట్రంలో వచ్చే నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇవాళ‌ గాంధీ భవన్‌లో ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు.. వాటి అమలుపై కమిటీ చర్చించింది. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వంద రోజుల్లో తాము ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పలు హామీలు నెరవేర్చామని, మిగతా వాటిని గడువులోగా అమలు చేస్తామన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. వచ్చేనెల నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామన్నారు. హామీల అమలుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. ఈ కారణంగానే హామీల అమలు జాప్యం అవుతోందని వెల్లడించారు. కాళేశ్వరం సహా గత ప్రభుత్వ పాలనలోని అన్ని అక్రమాలపై విచారణ ఉంటుందన్నారు.నిరుద్యోగ భృతి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల వరకు అన్ని హామీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క లోక్ సభ సీటును కూడా గెలుచుకోందని వ్యాఖ్యానించారు.
CRM

Monday, January 22, 2024

‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా సౌరశక్తి నుంచి విద్యుత్‌ ఉత్పత్తి పెంచేందుకు గాను ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని  ప్రారంభించనున్నామని ప్రధాని మోదీ సోమవారం తెలిపారు. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం తన నివాసానికి  వెళ్తున్న  సమయంలో పీఎం మోదీ ఈ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

‘ప్రపంచంలోని భక్తులందరూ సూర్యవంశీ శ్రీరాముడి కాంతితో ఎల్లప్పుడూ శక్తిని పొందుతారు. అయోధ్యలో రామూలల్లా పవిత్ర ఉత్సవం తర్వాత దేశ ప్రజలంతా.. తమ ఇళ్లపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ వ్యవస్థను కలిగి ఉండాలి. దాని కోసం ఈ  పథకాన్ని ప్రారంభించనున్నాం’ అని నరేంద్ర మోదీ తన ‘ఎక్స్’ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 

దేశంలో సుమారు కోటి ఇళ్లలో ఈ పథకం ద్వారా సోలార్‌ రూఫ్‌ టాప్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ పథకం పేద, మధ్యతరగతి చెందినవారికి కరెంట్‌ బిల్లు తగ్గించడమే కాకుండా విద్యుత్‌ రంగంలో భారత దేశ స్వావలంబనను పెంచుతుందని పేర్కొన్నారు. ఇక.. ఈ పథకానికి సంబంధించి అధికారులు చూపించిన సోలార్‌ రూఫ్‌ టాప్‌ సిస్టం ప్యాలెన్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.  CRM

Sunday, January 21, 2024

@Revanth_Anumula and officials undertook a study trip

Hon’ble Chief Minister Sri @Revanth_Anumula and officials undertook a study trip of the #DubaiWaterfront, and visited atop a skyscraper for an aerial perspective of the entire project Sunday afternoon.

The team was shown the linkage between water, land and building, and its socio-economic impact on hyper-local communities.

The team also discussed project management issues including international funding and investment possibilities, execution challenges, costs and timelines, and its replication possibilities in #Hyderabad as part of the #RiverMusi rejuvenation project.

https://twitter.com/TelanganaCMO/status/1749086013497197003?t=LMhW3AHTWhI30cHLMJAaUA&s=19

Saturday, January 20, 2024

ప్రభుత్వ సలహాదారుల... నియామకం

*ప్రభుత్వ సలహాదారుల... నియామకం*

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రభుత్వ సలహాదారులు వీరే..
► హర్కర వేణుగోపాల్- ప్రోటోకాల్,పబ్లిక్ రిలేషన్‌► వేం నరేందర్ రెడ్డి- సీఎం వ్యవహారాలు
► షబ్బీర్ అలీ- ఎస్సీ, ఎస్టీ,ఓబీసీ, మైనారిటీ శాఖలు
► మల్లు రవి- ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

*V.S. జీవన్*

CM Sri @Revanth_Anumula concludes successful #Davos trip

🚀🎯CM Sri @Revanth_Anumula concludes successful #Davos trip with record investments

🎯 ₹40,232 crore investments to come to #Telangana 
🎯 Record investments nearly double of last year
🎯 Team led by Chief Minister Sri A. Revanth Reddy, IT & Industries Minister Sri @Min_SridharBabu met over 200 major business houses, leaders in 3 days
🎯 Chief Minister Sri Revanth Reddy stood up for farmers at @WEF Annual meeting as part of food systems vision, asked world leaders to work to make farming profitable
🎯 Global business endorses CM Sri Revanth’s vision for Telangana, #Hyderabad

Chief Minister Sri A. Revanth Reddy, leading a team comprising IT & Industries minister Dr. D. Sridhar Babu and officials, harnessed the three-days trip to Davos, during which Telangana set a record in getting new investments deals signed - of ₹40,232 crore. This is nearly double the amount the state of Telangana could muster last year at Davos.

The investment concluded positively with @AdaniOnline, @TheJSWGroup, @WebWerksDC, @TataTech_News, BL Agro, @Surg_Holdings, Godi Energy, Aragen Life Sciences, Innovera Pharmaceuticals, QCentrio, Systra, @Uber and @o9Solutions, have a new potential of creating over 2,500 jobs directly.

At Davos, Chief Minister Sri Revanth Reddy during his two addresses at the CET forums as part of an exclusive World Economic Forum dialogue series with global leaders and thought leaders, stood up strongly for the small and marginal farmers, and urged world leaders to urgently collaborate the transform farming into a profitable activity.

In another watermark and historic address, CM Sri Revanth pitched Hyderabad as the city waiting to harness the convergence of healthcare and software to become the Medical Tourism capital of Asia, and provide western nations, including USA and several European nations, a great destination and solution for rising healthcare costs. CM also stressed on making healthcare universal and affordable, and shared his vision of using digital technologies to take top-notch medical services to reach every remote corner and citizen of Telangana.

The global business leaders, including all major Indian entrepreneurs, who met and discussed investment opportunities with the Chief Minister, strongly and unequivocally endorsed the new Telangana government’s business vision.

“It is a great delight for us that coming to Davos and meeting business leaders from all over the world we were able to convince them of our vision and get record investments for our state. Investments and growth have to go hand in hand for us to deliver development and welfare. Seeking investments will be a continuous endeavour for us. I welcome all these businesses to Hyderabad and Telangana,” said Chief Minister Sri Revanth Reddy at the conclusion of the trip.

