Monday, September 14, 2026

మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి_

*"మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి"*

*శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ - బాపట్ల పుష్పలత*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 13:

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించి భక్తిశ్రద్దలతో పూజించాలని శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ బాపట్ల పుష్పలత అన్నారు.హెచఎండిఏ సహకారంతో హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం( హైదరాబాద్ జిందాబాద్)మరియు శ్రీనిధి మహిళా ఫౌండేషన్ మరియు ప్రజాసంకల్పం స్వచ్చంద సంస్థ / ప్రజాసంకల్పం మీడియా ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గత పది సంవత్సరాలనుండి మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నాము అని అన్నారు.రామంతాపూర్ చిన్నచెరువు కట్ట కింద భరత్ నగర్ క్రాస్ రోడ్డు లో మరియు ఆర్టీసి కాలనీలో మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించే విధంగా అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాము అని అన్నారు.హెచ్ఎండిఏ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నదని అన్నారు.హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF) సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు  చెరువులు కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే  ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో  వైభవంగా  నిర్వహించుకొనే  “వినాయక చవితి” పండుగ  సందర్భంగా  అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను  ప్రతిష్టించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజెన్  రాలపళ్ళి కుసుమ మేడం,సరిత,ప్రజావాణి సంస్థ ఫౌండర్ ఎర్రం శ్రీనివాస్, రవీందర్ రావు, పోలిశెట్టి సత్యనారాయణ,ముదిగొండ శివ ప్రసాద్,సాయి వర్ధన్, మండల శివకుమార్,వెంకటేష్,బాపట్ల కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖ, ఫైర్ సేఫ్టీ రికార్డుల్లో అసలు వివరాలేమిటి?_

*హబ్సిగూడ ‘యోధ’ అపార్ట్‌మెంట్‌పై ప్రశ్నల వర్షం!*

- ఓసీ జారీ అయిందా? లేకుండానే ఫ్లాట్లలో నివాసం ఎలా?

- దాదాపు 20 ఫ్లాట్లు.. ఒకే విద్యుత్‌ మీటర్‌పై రూ.20–30 వేల బిల్లు ఎలా?

- నీటి కనెక్షన్‌కు ఏ పత్రాలు ఆధారం?.. లిఫ్ట్‌ విద్యుత్‌ సరఫరాపైనా సందేహాలు

- జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖ, ఫైర్ సేఫ్టీ రికార్డుల్లో అసలు వివరాలేమిటి?

మేడ్చల్ బ్యూరో సురేష్ ఇడపాక, హబ్సిగూడ, సెప్టెంబర్‌ 13(మీడియా టుడే): 

హబ్సిగూడ జేఎస్‌ఎన్‌ కాలనీలోని ‘యోధ’ అపార్ట్‌మెంట్‌ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 20 ఫ్లాట్లు ఉన్న ఈ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) జారీ అయిందా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేకుండానే కొన్ని ఫ్లాట్లలో కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందుతోంది. దీంతో భవన నిర్మాణ అనుమతులు, ఓసీ, నీటి, ఫైర్ సేఫ్టీ,విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

**ఓసీ జారీ అయిందా?**

భవన నిర్మాణానికి ఏ అనుమతులు మంజూరయ్యాయి? ఆమోదిత ప్లాన్‌ ప్రకారమే నిర్మాణం జరిగిందా? ఓసీ కోసం దరఖాస్తు చేశారా? చేసి ఉంటే దాని ప్రస్తుత స్థితి ఏమిటి? ఓసీ జారీ కాకముందే భవనంలో నివాసం కొనసాగుతున్నట్లయితే అందుకు సంబంధించిన నిబంధనలు ఏమిటి? అన్న విషయాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

భవనాన్ని అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేశారా? నిర్మాణంలో ఏవైనా తేడాలు లేదా ఉల్లంఘనలు గుర్తించారా? నోటీసులు జారీ చేశారా? అన్న వివరాలను అధికారిక రికార్డుల ఆధారంగా వెల్లడించాల్సి ఉంది.

**నీటి కనెక్షన్‌ ఎలా వచ్చింది?**

భవనంలో కుటుంబాలు నివాసం ఉంటున్న నేపథ్యంలో నీటి కనెక్షన్‌ అంశం కూడా ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 20 ఫ్లాట్లకు నీటి సరఫరా కోసం కనెక్షన్‌ ఎప్పుడు మంజూరైంది? ఏ కేటగిరీలో ఇచ్చారు? కనెక్షన్‌ మంజూరు సమయంలో భవన నిర్మాణ అనుమతులు, ఓసీ లేదా ఇతర అవసరమైన పత్రాలను పరిశీలించారా? అన్న ప్రశ్నలకు వాటర్‌ వర్క్స్‌ అధికారులు సమాధానం ఇవ్వాల్సి ఉంది.

నీటి కనెక్షన్‌కు సంబంధించిన దరఖాస్తు, మంజూరు పత్రాలు, కనెక్షన్‌ నంబర్‌, కేటగిరీ తదితర వివరాలను అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

**దాదాపు 20 ఫ్లాట్లు.. మీటర్‌ ఒక్కటేనా?**

అపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతం సుమారు ఐదు ఫ్లాట్లలో కుటుంబాలు నివసిస్తున్నట్లు సమాచారం. అయితే భవనానికి ఒకే విద్యుత్‌ మీటర్‌ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ మీటర్‌కు నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు విద్యుత్‌ బిల్లు వస్తున్నట్లు సమాచారం. అదే విద్యుత్‌ సరఫరా నుంచి లిఫ్ట్‌ కూడా పనిచేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ఇది వాస్తవమైతే.. దాదాపు 20 ఫ్లాట్లకు ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి? ప్రస్తుతం ఉన్న మీటర్‌ ఏ కేటగిరీకి చెందినది? ఒకే మీటర్‌ ద్వారా పలు ఫ్లాట్లకు విద్యుత్‌ సరఫరా జరుగుతోందా? లిఫ్ట్‌కు కూడా అదే కనెక్షన్‌ నుంచి విద్యుత్‌ వినియోగిస్తున్నారా? అన్న అంశాలపై విద్యుత్‌ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

నెలకు రూ.20–30 వేల వరకు బిల్లు నమోదవుతున్నట్లయితే ఆ మీటర్‌ వినియోగ వివరాలు, కనెక్షన్‌ కేటగిరీ, మీటర్‌ సామర్థ్యం, గత బిల్లింగ్‌ చరిత్ర తదితర అంశాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.

**లిఫ్ట్‌ భద్రతపై తనిఖీలు జరిగాయా?**

అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ వినియోగంలో ఉంటే దానికి సంబంధించిన అనుమతులు, నిర్వహణ, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లిఫ్ట్‌కు విద్యుత్‌ సరఫరా ఏ కనెక్షన్‌ నుంచి జరుగుతోంది? సంబంధిత భద్రతా తనిఖీలు, అనుమతులు ఉన్నాయా? అన్న అంశాలపైనా సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

**బిల్డర్ ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నారా??**

 ఫైర్ ఎక్స్‌టింగిషర్లు (Fire Extinguishers): ప్రతి ఫ్లోర్‌లో, కారిడార్లలో సులభంగా అందుబాటులో ఉండేలా ఫైర్ ఎక్స్‌టింగిషర్లను ఏర్పాటు చేశారా??. 

**సంబంధిత శాఖలు.. సమాధానాలు ఎక్కడ?**

ఈ వ్యవహారంలో జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. భవన నిర్మాణ అనుమతులు, ఆమోదిత ప్లాన్‌, ఓసీ విషయంలో జీహెచ్‌ఎంసీ.. నీటి కనెక్షన్‌ విషయంలో వాటర్‌ వర్క్స్‌.. విద్యుత్‌ మీటర్‌, కనెక్షన్‌ కేటగిరీ, బిల్లింగ్‌ విషయంలో విద్యుత్‌ శాఖ తమ రికార్డుల ఆధారంగా వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.ఫైర్ సేఫ్టీ అధికారులు NOC ఇచ్చారా ??

భవన నిర్మాణం నుంచి నివాసం ప్రారంభమయ్యే వరకు ఆయా శాఖల అధికారులు ఎప్పుడు తనిఖీలు నిర్వహించారు? ఏ పత్రాలను పరిశీలించారు? ఎలాంటి అనుమతులు మంజూరు చేశారు? ఏవైనా అభ్యంతరాలు లేదా ఉల్లంఘనలు గుర్తించారా? అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు అవసరమవుతున్నాయి.

