Friday, September 30, 2022

న్యాయ వాది ఆత్మహత్య.... హైకోర్టుకు నిప్పు

*న్యాయ వాది ఆత్మహత్య.... హైకోర్టుకు నిప్పు*

*మధ్యప్రదేశ్‌లో లాయర్ల నిరసన....!*

జబల్‌పుర్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పుర్‌లో హైకోర్టు న్యాయవాది ఆత్మహత్య పెను విధ్వంసానికి కారణమైంది.అనురాగ్‌ సాహూ అనే న్యాయవాది బలవన్మరణానికి పాల్పడగా.. ఆయన తోటి న్యాయవాదులు శుక్రవారం తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. హైకోర్టు ప్రాంగణంలో విధ్వంసానికి దిగి, న్యాయస్థానానికి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాయర్లపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

జబల్‌పుర్‌ హైకోర్టులో న్యాయవాది అయిన అనురాగ్‌ సాహూ ఓ అత్యాచారం కేసులో బాధితుల పక్షాన వాదించారు. ఈ కేసులో నిందితుడి బెయిల్‌ పిటిషనుపై శుక్రవారం జస్టిస్‌ సంజయ్‌ ద్వివేది ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. ఆ సమయంలో.. అనురాగ్‌ సాహూకు, నిందితుడి తరఫు న్యాయవాదికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకొంది.

చివరకు ఇద్దరూ వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అనురాగ్‌ సాహూ కోర్టు నుంచి హడావుడిగా ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తోటి న్యాయవాదులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

అనురాగ్‌ మృతదేహంతో నేరుగా హైకోర్టు ప్రాంగణానికి చేరుకొని మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. ఈ నిరసన కాసేపటికి హింసాత్మకంగా మారింది. లాయర్లు కోర్టు లోపలకు ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. అక్కడి వస్తువులకు నిప్పంటించారు.

పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోగా.. లాయర్లు వారిని అడ్డుకున్నారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందినీ చాలాసేపు లోపలకు రానివ్వలేదు. చివరకు.. న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

Thursday, September 29, 2022

గురువుగారూ... గురువుగారూ...అంటూ దోచేశారు....!

*గురువుగారూ... గురువుగారూ...అంటూ దోచేశారు....!*

*జోగిపేటలో రిటైర్డ్‌ టీచర్‌ ఇంట్లో రూ.30 లక్షల నగదు, 10 తులాల బంగారం చోరీ*

*కొంప ముంచిన మద్యం వ్యసనం*

*జోగిపేట (అందోల్‌): గురువు గారూ మేం మీ* విద్యార్థులం'అంటూ నమ్మించిన యువకులు ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయుడి ఇంట్లో నుంచి రూ. 30 లక్షల నగదు , 10 తులాల నగలు అపహరించుకు పోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్సీ బాలుర హాస్టల్‌ ప్రాంతంలో రిటైర్డ్‌ టీచర్‌ లక్ష్మీనారాయణ ఒంటరిగా ఉంటున్నారు.

మార్కెట్‌ యార్డు ఆవరణలో రెండు నెలల క్రితం లక్ష్మీనారాయణ మద్యం సేవిస్తుండగా అటువైపుగా వచ్చిన ఇద్దరు యువకులు.. 'గురువుగారు బాగున్నారా? మమ్మల్ని గుర్తుపట్టారా? మేము మీ శిష్యులం'అంటూ మాట కలిపారు. దీంతో పలుసార్లు కలుసుకోవడం, మద్యం సేవించడంతో వారి మధ్య చనువు ఏర్పడింది. కాగా, లక్ష్మీనారాయణ ఎప్పటిలాగే ఈనెల 24వ తేదీన మార్కెట్‌ యార్డు వద్దకు ఇద్దరు యువకులను తీసుకువెళ్లగా, అక్కడ దోమలు ఉన్నాయని, అన్నాసాగర్‌ వద్ద మంచి చోటు ఉంటుందని ఆ యువకులు తీసుకువెళ్లారు. ఆయన్ను మద్యం మత్తులోకి దింపిన ఆ యువకులు ఇంకా మద్యం, తినడానికి ఏమైనా తీసుకువస్తామని చెప్పి లక్ష్మీనారాయణ బైక్‌ను వెంట తీసుకువెళ్లారు.
*దొంగతనం జరిగింది ఇలా..*బైక్‌ తాళం చెవిగుత్తికే ఇంటి తాళం చెవి ఉండటంతో నేరుగా వారు లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి బీరువా తాళాన్ని పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. కేవలం 14 నిమిషాల్లో వారు దొంగతనం పూర్తి చేసుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4, 5 గంటల సమయంలో వెళ్లిన యువకులు రాత్రి 8 గంటల వరకు కూడా రాకపోయేసరికి లక్ష్మీనారాయణ తమ దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లి, 25వ తేదీన ఉదయం 5 గంటల సమయంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం లేకుండా గడియ పెట్టి ఉండడంతో లోనికి ప్రవేశించి చూడగా బీరువాలో దాచుకున్న డబ్బులు, బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు.

*ఇంటి స్థలం కొందామనుకున్నా*
రిటైర్‌మెంట్‌ ద్వారా వచ్చిన డబ్బులతో ఇంటి స్థలం కొందామనుకొని డబ్బు దాచుకున్నానని బాధితుడు లక్ష్మీనారాయణ విలేకరులకు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు రెండు నెలల క్రితం పరిచయమయ్యారని, తమది సంగారెడ్డి అని చెప్పారని, పేర్లు మాత్రం చెప్పలేదని అన్నారు.

*సుజీవన్ వావిలాల🖋️*

Wednesday, September 28, 2022

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఎన్ని ట్విస్టులో?.. బరిలో దిగ్విజయ్ సింగ్

ప్రశ్నించే ప్రతి ఒక్కరు #జర్నలిస్టే

*#మెయిన్ స్ట్రీమ్ మీడియా యాజమాన్యాలు అమ్ముడుపోయాయి అని అందరికి తెలిసిందే.... కానీ అందులో పనిచేసే కొందరు జర్నలిస్ట్ లు #జర్నలిజం అంటే అన్యాయాలపై / అవినీతి మీద  వాస్తవాలతో నిస్వార్థంగా #ప్రజాప్రయోజనాలకోసం తమ #కలానికి  ఎవరికీ భయపడకుండా ఉండాలని పనిచెపుతున్నారు.... ప్రస్తుతం #తెలంగాణ లో జర్నలిస్ట్ అనే పదానికి ఎంత మంది న్యాయం చేస్తున్నారో అందరికి తెలుసు.... అవినీతి మీద *ప్రశ్నించే" ప్రతి ఒక్కరు #జర్నలిస్టే 👍.... Bplkm🪶*                                                                         

*NOTE*:#సోషల్ మీడియా ప్రభంజనం ప్రస్తుతం అవినీతి మీద యుద్ధం చేస్తుంది*                                                                       

*Copy to Group link Media*

28/09/2022  prajasankalpam1.blogspot.com 

Monday, September 26, 2022

టాస్క్ ఫోర్స్ అదుపులో నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న

*బ్రేకింగ్*

*హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అదుపులో నయీమ్  ప్రధాన అనుచరుడు శేషన్న* 

*9 MM పిస్టల్ స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు*

కొంతకాలంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ ఈరోజు కొత్తపేట్ లోని  ఒక హోటల్లో  సెటిల్మెంట్ చేస్తున్న సమయంలో 

పక్కా సమాచారంతో శేషన్న ను  అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు

Sunday, September 25, 2022

నేడు బాసర ట్రిపుల్ ఐటికీ.... కేటీఆర్

*నేడు బాసర ట్రిపుల్ ఐటికీ.... కేటీఆర్*

నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీకి సోమవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వస్తున్నారు. ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా రానున్నారు.ఇటీవలే ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను పరామర్శించిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్‌లో మంత్రి కేటీఆర్‌ బాసర రానున్నారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని అనంతరం వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. కాగా, ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు పరిష్కరించాలంటూ జూన్‌లో విద్యార్థులు ఆందోళకు దిగిన విషయం తెలిసిందే. ట్రిపుల్‌ ఐటీకి ముఖ్యమంత్రి లేదంటే మంత్రి కేటీఆర్‌ రావాలని ఆందోళన చేసిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పర్యటన ప్రాధాన్యం సంత రించుకుంది.

*సుజీవన్ వావిలాల*🖋️

Saturday, September 24, 2022

ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు

ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు

Courtesy by : V6 వెలుగు మీడియా సౌజన్యంతో 

ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు
  • సాయంత్రం 4.30 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతి
  • వీఐపీలకు గేట్-1 నుంచి ఎంట్రీ

హైదరాబాద్,వెలుగు: ఇండియా– ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ట్వంటీ–20 క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియంలోకి సాయంత్రం 4.30 గంటల నుంచి అనుమతించనున్నారు. వీఐపీలు, వీవీఐపీలకు గేట్‌‌– 1 ద్వారా స్టేడియంలోకి ఎంట్రీ ఉంటుందని పోలీసులు తెలిపారు. వెహికల్ పార్కింగ్‌‌ కోసం స్టేడియం లోపల ‘ఎ’, ‘సి’ పార్కింగ్‌‌ స్లాట్స్ ఏర్పాటు చేశారు. హెచ్‌‌సీఏ మెంబర్స్, స్టాఫ్‌‌ కోసం గేట్‌‌–‌‌ 2ను  కేటాయించారు. సాధారణ ప్రేక్షకులను అన్ని గేట్ల నుంచి అనుమతిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా ఉప్పల్ క్రాస్‌‌ రోడ్స్, సికింద్రాబాద్‌‌, రామంతాపూర్‌‌‌‌, నాగోల్‌‌, అంబర్‌‌‌‌పేట్‌‌ రూట్‌‌లో వచ్చే వెహికల్స్​ను దారి మళ్లించనున్నారు.  సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వెహికల్స్​ను ఉప్పల్ వైపు అనుమతించరు. 

21 పార్కింగ్ ఏరియాలు

మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చే వారి కోసం 21 పార్కింగ్‌‌ స్లాట్స్‌‌ ఏర్పాలు చేశారు. 4,100 కార్లు, 5,350 బైక్​లు పార్కింగ్ చేసేందుకు స్లాట్స్ ఫిక్స్ చేశారు. కేటాయించిన ఏరియాల్లో మాత్రమే వెహికల్స్ పార్కింగ్ చేయాలని పోలీసులు సూచించారు. పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాలను ఫిక్స్ చేశారు. స్టేడియం బయట 5 క్రేన్లను అందుబాటులో ఉంచారు. మిగతా వాహనదారులు స్టేడియం రూట్​లో కాకుండా  నాగోల్, ఎల్​బీనగర్, దిల్​సుఖ్​నగర్, అంబర్ పేట మీదుగా వెళ్లాలని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 

మ్యాచ్​ కోసం  స్టేడియానికి వచ్చే వారి రూట్​ మ్యాప్

    తార్నాక వైపు నుంచి వచ్చే వీఐపీ పాస్‌‌ హోల్డర్స్‌‌: హబ్సిగూడ వైపు,ఎన్‌‌జీఆర్‌‌‌‌ఐ,ఏక్ మినార్ వద్ద రైట్‌‌ టర్న్‌‌ తీసుకుని గేట్ నం.1 నుంచి స్టేడియంలోకి వెళ్లాలి.