#TelanganaAtDavos
#InvestInTelangana
#WEF2024

https://twitter.com/TelanganaCMO/status/1748365020600435059?t=QBnNfjJp8L80iUPc1skglQ&s=19

Friday, January 19, 2024

ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా.... సీఎం రేవంత్ స్నేహితుడు....?

*ప్రభుత్వ    ప్రధాన సలహాదారుగా.... సీఎం రేవంత్ స్నేహితుడు....?*

*ముఖ్యమంత్రి రేవంత్‌ నీడలో బాధ్యతలు*

*16 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం* 

*ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మండవ*

*ఇద్దరు నేతలకు క్యాబినెట్‌ హోదా*

*మంత్రివర్గ సమావేశాలకూ మండవ?*
హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశాలున్నాయి. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి నిర్వహించే కార్యక్రమాలు అన్నింటినీ వెనుక నుంచి వేంనరేందరే పర్యవేక్షించే వారు. ఆయన టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. రేవంత్‌తో నరేందర్‌కు దాదాపు 16 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. టీడీపీలోనూ ఇద్దరూ కలిసే ఉన్నారు. 2004-2009 మధ్యలో వేం నరేందర్‌రెడ్డి మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా రేవంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతలిద్దరి మధ్య స్నేహబంధంబలపడింది. 2009లో నియోజకవర్గాల పునర్‌ విభజనతో వేంనరేందర్‌ నిర్మించుకున్న రాజకీయదుర్గం మహబూబాబాద్‌ రిజర్వ్‌డ్‌ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే 2015లో మిత్రుడు వేం నరేందర్‌ను ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో భాగంగానే నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్‌సన్‌ వద్దకు రేవంత్‌ వెళ్లారు. అనంతర కాలంలో రేవంత్‌ ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లలో నరేందర్‌ తన వెన్నంటే ఉన్నారు. తర్వాత ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచీ పలు కార్యక్రమాల్లో నరేందర్‌ కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల సమయంలోనూ పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడంతో నరేందర్‌కు కీలక పదవిని ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలనే దిశగా కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది. క్యాబినెట్‌ హోదాతో ఈ పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రధాన సలహాదారు పదవి అయితేనే సీఎంకు దగ్గరగా ఉండడంతో పాటు అవసరమైనకార్యకలాపాలను పర్యవేక్షించే చాన్స్‌ ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

*మండవకు ప్రణాళిక సంఘం*

సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవిని ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడికి క్యాబినెట్‌ హోదా ఉంటుంది. ఆ హోదాతో ఆయన్ను మంత్రివర్గ సమావేశాలకు ఆహ్వానించే అవకాశం ఉంది.

*V.S. జీవన్*

మూసీకి పునర్ వైభవం లండన్ పర్యటనలో రేవంత్ రెడ్డి...!

*మూసీకి పునర్ వైభవం వస్తే మరింత శక్తివంతంగా హైదరాబాద్.... రేవంత్ రెడ్డి...!*

లండన్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  బృందం లండన్‌ పర్యటన కొనసాగుతోంది. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో చర్చించారు.మూసీ పరీవాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం తెలిపారు. థేమ్స్‌ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజినీరింగ్‌, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్‌ ఆఫ్ లండన్‌ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.

హైదరాబాద్‌లో మూసీ, హుస్సేన్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ వంటి చెరువుల ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్‌ నిపుణులకు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీకి పునర్‌వైభవం వస్తే నది, చెరువులతో హైదరాబాద్‌ మరింత శక్తిమంతమవుతుందని సీఎం వివరించారు. మూసీ విజన్‌ 2050కి స్పందించిన పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ బృందం పూర్తిగా సహకరిస్తామని, భవిష్యత్తులో మరిన్ని చర్చలు, భాగస్వామ్యానికి సిద్ధమని తెలిపింది.

*V.S. జీవన్*

Thursday, January 18, 2024

చైతన్యపురి పీఎస్లో ఏసీబీ సోదాలు..ముగ్గురు కానిస్టేబుళ్లు అరెస్ట్

చైతన్యపురి పీఎస్లో ఏసీబీ సోదాలు..ముగ్గురు కానిస్టేబుళ్లు అరెస్ట్

చైతన్యపురి పీఎస్లో ఏసీబీ సోదాలు..ముగ్గురు కానిస్టేబుళ్లు అరెస్ట్

హైదరాబాద్ చైతన్య పురి పోలీస్ స్టేషన్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. చైతన్య పురి పీఎస్ కు చెందిన  కానిస్టేబుల్   నరేందర్ , హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ బాబు , కానిస్టేబుల్ మల్లేశంలు కోర్టు వారెంట్ రీకాల్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు ముగ్గురు గత కొంత కాలంగా కోర్టు వారెంట్లను అడ్డంగా పెట్టుకుని పలు కేసులలో వారెంట్లు జారీ అయిన నిందితులను బెదిరిస్తు, డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. 

తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 5లక్షలు డిమాండ్ చేశారని  ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు  నూజివీడుకు చెందిన   వెంకటరమణ.  ఇప్పటి వరకు 3 లక్షలు ఇచ్చిన..పదే పదే బెదిరింపులకు పాల్పడుతున్నారని  తమను ఆశ్రయించారని ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.  ఈ క్రమంలో  చైతన్య పురి పోలీస్ స్టేషన్లో దాడులు నిర్వహించగా ఆధారాలు దొరకడంతో ముగ్గురు పోలీస్ కానిస్టుబుళ్లు..వారికి సహకరిస్తున్న  మరో నలుగురు వ్యక్తులను  అరెస్ట్ చేశామని చెప్పారు.