**ఫ్లాట్‌ కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చారా?**

జీవితకాల పొదుపుతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవనానికి సంబంధించిన నిర్మాణ అనుమతులు, ఓసీ పరిస్థితి, నీటి, విద్యుత్‌ కనెక్షన్ల వివరాలు ముందుగానే తెలియజేశారా? ఓసీ ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే ఆ విషయం కొనుగోలుదారులకు వెల్లడించారా? స్వాధీనం ఇచ్చే సమయంలో అవసరమైన పత్రాలను పరిశీలించారా? అన్న అంశాలపై కూడా స్పష్టత అవసరం.

భవనానికి సంబంధించిన అనుమతులు, సర్టిఫికెట్లు, కనెక్షన్ల వివరాలపై భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు వాస్తవాలను స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

**అధికారిక రికార్డులు వెల్లడించాలి**

భవన నిర్మాణ అనుమతి, ఆమోదిత ప్లాన్‌, ఓసీ దరఖాస్తు మరియు ప్రస్తుత స్థితి, జారీ చేసిన నోటీసులు, నీటి కనెక్షన్‌ వివరాలు, విద్యుత్‌ మీటర్ల సంఖ్య, కనెక్షన్‌ కేటగిరీ,ఫైర్ సేఫ్టీ అధికారులు NOC ఇచ్చారా??బిల్లింగ్‌ వివరాలు తదితర అంశాలను సంబంధిత శాఖలు రికార్డుల ఆధారంగా వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

**స్పష్టత కావాల్సిన ప్రధాన అంశాలు..**

ఓసీ జారీ అయిందా?
నీటి కనెక్షన్‌ ఏ పత్రాల ఆధారంగా మంజూరైంది?
దాదాపు 20 ఫ్లాట్లకు ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి?
ఒకే మీటర్‌పై నెలకు రూ.20–30 వేల బిల్లు ఎలా నమోదవుతోంది?
అదే మీటర్‌ నుంచి లిఫ్ట్‌కు కూడా విద్యుత్‌ సరఫరా జరుగుతోందా? ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి NOC ఇచ్చారా ??
మూడు శాఖల అధికారులు ఇప్పటివరకు ఏ తనిఖీలు నిర్వహించారు?
ఫ్లాట్‌ కొనుగోలుదారులకు అన్ని అనుమతుల వివరాలు ముందుగానే తెలియజేశారా?

ఈ అంశాలపై జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖల అధికారులు అధికారిక రికార్డుల ఆధారంగా స్పష్టత ఇవ్వడంతో పాటు వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు కోరుతున్నారు.

Saturday, September 12, 2026

హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_

*హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు.శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో #Hyderabad మహానగరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వెం నరేందర్ రెడ్డి, నగర ప్రజాప్రతినిధులు,కమీషనర్ ghmc , సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్ , మల్కాజ్గిరి మున్సిపల్ కమీషనర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ ,హైడ్రా కమీషనర్ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలని కోరారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్వాహకులకు తెలిపారు.ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత సంప్రదాయాన్ని పునరుద్ధరించామని చెప్పారు. నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తానే సమీక్ష నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.గణేశ్ మండపాలకు అతిథులను ఆహ్వానించిన సందర్భాల్లో ఆ వివరాలను నిర్వాహకులు స్థానిక కమిషనరేట్‌కు అందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని పరిణామాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు అందించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, అయితే, మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని చెప్పారు.
ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగడానికి చెరువుల వద్ద చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - నల్లకుంట ఇన్స్పెక్టర్ SHO మారుతి ప్రసాద్_

*మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - నల్లకుంట ఇన్స్పెక్టర్ SHO మారుతి ప్రసాద్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

వినాయక చవితి పండుగను, భక్తి శ్రద్దలతో, సంప్రదాయాలతో, పర్యావరణాన్ని కాపాడుకుంటూ జరుపుకుందామని నల్లకుంట ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ పిలుపునిచ్చారు.నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ NCA, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం HCF ఆధ్వర్యంలో ఈరోజు నల్లకుంటలో జరిగిన మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మారుతి ప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు  చెరువులు, కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే  ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో  వైభవంగా  నిర్వహించుకొనే  “వినాయక చవితి” పండుగ  సందర్భంగా  అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను  ప్రతిష్టించాలని అన్నారు.
కార్యక్రమంలోNCA అధ్యక్షులు వి మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి మోహన్ నాయుడు, పి శ్రీనివాసరావు, HCF ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య, రామకృష్ణారావు, రాజీవ్ కుమార్, డాక్టర్ అమర్నాథ్, సత్యనారాయణ,  కృష్ణ బాబు, కిరణ్, గోపాల్, శివకుమార్, వినోద్, సుకుమార్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

దళితుల ఇల్లు కూల్చివేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి_

*దళితుల ఇల్లు కూల్చివేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

12 సెప్టెంబర్ 2026, శనివారం నాడు డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ ఆధ్వర్యంలో  మానవ హక్కుల వేదిక కార్యకర్త సంజీవ్, అంబేద్కర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి , హైకోర్టు న్యాయవాది ఎద్దు దివాకర్, సామాజిక కార్యకర్త భాస్కర్ లతో కలిసి గద్వాల జిల్లా, గద్వాల మండలం,రేపల్లె గ్రామాన్ని సందర్శించి దళితుల కూల్చివేత ను పరిశీలించారు. బాధిత కుటుంబంతో గ్రామస్తులతో మాట్లాడి సంఘటన సంబంధించిన వివరాలను సేకరించారు.మాదిగ కులానికి చెందిన అబ్బాయి బోయ కులానికి చెందిన అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకళ్ళను ఒకళ్ళు ఇష్టపడ్డారు. 9 సెప్టెంబర్ 2026 న హైదరాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాదులో  మాసబ్ ట్యాంకు  పోలీసులను కలిసి తాము పెళ్లి చేసు కొన్నామని రక్షణ కల్పించాలని కోరారు. ఇరు కుటుంబాలను పోలీసులు పిలిసి కౌన్సిలింగ్ ఇచ్చారు. కులాంతర వివాహం పై  ఆగ్రహించిన కుటుంబ సభ్యులు దాదాపు 15 మంది 10 సెప్టెంబర్ 2026 మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో దళితుడైన రంగముని ఇంటిని గడ్డపారలు, ట్రాక్టర్ తదితర వస్తువులతో కాయకష్టం చేసి దళితులు కట్టుకున్న ఇల్లును నేలమట్టం చేశారు. 10వ తారీఖునే FIR నమోదు చేశారు. 6 మందిని అరెస్ట్ చేశారు. అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 12 వ తారీఖున డీఎస్పీ మోగులయ్య రేపల్లె గ్రామాన్ని సందర్శించారు. నిజనిర్ధారణ బృందం డీఎస్పీ మొగులయ్యని, గద్వాల రూరల్  సబ్ ఇన్స్పెక్టర్ని కలిసి, దాడిలో పాల్గొన్న అందర్నీ, దాడికి ప్రోత్సహించిన వారందర్నీ గుర్తించి అరెస్ట్ చేయవలసిందిగా కోరింది. FIR లో నమోదు చేసిన సెక్షన్లతో పాటు, ఆస్తి నష్టానికి సంబంధించిన సెక్షన్లు కూడా నమోదు చేయమని కోరింది.ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం ఇల్లు కూల్చివేసిన వేసిన నిందితుల నుండి నష్టపరిహారాన్ని జరిమాన రూపంలో వసూలు చేసి తిరిగి దళితుల ఇల్లు నిర్మించాలని నిజ నిర్ధారణ బృందం  డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం నిందితులను గ్రామానికి దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు. సంఘటన కేవలం బోయలు చేసింది మాత్రమే కాదని దీని వెనుక ఆధిపత్య రెడ్డి వర్గం ప్రోత్సహించినట్లు వివరించారు. వారిని సైతం గుర్తించి చర్యలు తీసుకోవాలని వెంటనే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేసింది.

ధర్మో రక్షతి రక్షితః - ఖైరతాబాద్ ధర్మరక్షణ సభ_

*ధర్మో రక్షతి రక్షితః - ఖైరతాబాద్ ధర్మరక్షణ సభ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

ఖైరతాబాద్ ధర్మరక్షణ సభ అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో సంఘ పెద్దలు, ఉత్సవ సమితి పదాధికారులు, కన్వీనర్లు, కేంద్ర కమిటీ సభ్యులు మరియు కో-కన్వీనర్లు పాల్గొన్నారు.
**సమావేశంలోని ముఖ్యాంశాలు:**
 ఉత్సవాల ప్రణాళిక: రాబోయే 47వ సామూహిక గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు.
**ప్రత్యేక సందర్భాలు:** వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరియు హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం ప్రాధాన్యతను సభలో ప్రస్తావించారు.ఘనంగా ఉత్సవాలు: రాబోయే వినాయక నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు.

పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_

*ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఖాతాల్లోకి డైరెక్టుగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది*

*పాలిలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి*

*పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:

విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, పాలిటెక్నిక్ విద్యలో తీసుకొచ్చిన మార్పులు, వాటిపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు.. వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టమైన వివరణ ఇచ్చారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన సమాధానమిచ్చి ఆయా వర్గాల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను నివృతి చేశారు.
పాలిలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరుగుతుందనే ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విద్యార్థులు ఎవరి చేతుల్లోనో పావులుగా, కీలుబొమ్మలుగా మారొద్దని కోరారు. ముందు యుగం దూతలుగా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, నిజాయితీగా వివరాలందించిన కాలేజీల రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతల వారిగా చెల్లిస్తామని చెప్పారు.ప్రజాప్రభుత్వం విద్యా రంగానికి ఎందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందో సభలో వివరించిన ముఖ్యమంత్రి సభ్యులు లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానమిచ్చారు. 
ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలలను విద్యాశాఖ పరిధి నుంచి స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీయడానికి కాదని, వారిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకేనని తెలిపారు.
ఈ విషయంలో ఇప్పటికీ అనుమానాలుంటే సభ్యులు, నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చర్యలు చేపట్టి సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

*“విద్య ఒక్కటే మన జీవితాల్లో వెలుగును తీసుకొస్తుంది” అనే సంపూర్ణ విశ్వాసంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.*

సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కాకుండా విద్య లేకపోవడమే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
“తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించేందుకు కే కేశవరావు గారి నేతృత్వంలో కమిటీని నియమించాం. సభ్యులు, విద్యా రంగ నిపుణులు ఎవరైనా తమ సూచనలు, సలహాలను కమిటీకి అందిస్తే వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
విద్యాశాఖను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించడం ఆ శాఖకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం.  తాను విద్యాశాఖపై ఒక తపనతో పనిచేస్తున్నా. ముఖ్యమంత్రి హోదాలో విద్యాశాఖను సమీక్షిస్తే మొత్తం వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరుగుతుంది.2023-24లో గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయించగా, తమ ప్రభుత్వం 2024-25లో రూ.21,292 కోట్లు కేటాయించాం. 2025-26లో రూ.23,108 కోట్లకు, 2026-27లో రూ.26,647 కోట్లకు పెంచాం.  కేవలం మూడేళ్లలోనే విద్యాశాఖ బడ్జెట్‌ను రూ.7,554 కోట్ల మేర పెంచాం” అని ముఖ్యమంత్రి గారు సభ ముందు వివరించారు.

*“తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే కేవలం 55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేశాం.*

ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7,857 మంది ఉపాధ్యాయులను మాత్రమే నియమించింది” అని పేర్కొన్నారు.“జెన్ జీ ఒక్కటే కాదు. రానున్న జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తున్నాం. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది.. తలరాతలను మార్చేది విద్య” అనే నమ్మకంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నా. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తెలంగాణకు తీసుకొచ్చేందుకు, దేశానికి తెలంగాణను ఒక రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం” అని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న ఆదరణ
“విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మేర పెరిగిందని సీఎం తెలిపారు. ఇది తన పనితీరుకు నిదర్శనమన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో రెండున్నరేళ్లకే పిల్లలను చేర్చుకుంటుండగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్ల వయసు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నర్సరీ, ఎల్‌కేజీతో పాటు ఇంగ్లిష్ మీడియం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్తున్నారు.
అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ-ప్రైమరీ విధానాన్ని ప్రారంభించాం. ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులకు ప్రీ-ప్రైమరీ విద్య అందిస్తున్నాం. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా నాణ్యమైన, పరిశుభ్రమైన బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం” అని వివరించారు.

**పాలిటెక్నిక్‌లపై అపోహలు వద్దు**

“పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన జీఓ ఎంఎస్ నెం.97పై కొన్ని వివాదాలు తలెత్తాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తారనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. “పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణ అనే ప్రసక్తే లేదు” అని సభలో స్పష్టం చేశారు.ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు ఇకపై కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయి.  కేవలం సాంకేతిక విద్యా వ్యవస్థను స్కిల్స్ యూనివర్సిటీ పరిధితో అనుసంధానం చేస్తున్నాం.
ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి టాటా సంస్థ సహకారంతో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. అంతమాత్రాన ఐటీఐలను ప్రైవేటు పరం చేసినట్లు కాదు. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్‌షిప్ అందించాలని నిర్ణయించాం” అని చెప్పారు.పాలిటెక్నిక్‌ల విషయంలో భూములు అమ్ముకుంటారని, ఉద్యోగాలు పోతాయని కొందరు విద్యార్థుల్లో అపోహలు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రభుత్వం అదనంగా 282 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏటీసీలకు బదలాయించిందని, ఒక్కో ఏటీసీపై సుమారు రూ.46 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

**పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా... **

సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడమే పాలిటెక్నిక్‌లను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి గారు వివరించారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్ లను టాటా టెక్నాలజీ సంస్థ సహకారంతో రూ. 4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు.
విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలను పెంచడమే లక్ష్యమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా టాటా టెక్నాలజీస్ సంస్థ సహకారంతో కోర్సులను ఆధునీకరిస్తామని చెప్పారు.
సాంకేతిక విద్య–నైపుణ్యాభివృద్ధి విభాగాల అనుసంధానంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు, ల్యాబ్‌లు, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో నెలకొన్న అపోహలను తొలగిస్తామని, జీఓలో సవరణలు అవసరమైతే వాటిని కూడా చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్స్ యూనివర్సిటీకి ఏఐసీటీఈ అనుమతి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
పేద విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని అన్నారు. వారి భవిష్యత్తును మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలని సభ్యులను కోరారు.

**ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లెక్కలు...**

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపైనా ముఖ్యమంత్రి సభలో స్పష్టత ఇచ్చారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5,435 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వదిలివెళ్లిందని తెలిపారు. అందులో గత ప్రభుత్వం పెట్టిన బకాయిల నుంచి రూ.1,410 కోట్లు తమ ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందన్నారు.అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ.1,465 కోట్లను చెల్లించామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం చెల్లించిన వాటితో కలిపి మొత్తంగా 32 నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.3,488 కోట్లు చెల్లించినట్లు సభలో వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు విద్యార్థుల ఖాతాల్లోకి డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల కోసం అడ్వాన్స్‌గా గ్రీన్ చానెల్‌లో డబ్బు చెల్లిస్తున్నామని చెప్పారు. బకాయిల విషయంలో విజిలెన్స్ నివేదికను పరిశీలించిన తర్వాత నిజాయితీగా ఉన్న వాటన్నింటినీ బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.విద్యను కేవలం ఒక శాఖగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే సాధనంగా భావిస్తున్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి  విద్య, నైపుణ్యం, ఉద్యోగం, ఉపాధిని అనుసంధానించేలా సంస్కరణలు చేపట్టామని తెలిపారు

కుల ఆధారిత దూషణలు, మహిళా పోలీసు సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తనపై తెలంగాణ డీజీపీకి సమగ్ర నివేదికలు సమర్పించాలని TGHRC ఆదేశం_

*ప్రెస్ రిలీజ్*

*తెలంగాణ మానవ హక్కుల కమిషన్*

*కుల ఆధారిత దూషణలు, మహిళా పోలీసు సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తనపై తెలంగాణ డీజీపీకి సమగ్ర నివేదికలు సమర్పించాలని TGHRC ఆదేశం*

బాపట్ల కృష్ణమోహన్, సెప్టెంబర్ 11:

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) గౌరవ చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో, 07.09.2026న జరిగినట్లు ఆరోపించబడిన రెండు సంఘటనలకు సంబంధించి దాఖలైన ఫిర్యాదులపై ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.
S.R. No.3678 of 2026లో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లి సుధాకర్ మరియు ఇతరులు చేసిన ఫిర్యాదులో, BRS MLC తాటా మధుసూదన్, దళిత సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను మీడియా సమక్షంలో అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. అలాగే, దళితులు మాజీ ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావుకు చెందిన ఎర్రవెల్లి, సిద్ధిపేట జిల్లా ఫామ్‌హౌస్‌ ఎదుట నిరసన నిర్వహించిన సమయంలో, BRS నాయకురాలిగా పేర్కొన్న శ్రీమతి పావని గౌడ్ మరియు ఇతరులు పసుపు నీరు, పాలు చల్లి ప్రాంతాన్ని “శుద్ధి” చేసినట్లు, దళిత నిరసనకారులను అవమానకర పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు.
S.R. No.3680 of 2026లో శ్రీమతి ఇందిరా శోభన్ చేసిన ఫిర్యాదులో, తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కొంతమంది BRS ఎమ్మెల్యేలు నల్ల టీ-షర్టులు తొలగించి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది సమక్షంలో అర్ధనగ్నంగా నిలబడినట్లు ఆరోపించారు. ఈ ప్రవర్తన మహిళా పోలీసు సిబ్బందికి ఇబ్బంది, మానసిక వేదన, అవమానాన్ని కలిగించడంతో పాటు వారి గౌరవం, భద్రతపై ప్రభావం చూపిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనపై విచారణ జరిపి, CCTV మరియు ఇతర వీడియో దృశ్యాలను పరిశీలించి, బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు.
రికార్డులో ఉన్న అంశాలను పరిశీలించిన అనంతరం, రెండు కేసుల్లోనూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ నుంచి నివేదికలు కోరుతూ గౌరవనీయ చైర్‌పర్సన్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి నివేదిక కోసం రెండు కేసులను 09.10.2026కు వాయిదా వేశారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరికల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులు_

*పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరికల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 11:

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల పరిధిలోని మరికల్  గ్రామ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలు వివిధ ఆకారాలలో చూడముచ్చటగా తయారు చేశారు.మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు సర్వమంగళ బహుమతులు అందజేశారు.సీనియర్స్ లో మొదటి బహుమతి వైష్ణవి రెండో బహుమతి నితిన్ జూనియర్స్ లో మొదటి బహుమతి నరేష్ రెండో బహుమతి కార్తీక్ అందుకొన్నారు. గ్రామంలో మన ఇండ్లలో మట్టి వినాయకులను ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ వెంకటయ్య మల్లయ్య శివప్రసాద్ అంజిలయ్య రాజశేఖర్ హన్మయ్య శశిధర్ పాండురంగాచారి శ్రీలక్ష్మి రమాదేవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 17 న పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు_

*ఈనెల 17 న పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 11:

ఈనెల 17 వతేదీన నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే  తెలంగాణా ప్రజా పాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు  చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లపై గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్,  ముఖ్య కార్యదర్శులు  నవీన్ మిట్టల్, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హైదాబాద్ సి.పీ సజ్జనార్, ఆర్టీసీ ఎండి నాగి రెడ్డి, సమాచార శాఖ స్పెషల్  కమిషనర్ ముకుంద రెడ్డి తదితర సీనియర్ అధికారులు హాజయ్యారు.ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ప్రజా పాలనా దినోత్సవాన్ని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17 న ఉదయం అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్ కు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపంవద్ద,  పబ్లిక్ గార్డెన్ లో సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రధాన భవనాలకు , చారిత్రక కట్టడాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణ కు గానూ ఈనెల 15 న  పూర్తి డ్రెస్ రిహార్సల్స్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రజాపాలన దినోత్సవానికి వేయి మంది స్వయం సహాయక మహిళలతో పాటు  రెండు వేల మంది  హాజరవుతారని పేర్కొన్నారు.

సైబరాబాద్‌ పోలీస్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం_

*సైబరాబాద్‌ పోలీస్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం*

*నూతన సభ్యులకు సీపీ డా. రమేష్‌, IPS, అభినందనలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 11:

సైబరాబాద్‌ పోలీస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎస్సై శ్రీనివాస్‌ (హెచ్‌సీ–3046), ఉపాధ్యక్షుడిగా ఇన్‌స్పెక్టర్‌ శ్రీకర్‌బాబు (19435) ఎన్నికయ్యారు. ఎస్సై/ఏఎస్సై కేటగిరీలో ప్రియదర్శిని (3251), హెడ్‌ కానిస్టేబుల్‌ కేటగిరీలో కార్తిక్‌ శ్రీనివాస్‌ (3276), పోలీస్‌ కానిస్టేబుల్‌ కేటగిరీలో రాజేందర్‌ (5180) వైస్‌ ప్రెసిడెంట్లుగా ఎన్నికయ్యారు.వివిధ పదవులకు మొత్తం 29 మంది సభ్యులు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్‌ ద్వారా సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Friday, September 11, 2026

మూసినది అభివృద్ధి పేరుతో వేలకోట్ల దోపిడీ_

https://www.facebook.com/share/p/19CxaEt42o/

*_మూసినది అభివృద్ధి పేరుతో వేలకోట్ల దోపిడీ... ప్రజాప్రయోజనాలకోసం కాదు ఈ అభివృద్ధి...మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలు జాగృతం కావాలి... అప్పుడు కాళేశ్వరం... ఇప్పుడు మూసినది...Bplkm✍️_*
https://www.instagram.com/p/DdJbLK1qob0/?stkn=dmw0MTI0ZXk0MXdx
                 *****
https://x.com/Praja_Snklpm/status/2098315570903212443?t=vRradfzDt0R2AjdWULDd-A&s=08

*#SaveMusiNadi not #beautification...#publicvoice*

*#hyderabad #pollution #publichealth*

*@TelanganaCMO*
*@Bhatti_Mallu*
*@TelanganaCS @asadowaisi @INC_Ponguleti @Ponnam_INC @KTRBRS @N_RamchanderRao @HRF_Humanrights @bandarvirala @CitizensForHyd @SaveNalas_Tanks @MusiProject @PIBHyderabad @IPRTelangana @Narhariyarabotu @SitaramDhulipa1 @BplplH*

మహిళలు సమాజానికి, భవిష్యత్ తరాలకు నిజమైన స్ఫూర్తి మరియు శక్తి ప్రదాతలు అని నిరూపించిన డా. దీపా బానోత్_

*కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పీహెచ్డీ సాధించిన దీపా బానోత్*

*మహిళలు సమాజానికి, భవిష్యత్ తరాలకు నిజమైన స్ఫూర్తి మరియు శక్తి ప్రదాతలు అని నిరూపించిన డా. దీపా బానోత్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 10:
 
కాప్రా ECILకూ చెందిన ఉస్మానియా యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పరిశోధక విద్యార్థిని శ్రీమతి డా. దీపా బానోత్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పీహెచ్‌డీ పట్టా సాధించారు. ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ పొందడం అభినందనీయం. డా.దీపా బానోత్ "తెలంగాణలో ఎంపిక చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగుల సంతృప్తిపై తులనాత్మక అధ్యయనం (తెలంగాణ రాష్ట్రంలోని ఎంపిక చేసిన పబ్లిక్ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఉద్యోగుల సంతృప్తిపై తులనాత్మక అధ్యయనం)" అనే అంశంపై పరిశోధన జరిగింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఉద్యోగుల సంతృప్తికి తగిన సూచనలను కూడా ప్రతిపాదించారు. ఈ పరిశోధనను డా. వి .సమున్నత గారి పర్యవేక్షణలో పూర్తి చేశారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీరాములు, డీన్ ప్రొఫెసర్ జహంగీర్, డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు సిబ్బంది డా. దీపా బానోత్‌ను అభినందించారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలను (పెద్ద కుమారుడు MBBS మరియు చిన్న కుమారుడు ఇంజనీరింగ్) చదువుతున్న సమయంలోనూ కుటుంబ భాద్యతలు చూసుకుంటూ పీహెచ్‌డీ సాధించడం ద్వారా దీపా బానోత్ తన సంకల్పం, పట్టుదల, కృషితో కుటుంబ బాధ్యతలు ఉన్నా ఉన్నత లక్ష్యాలను సాధించినట్లు నిరూపించారు. ఈ సందర్భంగా డా. దీపా బానోత్ తన విజయానికి సహకరించిన తన భర్త శ్రీ రవి తేజకు, కుటుంబ సభ్యులకు మరియు తన పరిశోధన పర్యవేక్షకురాలు డా.వి. సమున్నతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరిశోధన సమయంలో వారు అందించిన నిరంతర ప్రోత్సాహం, సహకారం తన పీహెచ్డీ ప్రయాణంలో కీలకమని ఆమె పేర్కొన్నారు.ఆమె సాధించిన ఈ విజయం కుటుంబ బాధ్యతలతో పాటు ఉన్నత విద్యను కొనసాగించాలని ఆకాంక్షించే మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి_


*శాసనసభ సమావేశాల తొలిరోజు చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను  శిక్షించాలి - సీఎం రేవంత్ రెడ్డి*

*ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:

శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపించి, క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను  శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించారు.శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్ గారిని ఉద్దేశించి దుర్భాషలాడిన ఉదంతం, దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన సంఘటనలపై యావత్ శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. సభాపతి గారిని అవమానపరుస్తూ, జరిగిన దురదృష్టకర సంఘటన విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అసెంబ్లీ  అండగా నిలిచింది. ఈ దురదృష్టకర సంఘటనల్లో మానసిక ధైర్యం కోల్పోవద్దని స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది.ఈ అంశాలపై బుధవారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చపై సభా నాయకుడు, ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ విషయంలో స్పీకర్ కు ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. సభాపతి మనసును గాయపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
“ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారు. శాసన సభాపతి తల్లి గారిని అవమానించారు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దేశంపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు, తీవ్రవాదులకు శాసనసభ ప్రాంగణంలో సభా అధ్యక్షుడిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకు ఏమాత్రం తేడా లేదన్నారు. ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా ఈ సంఘటనను అభివర్ణించారు.
“మన మాతృస్వామ్య సమాజం. స్త్రీని అపరకాళి, భద్రకాళి, భూమాత, భారతమాత, తెలంగాణ మాత అని పిలుస్తాం. ఏదైనా శక్తిని, గొప్పతనాన్ని ఆపాదించాలని, చర్చించాలని అనుకున్నప్పుడు తల్లితో పోలుస్తాం. మహిళతో పోలుస్తాం. మహిళను పూజించే మన సమాజం ఈ దేశాన్ని భారతమాత అని మహిళతో పోల్చుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లితో పోల్చుకుంటాం. అలాంటి ఈ తెలంగాణ నేల మీద ఒక తల్లిని అవమానించే విధంగా ప్రవర్తించడం దారుణం” అని ఆందోళన వ్యక్తం చేశారు.
సభాపతి కి జరిగిన అవమానం సమాజానికి జరిగినట్టే. దోషులను తెలంగాణ సమాజం ఉపేక్షించదు. రజాకార్లను దిగంతాలకు తరిమి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ సభాపతి గారి మనసుకు గాయం చేయాలన్న ఆలోచన బరితెగించి మాట్లాడారని అన్నారు. సభాపతి ని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని చెప్పారు.
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం భావించింది. విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ధరణిలో జరిగిన అక్రమాలు, 22 (ఎ) వంటి అంశాలే కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన చాలా అంశాలను చర్చించాలని భావించాం. ప్రజా సమస్యలపై చర్చ జరగకూడదని అడ్డుకున్నారు” అని ముఖ్యమంత్రి  అన్నారు.

ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విచారణకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ఆదేశాలు – చర్యల నివేదిక కోరుతూ మరోసారి రిమైండర్_


*ప్రెస్ నోట్*

*ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విచారణకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ఆదేశాలు – చర్యల నివేదిక కోరుతూ మరోసారి రిమైండర్*

*NCPCR File No.: TL-99828/NCPCR/2026-27/EDU*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:

మెద్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) విచారణకు ఆదేశించింది.సామాజిక కార్యకర్త మరియు Know Your Rights Society అధ్యక్షుడు ఎస్. ఉమేష్ కుమార్ 07.07.2026న NCPCRకు సమర్పించిన ఫిర్యాదులో, సంబంధిత నిబంధనల ప్రకారం పాఠశాలలో విద్యాహక్కు చట్టం, 2009లోని సెక్షన్ 12(1)(c) అమలు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాలు (DG) చెందిన పిల్లలకు 25 శాతం ప్రవేశాల నిబంధన అమలవుతోందా అనే అంశంపై విచారణ జరిపించాలని కోరారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), 24.08.2026న మెద్చల్–మల్కాజిగిరి జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ పంపి, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపి Action Taken Report (ATR) ను 7 రోజుల్లో కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది.అయితే, నిర్ణీత సమయంలో చర్యల నివేదిక అందకపోవడంతో NCPCR 09.09.2026న Reminder-1 జారీ చేసింది. ఈ రిమైండర్‌లో, గతంలో పంపిన లేఖను ప్రస్తావిస్తూ, ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు సంబంధించిన అంశంపై విచారణ జరిపి, 7 రోజుల్లో అవసరమైన నివేదికను సమర్పించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను మరోసారి ఆదేశించింది.NCPCR తన లేఖలో, బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాల అమలును పర్యవేక్షించడం తమ చట్టబద్ధ బాధ్యత అని స్పష్టం చేసింది. ముఖ్యంగా RTE Act, 2009, POCSO Act, 2012 మరియు Juvenile Justice Act, 2015 వంటి చట్టాల సమర్థవంతమైన అమలుపై కమిషన్ పర్యవేక్షణ బాధ్యత కలిగి ఉందని పేర్కొంది.
“పిల్లల విద్యాహక్కు అమలుపై పూర్తి స్థాయి విచారణ జరగాలి”. 
ఈ సందర్భంగా  ఎస్. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ:
“విద్యాహక్కు చట్టం ద్వారా పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు కల్పించిన హక్కులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వాస్తవంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. NCPCR స్వయంగా విచారణకు ఆదేశించి, ఇప్పుడు చర్యల నివేదిక సమర్పించకపోవడంతో రిమైండర్ జారీ చేయడం ఈ అంశం ప్రాధాన్యతను తెలియజేస్తోంది. జిల్లా యంత్రాంగం నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు మరియు కమిషన్‌కు స్పష్టంగా తెలియజేయాలి.”
అలాగే, పాఠశాలలలో RTE నిబంధనలు, EWS/DG పిల్లలకు అందాల్సిన ప్రవేశ హక్కులు మరియు ఇతర బాలల హక్కులు సమర్థవంతంగా అమలయ్యేలా సంబంధిత అధికారులు పర్యవేక్షణ పెంచాలని ఆయన కోరారు.

మరికల్ లో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం_


 
*మరికల్ లో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు , అందరూ చదవాలి అందరూ ఎదగాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.తర్వాత  అక్షరాస్యత గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సర్వమంగళ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలని ఎవరు కూడా చదువును మధ్యలో మానివేయ రాదని ఇంటిలో ఉన్న పెద్దలు ఎవరైనా చదువు రాని వాళ్ళు ఉంటే వారికి సంతకం చేయడానికి చదవడానికి నేర్పించాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. మంచిగా చదువుకుంటే జీవిత లక్ష్యం తో పాటు జీవనభృతి సంఘంలో గౌరవం దక్కుతుందని తెలియజేశారు .
విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ ,వెంకటయ్య, రామకృష్ణ ,మల్లయ్య, హన్మయ్య ,అంజిలయ్య, రాజశేఖర్ ,పాండురంగాచారి ,రత్నమాల ,శ్రీలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మహత్య పరిష్కారం కాదు,సమస్యలను కుటుంబ సభ్యులతో లేదా మిత్రులతో పంచుకోవాలి_

*ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం*

*ఆత్మహత్య పరిష్కారం కాదు,సమస్యలను కుటుంబ సభ్యులతో లేదా మిత్రులతో పంచుకోవాలి*

*తోటివారితో మాట్లాడటం, వారి భావాలను అర్థం చేసుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు - అనూరాధ రావు,బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:

సెప్టెంబర్ నెలను జాతీయ ఆత్మహత్యల నివారణ అవగాహన మాసం అంటారు. National suicide prevention month.సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని ప్రపంచం అంతట నిర్వహిస్తారు. world suicide prevention Day. 2014-2026 సంవత్సరాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్దేశించిన థీమ్ - ఆత్మహత్యలపై మన దృక్పథాన్ని మార్చడం - అంటే సంభాషణను ప్రారంభించండి - start the conversation.ఆత్మహత్యల నివారణకై  ఆత్మహత్యలపై అవగాహన పెంచడం, మానసిక ఆరోగ్యం గురించి కావలసిన సహయం అందు బాటులో ఉంది అని అవగాహన పెంపొందించడమే లక్ష్యం.2003 నుండి ఇది ప్రారంభం అయింది. ప్రారంభించడానికి కారణాలు : ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ పిల్లల ఆత్మహత్యల గురించి బాలల హక్కల సంఘం మాట్లాడుతుంది.

*నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటా ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లల్లో ఆత్మహత్యలు తీవ్రమైన సమస్యగా ఉంది.*

2024 డేటా ప్రకారం 11, 184 పిల్లల ఆత్మహత్యలు జరిగాయి.వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
*(1)*:  1077 మంది పిల్లలు పరిక్ష ఫేల్యుర్ వల్ల సుసైడ్ చేసుకున్నారు.

*(2)*: కుటుంబ సమస్యలతో 3,101 పిల్లలు సుసైడ్ చేసుకున్నారు.

*(3)*: ప్రేమ వ్యవహారాల వల్ల-1671.

*(4)*: అనారోగ్య కారణాల వల్ల 1347.

