Wednesday, July 1, 2026
30వ తేదీ సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం - సీఎం రేవంత్ రెడ్డి
*30వ తేదీ సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం - సీఎం రేవంత్ రెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 29:
తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీ సదస్సు హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనుంది. తొలుత మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.30వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు వేదికల నుంచి సమావేశంలో పాల్గొంటారు.
_మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది_
*మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది.*
*అభివృద్ధి–మానవీయత రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతాం - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 29:
ఈ రోజు డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ కు అవసరమైన భూ సేకరణ, పునరావాసం తదితర అంశాలపై రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎండీ ఈ.వి. నర్సింహారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో సమీక్షించడం జరిగింది.హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసి నదిని పునరుజ్జీవింపజేసి, దాన్ని పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా మార్చాలన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక నదీ అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, పర్యావరణహితమైన జీవన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ సంకల్పం.మూసి నది కాలుష్యంతో ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వరదల సమయంలో పరివాహక ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వాక్వేలు, వినోద కేంద్రాలు ఏర్పాటు ద్వారా మూసి పరివాహక ప్రాంతాలను సరికొత్త జీవన కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసినట్టుగా మూసి ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకంగా కాని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదల జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయం మానవీయ కోణంలోనే తీసుకుంటాం.ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో భూ సేకరణ ప్రక్రియలో ప్రజా కోణంలో ఆలోచించి మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని అధికారులకు సూచించడం జరిగింది.ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి తక్షణమే అమలు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో రాజీ పడొద్దని అధికారులకు సూచిచడం జరిగింది.
_ప్రజల్లో ఓటర్ అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్న అడ్వకేట్ దేవరుప్పల శ్రీకాంత్_
*ప్రజల్లో ఓటర్ అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్న అడ్వకేట్ దేవరుప్పల శ్రీకాంత్*
*ఈరోజు సోమవారం అడ్వకేట్ దేవరుప్పల శ్రీకాంత్ కుమ్మర్వాడి, అంబర్పేట్ అసెంబ్లీ పరిధిలోని బూత్ నం. 26 వద్ద జరుగుతున్న S.I.R ప్రక్రియలో పాల్గొన్నారు. BLO తో కలిసి ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించారు.*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 29:
ప్రజల్లో ఓటర్ అవగాహన పెంచేందుకు మరియు ఎవరి పేరు కూడా విడిచిపోకుండా చూసేందుకు ఆయన కృషి చేస్తున్న అడ్వకేట్ దేవరుప్పల శ్రీకాంత్.ప్రజలకు శ్రీకాంత్ విజ్ఞప్తి
మీ బూత్లో S.I.R జరుగుతున్నప్పుడు తప్పకుండా పాల్గొనండి. మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓటు మన హక్కు - దాన్ని కాపాడుకుందాం.
S.I.R కు సంబంధించిన ఫారమ్లు మరియు వివరాల కోసం మీ ప్రాంత BLO ను లేదా http://www.voters.eci.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు అని ఆయన కోరడం జరిగింది.
*ఓటర్ అవగాహన - SPECIAL INTENSIVE REVISION గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది. ఓటర్ జాబితాలో పేరు సరిగ్గా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత. అందుకే ఎన్నికల సంఘం *SPECIAL INTENSIVE REVISION - S.I.R* ప్రక్రియను చేపడుతుంది.
*S.I.R లక్ష్యం:*
1. *కొత్త ఓటర్ల నమోదు* - 18 సంవత్సరాలు నిండిన యువతకు అవకాశం కల్పించడం
2. *తప్పిపోయిన పేర్లు చేర్చడం* - ఏ కారణం చేతనైనా జాబితాలో లేని వారి పేర్లు చేర్చడం
3. *తప్పుడు/డూప్లికేట్ పేర్లు తొలగించడం* - జాబితాను స్వచ్ఛంగా ఉంచడం
4. *చిరునామా మార్పులు సరిచేయడం* - ఓటర్ల వివరాలను తాజాగా ఉంచడం
ఇది పారదర్శకమైన మరియు నమ్మదగిన ఎన్నికల ప్రక్రియకు పునాది. ప్రతి కుటుంబం తమ బూత్ స్థాయిలో BLO ను కలిసి ఓటర్ జాబితాను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు
Subscribe to:
Posts (Atom)