చైతన్యపురి పీఎస్లో ఏసీబీ సోదాలు..ముగ్గురు కానిస్టేబుళ్లు అరెస్ట్ https://www.v6velugu.com/acb-conduct-raids-in-chaitanyapuri-ps-and-arrested-three-constables

ఇక నుండి ఆధార్: డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్

*ఇక నుండి ఆధార్: డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్*

*ఇక నుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా ఆధార్ సరిపోతుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది..*

*గతంలో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా* *బర్త్ సర్టిఫికెట్ ని తీసుకొనే వారు ఇప్పుడు ఆధార్ సరిపోతుందని  UIDAI వారు సర్క్యులర్ విడుదల చేసారు..*


*V.S. జీవన్*

నేలపై నిద్రిస్తూ... కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ....మోదీ కఠినమైన నియమాలు

*నేలపై  నిద్రిస్తూ... కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ....మోదీ కఠినమైన నియమాలు*

దిల్లీ...అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తోంది. రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని ఆయన 11 రోజుల పాటు అనుష్ఠానం పాటిస్తున్నారు. ఈ క్రమంలో కఠినమైన ఉపవాసం చేస్తున్నారని సమాచారం.

ఇందులో భాగంగా ఒక్క దుప్పటి మాత్రమే వేసుకొని నేలపై నిద్రిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే తాగుతున్నారన్నారు. అనుష్ఠానంలో భాగంగా పాటించే యమ నియమాల మేరకు సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం, యోగా.. ధ్యానం చేయటం, సాత్విక ఆహారం తీసుకోవడం వంటివి ఆచరిస్తారు. ఈ అనుష్ఠానం గురించి గతవారం మోదీ ఆడియో సందేశం విడుదల చేశారు.

ఇదిలా ఉంటే.. ప్రాణప్రతిష్ఠకు ముందుగా జనవరి 16 నుంచి ఆరు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత, భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోదీ నిర్వహించలేరు కాబట్టి, ఆయనకుబదులుగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు డాక్టర్‌ అనిల్‌ మిశ్ర దంపతులు అన్ని పూజల్లో పాల్గొంటున్నారు. ఇక, 22న కాశీకి చెందిన పండిట్‌ లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ నేతృత్వంలో మోదీ గర్భగుడిలోకి విగ్రహాన్ని తీసుకెళ్లనున్నారు

*V.S. జీవన్*

Tuesday, January 16, 2024

ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి  పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ @Min_SridharBabu తో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.

ఐటీ, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది. 

దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ @Borgebrende తో సమావేశమయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ తో పాటు నిర్వాహకులు, ఇతర ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య నాయకత్వం కలిసికట్టుగా పని చేస్తే ప్రజలు సంపన్నులవుతారని, సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడితే ప్రజలు మరింత ఆనందంగా ఉంటారనే దృక్కోణంలో చర్చలు జరిపారు.   

అనంతరం, ఇథియోఫియా ఉప ప్రధాని శ్రీ @DemekeHasen తో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న కార్యాచరణపై చర్చించారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీ శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ ప్రతినిధి బృందం నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (@NASSCOM) ప్రెసిడెంట్ శ్రీమతి @Debjani_Ghosh_ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటం, అందుకోసం అనుసరించే భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు స్కిల్ డెవెలప్మెంట్, ప్లేస్మెంట్ కమిట్మెంట్, ఉద్యోగ కల్పనకు సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు.

స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 54వ వార్షిక సదస్సు జరుగుతోంది. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది.

దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు పలువురు ప్రవాసీ భారత ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో మన దేశానికి చెందిన ప్రముఖులను కలిసి వారితో ముచ్చటించటం సంతోషాన్నిచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. సమ్మిళిత, సంతులిత అభివృద్ధి ద్వారా ప్రజలందరి పురోగతి.. నవ తెలంగాణ నిర్మాణానికై మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములు కావటం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తపరిచారు.

#TelanganaAtDavos
#WEF2024

https://twitter.com/TelanganaCMO/status/1747122121258750057?t=WCLbtHtB3VT7kAezC1w9HA&s=19

Monday, January 15, 2024

*రేవంత్ బృందానికి జ్యు రిచ్ లో ఘనస్వాగతం*

*రేవంత్ బృందానికి జ్యు రిచ్ లో ఘనస్వాగతం*

ఇంటర్నెట్‌డెస్క్‌: సమగ్ర అభివృద్ధితో కూడిన సరికొత్త తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దావోస్ వెళ్లిన రేవంత్ రెడ్డి బృందానికి జ్యురిచ్‌ విమానాశ్రయంలో పలువురు భారతీయ ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. వారితో మాట్లాడటం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో 'పెట్టుబడులు పెట్టండి' అనే ప్రచారం ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.

*V.S. జీవన్*

_*మకర సంక్రాతి శుభాకాంక్షలు 🙏*_

https://youtu.be/WY3YPcixTgg?si=VoboMlsaZKl7QEL4                                                                
_*మకర సంక్రాతి శుభాకాంక్షలు 🙏*_                                                                      
*#Environment* *#SaveLakes*

*@TelanganaCMO @Bhatti_Mallu @mpponguleti @jupallyk_rao* #pashamyadagiri *@hyderabadzinda2* *@veeruveeru1 @coll_vkb @spvikarabad* *@MC_Tandur @TandurPolice*
*@Narhariyarabotu*
*@BplplH @PushpaFashions @UNTGAPS*

https://twitter.com/Praja_Snklpm/status/1746798761219854809?t=FgK8Dy5Ki3SRa53pqsQlVw&s=19                                                                                                                  *****---*****---*****                  https://www.instagram.com/reel/C2HPT4rvNDT/?igsh=MThmcmI0bTR1cGw2Nw==                                                                                                       *****---*****---*****                                                  https://www.facebook.com/reel/824409146068436/?app=fbl

Saturday, January 13, 2024

రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై.

*రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై.* 

 హైదరాబాద్

రాజ్‌భ‌వ‌న్‌లో సంక్రాంతి వేడుక‌లు ఈరోజు శనివారం నిర్వ‌హించారు.

ఈ వేడుక‌ల్లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర్ రాజ‌న్ పాల్గొని పాయ‌సం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలిపారు.

తనకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పొంగల్ అని పేర్కొన్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు.

శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

ఇది వికసిత భారత్ అని ఆమె పేర్కొన్నారు. 