    అంబర్‌‌పేట్ వైపు నుంచి వచ్చే వీఐపీ పాస్ హోల్డర్స్‌‌: దూరదర్శన్, రామంతాపూర్ - స్ట్రీట్ నం.8 వద్ద లెఫ్ట్‌‌ టర్న్‌‌ తీసుకుని గేట్ నం.1కు చేరుకోవాలి. 

   నాగోల్, వరంగల్ హైవే నుంచి వచ్చే వీఐపీ పాస్‌‌ హోల్డర్స్‌‌: ఉప్పల్ క్రాస్‌‌ రోడ్,- సర్వే ఆఫ్ ఇండియా, ఏక్ మినార్ వద్ద లెఫ్ట్‌‌ టర్న్‌‌ తీసుకుని గేట్‌‌ నం.1 ద్వారా  స్టేడియంలోకి వెళ్లాలి.

పార్కింగ్‌‌ ఇలా..

  •     హబ్సిగూడ  నుంచి ఉప్పల్  వైపు వచ్చే కార్లు,బైక్స్‌‌: ఎన్‌‌జీఆర్‌‌‌‌ఐ లెఫ్ట్‌‌ సైడ్‌‌ గేట్ నం.1 లెఫ్ట్‌‌  నుంచి 3వ గేట్‌‌ వరకు మెట్రో పార్కింగ్‌‌లో వెహికల్స్ పెట్టాలి. 
  •     ఉప్పల్ నుంచి హబ్సిగూడ రోడ్డులో వచ్చే వెహికల్స్‌‌: హిందూ ఆఫీస్ లేన్ వైపు జెన్‌‌పాక్ట్ సర్వీస్ రోడ్ నుంచి ఎన్‌‌జీఆర్‌‌‌‌ మెట్రోస్టేషన్‌‌ వద్ద పార్క్‌‌ చేయాలి.
  •     ఉప్పల్,రామాంతపూర్ రూట్‌‌లో వచ్చే కార్లు: సినీపోలీస్ సెల్లార్‌‌, మోడ్రన్ బేకరీ లోపల, శక్తి డిటర్జెంట్ ఓపెన్ ప్లేస్, డీఎస్‌‌ఎల్‌‌ ఓపెన్ ల్యాండ్, మెరియా ఇంటర్నేషనల్ స్కూల్​లో పార్క్‌‌ చేయాలి.
  •     ఉప్పల్, రామంతాపూర్ నుంచి వచ్చే బైక్స్: మోడ్రన్ బేకరీ, అమ్మ భగవన్ సేవా లేన్‌‌, కేవీ స్కూల్‌‌ నుంచి డీఎస్‌‌ఎల్‌‌,ఎల్జీ గొడౌన్ వద్ద పార్క్ చేయాలి.

Bathukamma festivities..... @KCR


Chief Minister Sri K. Chandrashekar Rao extended greetings to the people of the State on the commencement of nine-day long #Bathukamma festivities.

Hon'ble CM said that the Bathukamma is celebrated with great fervour and gaiety by women at their maternal homes by arranging the flowers in a beautiful stack. The dance and songs around Bathukammas reflect the unique tradition of Telangana.The cultural extravaganza, that embeds praying the nature by women folk all through it, will be on full display across the State for nine days starting the 'Petharamasa'.
Bathukamma spread far and wide to all corners of the globe. And with it, the Telangana culture also proliferated to different continents. Pray Goddess of Nature, Bathukamma, to bestow the people of the State with happiness and good health: CM


Friday, September 23, 2022

రాంకీ సంస్థతో జిహెచ్ఎంసి కుదుర్చుకున్న ఒప్పందం విరమించుకోవాలని ఆందోళనకు దిగిన ఎఐటియుసి సిబ్బంది

పత్రికా ప్రకటన                24-09-2022
         రాంకీ సంస్థతో జిహెచ్ఎంసి 
కుదుర్చుకున్న ఒప్పందం విరమించుకోవాలని
  ఆందోళనకు దిగిన ఎఐటియుసి సిబ్బంది 
--------------------------------------------------------
సెప్టెంబర్ 24 హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి కార్మికుల శ్రమ దోపిడి కోసం రాంకీ సంస్థతో కుదుర్చుకున్న చికటి ఒప్పందాన్ని విరమించుకోవాలని, ఎండ, వాన, రాత్రి, పగలనక ప్రజా ఆరోగ్యాలకోసం పనిచేస్తున్న కార్మికుల గోస పట్టించుకోకుంటే, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం 24 వేలు ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మందా వెంకటేశ్వర్లు, కె.యేసురత్నం హెచ్చరించారు. శుక్రవారం జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ వరకు ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి పరిధిలో గల ఆరు జోన్ల కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ప్రదర్శనగా వచ్చి జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ మేయిన్ గేట్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా  మందా వెంకటేశ్వర్లు, కె.యేసురత్నం మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని అన్ని రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఇచ్చిన హామీని గుర్తుచేశారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ మాట పక్కన పెడితే కనీస వేతనాలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు శ్రమ దోపిడకి గురౌతున్నారని గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి లో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు చికటి ఒప్పందాన్ని చేసుకొని రాంకి అనే సంస్థతో జిహెచ్ఎంసి చేతులు కలిపడం జిహెచ్ఎంసి పరిధిలో పారిశుద్ధ్య పనులు చేయించడం పట్ల కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిహెచ్ఎంసి లో మలేరియా విభాగంలో గతంలో దోమల మందు పిచికారి చేయడానికి ఇద్దరు సిబ్బంది ఉండెవారని ఇప్పుడు ఇద్దరు చేసే పని ఒక్కరితోనే సక్కబెడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని పాత పద్ధతిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ప్రభుత్వం గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. అదేవిధంగా గ్రూపుల్లో 7గురు కార్మికులు ఉండాలి కాని కొన్ని గ్రూపుల్లో 3 లేదా 4 గురు మాత్రమే ఉన్నారని ప్రతి గ్రూపులో 7 గురు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని సర్కిల్ లలో పనిచేస్తున్న సిబ్బందికి సేఫ్టీ పరికరాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రవిచంద్ర, ముడి మార్టిన్, నాయకులు సుధాకర్,డి.రాములు, పి.హరినాద్, ఆనంద్, చిరంజీవి, మహేందర్,డి.ఎం.శేఖర్, నీలమ్మ, అనితా,లక్షమమ్మ, వీణా,కలమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

అజారుద్ధీన్ పై మానవ హక్కుల కమిషన్ లో కంప్లైంట్.

పీర్జాదిగూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్కు స్థలం కబ్జా

*పీర్జాదిగుడ మున్సిపల్ కార్పొరేషన్ 1 వ డివిజన్ లొ పార్కు కబ్జా చేసి చెర్రీస్ స్వచ్చంద సంస్థ చేపడుతున్న అక్రమ నిర్మాణంలో మేయర్, కమిషనర్ వాటా ఎంత...బీఎస్పీ కార్పొరేషన్  అధ్యక్షుడు ఇటికాల అంబేద్కర్*

*విషయం:* *పీర్జాదిగూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేయర్ గారి ఇలాకాలలో 1వ వార్డులోని సర్వే నెం 29లొ గల శ్రీసాయి నగర్ కాలనీ లొ గల పార్కు స్థలం కబ్జా చేసి చెర్రీస్ అనే  ఒక స్వచ్చంద సంస్థ నడుపుతున్న వ్యక్తి భవన నిర్మాణం చేపడుతున్న విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ  పీర్జాదిగూడా కార్పొరేషన్ అధ్యక్షులుఇటికాల అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో  పార్కు స్థలాన్ని తేది 6:03:2022 నాడు పరిశీలించి కమిషనర్ గారి దృష్టికి మేయర్ గారి దృష్టికి తీసుకొచ్చాము..కాని ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఇదే పార్కులో గౌరవ మంత్రి మల్లారెడ్డి గారు పట్టన  ప్రగతి కార్యక్రమంలో కొన్ని వందల మొక్కలు నాటారు. కానీ ఇప్పటివరకు  ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఈ వ్యవహారంపై కొంత మంది రాజకీయ నాయకులు ప్రముఖ mlc గారి  అండదండలతో ఈ వ్యవహారం చాపకింద నీరులా మారి ఈ రోజుకి 2nd ప్లోర్ స్లాబ్ అక్కడ నిర్మాణం జరిగింది.తెలంగాణ మున్సిపల్ యాక్ట్  2019 సెక్షన్ 24 ప్రకారం పార్కు ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వంలో ఉన్న మేయర్ గారు కమిషనర్ గారు ప్రభుత్వ అధికారులు ఎందుకు చూసి చూడనట్టు వుంటున్నారు.మరి ఇందులో మేయర్,కమిషనర్ వాట ఎంత ప్రజలకు తెలియాల్సిన అవసరం వుంది.మీ వాట లేకుంటే తక్షణం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.గత రెండు రోజులుగా అక్కడ నిర్మాణం చేపడుతున్న చెర్రీస్ ఫౌండేషన్ వ్యక్తి ,ఎలక్ట్రాన్ మీడియా వారికీ ఫోన్ పే,గూగుల్ పే ద్వారా డబ్బులు ఇచ్చినట్టు అతను మాట్లాడుతున్న వాయిస్  తో కొన్ని మీడియా ఛానళ్లలో,పత్రికలలో వార్తలు వచ్చాయి..మరి అది అతని సొంత భూమి ఐతే మీడియా వారికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది.కావునా మీరు ఇప్పటికైనా పార్కు స్థలాన్ని సర్వే చేయించి అక్కడ జరుగుతున్న నిర్మాణాలను ఆపేసి తగు చర్యలు తీసుకోని పార్కు స్థలాన్ని కాపాడాలని బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో ఈ కబ్జాల వ్యవహారాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి కలెక్టర్ గారి మరియు CDMA కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి పెద్దఎత్తున ఆందోళనలు చేసి మున్సిపల్ ఆఫీస్ కలెక్టరేట్ ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం*

   *జై భీమ్ జై భారత్*

        *భవదీయ*
*ఇటికాల అంబేద్కర్*
        *అధ్యక్షులు*
        *BSP-PMC*
        *🐘💺🐘*

ఈడీ ఝలక్.... నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు నోటీసులు

*ఈడీ ఝలక్.... నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు నోటీసులు*

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో​ టీకాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో భాగంగా షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డికి నోటీసులు అందినట్టు సమాచారం.కాగా, ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీని ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నోటీసులపై కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ స్పందించారు. శుక్రవారం షబ్బీర్‌ అలీ మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు వస్తే మాత్రం విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

Thursday, September 22, 2022

పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సంఘం కీలక సిఫార్సు.....!

*పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సంఘం కీలక సిఫార్సు.....!*


దిల్లీ: ఎన్నికల సమయంలో పోస్టల్‌ బ్యాలెట్లు  అవకాశం ఉందని భావిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పులకు సిద్ధమైంది. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌కు బదులుగా అదే కేంద్రంలో తమ బ్యాలెట్‌ను సమర్పించే వెసులుబాటును కల్పించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని సిఫార్సు చేస్తూ ఎన్నికల సంఘం తాజాగా కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది.

పోలింగ్‌ విధులు నిర్వర్తించే సిబ్బంది తమకు ఇచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకోకుండా తమవెంటే పెట్టుకున్నట్లు గతంలో జరిగిన ఎన్నికల్లో గుర్తించాం. నిబంధనల ప్రకారం కౌంటింగ్‌ తేదీన ఉదయం 8 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేయవచ్చనే ఆలోచనతో వాటిని సిబ్బంది తమతోనే ఉంచుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో విధులు ముగిసిన తర్వాత పోస్టల్‌ బాలెట్లను సిబ్బంది తమతోపాటే ఇంటికి తీసుకెళ్లడంపైనా ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. 1951 నాటి ప్రజాప్రతినిధ్య చట్టం, 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌ 18 ప్రకారం కౌంటింగ్‌ తేదీన ఉదయం వరకు పోస్టల్‌ బ్యాలెట్లను అనుమతిస్తారు. ఇలా గత రెండేళ్లలో గోవా, కేరళ, మణిపూర్‌లలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 50శాతానికి పైగా పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చినట్లు వెల్లడైంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌కు బదులుగా ఆ కేంద్రంలోనే ఓటును వినియోగించుకోవడంపై సెప్టెంబర్‌ 16న జరిగిన సమావేశంలో భారత ఎన్నికల ప్రధాన అధికారి (CEC) రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్రపాండేలు నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర న్యాయశాఖకు ఎన్నికల సంఘం లేఖలో సిఫార్సు చేసింది.

ఇప్పటి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది శిక్షణ సమయంలోనే ఆయా రిటర్నింగ్‌ అధికారిని సంప్రదించి పోస్టల్‌ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అనంతరం వారికి పోలింగ్‌ స్టేషన్‌ కేటాయించే ముందే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్లను అందజేస్తారు. ఈ క్రమంలోనే పోస్టల్‌ బ్యాలెట్లు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని గుర్తించిన ఎన్నికల సంఘం ఈ విధానంలో మార్పులు తెచ్చేందుకు సిద్ధమైంది.

*సుజీవన్ వావిలాల*🖋️

Tuesday, September 20, 2022

దసరా సెలవులు తగ్గించండి

దసరా సెలవులు తగ్గించండి

 
దసరా సెలవులు తగ్గించండి
  • విద్యాశాఖ డైరెక్టర్‌కు ఎస్సీఈఆర్టీ ప్రతిపాదన

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (నమస్తే తెలంగాణ): దసరా సెలవులు తగ్గించడం లేదా రెండో శనివారాల్లోనూ పాఠశాలలను నడిపేందుకు అనుమతించాలని కోరుతూ ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ ఎం రాధారెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేనకు మంగళవారం లేఖరాశారు. భారీ వర్షాలతో జూలై 7 నుంచి 16 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతోపాటు జాతీయ సమైక్యత ఉత్సవాల నేపథ్యంలో 2022 -23 విద్యాసంవత్సరం 7 రోజులు నష్టపోయిందని లేఖలో ప్రస్తావించారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం మొత్తం పని దినాలు 230 కాగా, జరిగిన నష్టాన్ని పూరించేందుకు పై రెండు ప్రతిపాదనలను సమర్పించారు.

ప్రతిపాదనలివే..

  • అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు 14 రోజులు ప్రకటించిన దసరా పండుగ సెలవులను వాయిదావేసి తాజాగా అక్టోబర్‌ 1 నుంచి 9 వరకు 9 రోజుల పాటు రీషెడ్యూల్‌ చేసేందుకు అనుమతించాలి. దీంతో 5 పని రోజులు స్కూళ్లు నడిపి భర్తీచేయవచ్చని పేర్కొన్నారు.
  • రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లను రెండో శనివారాల్లోనూ నడిపేందుకు ఆదేశాలివ్వాలని కోరారు. ఇలా నవంబర్‌, డిసెంబర్‌, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలో స్కూళ్లలో తరగతులు నిర్వహించడం ద్వారా ఐదు రోజులు కలిసివస్తుందని లేఖలో ప్రస్తావించారు.

జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్.... కేద్రం

*జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్.... కేద్రం*

న్యూఢిల్లీ: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్‌ కోటాలో ఎలాంటి కోత లేదని, కేవలం జనరల్‌ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్‌కు స్థానం కల‍్పించామని కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టంచేసింది.ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు ఉన్న 50 శాతం రిజర్వేషన్‌ స్వాతంత్య్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు.

ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు కేంద్రం 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న విషయం విదితమే. రిజర్వేషన్‌ కల్పనకు ఆర్థిక పరిస్థితి గీటురాయి కాదని, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను కోర్టు సమరి్థంచాలనుకుంటే అంతకుముందుగా ఇందిరా సహానీ(మండల్‌) తీర్పును çసమీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది.

*సుజీవన్ వావిలాల*🖋️

బుల్లెట్ బండి పెళ్లి కూతురు... భర్త ఏసీబీ వలకు చిక్కాడు

*బుల్లెట్ బండి పెళ్లి కూతురు... భర్త ఏసీబీ వలకు చిక్కాడు*

హైదరాబాద్‌: బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పట్టణ ప్రణాళిక అధికారి ఆకుల ఆశోక్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కాడుప్రణాళికా విభాగంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అశోక్‌.. దేవేందర్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. ఆ మొత్తం నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంతో పాటు అశోక్‌ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. 'బుల్లెట్‌ బండి' పాటకు డ్యాన్స్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన పెళ్లి కుమార్తె భర్తే ఈ అశోక్‌. ఈ సాంగ్‌తో అతడు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

*సుజీవన్ వావిలాల*🖋️

ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియోతో కూడిన CCTV కెమెరాలు

*ప్రెస్ నోట్ - పత్రికా ప్రకటన - ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియోతో కూడిన CCTV  కెమెరాలు*

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం లోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియోతో కూడిన సీసీ కెమెరాలు అమర్చాలి - తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం లో పోలీస్ ఉన్నత అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించిన సీసీఆర్ హైదరాబాద్ విభాగం

సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వస్తే సత్వర & పారదర్శకంగా న్యాయం జరగాలన్న లక్ష్యంతో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆడియోతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్) సంస్థ సభ్యులు సోమవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సుప్రీంకోర్టు ఆర్డర్ తో కూడిన వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీసీఆర్ సంస్థ హైదరాబాద్ విభాగం వారు మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు సీసీఆర్ సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ప్రజలకు నిజమైన న్యాయం లభించినప్పుడే తమ పనికి సార్ధకత ఏర్పడుతుందని, సామాజిక & ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహించామని, మెరుగైన పోలీస్ సేవల కోసం, పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడం, పోలీస్ వ్యవస్థపై భయం పోయి నమ్మకం రావడం, పోలీస్ స్టేషన్ లలో సత్వర & పారదర్శక న్యాయం కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందించామని సంస్థ సభ్యులు తెలిపారు.

సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సీసీ కెమెరాలు ఉండవలసిన చోట్లు, సీసీఆర్ సంస్థ పిటిషన్ వివరాలు : పోలీస్ స్టేషన్ లోని అన్ని ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లు; పోలీస్ స్టేషన్ యొక్క ప్రధాన ద్వారం; అన్ని లాక్-అప్‌లు, అన్ని కారిడార్లు; లాబీ / రిసెప్షన్ ప్రాంతం; అన్ని వరండాలు / అవుట్‌హౌస్‌లు; ఇన్‌స్పెక్టర్ గది, సబ్-ఇన్‌స్పెక్టర్ గది; లాక్-అప్ గది వెలుపల ఉన్న ప్రాంతాలు, స్టేషన్ హాల్; పోలీస్ స్టేషన్ కాంపౌండ్ ముందు; వెలుపల (లోపల కాదు) వాష్‌రూమ్‌లు / మరుగుదొడ్లు; డ్యూటీ ఆఫీసర్ గది, పోలీస్ స్టేషన్ వెనుక భాగం మొదలైనవి.
CCTV కెమెరాలు రాత్రి దృష్టితో ఉండాలి మరియు తప్పనిసరిగా ఆడియో మరియు వీడియో ఫుటేజీని కలిగి ఉండాలి. రికార్డింగ్‌లను 18 నెలల పాటు భద్రపరచాలి.

ఈ కార్యక్రమంలో సీసీఆర్ సంస్థ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ యెలిశెట్టి ప్రసాద్, జోనల్ లీగల్ అడ్వైజర్ సెక్రటరీ గుండ్ల మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.

సందేహాలకు సంప్రదించగలరు: 90145 86589, 70418 61001, 91824 99025.

అవినీతి రహిత & అలసత్వం లేని భారత వ్యవస్థ మా లక్ష్యం
సిసిఆర్ సంస్థ ఆఫీషియల్ ఈమేల్: councilforcitizenrights@gmail.com

Monday, September 19, 2022

తెలంగాణ..... బతుకమ్మ ఉత్సవాల తేదీల .... ఖరారు

*తెలంగాణ..... బతుకమ్మ ఉత్సవాల   తేదీల .... ఖరారు*

హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 25 నుంచి అక్టోబర్‌ 3 వరకు బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని టీఎస్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.అక్టోబర్‌ 3న ట్యాంక్‌బండ్‌ దగ్గర ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. బీఆర్‌కే భవన్‌లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆయాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Sunday, September 18, 2022

గవర్నర్ తమిళిసై ని కలిసిన MLA రాజా సింగ్ భార్య....!