ఇంకా ఇతర కారణాలు - మానసిక బత్తిడి, బుల్లీయింగ్ సామజిక ఒత్తిడి మొదలైనవి. ఇవి అధికారక సంఖ్యలు మాత్రమే, వాస్తవంగా ఎక్కువ సంఖ్య ఉండవచ్చు అని అంటున్నారు.
కారణం కేసు నమోదు చేయడానికి ఇష్టపడని వారు, బయటకు చెప్పడానికి భయపడే వారు కొందరు ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ సమ్యస తీవ్రత ఎక్కువగానే ఉంది.విద్యార్థుల ఆత్మహత్మలు రైతుల ఆత్మహత్యల కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది ఒక పెచ్చరిక అని మానసిక నిపుణులు అంటున్నారు.విద్యార్థుల ఆత్మ హత్యలకు ప్రధాన కారణం, వారికి ఒత్తిడి పెరగడం - అటు తల్లి తండ్రల నుండి, ఇటు కాలేజి / స్కూళ్ల యాజమాన్యాల నుండి పిల్లలపై బత్తిడి తేవడం, రాంక్యుల గురించి, మార్కుల గురించి. దీన్ని తట్టుకోలేక పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు.
కుటుంబంలో గొడవలు, తల్లి తండ్రల మధ్య విబేధాలు ఉండడం వల్ల పిల్లలు తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక సుసైడ్స్ కు పాల్పడాతున్నారు.
పరీక్షల వత్తిడి - సరిగ్గా రాయక పోతే ఫెయిల్ అవడం, తక్కువ మార్కులు రావడం,ఇంట్లో చెప్పుకునే అవకాశం లేక బలైపోతున్నారు. ఇక NEET,JEE పరీక్షల్లో జరిగే అవకతవకల వల్ల పిల్లలు ప్రతి సంవత్సరం సుసైడ్స్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.స్నేహితులు మధ్య విభేదాలు, చిన్నవయస్సు ప్రేమ వ్యవరాలు బ్రేకప్ అవడం, భావోద్వేగాలకు లోను కావడం వల్ల కూడా సూసైడ్స్ అవుతున్నాయి.
ముఖ్యంగా మానసిక అనారోగ్య సమస్యలు, డిప్రెషన్, ఆందోళన. మానసిక ఒత్తిడి సమస్యలను గుర్తించలేక పోవడం.బుల్లీయింగ్ స్కూళ్లో లేదా ఆన్లైన్లో పిల్లలుబుల్లేయింగ్కు గురికావడం ఎక్కువగా మానసికి బత్తిడిని ఎవరు గుర్తించ లేక, ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
నివారణ చర్యలు తప్పని సరిగా ఆలోచించాల్సిన సమయం. 
అంటే ముఖ్యంగా తల్లితండ్రుల్లో మార్పు రావలి, పిల్లలకు సమయాన్ని ఇవ్వాలి,పూర్తిగా వారు చెబుతున్న సమస్య వినాలి,వారితో ఓపెన్గా మాట్లాడి,వారి సమస్యను అర్ధం చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
పిల్లలపై అధిక అంచనాలు పెట్టకండి, మొదటి ర్యాంకు రావాలి అనే బత్తిడి అటు పేరేంట్స్, ఇటు స్కూల్స్ పెట్టకూడదు. పిల్లలుస్వేచ్ఛగా చదువుకునేలా,సంతోషంగా పాఠశాలలకు వెళ్లేలా ఉండాలి. 
స్కూళ్లలో తరచుగా నిపుణులైన మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ ఎర్పాటు చేయాలి. పిల్లల్లో 
కొన్ని సంకేతాలు గమనించాలి.  పిల్లలు అకస్మాత్తుగా ఒంటరిగా ఉండడం, ఏదో కోల్పోయిన విధంగా ఉండడం,ఎవరితో మాట్లాడక పోవడం, నిరాశగా మాట్లాడడం, నిద్ర పోకపోవడం, స్నేహితులకు దూరంగా ఉండడం చేస్తారు.ఇది గుర్తిం చినట్లయితే పేరేంట్స్ కాని స్కూల్లో టీచర్లు కాని, హస్టల్స్లో ఉన్న పిల్లలు ఇతర రూంమ్మెట్స్ కాని ఈ మార్పులను గమనిస్తే,వారిని కాపాడుకోవచ్చు. వెంటనే వారిని మానసిక వైద్యుల వద్ద సంప్రదించాలి.
 వారు కౌన్సెలింగ్ ద్వారా పిల్లల్లో ఉన్న భయాలను తొలిగిస్తారు.వారిలో ఆత్మ విశ్వాసం పెంచడానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తారు.వారికి కావల్సింది నీవు ఒంటరి కాదు, నీకు మేం ఉన్నాం అనే భరోసా ఇవ్వడం. ప్రతి స్కూళ్లలో, కళాశాలల్లో తరచు కౌన్సిలింగ్, వర్క్ షాప్స్  నిర్వహించాలి.టెలి మానస్ 1416 / 18008914416
Kiran - 18005990019
ఈ నంబర్స్కు కాల్ చేసి మీ మానసిక సమస్య ఎదైనా మాట్లాడిన వారు మీకు గైడ్ చేస్తారు.ప్రతి విద్యార్థి జీవితం విలువైనది, కావల్సిన సహయం తీసుకోవడం తప్పుకాదు.
ఆత్మహత్యల నివారణకై,అవగాహన పెంపోందించడానికి విద్యార్థులకు అండగా పని చేద్దాం.

Wednesday, September 9, 2026

_గురువుగారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు సారు జయంతి యాదిలో ✊_

https://www.facebook.com/share/p/17asKr4qLN/

*_గురువుగారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు సారు జయంతి యాదిలో ✊_*

*"తెలంగాణ భాషా దినోత్సవం"🙏*
*#KalojiJayanthi #warangal #telangana*

*@PIBHyderabad @HiWarangal @Warangal @HRF_Humanrights @IPRTelangana @DigitalMediaTG*

https://www.instagram.com/p/DdEiCS3quqr/?stkn=NXg0aWlobWc0NnR3
               *****
https://x.com/Praja_Snklpm/status/2097700670468157507

Tuesday, September 8, 2026

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ TGHRC పాత కేసు రికార్డుల తొలగింపు మరియు ధ్వంసానికి సంబంధించి జారీ చేసిన ప్రజా నోటీసు_

*తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ TGHRC పాత కేసు రికార్డుల తొలగింపు మరియు ధ్వంసానికి సంబంధించి జారీ చేసిన ప్రజా నోటీసు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 08:

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కార్యదర్శి మరియు CEO జారీ చేసిన ప్రజా నోటీసును ఇందుమూలంగా జతపరుస్తున్నాము. కమిషన్‌లో పూర్తయిన పాత/పరిష్కరించబడిన కేసు రికార్డుల తొలగింపు (Weeding-out) ప్రక్రియ అనంతరం, మొత్తం 51,798 పాత/పరిష్కరించబడిన కేసు రికార్డులను ధ్వంసం చేయడం ప్రతిపాదించబడింది. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 16,730 రికార్డులు మరియు 12.08.2005 నుండి 20.03.2021 వరకు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 35,068 రికార్డులు ఉన్నాయి.ఈ ప్రజా నోటీసు ద్వారా సంబంధిత వ్యక్తులు తమ అభ్యంతరాలు, హక్కు/దావాలు లేదా వివరణ/స్పష్టీకరణకు సంబంధించిన అభ్యర్థనలను నోటీసు ప్రచురితమైన తేదీ నుండి 15 రోజులలోపు సమర్పించేందుకు అవకాశం కల్పించబడింది. అందువల్ల, ఈ నోటీసు ప్రజల హక్కులు మరియు ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశం కావడంతో, ప్రజా ప్రయోజనార్థం విస్తృత ప్రచారం అవసరం.కావున, జతపరచిన ప్రజా నోటీసును ప్రజలందరికీ సమాచారం అందేలా విస్తృత ప్రచారం కల్పించవలసిందిగా మనవి.

దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ ఆయనను అవమానించేలా మాట్లాడటం కరెక్ట్ కాదు _

*స్పీకర్‌ను కించపరిచేలా, అసభ్య పదజాలంతో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాసనసభ గౌరవానికి అవమానకరం - మంత్రి దామోదర్ రాజనర్సింహ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 07:

అసెంబ్లీ స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఓ ఎమ్మెల్సీ బూతులు తిడుతూ, అమర్యాదకరంగా మాట్లాడటాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్రంగా ఖండించారు.స్పీకర్‌ను కించపరిచేలా, అసభ్య పదజాలంతో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాసనసభ గౌరవానికి అవమానకరం అని మంత్రి పేర్కొన్నారు.రాజకీయ విభేదాలు ఉండవచ్చు. విధానాలపై విమర్శలు చేయవచ్చు. కానీ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నారు. ప్రత్యేకించి, దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ ఆయనను అవమానించేలా మాట్లాడటం అత్యంత ఆందోళనకరమైన విషయం అని మంత్రి అన్నారు.దళితులు ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయికి ఎదిగి, అత్యున్నత పదవులను అలంకరించినప్పటికీ వారిపై వివక్ష, చిన్నచూపు, అవమానకరమైన వ్యవహారశైలి ఇంకా కొనసాగుతుండటం దురదృష్టకరమన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి ఎనభై ఏళ్లు అవుతున్నా ఇప్పటికి కూడా దళితుల పట్ల ఇలాంటి మానసిక వివక్ష కొనసాగడం బాధాకరం అని దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, గౌరవం కల్పించినప్పటికీ, దళితులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వారిని ఇంకా చిన్నచూపు చూసే మనస్తత్వం కొనసాగడం సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశమన్నారు.
ఒక దళితుడు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలకు గురికావడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం మాత్రమే కాదని, దళిత సమాజం పట్ల ఉన్న వివక్షపూరిత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు. ప్రజాప్రతినిధులు తమ హోదా, బాధ్యతలను గుర్తించి మాట్లాడాలని, పరస్పర గౌరవాన్ని పాటించాలని ఆయన సూచించారు. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు.సదరు ఎమ్మెల్సీ గారిపై శాసనసభ నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్ గారిని మంత్రి కోరారు.

శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్ కు మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాలుగా నామకరణం_

*శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్ కు మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాలుగా నామకరణం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 07:

శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాలుగా నామకరణం చేసిన ఈ ప్రాంగణ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ శాసనసభ స్పీకర్ శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి గౌరవ సభ్యులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో వెన్నెముక గాయాలతో బాధపడుతున్న దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకోవాలి - నరేష్

*రేవంత్ రెడ్డి సారు మమ్మల్ని ఆదుకోండి*

*రాష్ట్రంలో వెన్నెముక గాయాలతో బాధపడుతున్న దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకోవాలి - నరేష్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 07:

నా పేరు నరేష్ మాది మరికల్ గ్రామం,చౌడపూర్ మండలం,వికారాబాద్ జిల్లా.​జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు.నాకు 18 సంవత్సరాల క్రితం ఆటో ప్రమాదం వల్ల వెన్నుముక విరిగింది అప్పటినుంచి నేను మంచానికి పరిమితం అయ్యాను.ఏ పనులు చేసుకోవాలన్న అమ్మా నాన్నల సహకారం అవసరం. రోడ్డు ప్రమాదం తర్వాత వెన్నుముక్క విరిగి మంచానికి పరిమితమైన నేను నా వల్ల కుటుంబం చాలా ఇబ్బందులు పడింది.ఆ సమయంలో నాకంటే ఎక్కువగా నా కుటుంబం తీవ్ర వేదనను అనుభవించింది.నన్ను పూర్వపు స్థితికి తీసుకురావాలన్న తాపత్రయంతో నిమ్స్ (NIMS) హాస్పిటల్‌లో దాదాపు రెండు సంవత్సరాలకు పైగా చికిత్స చేయించారు.

*ట్రీట్మెంట్ కోసం 20 పశువులను,కొంత భూమిని కూడా అమ్మి నాకోసం ఖర్చు చేశారు*

అయినా కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు మమ్మల్ని చూసుకోవడానికి ఒక సంరక్షకులు ఎప్పుడు మావెంటే ఉండాలి.​ఆ చీకటి రోజుల్లో జీవితంపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ... నా జీవితంలోకి *హోప్ 4 స్పందన* ఒక స్వచ్ఛంద సంస్థ పరిచయమై శ్రీ కోట లక్ష్మీ నరసింహ సర్ ,రఘు అరికపూడి సర్ నా పరిస్థితిని అర్థం చేసుకుని, నేను స్వయం సమృద్ధిగా జీవించడానికి నాకు ఒక చిన్న కిరాణా షాప్ పెట్టి ఇవ్వడం జరిగింది. అలాగే నాలాంటి వెన్నుముక బాధితులకు *హోప్ 4 స్పందన ఫౌండేషన్  *స్పైనల్ కార్డ్ మెడికల్ కిట్* కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో వెన్నెముక గాయాలతో బాధపడుతున్న దివ్యాంగులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలి అని నరేష్ విజ్ఞప్తి చేశాడు.వీల్ చైర్ ఆటల గురించి తెలుసుకొని వీల్ చైర్ క్రికెట్లో *తెలంగాణ వీల్ చైర్ క్రికెట్ టీం* కి ఆడుతున్నాను అలాగే స్టేట్ లెవెల్ ప్యార గేమ్స్ లో జావేలిన్ త్రో లో, మెడల్స్ గెలవడం జరిగింది అని తెలిపాడు.​మంచానికే పరిమితమైన స్థాయి నుంచి నేడు క్రీడా మైదానంలో పతకాలు గెలిచే స్థాయికి చేరుకోవడానికి కారణం నా కుటుంబం చేసిన త్యాగం, "హోప్ ఫర్ స్పందన" అందించిన చేయూత, నాలోని ఆత్మవిశ్వాసం. వైకల్యం శరీరానికే కానీ ఆలోచనలకు, సంకల్పానికి కాదు!.

**ప్రపంచ వెన్నెముక  మరియు వెన్నుపాము గాయాల దినోత్సవాన్ని (World Spinal Cord Injury Day) ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న జరుపుకుంటారు*.

సెప్టెంబర్ 5 న హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం,అవగాహన సదస్సు నిర్వహించారు.తెలంగాణ వెన్నెముక గాయాల దివ్యాంగుల సంఘం (SCIAT) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.డి. షఫీ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇంటర్నేషనల్ స్పైనల్ కార్డ్ సొసైటీ (ISCoS) సంస్థ 2016 వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.వెన్నుముక మరియు వెన్నుపాముకు జరిగే గాయాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు, అధునాతన శస్త్రచికిత్సల ప్రాధాన్యతను వివరించడం. వీల్‌చైర్‌కే పరిమితమైన బాధితులకు సమాజంలో సమాన అవకాశాలు కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపడం.వెన్నెముక గాయం అనేది జీవితాన్ని పూర్తిగా మార్చివేసే తీవ్రమైన సమస్య అని, సకాలంలో సరైన చికిత్స అందకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని మలమూత్రాలు ఆధీనంలో ఉండక డైపర్లు యూరిన్ క్యాటరు వాడాల్సి వస్తుంది. పుండ్లు పడి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని పేర్కొన్నారు.​రోడ్డు ప్రమాదాలు మరియు ఎత్తుల నుండి పడటం వంటి సమయాల్లో వెన్నుముక దెబ్బతినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణులు ఈ సమావేశంలో సూచించారు.

**అవసరమైన సదుపాయాలు:**

బాధితులకు సకాలంలో ఫిజియోథెరపీ, మెరుగైన వైద్యం, వీల్‌చైర్ వంటి సహాయ పరికరాలు అందించాలని కోరారు.వెన్నెముక దెబ్బతిని ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న వారి పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఆంధ్రప్రదేశ్ తరహాలో నెలకు ₹15 వేల ఆర్థిక భరోసా (పెన్షన్/సాయం) కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగ తీవ్రమైన వికలాంగులను గుర్తించి పునారావస కేంద్రాలు ఏర్పాటు చేసి మెరుగైన ఫిజియోథెరపీ అందించాలి స్పైనల్ కార్డ్ బాధితులు ఆర్థికంగా ఎదగడానికి జీవనోపాధి కల్పించి  ప్రభుత్వం సహకారం అందించాలి అని అన్నారు.

Monday, September 7, 2026

హైకోర్ట్ న్యాయవాది బాలకిష్టి శ్రీనివాస రెడ్డి 50వ జన్మదిన వేడుకలు_

*హైకోర్ట్ న్యాయవాది బాలకిష్టి శ్రీనివాస రెడ్డి 50వ జన్మదిన వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 06:

సమాజంలో న్యాయాన్ని కాపాడుతూ, బాధితుల పక్షాన ఉంటూ  న్యాయస్థానంలో మీ వాదనలు ఎంత పదునైనవో, మీ వ్యక్తిత్వం అంత గొప్పది అని మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని,చట్ట పరిధిలో మీరు చేసే ప్రతి పోరాటం విజయవంతం కావాలని, మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ  హైకోర్టు న్యాయవాది బాలకిష్టి శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసి శాలువాతో సత్కరించిన తోటి న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు మిత్రులు. శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్ లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో పులి దేవేందర్,అచలనంద్ అరుగొండ, శ్రీరామ్ రెడ్డి, శ్రవణ్, శాంసుందర్, రామకృష్ణ రెడ్డి,పూండ్రు దామోదర్ రెడ్డి, పెరిచర్ల వెంకట రామరాజు, బాపట్ల కృష్ణమోహన్,మంచోజు నరేష్ కుమార్ 
తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో డీజే వ్యవస్థలపై ఉన్న నిబంధనలు ఏమిటి?_

*"హైదరాబాద్‌లో డీజేల శబ్దం ఎంతవరకు ఉండవచ్చు? చట్టం ఏం చెబుతోంది"*

*సుధాకర్ ఉడుముల - ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 06:

రామ్‌నగర్‌లో జరిగిన గణేష్ ఆగమనం కార్యక్రమంలో 18 ఏళ్ల యువకుడు మరణించడం, హైదరాబాద్ చాలా ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఒక ప్రశ్నకు దృష్టిని ఆకర్షించింది: మతపరమైన ఊరేగింపుల సమయంలో శబ్దాన్ని ఎలా నియంత్రించాలి? శనివారం రాత్రి ఊరేగింపులో నాట్యం చేస్తుండగా బద్రీనాథ్ అనే యువకుడు కుప్పకూలిపోయాడు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. అతని మరణానికి దారితీసిన పరిస్థితులను పోలీసుల దర్యాప్తు మరియు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది. డీజే శబ్దం అతని మరణానికి కారణమైందని అందుబాటులో ఉన్న నివేదికలో నిర్ధారణ కాలేదు.

*"హైదరాబాద్‌లో ఇంతకుముందు కూడా డీజే (DJ) శబ్దాల గురించిన ఫిర్యాదులు వచ్చాయి"*

మతపరమైన ఉత్సవాల సమయంలో పెద్ద శబ్దంతో కూడిన సంగీతంపై ఫిర్యాదులు రావడం కొత్తేమీ కాదు. 2019 సెప్టెంబర్‌లో, గణేష్ పండాల్‌ల వద్ద ధ్వని కాలుష్యంపై డయల్ 100 మరియు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అనుమతులు మంజూరు చేసేటప్పుడు విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ, అనేక పండాల్‌ల నిర్వాహకులు పెద్ద శబ్దంతో డీజేలను ఉపయోగిస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు.ఆ నెలలో వెలువడిన మరో నివేదిక ప్రకారం, గణేష్ ఊరేగింపుల సమయంలో లౌడ్‌స్పీకర్లు, డప్పుల శబ్దాలపై స్థానికులు ఫిర్యాదు చేశారని, అలాగే ప్రస్తుతం ఉన్న ధ్వని నియంత్రణ నిబంధనల అమలును ప్రశ్నించారని పేర్కొంది.2024లో ఈ సమస్య హైదరాబాద్ పండుగల నియంత్రణ అధికారుల దృష్టికి మళ్లీ వచ్చింది. పెద్ద డీజే పరికరాలను ఎక్కువ గంటల పాటు ఉపయోగించడంపై ఫిర్యాదులు పెరిగాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారు పౌర అధికారులు, కాలుష్య నియంత్రణ అధికారులు, రాజకీయ ప్రతినిధులు, నిర్వాహకులతో రౌండ్-టేబుల్ సమావేశం నిర్వహించారు.హైదరాబాద్ పోలీసుల 2024 వార్షిక నివేదిక ప్రకారం, ధ్వని కాలుష్యంపై ఫిర్యాదులు 500 శాతం పెరిగాయి. మతపరమైన ఊరేగింపుల సమయంలో అధిక శబ్దంతో కూడిన డీజే వ్యవస్థలు, బాణసంచా వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు, భద్రతపై కలిగే ప్రభావాలపై కూడా పోలీసులకు సమాచారం అందిందని ఆ నివేదిక పేర్కొంది.

*హైదరాబాద్‌లో డీజే వ్యవస్థలపై ఉన్న నిబంధనలు ఏమిటి?**

అనేక చర్చల అనంతరం, సెప్టెంబర్ 2024లో హైదరాబాద్ పోలీసులు మతపరమైన ఊరేగింపుల సమయంలో డీజే వ్యవస్థలు, డీజే మిక్సర్లు, సౌండ్ యాంప్లిఫైయర్లు మరియు ఇతర అధిక శబ్దంతో కూడిన పరికరాల వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, నిర్దేశిత పరిమితులు మరియు ఇతర షరతులకు లోబడి సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి అనుమతి ఇవ్వబడింది.ఈ పరిమితులు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. నివాస ప్రాంతాల్లో పగటిపూట 55 డెసిబెల్స్ మరియు రాత్రిపూట 45 డెసిబెల్స్ పరిమితి ఉంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో పగటిపూట 65 డెసిబెల్స్ మరియు రాత్రిపూట 55 డెసిబెల్స్ పరిమితి ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో పగటిపూట 75 డెసిబెల్స్ మరియు రాత్రిపూట 70 డెసిబెల్స్ పరిమితి ఉంటుంది.అలాగే, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య లౌడ్‌స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు మరియు డీజే వ్యవస్థల వినియోగాన్ని కూడా ఈ ఉత్తర్వులు నిషేధించాయి. ఇటువంటి కార్యక్రమాల్లో ఉపయోగించే సౌండ్ పరికరాల కోసం పోలీసుల అనుమతి తప్పనిసరి. ఊరేగింపులకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, సంబంధిత అధికారి నుండి ప్రత్యేక అనుమతి పొందితే తప్ప మైక్రోఫోన్లు మరియు ఇతర సౌండ్ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు. నిర్వాహకులు అత్యవసర వాహనాల రాకపోకలకు మార్గాన్ని ఖాళీగా ఉంచాలి మరియు సాధారణ ట్రాఫిక్ కోసం రోడ్డు వెడల్పులో కనీసం మూడు వంతుల భాగాన్ని అందుబాటులో ఉంచాలి.

**ఇప్పుడు అసలు ప్రశ్న పండుగ గురించి కాదు, నిబంధనల అమలు గురించి**

పౌరుల ఫిర్యాదులు మరియు అధికారులు, వైద్య నిపుణుల ఆందోళనల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించబడ్డాయి. అధిక శబ్ద స్థాయిలు భద్రతా ఏర్పాట్ల (బందోబస్తు) సమయంలో సమాచార మార్పిడికి ఆటంకం కలిగిస్తాయని మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందించడంలో ఇబ్బందులు సృష్టిస్తాయని పోలీసులు పేర్కొన్నారు.ఈ సమస్య కేవలం గణేష్ ఉత్సవాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఏప్రిల్ 2025లో, రామ నవమి ఊరేగింపుల సమయంలో డీజే వ్యవస్థలపై ఉన్న నిషేధాన్ని హైదరాబాద్ పోలీసులు నిర్వాహకులకు మరోసారి గుర్తుచేశారు మరియు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆ తర్వాత, ఊరేగింపు నిబంధనలను ఉల్లంఘించి డీజే వ్యవస్థలను ఉపయోగించినట్లు ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు.
కాబట్టి, రామ్‌నగర్ ఘటన లేవనెత్తిన ప్రశ్నను విశ్వాసం మరియు నిబంధనల మధ్య సంఘర్షణగా చూడాల్సిన అవసరం లేదు. మతపరమైన ఊరేగింపులు కొనసాగుతూనే, అదే సమయంలో నిర్వాహకులు మరియు అధికారులు జనసమూహ కదలికలు, వైద్య సేవలకు మార్గం, శబ్ద స్థాయిలు మరియు అత్యవసర సమాచార వ్యవస్థలను సక్రమంగా నిర్వహించేలా చూసుకోవచ్చు.బద్రీనాథ్ విషయంలో, ఆయన మరణానికి గల కారణాన్ని నిర్ధారించడం తక్షణ ప్రాధాన్యత కలిగిన అంశం. అదే సమయంలో, ఊరేగింపుల సందర్భంగా శబ్ద నియంత్రణ నిబంధనలను నిలకడగా పాటిస్తున్నారా, అలాగే నిర్వాహకులు తగిన జన సమూహ భద్రత మరియు అత్యవసర ఏర్పాట్లు చేశారా లేదా అనే విషయాలను పరిశీలించడానికి కూడా ఈ ఘటన ఒక సందర్భాన్ని కల్పిస్తోంది.

తెలంగాణ హైకోర్ట్ లో బోనాల పండుగ సందడి_

*తెలంగాణ హైకోర్ట్ లో బోనాల పండుగ సందడి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 06:

తెలంగాణ హైకోర్ట్ ప్రాంగణంలో ఈరోజు భక్తి శ్రద్దలతో బోనాల పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్ట్ గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. నంద మేడం గారు, జస్టిస్ మౌసమి బట్టాచార్య మేడం గారు, జస్టిస్ వాకిటి రామకృష్ణరెడ్డి గారు,జస్టిస్ మొయినుద్దీన్ గారు, జస్టిస్ జె. శ్రీనివాస్ రావు గారు, జస్టిస్ ఎన్వి. శ్రవణ్ కుమార్ గారు, మరియు తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. సురేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డి.ఎల్. పాండు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీ ఇతర అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు హైకోర్ట్ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.