గవర్నర్ తమిళసై శుక్రవారం పుదుచ్చరి రాజ్‌నివాస్‌లో పొంగల్ వేడుకల్ని నిర్వహించారు.

*V.S. జీవన్*

Friday, January 12, 2024

కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.... కేటీఆర్

*కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.... కేటీఆర్*

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రజల తరుపున పోరాటం చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.ఆ పార్టీ ఇచ్చిన హామీల పుస్తకంను బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగా చదవి, అవి అమలు చేసేంత వరకు వదలొద్దు అని కార్యకర్తలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఒక్క నెలలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి పార్లమెంట్ సమీక్ష సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నజనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిగతా 6 నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, గెలుపులు సహజం. ఈరోజు మనం ఒడిపోయాము అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్నికరపత్రంలా మాట్లాడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేయించారు. మునుగోడు నియోజకవర్గంలో ప్లోరైడ్ సమస్య తీర్చింది నిజం కాదా!. ఇంటింటికీ మంచి నీళ్ళు ఇచ్చింది నిజం కాదా!.. పదేండ్లల్లో చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే, కళ్ళు లేని కబోదిలా కాంగ్రెస్ పార్టీ వ్యహారిస్తుంది. ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయింది, కేసీఆర్ ప్రజాశేత్రంలోకి రాగానే అసలు సినిమా స్టార్ట్ అవుతుందని" కేటీఆర్ అన్నారు.

*V.S. జీవన్*

Thursday, January 11, 2024

లోకసభ ఎన్నికలు...ఏఐసీసీ కీలక సమావేశం...!

*లోకసభ ఎన్నికలు...ఏఐసీసీ కీలక సమావేశం...!*

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్షదీప్ రాష్ట్రాలకు సంబంధించిన నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో కాంగ్రెస్‌ అధిష్టానం సమావేశమైంది.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రచారం, పోల్ మేనేజ్‌మేంట్‌, ప్రజలతో మమేకం వంటి అంశాలపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మార్గనిర్ధేశం చేశారు.

రెండు గ్రూపులుగా సమావేశం నిర్వహించగా, మొదటి సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి.. రెండో సమావేశంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా, అండమాన్ అండ్‌ నికోబార్‌ల కోఆర్డినేటర్లతో మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేలా కో ఆర్డినేటర్లు ప్రయత్నం చేయాలని ఖర్గే అన్నారు.

సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికలలో పార్టీ విజయం కోసం అధిష్టానం దిశ నిర్దేశం చేసిందని, తెలంగాణలో అత్యధిక స్థానాలలో గెలవాలని ప్రయత్నం చేస్తామన్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచిపోటీ చేయాలని కోరినట్లు భట్టి తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారని కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయన్నారు.

మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని, మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని ఖర్గే సూచించారన్నారు. అత్యధిక స్థానాలు గెలిపించే బాధ్యత కో ఆర్డినేటర్లపై ఉందని ఖర్గే దిశానిర్దేశం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఉత్సాహాన్ని లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగించి మెజారిటీ స్థానాల్లో గెలవాలని సూచించారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని, అధిష్టానం సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు.


*V.S. జీవన్*

Wednesday, January 10, 2024

13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు ఆతిథ్యం ఇచ్చారు

బుధవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారు ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు ఈ విందుకు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను వివరించారు. ‘అభయహస్తం’ గొడుగు కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకతతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుందని తెలిపారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని వారిని సీఎం కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, మంత్రులు శ్రీ దామోదర రాజనర్సింహ, శ్రీ @Min_SridharBabu, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ @Jayesh_Ranjan, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1745142933442167118?t=3PEoFK8_RSkVklmPHd3yig&s=19

Hon’ble CM accorded a warm welcome

Chief Minister Sri @Revanth_Anumula hosted representatives of 13 countries for dinner at Qutb Shahi Tombs in Hyderabad on Wednesday.  Representatives of United States of America, Iran, Turkey, UAE, UK, Japan, Thailand, Germany, Sri Lanka, Bangladesh, Australia, France and Finland attended the dinner.

Hon’ble CM accorded a warm welcome to the guests and explained the priorities of his government. Under the banner of Abhaya Hastham, the Telangana Government is committed to the welfare of all the sections in the State. The Government has drawn inspiration from the values practised by freedom fighters like Mahatma Gandhi, Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel and former Prime Minister Indira Gandhi and is working to deliver an administration that promotes equality and transparency.

The Chief Minister said that the government is making efforts to promote Telangana as the best welfare State in the country by implementing Six Guarantees. The government also gave equal priority to development and committed to the welfare of the youth and industrial growth.

Hon’ble CM appealed to the respective countries to come forward to invest in Telangana by exploring the opportunities available in the State. Adding that the government will maintain cordial relations with all countries, the CM has appealed to the guests to make appropriate suggestions for the industrial development of the state.

Deputy Chief Minister Sri @Bhatti_Mallu, Ministers Sri Damodara Raja Narasimha, Sri @Min_SridharBabu, @TelanganaCS Smt. Santhi Kumari, Principal Secretary Industries Dept. Sri @Jayesh_Ranjan, @RPOHyderabad Officer Smt. Snehaja and other officials were present on the occasion.

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1745142463004881412?t=AjnDydCADvWXQioPmLIuvg&s=19

THIS PHOTO GIVES HOPE!

THIS PHOTO GIVES HOPE!

Why? Because the man sitting there on the railway platform like a common man, like a regular citizen is none other than Pusapati Ashok Gajapathi Raju of #Vizianagaram #TDP
- former Union Minister for Civil Aviation
- MLA for over TWENTY FIVE YEARS
- Minister in Andhra Govt for at least THIRTEEN YEARS…held portfolios like Commercial Tax, Excise, Legislative affairs, Finance, Planning and Revenue
- ALSO the younger son of Vizinagaram Maharaja!!!

The Vizinagaram Pusapati’s are like the real kings from that part #AndhraPradesh. Of course, they gave away most of their wealth for public and dedicated their lives to public service!

Today he travels like a commoner. May be, just may be…there is still hope for leaders/politicians who work for people! Who don’t take pride in their ‘high-end’ cavalcades or an army of ‘karyakarthas’.