*గవర్నర్ తమిళిసై ని కలిసిన MLA రాజా సింగ్ భార్య....!*

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కలిశారు. అయితే తన భర్తపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని, వీటిపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌కు ఉషాభాయి వినతి చేశారుతన భర్తపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ సతీమణి గతకొద్దిరోజులుగా న్యాయం చేయాలంటూ అటు కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్‌తో పాటు అవకాశం ఉన్న ప్రతీ చోట ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గవర్నర్‌ను కలిసిన ఉషాభాయి. తన భర్తపై కేసులు ఎత్తివేయాలని లేఖ అందజేశారు. ఇంకోవైపు ప్రభుత్వం చెబుతున్నట్లు వంద కేసులు తన భర్తపై లేవని, అవన్నీ ప్రజాకోర్టులో కొట్టేసినవే అని తెలిపారు. ప్రభుత్వం ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాసేలా వ్యవహరిస్తోందని, దాన్ని ప్రశ్నించిన రాజాసింగ్‌పై తప్పుడు కేసులు పెట్టిందని రాజాసింగ్ సతీమణి తెలిపారు

*సుజీవన్ వావిలాల*🖋️

Friday, September 16, 2022

TS: రేపు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

TS: రేపు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌:  తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు (శనివారం) సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అవాక్కయ్యే ఘటన.... జయహో జగదీష్ రెడ్డి.... జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం

*అవాక్కయ్యే ఘటన.... జయహో జగదీష్ రెడ్డి.... జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం*

సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ ఒక జిల్లా ఎస్పీనే అత్యుత్సాహం ప్రదర్శించారు.వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌.. 'జయహో జగదీష్‌రెడ్డి' అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో మంత్రి జగదీష్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు... ''జయహో జగదీష్‌రెడ్డి'' అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వేదిక ముందున్నవారితో కూడా ఎస్సీ.. 'జయహో జగదీషన్న' అంటూ నినాదాలు చేయించారు. జిల్లా పోలీస్‌ బాస్‌ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ నేత మాట్లాడినట్లుగా ఎస్పీ ప్రసంగం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు

*సుజీవన్ వావిలాల*🖋️

తమిళనాడులో స్కూలు పిల్లలకు ఉచితంగా టిఫిన్ - సిఎం స్టాలిన్

తమిళనాడులో స్కూలు పిల్లలకు ఉచితంగా టిఫిన్ - సిఎం స్టాలిన్

తమిళనాడులో ప్రభుత్వ ప్రాధమిక స్కూళ్ల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని సిఎం ఎంకె స్టాలిన్ గురువారం ప్రారంభించారు.ఈ పథకం పరిధిలో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు టిఫిన్లు అందుతాయి.మధురైలో పథకం ఆరంభించిన స్టాలిన్ అక్కడి చిన్నారులకు ఆహారం అందించడమే కాకుండా వారితో కలిసి కూర్చుని తాను కూడా ఆరగించారు. పేదల జీవనస్థితిగతులలో మార్పు దిశగా ఈ పథకం దోహదం చేస్తుందని పిల్లల్లో అధ్యయన శక్తి పెరిగేందుకు,పిల్లలను క్రమం తప్పకుండా బడులకు రప్పించేందుకు ఈ స్కీం దోహదపడుతుందని చరిత్రలో దీనికి ప్రత్యేకత ఉంటుందని తెలిపారు.పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ స్కీంలు అమెరికా, యూరప్‌లలో ఉన్నాయని, అక్కడ విద్యార్థులలో వికాసానికి ఈ తోడ్పాటు ఎంతగానో ఉపకరించినట్లు వెల్లడైందని,దీనిని పరిగణనలోకి తీసుకున్నామని స్టాలిన్ తెలిపారు. స్కీం తొలిదశలో రాష్ట్రంలోని 1545 స్కూళ్లలో అమలు అవుతుంది.రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి నేపథ్యంలో మధురైలో దీనిని ఆరంభించారు.ఈ అల్పాహార పథకంలో భాగంగా విద్యార్థులకు వడ్డించే వాటిలో సాంబార్‌తో సేమియా ఉప్మా, రవ్వ ఉప్మా, సేమియా కిచిడి, రవ్వ పొంగలి వుంటుంది..

Courtesy by link Media 

Thursday, September 15, 2022

పేరు పెట్టడం ఓకే.... దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది... RS ప్రవీణ్ కుమార్

*పేరు పెట్టడం ఓకే.... దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది... RS ప్రవీణ్ కుమార్*

తెలంగాణ సెక్రటేరియెట్ కు అంబేడ్కర్ పేరు పెట్టడం మంచిదే అని బీఎస్పీ స్టేట్ ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కానీ భవనాలకు, రోడ్లకు, పేరు పెట్టి, పెద్ద విగ్రహాలను నిర్మించి, ఆ మహనీయుల ఆశయాలను తెలివిగా తుంగలో తొక్కే ప్రయత్నం అనాదిగా జరుగుతున్నదే అని గుర్తు చేశారు.అధికారం కోసం ఏమైనా చేస్తారు..మీకు చిత్తశుద్ది ఉంటే మీ అక్రమ ఆస్తులను పేదలకు పంచి సామాజిక అసమానతలను తగ్గించాలని డిమాండ్ చేశాడు. 2014కు ముందు దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. బహుజనుల ఓట్ల కోసం ఆధిపత్య వర్గాలు ఏమైనా చేస్తారని దుయ్యబట్టారు. బహుజనుల లక్ష్యం కుర్చీ తప్ప మరొటి కాదని మాన్యవర్ కాన్సిరాం గారు ఏనాడో చెప్పారని తెలిపారు.

ఫాం హౌస్‌లను పేదలకు రాసివ్వండి..అంబేడ్కర్ పై అభిమానం ఉంటే ముందు మీ ఫాం హౌస్‌లను పేదలకు రాసివ్వండని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా మీ బినామీ కంపెనీలను పేదలకు పంచి, ఇన్ని రోజులు తెలంగాణల చేసిన దోపిడీకి ట్యాంక్ బండ్ దగ్గర క్షమాపణ చెప్పాలన్నారు.

అధికారమే బహుజనుల లక్ష్యం..

మనం అడగకపోయినా సచివాలయానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాడు. కానీ ఆయన వెయ్యి సార్లు ప్రతిజ్ఞ చేసి చెప్పిన దళిత ముఖ్యమంత్రి పదవి మాత్రం ఇవ్వడని చెప్పారు. తన తర్వాత కూడా కొడుకునే ముఖ్యమంత్రి చేసే పనిలో ఉన్నాడని వివరించారు. "బహుజనులారా సచివాలయానికి బాబాసాహెబ్ పేరు చూసి సంకలు గుద్దుకుందామా? బహుజనులను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించే కాన్సిరాం బాటలో నడుద్దామా?" ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

CI కుటుంబానికి రూ.25 లక్షలు సాయం....!

*CI  కుటుంబానికి రూ.25 లక్షలు  సాయం....!*

గుండె పోటుతో మృతిచెందిన ఓ సీఐ కుటుంబానికి ఆయన బ్యాచ్‌కు చెందిన సీఐలు, డీఎస్పీలు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం చిన్నబీరవెల్లికి చెందిన వై. రమేష్‎బాబు 1996 బ్యాచ్‌లో ఎస్‌ఐగా ఎపింకయ్యారు. కుటుంబంతో హైదరాబాద్‌ ఉప్పల్‌లో స్థిరపడ్డారు. గత ఏడాదినుంచి ఆదిలాబాద్‌ జిల్లా, ఇచ్చోడ పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన కొంతకాలంగా జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్నారు. వారం రోజులక్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో ఉండగానే గుండెపోటుకు గురైన ఆయన మంగళవారం మృతిచెందారు.ఉప్పల్‌లో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాల్లో సీఐలు, డీఎస్పీలుగా పనిచేస్తున్న రమేష్‎బాబు బ్యాచ్‌కు చెందిన పోలీసు అధికారులు రూ. 25,00,116 చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేసి ఏ అవసరం వచ్చినా తామున్నామంటూ ధైర్యం చెప్పారు.

*సుజీవన్ వావిలాల🖋️*
ప్రజల పక్షం 

బ్యాడ్జ్ పెట్టుకో లేదా అవినీతిపరులుగానే ప్రభుత్వ అధికారులు

https://twitter.com/SrinivasRTIA/status/1570048789158973440?t=ONFA-PjMr8kfq2macdFk-w&s=08                                                                                                                                                

*తెలంగాణలో ఇంత ధైర్యం ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఉంటే వెంటనే వీరి ఆదర్శంగా బ్యాడ్జ్ ధరించండి, బ్యాడ్జ్ పెట్టుకోలేదా అవినీతిపరులుగానే ప్రజలు భావించాల్సి ఉంటుంది, సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి విస్తృతంగా tag #NOBRIBE తీసుకువెళదాము 🌹😊🙏.                                                                                          G. శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్




ఓట్ల స్కాం లో పువ్వాడను అరెస్ట్ చేయాలి

https://twitter.com/RSPraveenSwaero/status/1570266537709412353?t=B-cQfuqkqIvMrlMmf06spQ&s=08                   

*పువ్వాడ అడ్రస్‌ మీద 532 ఓట్లా? మరి ఎలక్షన్ కమీషన్ నిద్రపోయిందా? ఆధిపత్య వర్గాలు అధికారం  తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ⁦@SpokespersonECI⁩ మీకు ధమ్ముంటే ఈ ఓట్ల స్కాం లో పువ్వాడను అరెస్ట్ చేయాలి*.                                                                                                                                                          *This is a scam on democracy. The accused Min must go to jail*

Wednesday, September 14, 2022

నమ్మిన సిద్ధాంతాన్ని వదలను.... చావుకు భయపడను.... MLA ఈటల....!

*నమ్మిన సిద్ధాంతాన్ని వదలను.... చావుకు భయపడను.... MLA ఈటల....!*

హైదరాబాద్: స్పీకర్‌ను ఉద్దేశించి 'మరమనిషి' అంటే సీఎం కేసీఆర్‌కు అంత కోపం ఎందుకని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు.కేసీఆర్‌ అనేక మాటలు అన్నారని.. వాటి సంగతేంటని నిలదీశారు. ఆయన తిట్లే తెలంగాణలో మాట్లాడే భాషనా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ చెప్పే ప్రతి మాటా అబద్ధమేనని ఈటల వ్యాఖ్యానించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

''బీఏసీ సమావేశానికి భాజపా ఎమ్మెల్యేలను పిలవలేదు. ఆ విషయంపై ఎమ్మెల్యే రఘునందన్‌ అడిగితే సభాపతి సమాధానం చెప్పలేదు. భాజపా సభ్యుల హక్కులను సభాపతి కాలరాశారు. ప్రజల సమస్యలపై సభలో ఎవరూ మాట్లాడకూడదా? బీఏసీలో సీఎం ఇచ్చిన అజెండానే సభలో అమలు చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం ఇవ్వాలని కోరా. ఈ ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతుల సమస్యలపై తెరాస, కాంగ్రెస్‌, ఎంఐఎం సభలో చర్చించలేదు. నిరుద్యోగ సమస్యపై సభలో ఒక్కరూ మాట్లాడలేదు. గొల్లకురుమలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్ని పార్టీలు, సభ్యుల హక్కులను సభాపతి కాపాడాలి. సభలో తప్పు ఎవరిదో ప్రజలందరికీ తెలుసు.

