Monday, August 9, 2021

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు

హైదరాబాద్ : 09/08/2021

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు

పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలయ్యాయి. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతుల అకౌంట్స్ లో రూ.19,000 కోట్లు క్రెడిట్ అయ్యాయి.

ఆగ‌స్టు, న‌వంబ‌ర్ కు సంబంధించి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో 9వ విడత కింద రూ.2వేల చొప్పున జమ చేసింది కేంద్రం. రైతన్నలకు పెట్టుబడి సాయం కింద.. వారికి చేయూతనిచ్చేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని తీసుకొచ్చారు మోడీ. దీని ద్వారా ఏడాదికి 3 వాయిదాల్లో ఒక్కో రైతుకు రూ.6వేలు అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన నగదును పీఎం కిసాన్ వెబ్‌ సైట్‌ లో రైతులు చెక్ చేసుకోవచ్చు.

https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx

No comments:

Post a Comment