Pic: @JaiTDP 👍🏼

https://twitter.com/revathitweets/status/1744931492139249981?t=aejJl0CUDg8lc6pkcFaYxQ&s=19

Tuesday, January 9, 2024

నిన్ను తిట్టడానికి తిట్లు కూడా సిగ్గుపడతాయి

https://youtu.be/DgI5n_953fw?si=9no6opid5JRXNbqZ                                                                                    
  _*#రాజ్యాంగం ను గౌరవించని, #ప్రజాస్వామ్యం ను అపహాస్యం చేస్తున్న #జర్నలిస్ట్ లను #తెలంగాణ నుంచి తరిమికొట్టాలి... Bplkm🪶*_                                                   
 *@TelanganaCMO @Bhatti_Mallu @jupallyk_rao*

*#IndianConstitution*
*#journalism* *#Journalist*

*#pashamyadagiri* *#kkr* *#ExclusiveTv*                                                                                                
 _*(విలువలతో కూడిన, ఒక ఆంకిత భావం, తెగింపు, సమాజాన్ని మార్చే వారధులు మనమే అన్న, ఒక స్పృహ ఏమి లేదా. ఎవడు డబ్బులిస్తే వాడికి ఊడిగం చేసే సిగ్గులేని బ్రతుకులకు పవిత్రమైన జర్నలిజం పేరు పెట్టుకుంటారా?.. Q గ్రూప్ న్యూస్)*_                                                                                                                                         https://twitter.com/Praja_Snklpm/status/1744437106758533271?t=J742vSRkNn44ju6NYj25zg&s=19                                                                                         *****---*****---*****                   https://www.instagram.com/reel/C12aigsv5oD/?igsh=MTJzMmF4Z3dnbnJmbA==                                                                              *****---*****---*****                                                                                 https://www.facebook.com/reel/638320804993727/?app=fbl

1500 కోట్లు మింగేసిన #సాహితీగ్రూప్ దొంగలు

https://x.com/Praja_Snklpm/status/1744634432009679288?t=vXVWYC-AwaLwiAqr7Sm1ZA&s=08                                                                                                           *మధ్యతరగతి కుటుంబాల ఆశలను పెట్టుబడిగా మలుచుకోని 1500 కోట్లు మింగేసిన #సాహితీగ్రూప్ దొంగలు*
* సంధ్య కన్వెన్షన్ కి 40 కోట్ల లావాదేవీలు*
*అమీన్ పూర్ అనుమతుల కోసం అప్పటి ముఖ్యమంత్రి బిడ్డకు 20 కోట్లు సమర్పించిన సాహితీ*
*ఒక్క సెటిల్మెంట్ లో సాహితీ సొమ్ము 15 కోట్లు సంధ్య శ్రీధర్ రావుకు*          *ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ . కామ్ , బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఉంటుంది.*
By:
*Devender Reddy-9848070809*
For full details 👇 click here                                                                                                          https://www.landsandrecords.com/news-details.php?nid=66                     *@TelanganaCMO*
*@Bhatti_Mallu*
*@TelanganaCS @mpponguleti* *@TelanganaDGP @prashantchiguru @RamMohanINC* *@KomatireddyKVR @UttamINC @seethakkaMLA @KondaSurekha @PonnamLoksabha @DamodarCilarapu @OffDSB @jupallyk_rao @zson_bakka @dr_mvreddy @Murali_IASretd @KVishReddy @MinisterKTR @KTRBRS @Congress4TS @RaoKavitha*

*#CMRevanthReddy*
*#sahithigroup* *#సాహితీబాధితులు*
*#JournalistDevenderReddy*                                                                                                                                                            _*#సాహితీ గ్రూప్ ప్రజలకు చేసిన వేలకోట్ల మోసాన్ని సాక్ష్యాలతో బట్టబయలు చేసిన ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ .  కామ్  డైనమిక్ జర్నలిస్ట్ దేవేందర్ రెడ్డి & టీం కు అభినందనలు తెలియచేస్తుంది 'ప్రజాసంకల్పం'.... Bplkm🪶*_

Sunday, January 7, 2024

ప్రజాపాలన - అభయ హస్తం... దరఖాస్తులు ఎన్ని వచ్చాయంటే!

*ప్రజాపాలన - అభయ హస్తం... దరఖాస్తులు ఎన్ని వచ్చాయంటే!*

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-అభయహస్తం కార్యక్రమం ముగిసింది. ఇక, ఆరు గ్యారంటీల కోసం ప్రజలకు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.మహాలక్ష్మి, పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా కోటి 25లక్షల 84వేల 383వందల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం.

అయితే, డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు పది రోజుల పాటు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే సిలిండర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఒక్కో మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా, రూ.5 లక్షల యువ వికాసం, రూ.4 వేల పెన్షన్, రేషన్‌ కార్డులు, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని ప్రారంభించింది. ఆ తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఐదు గ్యారెంటీలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

కాగా, గ్యారంటీలకుగానూ నిన్న ఒక్కరోజే 12లక్షల 53వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 24లక్షలు వచ్చినట్టు తెలిపారు. మహాలక్ష్మి, పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 650 కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరించారు. ఇక ఈ దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనుంది.


*V.S. జీవన్*

Saturday, January 6, 2024

హైదరాబాద్ లో మరిన్ని డంప్ యార్డులు

హైదరాబాద్ లో మరిన్ని డంప్ యార్డులు
 
హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతటికి జవహర్ నగర్ లో ఒకే డంప్ యార్డు వున్నది. ప్రతి రోజు సుమారు 8వేల టన్నుల చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డుకు చేరవేయడం జరుగుతున్నది. డంప్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం, చెడువాసన వంటి వాటితో చుట్టు ప్రక్కల వుండే ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కాలుష్యాన్ని తగ్గించే విధంగా సిటీకి దూరంగా గతంలో శంషాబాద్, మెదక్ వైపు డంప్ యార్డు సైట్ లను పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఏర్పాటు చేయాలన్నారు.

చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని, ఇందుకు గాను టిఎస్ఎస్పీడీసిఎల్ తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తను సాధ్యమైనంతవరకు రీసైకిల్ చేయాలని అన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలందిస్తామన్నారు.

మెట్రో రైల్

సీఐఐ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టతను ఇచ్చారు. గతంలో గచ్చిబోలి – ఎయిర్ పోర్టు వరకు 32కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారని, దానివల్ల సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. గచ్చిబౌలి, జూబ్లిహిల్స్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో అధికంగా ధనికులు వుండటం వల్ల వారు ఎక్కువగా స్వంత వాహనాలు వాడుతున్నారని అన్నారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ – ఫలక్ నుమా - ఏయిర్ పోర్టు రూట్, ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టు రూట్ ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలు వున్నాయని అన్నారు. ఈ ప్రాంతాల నుంచి అరబ్ దేశాలకు అధికంగా వెళుతుంటారని, విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు ఎయిర్ పోర్టుకు వెళ్లి సెండాఫ్ ఇస్తుంటారని అందుకే ఈ రూట్ చాలా ఉపయోగకరంగా వుంటుందని సిఎం అభిప్రాయపడ్డారు.

మూసీ నది పరీవాహక ప్రాంతం

మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని తొలిదశలో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ది చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రింగ్ రోడ్ టూ రింగ్ రోడ్ మొత్తం ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం అన్నారు. 

మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్లలతో అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఎరియా, షాపింగ్ మాల్స్ లతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రాత్మక కట్టడాలయిన చార్మినార్, గొల్కొండ, సెవెన్ టూంబ్స్, తారామతి బారాదరి వంటి వాటిని అనసంధానిస్తూ ఒక టూరిజం సర్క్యూట్ ను రూపొందించాలని సూచించారు. 

ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పిపిపి మోడల్ లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించేందుకు పరిశీలించాలన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతంలో చెక్ డ్యాములను నిర్మించి వాటర్ ఫౌంటెన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఫైవ్ స్టార్ హొటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని అన్నారు.

Courtesy / Source by : Telangana CMO fb account 

_*హైదరాబాద్ జిందాబాద్ కేలండర్ ఆవిష్కరణ*_

https://x.com/Praja_Snklpm/status/1743600275812970792?t=juLyUqOff1xNvlvIg5abHQ&s=08                                                                          _*హైదరాబాద్ జిందాబాద్ కేలండర్ ఆవిష్కరణ*_                             
 *#తెలంగాణ  రాష్ట్ర ఎక్సైజ్ &  ప్రోహిబిషన్,టూరిజం అండ్ సంస్కృతిక శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు (06.01.2024) వారి నివాసంలో హైదరాబాద్ జిందాబాద్ 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.*

*@jupallyk_rao*
*@TSExcise @Harikrishna_TS*

*#jupallikrishnarao*
*#department_of_language_culture*
*#NewYearCalendar2024*   *#NewYear*
*@hyderabadzinda2* *@veeruveeru1*
*@RamsGTRK* *@VVeldandi @Narhariyarabotu @RaviVattem @BplplH @PushpaFashions*                                         
*Bplkm🪶*

పోలీస్.. సెట్రైట్.. కొత్త ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్‌ ప్రక్షాళన

*పోలీస్.. సెట్రైట్.. కొత్త ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్‌ ప్రక్షాళన*

*గతంలో ఎస్‌ఐ నుంచి డీసీపీ దాకా సిఫార్స్ పోస్టింగ్లే*

*ఇప్పుడు రాజకీయ జోక్యం లేకుండా పోలీసులకు పవర్స్*

*డీజీపీ రవిగుప్తా యాక్షన్ ప్లాన్*

 *హైదరాబాద్‌,*  పోలీస్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయి ప్రక్షాళన జరుగుతున్నది. ఎలాంటి సిఫార్సులు, పైరవీలకు తావులేకుండా అర్హులైన వారికి మాత్రమే పోస్టింగ్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో డీజీపీ రవిగుప్తా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దీంతో డిపార్ట్మెంట్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా డీజీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా భూ కబ్జాలు, డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు, మహిళలకు రక్షణపై వంటి అంశాలపై ఆయన దృష్టి పెట్టారు.

*CRM...!*

Friday, January 5, 2024

అయోధ్య ఎయిర్ పోర్ట్ కు...మహర్షి వాల్మీకి పేరు..!

*అయోధ్య ఎయిర్ పోర్ట్ కు...మహర్షి వాల్మీకి పేరు..!*

*కేంద్ర మంత్రివర్గం ఆమోదం, ప్రధాని మోదీ హర్షం*

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయానికి 'మహర్షి వాల్మికి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు-అయోధ్యధామ్‌' అని పేరుపెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది.

*V.S.జీవన్*

100 ఎకరాల్లో హైకోర్ట్ భవనం... జీవో జారీ

*100 ఎకరాల్లో హైకోర్ట్ భవనం... జీవో జారీ*

హైదరాబాద్...తెలంగాణలో నిర్మించబోయే కొత్త హైకోర్టు కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ సర్కార్‌ జీవో జారీ చేసిందిరంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్ , బుద్వేల్ గ్రామం పరిధిలో ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లు జీవో నెంబర్‌ 55లో పేర్కొంది.

కిందటి నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరుగుతాయి. ఆ తర్వాత హెరిటేజ్‌ భవనంగా పరిరక్షించాలని సర్కార్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాన్ని సిటీ కోర్టుకు లేదంటే మరేదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారిని ఆదేశించారు.

*V.S.జీవన్*

_జర్నలిస్టు సమస్యలపై స్పష్టమైన హామీ_

*_జర్నలిస్టు సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి_*

*_తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు కె.కోటేశ్వర్ రావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరరావులు ఏకాంత చర్చలు. జర్నలిస్టులకు ఉన్న సమస్యలలో ఎక్కువ సమస్యలు పరిష్కరించే మార్గాలతో పాటు, చిన్న , మధ్య తరగతి పత్రికల మనుగడ కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలన్న శీనన్న. జర్నలిస్టు సంఘాల సూచనలపై పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి_*

https://twitter.com/Praja_Snklpm/status/1743238725667328056?t=R2qDEBYSSaYdfOyOgftDKQ&s=19

conservation and development of the Musi, addressing critical issues.

Join us for a walk, poetry performance, and discussion on the Musi River by Focus High School students on *5th (Friday), 2024, from 11:00 am to 12:30 pm. Students will gather at Musi, Infront of High Court*.

Let's assert the importance of this space and convey a message for the conservation and development of the Musi, addressing critical issues. 

Dr. Lubna Sarwath will lead the discussion. Your presence will greatly encourage these students in their initiative. 

Shaher Bano
coordinator - Service Learning at FHS

We are meeting at Musi river Infront of High Court at 11:00
*****************************

#TelanganaHighCourt
#SaveMusiRiver
#Hyderabad
#HMDA

@TelanganaCMO @Bhatti_Mallu #MDanakishoreIAS @HMDA_Gov @LubnaSarwath @BrsBandari @KaleruVenkatesh

Bplkm🪶

https://twitter.com/Praja_Snklpm/status/1742953223739301981?t=XrSsER9U-LoajxYtEHvaXg&s=19

https://www.instagram.com/reel/C1tvKrDvkqX/?igsh=MWw3OW1uc3Q1eWc4aA==

https://www.facebook.com/reel/217800664742734/?app=fbl

Thursday, January 4, 2024

ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బస్తీ లో నాయకుల దురాక్రమణని అడ్డుకోవాలి

*ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బస్తీ లో నాయకుల దురాక్రమణని అడ్డుకోవాలి*


ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ అనబడే బస్తీ యొక్క ప్రజలను గత కొద్ది సంవత్సరాలుగా రాజకీయనాయకులు ఆ భూమిని అప్పగించవలసిందిగా భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ విషయం మీద జనవరి 2వ 2024 రోజు బస్తీ ప్రజలు ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమంలో నివేదికని సమ్పార్పించిన విషయం మీడియా లో రావడం వలన మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ బృందం జనవరి 3వ తారీఖున నిజనిర్ధారణ జరిపింది. 

బాలానగర్ మండలం, బేగంపేట్ దగ్గరి ప్రకాష్ నగర్ కాలనీ పక్కన ఉన్న ఈ భూమి జలాలుద్దీన్ ఖాన్ అనే వ్యక్తికి చెందినది. ఆ భూమి నిజాం కాలం నుంచి వారి వంశస్థుల ఆధీనంలో ఉంది. అతని భూమిలో కొంత భాగం సర్వే నెంబర్ 194/8/1 లో ఈ బస్తీ నెలకొంది ఉంది. ఈ బస్తీ లో ప్రస్తుతం ఉన్న 300 కి పైగా కుటుంబాలు 182 ఇళ్లలో ఉన్నారు. ఈ స్థలం దశాబ్దాలుగా చాలా చేతులు మారింది. వీరందరికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఉన్నాయి. బస్తీలో మంచి రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇంటి పన్ను కూడా కడుతున్నారు. బస్తీ వైశాల్యం ఒక ఎకరం ఉంటుంది. 

ఈ సర్వే నెంబర్ భూమికి పక్కన ఉన్న సర్వే నెంబర్ 184,185,186 లలో దాదాపు మూడు ఎకరాల భూమి ఉంది. ఈ బస్తీ భూమిని కూడా కలుపుకుని అపార్టుమెంట్లు కట్టి అమ్ముకోవాలని కొంతమంది బిల్డర్స్ ఆలోచన. వీరికి రాజకీయ నాయకుల మద్దతు ఉంది. మాజీ మంత్రి దానం నాగేందర్ అనుచరులు ఈ బస్తీ వాసులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. బస్తీలో ఎప్పుడూ కొంతమంది కాపు కాయడం,  రాత్రి పూట ప్రజలు మీద దాడి చెయ్యడం, ఇళ్లపై రాళ్లు రువ్వడం, బస్తీ ఖాళీ చేసి వెళ్లిపొమ్మని బెదిరించడం బాగా జరిగింది. ఈ విషయం మీద బేగంపేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్లిన బస్తీవాసులను, పోలీసు వారు నిరాశ పరిచి, కంప్లైన్ట్ తీసుకోకుండా, బస్తీ వాసులు ఈ పోరాటం గెలవలేరని  వారు భూమి ఇచ్చేయడం మంచిదని ఉచిత సలహా ఇచ్చి పంపించేవారు. 

2022 సంవత్సరంలో పైవేటు వ్యక్తులు బుల్డోజర్ల సహాయంతో 8 ఇళ్లను కూల్చివేయడం జరిగింది.  బస్తీ ప్రజలు హై  కోర్టును ఆశ్రయించగా, WPS నెంబర్ 37279, 37392, 37587 status quo తీర్పు ఇచ్చింది, అయినా సరే, దానం నాగేందర్ అనుచరుడిగా గుర్తింపు ఉన్న సుధీర్ గౌడ్ ఆధ్వార్యంలో బస్తీ ప్రజలను భయపెట్టడం ఆగలేదు.జనవరి మూడవ తారీఖు ప్రజావాణిలో నివేదిద్దామని వెళ్లిన బస్తీ వాస్తులను సుధీర్ గౌడ్ మనిషి వారిని అనుసరరిస్తూ అతని మీద ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. 

బస్తీకి రెండు వైపులా ఉన్న చెరువులలో ఒక చెరువు కబ్జాకి గురి అయ్యి, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది. ఇంకో వైపు ఉన్న చిన్న చెరువు కూడా కబ్జాకి గురి అయ్యింది. మరో వైపు ఉన్న భూమిలో బస్తీకి భూమిని కూడా కలుపుకుని నిర్మాణాలు కొనసాగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి రాజకీయ అండదండలు ఉన్నాయి. భూమి రికార్డులలో ఉన్న అవకతవకలు, చెరువుల రక్షణ ప్రభుత్వం చేపట్టకపోవడం, ప్రభుత్వ భూమిని గుర్తించకపోవడం, ఇవన్నీ కూడా పేదవారికి భారం అవుతున్నాయి.

మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ ఉపాదాధ్యక్షులు శ్రీ బిలాల్ మరియు ప్రధాన కార్యదర్శి సంజీవ్ ఈ బృందంలో పాల్గొన్నారు. 

డిమాండ్లు 

*జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ఆ బస్తీ వాసులకు చట్టరీత్యా నివాస హక్కులు కల్పించాలి.
*బస్తీ వాసులకు రౌడీల నుండి పోలీస్ కమిషనర్ పూర్తి రక్షణ కల్పించాలి.
*మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాత్రపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి.
Courtesy / Source by : hrf Hyderabad unit 

Tuesday, January 2, 2024

కాళేశ్వరం ప్రాజెక్టు పై జుడిషల్ విచారణ

As per our promise on the Kaleshwaram project... we will start the judicial inquiry this week itself.

కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఇచ్చిన మాట ప్రకారం జుడిషల్ విచారణ ఈ వారంలోనే మొదలు పెడతాం.
    -- మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.
📍 సెక్రటేరియట్ మీడియా పాయింట్

*స్వాతంత్రం తరువాత సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు.
*బ్యాంక్ లు, రూరల్ ఎలాక్ట్రిఫిషల్ ద్వారా లోన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం ఇప్పించింది.
* కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయి.
* బీజేపీ - BRS పదేళ్ల పాటు కలిసి పనిచేసి ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది రోజుల కాలేదు అప్పుడే మాపై బురద జల్లుతున్నారు.
* కాళేశ్వరం ప్రాజెక్టు కు మద్దతు ఇచ్చింది కేంద్ర బీజేపీనే.
* పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్ కు నిబంధనలు మార్చి బీజేపీ లోన్స్ BRS ప్రభుత్వానికి లోన్స్ ఇచ్చింది.
* 1లక్ష 27వేల కార్పొరేషన్ పేరుతో కేంద్రం రాష్ట్రానికి లోన్ ఇచ్చింది.
* ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కే 60వేల లోన్స్ బీజేపీ ఇచ్చింది.
* BRS - BJP కలిసి దోచుకుందాం అని లక్షల కోట్లు ఇచ్చారా?
* మేడిగడ్డ 5 పిట్లు కుంగితే కనీసం కిషన్ రెడ్డి పరిశీలన చెయ్యలేదు.
* కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితె ఎందుకు విసిట్ చెయ్యలేదు?
* మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు?
* ఎవరు తప్పులు చేసినా వదిలిపెట్టం.
* 80వేల కోట్ల ప్రాజెక్ట్ ను 1లక్ష 27వేల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చింది?
* CBI - ED అని ఎదేదో అని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు?
* ప్రతిపక్ష నాయకుల పై తప్పు చేయకున్నా ED కేసులు వేసిన బీజేపీ కేసీఆర్ పై ఎందుకు వెయ్యలేదు?
* కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోడీ, నాడ్డ పదే పదే అంటారు..మరి ఎందుకు విచారణకు అదేశించలేదు?
* లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
* పదేళ్ల పాటు లక్షల కోట్లు BRS వాళ్ళు తిన్నారు అని బీజేపీ ఆరోపణ చేసింది మరి సీబీఐ విచారణ ఎందుకు  చెయ్యలేదు?
* మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా సంస్థనే భరిస్తుంది.
* ఇరిగేషన్ పై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం.
*బీజేపీ - BRS కలిసి 3500 రోజులు పని చేశారు.
*ఇరిగేషన్ లో అవినీతి బీజేపీ - BRS కలిసి చేశాయి.

#Uttam @UttamINC

https://twitter.com/Congress4TS/status/1742186646651777197?t=ygg4RAHSCls1ez-danJKXA&s=19

సీఎం గారు మూసీ నది అభివృద్ధిపై సమీక్షా సమావేశం

మూసీ నది అభివృద్ధిపై నానక్ రామ్ గూడలోని @HMDA_Gov కార్యాలయంలో అధికారులతో సీఎం శ్రీ @Revanth_Anumula గారు సమీక్ష నిర్వహించారు.

మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ దానకిషోర్, HMDA జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీమతి ఆమ్రపాలి, సీఎం ఓ.ఎస్.డి శ్రీ అజిత్ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

https://twitter.com/TelanganaCMO/status/1742202507466867066?t=fHSuhOE65R6HS6T5yVtqVA&s=19

రెవిన్యూ శాఖలోని అవినీతి అధికారుల భరతం పట్టాలి

*రెవెన్యూ శాఖను బలోపేతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ట్రెసా* https://www.dishadaily.com/telangana/tresa-asked-cm-revanth-reddy-to-strengthen-the-revenue-department-285328 
 
*****---*****---*****                                                                                                      _*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_                        _*#ప్రజాస్వామికతెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సారు & 'ట్రెసా' ప్రతినిధులు ముందుగాళ్ళ చేయాల్సింది #తెలంగాణరెవిన్యూ శాఖలోని అవినీతి అధికారుల భరతం పట్టాలి.ఎందుకంటే ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం రెవిన్యూ కార్యాలయాల చుట్టూ సంవత్సరాలతరబడి తిరిగినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.#RTIA కు సరి అయిన స్పందన ఉండదు. చట్టాలను గౌరవించరు.ఇక ముఖ్యమైన అంశం 'రైతుల ఆత్మహత్యలు' ఇలాంటి పరిస్థితులు 2014 నుంచి డిసెంబర్ 3,2023 వరకు కొనసాగాయి #తెలంగాణ లో కావున ఇప్పటినుండి #తెలంగాణరెవిన్యూ అధికారులు & సిబ్బంది #రాజ్యాంగం ను గౌరవిస్తూ ప్రజాప్రయోజనాలకోసం ప్రజలకు జవాబుదారీతనంగా విధులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.*_                                                                                                                               *@Bhatti_Mallu @mpponguleti @UttamINC @KomatireddyKVR @seethakkaMLA @PonnamLoksabha @DamodarCilarapu @KondaSurekha @dr_mvreddy @KVishReddy @ProfKodandaram  @RamsGTRK*                                                               
 *Bplkm🪶*                                                    *Bapatla Krishnamohan*
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/      prj_snklpm9456 (Instagram)