గతంలో రెక్కీ నిర్వహించి నన్ను చంపుతానని బెదిరించినప్పుడే నేను భయపడలేదు. నాకు, నా కుటుంబసభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌ వహించాల్సిందే. నాపై దాడి జరిగితే అది యావత్ తెలంగాణపై జరిగిన దాడిగా భావిస్తాం. 24 గంటలూ స్వేచ్ఛగా, ఒంటరిగా తిరగగలిగే శక్తి ఉన్నవాడిని నేను. చావుకు భయపడేది లేదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా.. ఎంత ఒత్తిడి చేసినా.. నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా సాగుతున్నాను'' అని ఈటల అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Monday, September 12, 2022

సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం....ఏడుగురి సజీవ దహనం

*సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.... ఏడుగురు మృతి!*

*ఏడుగురి సజీవ దహనం*

*మరో నలుగురి పరిస్థితి* *విషమంసికింద్రాబాద్‌ రూబీ ఎలక్ట్రిక్‌ షోరూంలో ఘటనషోరూంపైన రూబీ హోటల్‌కూ* *మంటలుఆ సమయంలో లాడ్జిలో పలువురి బసదట్టమైన పొగ.....*
మంటలతో ఉక్కిరిబిక్కిరికాలిన గాయాలతో కిందకు దూకిన పలువురుగాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు8 వాహనాలతో రంగంలోకి అగ్నిమాపక శాఖప్రాణాలకు తెగించి, పలువురిని కాపాడిన సిబ్బందిసెల్లార్‌లో బ్యాటరీల చార్జింగ్‌తోనే ప్రమాదం!భవనంలో అగ్నిమాపక పరికరాల లేమి?

హైదరాబాద్‌  సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో.. ఆ ప్రాంతంలో భారీ శబ్దాలువచ్చాయి. చూస్తుండగానే దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న రూబీ హోటల్‌కు వ్యాపించాయి. హోటల్‌లో దిగిన పలువురు పొగలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకారు. తీవ్రగాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కడపటి వార్తలందేసరికి ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బం ది, స్థానికుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురు రోడ్డులో.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ ఎలక్ట్రికల్‌ షోరూం కొనసాగుతోంది. సెల్లార్‌లో ఆ షోరూం వాహనాల గోదాము ఉంది. రాత్రి 8.45 సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఈ-స్కూటర్‌ పేలిపోయింది. చూస్తుండగానే మంటలు ఇతర వాహనాలకు వ్యాపిం చి, ఒక్కొక్కటిగా పలు వాహనాలు భారీ శబ్దంతో పేలిపోయాయి. రాత్రి కడపటి వార్తలందేసరికి కూడా ఈ-స్కూటర్ల బ్యాటరీల పేలుళ్లు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో గోదాములో ఎవరూ లేకున్నా.. పై అంతస్తుల్లో ఉన్న రూబీ హోటల్‌ గదులకు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్‌లో 25 మంది బసచేసినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. దట్టమైన పొగ, మంటలతో ఉక్కిరిబిక్కిరైన మరో ఐదుగురు ప్రాణభయంతో కిందకు దూకారు.

ఆలోగానే వారికి మంటలంటుకున్నాయి. ఓ మహిళ సహా.. మరో ఆరుగురు కిందకు దూకలేక.. మెట్ల వైపు పరుగులు తీశారు. ఆ ప్రయత్నంలో వారికీ మంటలు అంటుకున్నాయి. ఐదుగురిని వేర్వేరు ఆస్పత్రులకు తరలించగా, ఆ మహిళ మృతిచెందినట్లు తెలిసింది. మరో ముగ్గురికి గాంధీ ఆస్పత్రి బర్నింగ్‌ వార్డ్‌లో చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుంది. అయితే.. అప్పటికే షోరూం, గోదాము అగ్నికి ఆహుతయ్యాయి. హోటల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 54 మీటర్ల నిచ్చెన ఉండే వాహనంతోపాటు.. 5 ఫైరింజన్లు, స్మోక్‌ ఇస్టింగ్విషర్‌ వాహనాలు, రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. పైఅంతస్తుల్లోని హోటల్‌ గదుల్లో చిక్కుకుపోయిన 10 మందిని ఫైర్‌ ఆఫీసర్లు మోహన్‌రావు, ముస్తఫా, ప్రవీణ్‌ తమ బృందాలతో కలిసి ప్రాణాలకు తెగించి కాపాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌కుమార్‌ జైన్‌, ప్రాంతీయ అగ్నిమాక అధికారి వి.పాపయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూధన్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సంఘటనాస్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ''మొత్తం ఏడుగురు మృతిచెందారు. దట్టమైన పొగలతో ఊపిరి ఆడకే మరణాలు సంభవించాయి'' అని సీవీ ఆనంద్‌ వివరించారు.

ఒకవైపే

దారిరూబీ ఎలక్ట్రిక్‌ షోరూం, హోటల్‌ మొత్తం ఐదంతస్తుల్లో కొనసాగుతున్నాయి. అయితే.. ఆ హోటల్‌ భవనం నుంచి లోనికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉంది. భవనానికి సెట్‌ బ్యాక్స్‌లేవు. దీంతో.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. సరిపడా అగ్నిమాపక వాహనాలు వచ్చినా.. ఒకవైపు నుంచే మంటలను ఆర్పాల్సి వచ్చింది. హోటల్‌ గదుల్లో ఏసీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని ఫైర్‌ సిబ్బంది చెబుతున్నారు.

బ్యాటరీల చార్జింగ్‌ వల్లేనా?

షోరూం గోదాములో ఈ-స్కూటర్లను పార్క్‌ చేస్తారు. ఒక భాగంలో ఈ-స్కూటర్ల బ్యాటరీలను చార్జింగ్‌ చేస్తుంటారు. అక్కడే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి.. ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

స్థానికుల చొరవ

ప్రమాదం జరిగిన దాదాపు 45 నిమిషాలకు గానీ ఫైరింజన్లు సంఘటన రాలేదని స్థానికులు చెబుతున్నారు. దాంతో సూర్య, సతీశ్‌ అనే యువకులు నిచ్చెనల సాయంతో హోటల్‌లో చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేశారు. చూస్తుండగానే.. మరికొందరు యువకులు, పోలీసులు వారికి తోడయ్యారు. తుకారంగేట్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ అంబటి ఆంజనేయులు కూడా ప్రాణాలకు తెగించి, రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అలా కొందరిని కిందకు తీసుకొచ్చామని, ప్రాణనష్టం తగ్గిందని మార్కెట్‌ పోలీసులు 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. అంబటి ఆంజనేయులును హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ప్రత్యేకంగా అభినందించారు.

మంటలార్పేందుకు ప్రయత్నించినా..

షోరూం గోదాములో మంటలంటుకోగానే.. స్థానికులు షోరూంలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాంతో వారు షోరూంలో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే.. కాసేపటికే వారి పరికరాల్లో మంటలను ఆర్పే వాయువు అయిపోవడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే బ్యాటరీలు పేలిపోతూ.. మంటలు వేగంగా వ్యాప్తిచెందాయి.

ఏసీ గదులతో మంటల వ్యాప్తి

లాడ్జిలోని గదుల్లో దిగిన వారు ఏసీలు వేసుకోవడం కూడా మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమై ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నాలుగంతస్తుల హోటల్‌ల్లో మొత్తం 23 గదులు ఉన్నాయని, రాత్రి 12 గంటలకల్లా.. అన్ని గదులను పరిశీలించామని పేర్కొన్నారు. ఐదు మృతదేహాలను వెలికి తీశామని, పలువురు కిందికి దూకగా.. పైన చిక్కుకున్న 10 మందిని కాపాడామని పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

వందకో..500 వందలకో..అమ్ముడుపోయి ఓటేసి

*మనం కాదా!దొంగలం*??

కొడుకు యూఎస్ లో ఉంటాడు, 
కూతురు ఆస్ట్రేలియాలో  ఉంటది, 
నెలకు 50 వేలొచ్చే ఉద్యోగముంటది,
నెలకు 60 వేల రెంటొచ్చే అపార్టుమెంట్లు
ఓ రెండుంటాయి.
 
*అయినా ...*
సర్పంచ్ మనోడేనని తెల్లకార్డు తీసుకుంటిమి,
రేషన్ సరుకులు నెలనెలా టంచన్ గా తీసుకుంటుమి,
ఆ రేషన్ బియ్యం పదికి కిలో పదికి బ్లాక్ లో అమ్ముకుంటిమి,
MLA తెలిసినోడేనని గవర్నమెంట్ ఇల్లు కూడా రాయించుకుంటిమి,
ఆరోగ్య శ్రీ కార్డు మీద ఆపరేషన్ లు చేయించుకుంటిమి,
ఇంకా సాలదన్నట్టు ఓ గవర్నమెంట్ స్థలం కూడా రాయించుకుంటిమి,

*ఇక ....*
నీరవ్ మోడీ యో, విజయ్ మాల్యాదో ముచ్చటలు టీవీలో వినబడగానే.....
శివమెత్తి ఊగిపోతూ లుంగీ చేతపట్టి వీళ్లంతా దొంగలంటూ రచ్చబండ దగ్గర ముచ్చట్లు చెప్తిమి.

పక్కింటి జోగేశ్వర్ కొడుకు రామేశ్వర్ మునిసిపల్ ఆపీసులో పనిచేసి వంద కోట్లు ఆస్తులు కూడబెట్టింది తెలుసు..
ఇంటెనుక ప్రసాద్  చిట్టీల వ్యాపారం పెట్టుకుని బిల్డింగుల మీద బిల్డింగ్లు కట్టుకున్నది తెలుసు.....

మూల మీద ప్రకాశం గాడు కరెంట్ ఆపీసులో పనిచేస్తూ 4 కోట్లు ఎనుకేసుకున్నదీ తెలుసు .....

మేనల్లుడు కుమార్ బ్యాంకులో పనిచేస్తూ దొంగలోన్లిప్పిచ్చి కమిషన్లతో లెక్కలేనన్ని ప్లాట్లు సంపాదించింది తెలుసు.......

సందు దొరికితే చాలు ఎనకముందు చూడకుండా నొక్కెయ్యడం.. ఎం ఎరగనట్టు గురువింద గింజలా సుద్దులు చెప్పటం ప్రతోడికి కామన్ అయిపోయింది బాబాయ్...
అవినీతి నీ ఇంట్లో నా ఇంట్లో పక్కింట్లో ఏరులై పారుతూనే ఉంది.. 

ఎదుటోడికి కనపడకుండా తుడుచుకుని కొందరు ..  
చూస్తే చూసార్లే ఎం చేస్తారని ఇంకొందరు... 

ఆ మనకేడుందిరా నీతి అని ముడ్డికంటిదాన్ని మూతికి తుడుసుకుని ఇంకొందరు.. 
ఇలా భూమిపై అడుగంటి పోయింది నీటిచుక్కొక్కటే కాదు నీతి నిజాయితీలు కూడా బాబాయ్...

*బ్యాంకు కుంభకోణమైనా ...*
బంతాట కుంభకోణమైనా.....
గడ్డి మోపుల కుంభకోణమైనా....
పెన్నుల కంపిని అవినీతైనా ....
నువ్వో నేనో వాడో వీడో చెయ్యందిస్తేనే అయింది......
పైనున్న దేవుడు నిజం చెబితే 
పై నుండి కింది దాకా మనవే పేర్లుంటాయి..

మొన్న ఒక మిత్రుడు ఓ పెద్ద లెక్కేశాడు:
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లు చేసిన మొత్తం మోసం /120 కోట్లమందికి = 
ఒక్కొక్కరికి 185 రూపాయలని,
ఇది కచ్చితంగా తప్పే. 
నియమాలను కఠినం చెయ్యాల్సిందే. 
తప్పులను అరికట్టాల్సిందే.

*ఇపుడు నేనో లెక్క చెపుతా...*
*ఒక ఇంట్లోంచి ఒక సంవత్సరానికి 1000 రూపాయల అవినీతి  జరిగితే:*🤔
*1000 రూపాయలు X ??? కోట్ల జనాభా = ఎన్ని వేల కోట్లు మరి దీనిని ఆపటం ఎలా..?*

*ముందు మారాల్సింది మనం, వందకో, 500 వందలకో, అమ్ముడుపోయి ఓటేసి, తీరా చాతగాని దద్దమ్మగాన్ని కోట్లకు కోట్లు మాయం చేసే  గాన్ని గెలిపిస్తే, వాడు తిరిగి నీకే ఎసరు పెట్టి, నీ అవసరాన్నే అవినీతికి అడ్డాగా మార్చుకుని ఇలా నీరవ్ , మాల్యా , లలిత్ లను మించిపోక మానడు ..*

*అసలు అవినీతి నీ ఇంట్లో పెట్టుకుని నీతులు చెప్పడం ఆపనంత వరకు ఈ దేశం కుంభకోణాలకు పుట్టినిల్లే, అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి అభివృద్ది చెందుతున్న భారతమే ..*


.

Telangana High Court : పబ్స్‌కు షాక్‌.. రాత్రి 10 దాటితే నో సౌండ్స్‌..

అప్పటి ఏపీ సీయం చేతిలో ప్రధాని కీలు బొమ్మలా మారారు... కేసీఆర్.....!

అప్పటి ఏపీ సీయం చేతిలో ప్రధాని కీలు బొమ్మలా మారారు... కేసీఆర్.....!

హైదరాబాద్‌: రాష్ట్రాలు ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో విద్యుత్‌ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని..
ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతాలతో ప్రజలు చనిపోయారని చెప్పారు. బిల్లులు కట్టలేదని విద్యుత్‌ అధికారులు దాడులు చేయబోతే కొందరు విషం తాగి చనిపోయారన్నారు. విద్యుత్‌ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని సీఎం గుర్తుచేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుపై కేసీఆర్‌ మాట్లాడారు. దేశాల విద్యుత్‌ వినియోగాన్ని ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుందన్నారు.

''పునర్విభజన హామీల అమల్లో తెలంగాణకు అన్యాయం చేశారు. విద్యుత్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. ఇరు రాష్ట్రాల కేటాయింపుల్లో భాగంగా లోయర్‌ సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును తెలంగాణకు అప్పగించారు. సింగరేణి కాలరీస్‌పై హక్కు తెలంగాణకే ఉంటుందని కేటాయించారు. 2014లో అప్పటి ఏపీ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారు. అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినెన్స్‌ తెచ్చారు. శాసనసభకు ప్రతిపాదించకుండానే కర్కశంగా 7 మండలాలను ఏపీకి అప్పగించారు. సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును కూడా వారికే కేటాయించారు'' అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*సుజీవన్ వావిలాల🖋️*
ప్రజల పక్షం 

Friday, September 9, 2022

తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్....హైదరాబాద్ లో పరిస్థితి ఆందోళనకరం

*తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్....హైదరాబాద్ లో పరిస్థితి ఆందోళనకరం*

*దడ పుట్టిస్తున్న జ్వరాలు*

*3,602 ఒక్క ఆగస్టులోనే నమోదైన కేసులు*

*సెప్టెంబర్‌ మొదటి నాలుగు రోజుల్లోనే 599 మంది బాధితులు*

*ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 1,950 కేసులే*
*ఈ నెల 4 వరకు మొత్తం 6,151 కేసులు రికార్డు*

*హైదరాబాద్‌ను హీటెక్కిస్తున్న డెంగీ*

*రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాల్లోనూ విజృంభణ*

*ప్రభుత్వానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక*

హైదరాబాద్‌: డెంగీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆగస్టు నెలలో రోజుకు సగటున వందమందికి పైగా దీని బారినపడ్డారు. సెప్టెంబర్‌లో మొదటి నాలుగు రోజుల్లోనే 599 మందికి జ్వరం సోకడం వ్యాధి విజృంభణను స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల నాలుగో తేదీ వరకు 6,151 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ సమర్పించిన తాజా నివేదిక వెల్లడించింది. జనవరి నుంచి జూలై వరకు 1950 కేసులు మాత్రమే నమోదు కాగా, ఒక్క ఆగస్టులోనే ఏకంగా 3,602 కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులు చాలావరకు ప్రభుత్వం దృష్టికి రావడం లేదని అధికారులు అంటున్నారు *అత్యధికంగా హైదరాబాద్‌లోనే..*
రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 2,998 రికార్డు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 588, మేడ్చల్‌లో 411, ఖమ్మంలో 361, సంగారెడ్డి జిల్లాలో 208 నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. జూలై నుంచి మొదలైన వర్షాలు కొన్ని రోజులు మినహా ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఎక్కడికక్కడ నీటి నిల్వలు పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనైతే పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

కలలు కనడం....వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు తెలుసు... KTR

కలలు కనడం....వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు తెలుసు... KTR*

హైదరాబాద్‌: తెలంగాణ ప్రగతి చక్రానికి కేంద్రం కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు కానీ అభివృద్ధి దిశగా రాష్ట్ర పయనాన్ని మాత్రం అడ్డుకోలేరని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఈ మేరకు ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఐటీఐఆర్ రద్దు చేసినప్పటికీ తెలంగాణ ఐటీ రంగం గత 8 ఏళ్లలో 3.2 రెట్లు వృద్ధి చెందిందన్నారు. నిరుడు దేశంలో మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే వచ్చిందని పేర్కొన్నారు. సకాలంలో నిధులు ఇవ్వకపోయినా, ఎఫ్ఆర్‌బీఎం ఆంక్షలు విధించినప్పటికీ దేశంలో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ వాటా జీడీపీలో 5 శాతంగా ఉందని చెప్పారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా రెట్టింపు అయిందన్నారు.

''పారిశ్రామిక కారిడార్లు తిరస్కరించినప్పటికీ రాష్ట్రంలో అద్భుతమైన వృద్ధి నమోదైంది. 20వేల పారిశ్రామిక యూనిట్ల మంజూరుతో పాటు 16 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభించాయి. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ నిర్మించాం. మిషన్ కాకతీయకు తోడ్పాటు ఇవ్వకపోయినా 20వేల చెరువులు పునరుద్ధరించాం. కేంద్ర ప్రభుత్వ అమృత్ సరోవర్ పథకానికి మిషన్ కాకతీయ ఆదర్శంగా నిలిచింది. కేంద్రం ఒక్క వైద్య కళాశాల ఇవ్వకపోయినా జిల్లాకు ఒకటి చొప్పున 33 వైద్యకళాశాలలు నిర్మిస్తున్నాం. జాతీయ హోదా ఇవ్వకపోయినా ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రం సొంతంగా నిర్మించింది. కేంద్రం మద్దతు ఉన్నా, లేకపోయినా పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం. మిషన్ భగీరథకు సాయం చేసేందుకు నిరాకరించినా ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తున్న మొదటి రాష్ట్రంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో.. ఎలా పోరాడాలో మాకు తెలుసు. కలలు కనడం.. వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు బాగా తెలుసు'' అని కేటీఆర్ వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Thursday, September 8, 2022

నిమజ్జనం పై నిఘా

*నిమజ్జనం పై నిఘా*

హైదరాబాద్‌ : ఎటువంటి ఆటంకాలూ లేకుండా గణేశ్‌ నిమజ్జనం సాగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎక్కడికక్కడ నిఘా ఉంచారు. మూడు కమిషనరేట్లలో 45 వేల మంది సిబ్బంది బందోబస్తులో ఉంటారని అధికారులు చెప్పారు. గురువారం నగర సీపీ సీవీ ఆనంద్‌, అదనపు సీపీలు నిమజ్జన రూట్‌ను, బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు 18కి.మీ. రూట్‌ భద్రత, బందోబస్తు చర్యలను పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షణతో పాటు నగరంలో డ్రోన్‌ కెమెరాలతోపాటు ఏరియల్‌ వ్యూ ఏర్పాట్లు చేశామని, మూడు కమిషనరేట్లలో సుమారు 30 వేలకు పైగా విగ్రహాలు ఉన్నాయని పోలీసు అధికారులు చెప్పారు. 10వ తేదీ సాయంత్రం వరకు ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో 45 వేల మంది పోలీసు సిబ్బందితోపాటు గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ బృందాలు, లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, ఎస్‌బీ, టాస్క్‌ఫోర్స్‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీంలు, డాగ్‌ స్క్వాడ్‌, బాంబు, మెటల్‌ డిటెక్టర్లు బందోబస్తులో వినియోగించనున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గణేష్‌ నిమజ్జనానికి భారీ భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. సున్నితమైన ప్రాంతాల్లో, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేని ప్రాంతాల్లో 30 మంది ప్రత్యేక లా అండ్‌ ఆర్డర్‌ సిబ్బందిని కేటాయించి వారికి బాడీవోన్‌ కెమెరాలు అందించి రంగంలోకి దింపారు. కమిషనరేట్‌ పరిధిలో 10,510 విగ్రహాలకు జియోట్యాగింగ్‌ పూర్తయిందన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 7వేల విగ్రహాలు ఉన్నాయి. 6 వేల మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

గవర్నర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం....!

*గవర్నర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం....!*

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై  కామెంట్స్పై ఎమ్మెల్సీ కవిత  ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై ట్విటర్లో తీవ్రంగా స్పందించారు
సీఎం కేసీఆర్ (CM KCR), తెలంగాణ సర్కార్ను అపఖ్యాతి పాలు చేయడానికి.. తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చారని దుయ్యబట్టారు. తప్పుడు ప్రచారంతో ప్రజల మన్నన పొందలేమని బీజేపీ గ్రహించిందని, ఆ నేపథ్యంలోనే గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు.

తన మూడేళ్ల పదవీకాలంలో తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కాలంలో ఆమెకు జరిగిన అవమానాలను ఏకరువు పెట్టారు. ప్రోటోకాల్ ఇతర విషయాల్లో తనకు ఎలాంటి ప్రధాన్యత ఇవ్వలేదని, ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌, ప్రగతిభవన్ మధ్య పెరుగుతున్న గ్యాప్‌పై ఒకింత అసహనానికి గురవుతున్నారు. మహిళా గవర్నర్‌గా తనను చాలా తక్కువ అంచనా వేశారని, తన పరిధి ఏంటో తెలుసని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తన మనోధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని, తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని తమిళిసై చెప్పుకొచ్చారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Wednesday, September 7, 2022

సెప్టెంబర్ గండం.... గ్రేటర్ వాసుల.... వెన్నులో వణుకు

*సెప్టెంబర్ గండం.... గ్రేటర్ వాసుల.... వెన్నులో వణుకు*

*ఏటా ఈ మాసంలోనే కుండపోత వర్షాలు*

*1908లో మూసీ వరదలు ఈ నెలలోనే*

*గత చరిత్రను పరిశీలిస్తే సుస్పష్టం*

*నిండా మునుగుతున్న బస్తీలు, కాలనీలు*
హైదరాబాద్‌: సెప్టెంబర్‌ వస్తోందంటేనే గ్రేటర్‌ వాసుల వెన్నులో వణుకు పుడుతోంది. ఏటా ఇదే నెలలో కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలు, జలాశయాలకు ఆనుకొని ఉన్న బస్తీలు, ప్రధాన రహదారులను నిండా ముంచుతున్నాయి. 1908వ సంవత్సరంలో మూసీ మహోగ్రరూపం దాల్చి నగరంలో సగభాగం తుడిచిపెట్టేసిన వరదలు కూడా ఇదే నెలలో.. సెప్టెంబర్‌ 28న సంభవించినట్లు చరిత్ర స్పష్టం చేస్తోంది. ఇక 2000, 2016 సంవత్సరాల్లోనూ ఇదే నెలలో కుండపోత వర్షాలు సిటీని అతలాకుతలం చేశాయి.

*చరిత్ర పుటల్లో హైదరాబాద్‌ వరదల ఆనవాళ్లివీ....*
1591 నుంచి 1908 వరకు 14సార్లు వరద ప్రవాహంలో నగరం చిక్కుకుంది.
►1631, 1831, 1903లలో భారీ వరదలతో సిటీలో ధన, ప్రాణ నష్టం సంభవించాయి.
►1908 సెప్టెంబరు వరదలతో 2 వేల ఇళ్లు కొట్టుకుపోయాయి.15 వేల మంది మృతి చెందారు. 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. వారం రోజుల పాటు జనజీవనం స్తంభించింది.
►1631లో కుతుబ్‌ షాహీ ఆరో పాలకుడు అబ్దుల్లా కుతుబ్‌ షా కాలంలో సంభవించిన వరదలకు నగరంలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు ధ్వంసం అయ్యాయి. మూసీ చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి.
►1831లో అసఫ్‌ జాహీ నాలుగో మీర్‌ ఫరుకుందా అలీఖాన్‌ నాసరుదౌలా పాలనా కాలంలోనూ వరదలు సంభవించాయి. నిర్మాణంలో ఉన్న చాదర్‌ఘాట్‌ వంతెన కొట్టుకుపోయింది.
►ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ పాలనా కాలం 1903లో సెప్టెంబర్‌ నెలలోనే భారీ వర్షాలకు నగరం అతలాకుతలమైంది. ఇక 1968, 1984, 2000, 2007, 2016, 2020లలో కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మూసీ నిండుగా ప్రవహించింది.
*1908.. సెప్టెంబరు 28న కొట్టుకుపోయిన సిటీ....*
మూసీ నది 60 అడుగుల ఎత్తున ప్రవహిస్తూ మహోగ్ర రూపం దాల్చింది. కేవలం 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అఫ్జల్‌గంజ్‌ వద్ద నీటి మట్టం 11 అడుగులు. వరదనీరు ఇటు చాదర్‌ఘాట్‌ దాటి అంబర్‌పేట బుర్జు వరకు.. అటు చార్మినార్‌ దాటి శాలిబండ వరకు పోటెత్తింది. చంపా దర్వాజా ప్రాంతంలోకి చేరడంతో అక్కడే ఉన్న పేట్లబురుజుపైకి వందల సంఖ్యలో జనం ఎక్కారు. రెండు గంటల్లోనే నీటి ప్రవాహానికి పేట్లబురుజు కొట్టుకుపోయింది. వందల మంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. సెప్టెంబరు 28న సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టింది. జనం హాహాకారాలు చేశారు. వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు.

నాటి పాలకుడు నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ కాలినడక జనం మధ్యకు వచ్చారు. వరద బాదితుల కోసం సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాన మంత్రి మహారాజా కిషన్‌ ప్రసాద్‌ను ఆదేశించారు. నిరాశ్రయులకు తమ సంస్థానంలోని అన్ని భననాలను ప్రజల కోసం తెరిచిఉంచాలని కోరారు. పురానీ హవేలీతో పాటు అన్ని ప్యాలెస్‌ల్లో వైద్య శిబిరాలు, అన్న దానం ప్రారంభించారు. అన్ని «శాఖల సిబ్బందిని వరద బాధితుల సహాయం కోసం పని చేయాలని సర్కార్‌ ఆదేశాలిచ్చింది. నాటి నుంచి సెప్టెంబర్‌ నెల వచ్చిందంటే నగర ప్రజలు వరదలకు భయపడుతూనే ఉన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

నిరుత్సాహపడిన పర్యావరణ ప్రేమికులు

https://youtu.be/GfICqwyQesM                                                                                               #పర్యావరణప్రేమికులు ఎంతో ఆసక్తిగా వేచి చూసిన తెలంగాణ లోకాయుక్త తీర్పు వాయిదా పడడానికి కారణం సంబంధిత #ప్రభుత్వఅధికారుల నిర్లక్ష్యం. ఈరోజు ఫైనల్ హియరింగ్ వుంది అని తెలిసి కూడా ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా న్యాయస్థానంలో హాజరు కాలేదు అంటేనే అర్థం అవుతుంది #ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో #ప్రజాప్రయోజనాలమీద..... Bplkm🪶                                                                                                                                                                  Copy to Group link Media                               07/09/2022  prajasankalpam1.blogspot.com

Tuesday, September 6, 2022

ఢిల్లీ లిక్కర్ స్కామ్.... హైదరాబాద్ సహా 30చోట్ల.... ఈడీ సోదాలు.....!

*ఢిల్లీ లిక్కర్ స్కామ్.... హైదరాబాద్ సహా 30చోట్ల.... ఈడీ సోదాలు.....!*

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ప్రారంభమైంది. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.దిల్లీ, ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్‌, లఖ్‌నవూ తదితర నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రేమ్‌సాగర్‌, అభిషేక్‌రావు, సృజన్‌రెడ్డి ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల విషయాన్ని ఈడీ ప్రధాన కార్యాలయం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ఇంట్లో సోదాలు నిర్వహించడం లేదని ఈడీ అధికారులు తెలిపారు

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Monday, September 5, 2022

నకిలీ పత్రాలు సృష్టించుకో..అనుమతులు ఇస్తా

నకిలీ పత్రాలు సృష్టించుకో..అనుమతులు ఇస్తా..

నకిలీ పత్రాలు సృష్టించుకో..అనుమతులు ఇస్తా..


( అక్రమార్కులకు నిస్సిగ్గుగా వంత పాడుతున్న అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత.. )

- అమీన్ పూర్ మున్సిపల్ కేంద్రంగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు..
- అమ్యామ్యాలు ఇస్తే చాలు అధికారులు ఆ వైపు చూడరు.. 
- జిల్లా రెవిన్యూ అధికారి కస్టడీలో ఉండాల్సిన భూములు కనుమరుగు.. 
- ఏ.ఆర్ డెవలపర్స్ పేరుతో పాగా వేస్తున్న వైనం..  
- వక్ర మార్గంలో నిర్మాణ అనుమతులు..
- అక్రమార్జనే ద్యేయంగా మున్సిపల్ కమిషనర్ సుజాత..   
 - బోగస్ పత్రాలతో  తెరపైకి వస్తున్న అక్రమ వెంచర్లు..
- ప్రభుత్వ ఖజానాకు భారీ గా గండి..  
-  గ్రామ పంచాయితీ అనుమతులతో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు..   
-  రెవిన్యూ అధికారుల అధీనంలో ఉన్న భూమి మాయం..         
- సర్వే నెంబర్ 1003,1004,1057,1060,1062,1063 లలో 
   అక్రమ నిర్మాణాలతో పేట్రేగిపోతున్న నిర్మాణ సంస్థ.. 
- కాసులకు కక్కుర్తి పడి సర్కారీ భూమిలో నిర్మాణ అనుమతులు 
   ఇచ్చిన అధికారులు 
- గడప దాటని సీడీఎంఏ డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ.. 
 
ఒక అవినీతి అధికారిణి నిస్సిగ్గుగా నకిలీ పత్రాలు సృష్టించిన నిర్మాణ సంస్థలకు, లంచాలు అందుకుంటూ అడ్డగోలుగా అనుమతులు జారీ చేస్తుంటే.. వాటిని నిలువరించి చర్యలు తీసుకోవాల్సిన కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ . సత్యనారాయణ కూడా అవినీతి ఆఫీసర్ సుజాతకు వత్తాసు పలుకుతూ..  తాను కూడా ఆమె పాపంలో పాలుపంచుకోవడం ఎంతో దుర్మార్గం.. ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజలను మోసం చేస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడి తాము విధులు నిర్వహిస్తున్న స్థాయికి కళంకం అంటగడుతున్నారు.. ఇలాంటి అవినీతిపరులైన అధికారుల వలన ప్రభుత్వానికి, సంబంధిత శాఖా మంత్రి కేటీఆర్ కు చెడ్డపేరు వస్తోంది.. ఇలాంటి అక్రమ వ్యవహారాలపై మంత్రి కేటీఆర్ దృష్టి పెట్టాలని అమీన్ పూర్ స్థానికులు కోరుతున్నారు.. 
 
హైదరాబాద్, 04 సెప్టెంబర్ (ఆదాబ్ హైదరాబాద్) : 
సంగారెడ్డి జిల్లాలోని, అమీన్ పూర్ మున్సిపాల్టీలో ఏ.ఆర్. డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలకు తెరలేపింది.. సదరు నిర్మాణ సంస్థ చూపించిన సర్వే నెంబర్ల భూమి ఏ.ఆర్. డెవలపర్స్ భూమి కాదని, రెవిన్యూ అధికారులు గతంలోనే ఇచ్చిన రిపోర్ట్ ద్వారా తేట తెల్లమవుతుంది.. సర్వే నెంబర్స్  1003,1004,1057,1060,1062,1063 లకు సంబంధించిన భూములలో వక్ర మార్గంలో పొందిన అనుమతులుతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణ పనులు చేపడుతోంది.. ఆ భూమి జిల్లా రెవిన్యూ అధికారి కస్టడీలో ఉన్నా కూడా డోంట్ కేర్ అంటూ, ప్రభుత్వ భూమి,ఇండస్ట్రియల్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూములను 
కాచేయుటకు ఏ.ఆర్. డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ తన వక్ర బుద్దిని చూపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఏ.ఆర్. డెవలపర్స్ నిర్మాణ సంస్థతో అమీన్  పూర్ మున్సిపల్ కమిషనర్ లోపాయికారి ఒప్పందం చేసుకుని, అక్రమార్జనే ద్యేయంగా అందిన కాడికి దోచుకొని సదరు నిర్మాణ సంస్థకు వత్తాసు పలుకుతున్నారని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. బోగస్ పత్రాలతో సదరు నిర్మాణ సంస్థ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు నిర్మిస్తుంటే..  మున్సిపల్ కమిషనర్ సుజాత అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వారి అవినీతికి అద్ధం పడుతుంది..  క్షేత్ర స్థాయి సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడితే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన కమిషనరే, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. మున్సిపాల్టీలలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, సజావుగా జరిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019లో నూతనంగా ప్రవేశ పెట్టిన మున్సిపల్ చట్టం, ఇక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తోంది.. అమీన్ పూర్ మున్సిపాల్టీలో అక్రమనిర్మాణాలు పుట్టగొడుగుల్లా పెరిగిపోవడంతో.. ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టం బ్రష్టు పడుతుందనే విమర్శలు  వినిపిస్తున్నాయి.. 2018 సంవత్సరంలో అమీన్ పూర్ గ్రామ పంచాయితీ మున్సిపాల్టీ గా ఏర్పడింది.. 2018 సం" లో మున్సిపాల్టీ ఏర్పడ్డది కనుక నిర్మాణ   అనుమతులు పొందాలంటే మున్సిపల్ చట్టం ప్రకారం అనుమతులు తీసుకోవాలి.. మున్సిపాల్టీ ఏర్పడక ముందు గ్రామ పంచాయితి నుండి తీసుకున్న నిర్మాణ అనుమతులు..  పర్మిషన్ తీసుకున్న తేదీ నుండి రెండు సంవత్సరాల కాలపరిమితి మాత్రమే ఉంటుంది.. కానీ అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో 2018లో తీసుకున్న అనుమతులు 2022 వరకు ఎలా చెల్లబాటు అవుతున్నాయనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది..? నకిలీ పత్రాలు సృష్టిస్తే వాటిని గుర్తించి అట్టి నకిలీ పత్రాలను సృష్టించిన వ్యక్తులపై క్రిమనల్ చేపట్టాల్సిన అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోకపోవడంతో..  భూ కబ్జాలకు పాల్పడే అక్రమార్కులు కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నారు. అవినీతిలో కూరుకుపోయిన మున్సిపల్ కమిషనర్ సుజాత బోగస్ పత్రాలను, అక్రమ వెంచర్లను  పట్టించుకోకుండా, ధనార్జనే ద్యేయంగా..  ఇష్ట్టమొచ్చినట్లు అనుమతులు జారీ చేసి, భారీ ఎత్తున ముడుపులు దండుకుంటున్నారని  స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.. గతంలో కూడా మున్సిపల్ కమిషనర్ సుజాత అవినీతి వ్యవహారాలపై వివిధ పత్రికల్లో..  ఆధారాలతో వార్త కథనాలు ప్రచురితమైనా, వివిధ సంఘాల నుండి పిర్యాదులు అందినా  చర్యలు తీసుకోవాల్సిన కమిషనర్, సంచాలకులు పురపాలక పరిపాలన కార్యాలయ అధికారి సత్యనారాయణ.. ఎలాంటి చర్యలు చేపట్టకుండా  మౌనంగా  ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.. 2018 కంటే ముందు గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో పొందిన ఇంటి నెంబర్లుతో  ఏ.ఆర్.  డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థ, బోగస్  పత్రాలతో అక్రమ లే అవుట్లను చేస్తుంటే ..  దర్జాగా  దొడ్డిదారిలో అక్రమ నిర్మాణ పనులు చేస్తుంటే..  మున్సిపల్ అధికారులు చర్యలు ఎందుకు చేపట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.. అమీన్ పూర్ మున్సిపాల్టిలో నిర్మాణ అనుమతులు పొందాల్సిన ఏ.ఆర్. డెవలపర్స్  అనే నిర్మాణ సంస్థ, గ్రామ పంచాయితీ ఇంటి నెంబర్లతో అక్రమ నిర్మాణ పనులు చేస్తుంటే..  వీరికి మున్సిపల్ చట్టం వర్తించదా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.. ఏ.ఆర్.  డెవలపర్స్  అక్రమ లే అవుట్ కు సంబంధించిన వ్యవహారాలపై, మున్సిపల్ అధికారులు చేస్తున్న అక్రమ ఆగడాలపై మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది  
' ఆదాబ్ హైదరాబాద్ '..  ' మా అక్షరం అవినీతిపై అస్రం '..

Sunday, September 4, 2022

నా జోలికి వస్తే నీ చరిత్ర మొత్తం బయటపెడుతాను...ఒళ్ళు దగ్గరపెట్టుకో

నా జోలికి వస్తే నీ *చరిత్ర మొత్తం బయటపెడుతాను...ఒళ్ళు దగ్గరపెట్టుకో....రేవంత్ కు... రాజగోపాల్ రెడ్డి వార్నింగ్....!*

నల్గొండ : తెలంగాణలో పొలిటికల్‌ లీడర్ల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటల దాడి చేస్తున్నారు.హస్తం నేతలను టార్గెట్‌ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా రేవంత్‌ రెడ్డిపై రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్. నా జోలికొస్తే నీ చరిత్ర మొత్తం బయట పెడతాను. నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో అన్ని తెలుసు. వాటిని బయట పెడితే ముఖం చూపించుకోలేవు. పోయేకాలం వచ్చిందా రేవంత్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మునుగోడులో కూడా అడుగు పెట్టవ్.

సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు వెనకేసుకున్నది నువ్వు కాదా?. హైదరాబాద్‌లో వంద మందిని బ్లాక్ మెయిల్‌ చేసి ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశావు. డబ్బులిచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నావు. నీలాంటి మనిషిని పీసీసీ చేయడమా?. నీది నేర, అవినీతి చరిత్ర నీకు పార్టీ జెండా కావాలి. నేను ఇండిపెండెంట్‌గా పోటీచేసినా గెలుస్తాను. మునుగోడుకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. పోనీలే అని ఇరవై రోజులుగా ఓపికపడుతున్నా. నా మంచితనాన్ని చేతగానితనంగా అనుకోవద్దు. నేను అమ్ముడుపోయినట్లు నీ దగ్గర పత్రాలు ఉంటే మీడియాకు ఇవ్వు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక సోషల్ మీడియాలో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. నీకు లాస్ట్ వార్నింగ్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Saturday, September 3, 2022

అధికారికంగా హైదరాబాద్, సంస్థాన విమోచన దినోత్సవం

*అధికారికంగా హైదరాబాద్, సంస్థాన విమోచన దినోత్సవం*

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థాన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.17న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, హోంశాఖల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ ఉత్సవాల్లో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై పాల్గొననున్నారు.

ఈ ఉత్సవాలను హైదరాబాద్‌ స్టేట్‌ విలీన దినోత్సవంగా కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలు భావిస్తున్నట్లు సమాచారం. పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏడు సాయుధ దళాలతో నిర్వహించే సైనిక కవాతు సందర్భంగా అమిత్‌ షా సైనిక వందనం స్వీకరించనున్నారు. సైనిక కవాతుతోపాటు కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గతంలో హైదరాబాద్‌ స్టేట్‌లో భాగంగా ఉన్న వివిధ ప్రాంతాలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో విలీనమైన విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో కేంద్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Friday, September 2, 2022

కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా....? నిర్మలా సీతారామన్ ఫైర్....!

*కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా....? నిర్మలా సీతారామన్ ఫైర్....!*

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌పై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్కూర్‌లో శుక్రవారం రేషన్‌ షాప్‌ను తనిఖీ చేయడానికి వెళ్లిన నిర్మలా సీతారామన్‌..
రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటా ఎంతని కామారెడ్డి కలెక్టర్‌ను ప్రశ్నించారు. అయితే కలెక్టర్‌ తెలియదని సమాధానం చెప్పడంతో.. 'కలెక్టర్‌ అయ్యుండి తెలియదంటారా' అని నిర్మలా మండిపడ్డారు. అరగంటలో తెలుసుకొని చెప్పాలని కలెక్టర్‌ను ఆదేశించారు.పేదలకిచ్చే రేషన్ బియ్యంపై కిలోకు 35 రూపాయల ఖర్చవుతుంటే కేంద్రం 30 రూపాయలు భరిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. రేషన్‌ షాప్‌ ఫ్లెక్సీలో మోదీ ఫోటో లేకపోవడం గమనించిన కేంద్ర మంత్రి.. ప్రధాని ఫోటో ఎందుకు పెట్టలేదని మళ్లీ కలెక్టర్‌ను నిలదీశారు. మోదీ ఫోటో పెట్టకపోతే సాయంత్రం తానే వచ్చి కడతానని నిర్మలా చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం