Friday, June 19, 2026

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్ - నిద్దురమత్తులో తెలంగాణ విద్యాశాఖ

*మీ పిల్లలను ఏ స్కూల్లో చేర్పిస్తున్నారో ఒక్కసారి చెక్ చేయండి.*

*అది ప్రభుత్వ గుర్తింపు పొందినదా? లేదా ?*

*తెలంగాణ విద్యా శాఖ కీలక పెచ్చరికలను జారీ చేసింది.*

*అనురాధ రావు అధ్యక్షురాలు - బాలలహక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 19:

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు,గుర్తింపు లేకుండా పుట్ట గొడుగుల్లా ప్లే స్కూళ్లు, Primary, High school వెలిసాయి. అవి చిన్న చిన్న  భవనాల్లో బహుళ అంతస్తుల్లో కనీస వసతులు లేకుండా తగినంత ఆటస్థలం, ఫైర్ సేఫ్టీ లేని పాఠశాలలు 500 పైగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్నాయి.మన విద్యాశాఖ మంత్రి, అధికారుల దృష్టికి వచ్చినా, గాఢ నిద్రలో ఉన్నారు,
వారికి ఏమీ పట్టదు.యధేచ్చగా స్కూళ్లు తమ వ్యాపారాలు చేస్తున్నాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన విధంగా ఉంది.తీసుకున్న జీతానికి న్యాయం చేయండి,పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి.విద్యాశాఖ అధికారులు మీ కుర్చిలనుండి దిగి పాఠశాలల తనిఖీలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం విన్నపం.ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్ల వివరాలను జిల్లాల వారిగా, మండలాల వారిగా అధికారిక పోర్టల్లో అందుబాటులో పొందుపరిచారు. Website: 
www.schooledu.telangana,gov.in 
మన ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి, చేసేది వేరే. ఆ శాఖ ముఖ్య మంత్రి గారి దగ్గర వుంది. అధిక ఫిజులకు అడ్డుకట్ట వేస్తా అంటున్నారు  కానీ దోపిడి చేస్తున్న ఉన్నారు స్కూల్ యాజమాన్యాలకు అడ్డుకట్ట వేయడం లేదు.తల్లిదండ్రులకు విజ్ఞప్తి,ఫీజులు కట్టే ముందు ఒక్క విషయం చెక్ చేయకపోతే మీపిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు.ఒక వేళ గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే ...
* విద్యా ప్రమాణాలు సరిగా ఉండవు
* భద్రతా నిబంధనలు పాటించరు, మీ పిల్లల భద్రత మీదే.
* అర్హత లేని సిబ్బందితో భోధన  
* భవిషత్తులో సర్టిఫికెట్లకు సమస్య అవుతుంది.
స్కూల్ రికగ్నిషన్ తప్పనిసరిగా చెక్ చేయండి అధికారిక వెబ్ సైటులో ఆ స్కూల్ పేరు ఉందో లేదో చూడండి.అఫిలియేషన్ వివరాలు తీసుకోండి CBSE, ICSE of State Board  ఏదైనా సరే, దానికి సంబంధించిన వివరాలు.స్కూల్ ను స్వయంగా సందర్శంచండి, ప్రకటనలు చూసి మోసపోకండి. తరగతి గదులు, భద్రత,మరుగుదొడ్లు,తాగునీటి సౌకర్యం,ఆట స్థలం, ఫైర్ సేఫ్టీ, ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఎలా ఉంది, ఒక వేళ బస్సు అయితే, ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉందా? బస్సు లో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్, అన్ని అనుమతి పత్రాల గురించి అడగండి.చెల్లించిన డబ్బుకు రసీదులు అన్ని బద్ర పరుచుకోవాలి.అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలి, విద్యాబోధన ఏవిదంగా ఉంది అని. తెలుసుకోవాలి.అన్ని గుర్తింపు పత్రాలు చూడాలి.
పిల్లల విద్య పెట్టుబడి కాదు, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి.స్కూల్ లో చేర్చుకునే సమయం లో పిల్లలకు ఐడి క్రియేట్ చేస్తారు అదే"పెన్"
నెంబర్,11 డిజిట్స్ తో క్రియెట్ చేస్తారు, దీని వల్ల పిల్లల చదువులు ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు ట్రాక్ చేయడానికి, బోర్డు ఎగ్జామ్స్ కు ఉపయెగ పడుతుంది. ఇది క్రియేట్ అయ్యాక 'అపార్' ఐడి క్రియేట్ చేస్తారు,
ఇది ఒక యూనిక్ ఐడి.12 డిజిట్స్ తో ఉంటుంది. ఈ ఐడి లో పిల్లల మార్కులు, వారి అకాడమిక్ రికార్డ్స్, సర్టిఫికెట్స్ అన్ని ఒక డిజి లాకర్ లో డిజిటల్ గా భద్రపరుస్తారు. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్/ అడ్మిషన్ కోసం సులభం అవుతుంది.
One Nation,One student ID అని నేషనల్ ఎజుకెషన్ పాలసీ 2020 ప్రకారం 2023/25 విద్యా సంవత్సరం నుండి ఇది ప్రారంభం అయింది.

Wednesday, June 17, 2026

_జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది_

*పాత్రికేయ కుటుంబాలకు అండగా తెలంగాణ మీడియా అకాడమీ*

జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 21 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.

తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకం కింద మొత్తం 21 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేయబడింది. ఇందులో 17 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు మరియు 4 మంది అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకం కింద మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1,00,000 ఏకమొత్తo ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.3,000 పెన్షన్, అలాగే కుటుంబంలోని గరిష్టంగా ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 159 మందికి యిలాంటి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు.  

అనంతరం సభలో పాల్గొన్న వారందరూ తమ మధ్య నేడు లేని పాత్రికేయులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన జర్నలిస్టుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు,  మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, జర్నలిస్టులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.                                                              *Bplkm✍️*

Friday, June 12, 2026

మానవత్వం,సహాయం అందించడం లో ఎప్పుడు ముందుడే "క్రైమ్ రిపోర్టర్" విజయ్ కుమార్_

*మానవత్వం పరిమళించే - CPR చేసి మహిళ ప్రాణాలు కాపాడిన "క్రైమ్ రిపోర్టర్"*

*మానవత్వం,సహాయం అందించడం లో ఎప్పుడు ముందుడే "క్రైమ్ రిపోర్టర్" విజయ్ కుమార్*

*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త*
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

మౌలాలి రైల్వే స్టేషన్ లో జనవరి 5,2026 న జరిగింది ఈ సంఘటన.ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వస్తున్న మహిళ మౌలాలి లో స్టేషన్ కు చేరుకున్న తరువాత ట్రైన్ లో నుండి దిగుతూ కాలు జారీ ట్రైన్ కింద పడిపోయింది.అందరు చూస్తున్నారు కానీ ఆపదలో ఉన్న ఆ మహిళ వద్దకు వెళ్లి సహాయం చేద్దాం అనే వారు కరువయ్యారు. ఇదే ట్రైన్ లో ఖమ్మం నుంచి వస్తున్న సురేష్ ఈ సంఘటన చూసి తన మిత్రుడు అయిన *క్రైమ్ రిపోర్టర్ విజయ్ కుమార్* కు ఫోన్ చేయగా  "యాదృచ్ఛికం" గా మౌలాలి పరిసర ప్రాంతంలో ఉన్న విజయ్ కుమార్ వెంటనే మౌలాలి రైల్వేస్టేషన్ కు వెళ్లి ట్రైన్ కింద పడిపోయిన మహిళను పైకి లాగి మహిళకు CPR(కార్డియోపల్మోనరీ రిససిటేషన్ - Cardiopulmonary Resuscitation) చేసి ఆ మహిళను అంబులెన్సు లో తీసుకెళ్లి ప్రాణం కాపాడిన రామంతాపూర్ కి చెందిన హైదరాబాద్ క్రైమ్ రిపోర్టర్ విజయ్ కుమార్.ఎవరైనా గుండెపోటుతో పడిపోయినా లేదా శ్వాస ఆడక స్పృహ కోల్పోయినా, వెంటనే సీపీఆర్ చేయడం వల్ల మెదడుకు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కొనసాగుతుంది. ఇది వారి ప్రాణాలను కాపాడే అవకాశం.ప్రతి ఒక్కరు CPR శిక్షణ (Training), ప్రథమ చికిత్స (First-aid) గురించి అవగాహన చేసుకుంటే ఇలాంటి సమయంలో ప్రాణాలను కాపాడవచ్చు.ఈ సమాజంలో ఎవరికి ఏమైతే నాకు ఏంటి అనుకునే ఈ వ్యవస్థలో మహిళను కాపాడిన సీనియర్ క్రైమ్ రిపోర్టర్ కి అభినందనలు.

బాలకార్మిక వ్యవస్థను రూపు మాపాలి - అనురాధ రావు బాలల హక్కుల సంఘం_

*జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం...*

*బాల కార్మికం కాదు - బాల్యాన్ని హత్య చేయడం*

*బాలకార్మిక వ్యవస్థను రూపు మాపాలి - అనురాధ రావు బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

పాలు కావలని అడిగే చేతులు - పనిముట్లను,ఇటుకలను మోస్తున్నాయి, ఇది బాల కార్మికం కాదు - బాల్యాన్ని హత్య చేయడం. *International labour Organization* 2003 లో బాలకార్మిక వ్యవస్థను రూపు మాపడానికీ, దీని గురించి అవగాహనకల్పించడం, కావల్సిన చర్యలు తీసుకోవడానికి ఈ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది.138 మిలియన్ పిల్లలు అంటే 13.8 కోట్ల చిన్నారులు బాల కార్మికులుగా మగ్గుతున్నారు. దీంట్లో 54 మిలియన్ / 5.4 కోట్ల మంది చిన్నారులు హానికరమైన పనుల్లో బలైతున్నారు.ఒక చిన్నారి రాత్రి 12 గంటల వరకు పని చేసి, ఉదయం పుస్తకాల సంచితో స్కూల్ కు వెళ్ళితే, ఆ బ్యాగు బరువు పుస్తకాలది కాదు, తన బాల్యానిది.చాలా వరకు చిన్న పిల్లలు పాలకోసం లేస్తారు కాని, ఈ చిన్నారులు పనికోసం లేస్తున్నారు. వీరిచేతుల్లో పుస్తకాలకు బదులుగా స్తుత్తి, పార, ఇటుకలు మోస్తూ, హోటల్స్లో టీ కప్పులు కడుగుతూ, ప్లేట్లు తీస్తు కనిపిస్తారు, ఇండ్లల్లో పనులు చేస్తూ ఉంటారు.కారణం పేదరికం, అనాధలుగా మరడం, ప్రజల్లో అవగాహన లేకపోవడం, ట్రాఫికింగ్ కు గురి కావడం.ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి, ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టం గా కనబడుతోంది.మన దేశంలో ప్రతి ఆరునెలలకు ఒక రిస్క్యు ఆపరేషన్ జరుగుతుంది, జులై నెలలో ఆపరేషన్ ముస్కాన్, జనవరిలో ఆపరేషన్ స్మైల్. దీంట్లో తప్పిపోయిన చిన్నారులను, బాలకార్మికులను రెస్క్యూ చేసి వారి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు.కాని సంవత్సరాలు మారుతున్నాయి,
బాలకార్మిక వ్యవస్థలో మార్పు లేదు. ఆపరేషన్ ముస్కాన్లో దొరుకుతున్నారు, ఆపరేషన్ స్మైల్లో దొరుకుతున్నారు. అది
ఒక మొక్కుబడి కార్యక్రమం అని అనుకోవచ్చు. కారణం ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుంతుంది.మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ బాలకార్మికులు ఉన్నారు, వారు ఇతర రాష్ట్రాలకు కూడా ముఠాలు తీసుకుని వెళుతాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ మరియు మహారాష్ట్ర.ప్రతి చిన్నారి స్కులుకు వెళ్లాలి, బాల కార్మిక వ్యవస్థ నుండి విముక్తి కల్పించాలి.బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాన్ని, వారి ఫ్యాక్టరీలను/ సంస్థలను ఇటుక బట్టీలు, నిర్మాణ సంస్థలు, హోటల్స్, గాజుల ఫ్యాక్టరీలు, ముఖ్యంగా బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీలు ఏవైనా సరే సీజ్ చేసి కఠినంగా శిక్షలు,భారి జరిమాన విధించాలి.ప్రతిఒక్కరు తమ బాధ్యతగా ప్రతిజ్ఞ చేయాలి ,నా చుట్టూ ఉన్న పిల్లలను పని చేయకుండా స్కూల్ కు పంపుతాను అనే ప్రతిజ్ఞ చేద్దాం. ఆటపాటలతో వారి బాల్యాన్ని కాపాడటానికి మన వంతు కృషి చేద్దాం. బాల్యాన్ని చిదిమి వేయకుండా బడికి వెళ్లే విధంగా చుద్దాం - వారికి చేయుత నిద్దాం.

GHMC అంబర్పేట్ సర్కిల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు_

*GHMC అంబర్పేట్ సర్కిల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు*

*అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోని GHMC కమీషనర్, సికింద్రాబాద్ జోనల్ కమీషనర్,అంబర్పేట్ డిప్యుటీ కమీషనర్*

*అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను GHMC అధికారులు గౌరవిస్తలేరు - బాపట్ల కృష్ణమోహన్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

అంబర్పేట్ బాపు నగర్ అంబికా సారీస్ పక్కన నిర్మిస్తున్న నిర్మాణం అక్రమమా? సక్రమమా? అంబర్పేట్ సర్కిల్ డిప్యుటీ కమీషనర్ సమాధానం చెప్పాలి.ఐదు ఫ్లోర్లు పెంట్ హౌస్ కూడా వేశారు.అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.ఐదు ఫ్లోర్లు & పెంట్ హౌస్ వేసే దాకా GHMC అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు ? TGBPASS / బిల్డ్ నౌ లో అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ అంతస్తులు నిర్మించడం. సెట్‌బ్యాంక్ ఉల్లంఘనలు అంటే స్థలాన్ని వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేస్తున్నారు. కమర్షియల్ మార్పులు అంటే నివాస భవనాలను వాణిజ్య సముదాయాలుగా మారుస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తుంటే తక్షణమే ఆ నిర్మాణంను ఆపితే యజమానికి నష్టం జరుగదు. లేకపోతే అట్టి అక్రమ నిర్మాణంను అడ్డుపెట్టుకొని అవినీతి GHMC అధికారులతో కుమ్మక్కై కొందరు ప్రజాప్రతినిధులు / రాజకీయ నాయకులు / మీడియా ప్రతినిధులు అక్రమ నిర్మాణ యజమాని వద్ద అక్రమంగా డబ్బులు తీసుకుంటుండ్రు అని నిత్యం ఫిర్యాదులు.వీళందరు కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆధాయానికి గండి కొడుతున్నారు.ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి, వ్యవస్థలకు తీరని నష్టం.మున్సిపల్ చట్టాలను, TGBPASS నిబంధనలు ఉల్లంగించి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు అని గతంలో కూడా "మీడియా టుడే" లో వార్త కథనాలు వచ్చాయి. అధికారులు చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. కానీ ఈరోజు వరకు ఎలాంటి చర్యలు లేవు అంటే అవినీతి కి పాల్పడుతున్న అంబర్పేట్ జిహెచ్ఎంసి అధికారులు అని క్లియర్ గా అర్ధం అవుతుంది. నిబంధనలను ఉల్లంఘించిన వాటిపై GHMC కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి భవనాలను సీజ్ చేస్తున్నాం అన్నారు కానీ ఆలా జరగడం లేదు.సీజ్ చేసిన భవనాలు పూర్తి కూడా అయి గృహప్రవేశం అయిన సందర్భాలు ఎన్నో.
రాజకీయ రక్షణ, ఉన్నతాధికారుల అండదండలు ఉండటం వల్లనే అవినీతి అధికారులు వందల కోట్ల అక్రమాస్తులను కూడబెట్టగలుగుతున్నారు.తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు అని అర్ధం అవుతుంది.ఇలాంటి అక్రమ నిర్మాణాల గురించి నిత్యం ప్రభుత్వ అధికారిక మాద్యమాలు అయిన ట్విట్టర్ / ఇంస్టాగ్రామ్ / ఫేస్ బుక్ ద్వారా సీఎం కమ్ పురపాలక శాఖ మంత్రివర్యులు రేవంత్ రెడ్డికి,తెలంగాణ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ముఖ్య కార్యదర్శికి,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (MA&UD & HMDA) జయేష్ రంజన్,IAS కు,జిహెచ్ఎంసి కమీషనర్ కు,సైబరాబాద్ కమిషనర్ కు, మల్కాజిగిరి కమీషనర్ కు, అన్ని జోనల్ కమిషనర్లకు కు, డిప్యుటీ కమీషనర్లకు వందల ఫిర్యాదులు.GHMC ట్విట్టర్ ఆన్లైన్ లో ఎన్నిసార్లు 
ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటాం అని సమాధానం వస్తుంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు ? అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను గౌరవించరు ఎందుకు ?అక్రమ నిర్మాణాల ముందు అవి ‘నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలు’ అని తెలిసే విధంగా బోర్డులు పెట్టాలని హైకోర్టు గతంలో అభిప్రాయం వ్యక్తం చేసింది. అయినా అధికారులు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?.ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ అక్రమ నిర్మాణాల పై మౌనం వహిస్తే ఎట్లా ? అంబర్పేట్ సర్కిల్ లో చాలా అక్రమ నిర్మాణాల ఫిర్యాదులు ఉన్నాయి వీటిపై పూర్తిగా విచారణ జరిపించాలి... బాపట్ల కృష్ణమోహన్.

Thursday, June 11, 2026

బ్రతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించి భూమి కాజేయాలన్న కుట్ర బట్టబయలు..!

*బ్రతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించి భూమి కాజేయాలన్న కుట్ర బట్టబయలు..!*

*ప్రజావాణిలో ఫిర్యాదు – విచారణకు ఆర్డీఓ ఆదేశాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 10:

నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండలం ఇటుకులపాడు గ్రామానికి చెందిన గందం జ్యోతి భర్త అశోక్ తనకు పూర్వీకుల ఆస్తిలో రావలసిన మూడు ఎకరాల 10 గుంటల భూమిని అక్రమంగా కాజేయడానికి జరిగిన భారీ కుట్రపై న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు వివరాల ప్రకారం, తాను బ్రతికి ఉండగానే చనిపోయినట్టుగా తప్పుడు పత్రాలు, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి, తన అన్న అయిన బొడ్డు విజయ్ (తండ్రి వీరమల్లు) కొందరు అధికారులతో కుమ్మక్కై అక్రమ పట్టా పొందినట్లు ఆరోపించారు. తనకు చట్టబద్ధంగా రావలసిన వాటా భూమిని దోచుకునేందుకు ఈ కుట్ర జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు గందం జ్యోతి ప్రజావాణి ఫిర్యాదు నంబర్: PV-B 172/2026, తేదీ: 04-06-2026 ద్వారా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన నల్లగొండ జిల్లా ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి గారు విచారణ జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శాలి గౌరారం తహసీల్దార్ (ఎంఆర్వో)కు ఆదేశాలు జారీ చేశారు.*ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి..*:ఒక మహిళ బ్రతికి ఉండగానే ఆమెను ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్టుగా చూపించేంత ధైర్యం ఎవరిచ్చారు? తప్పుడు ధ్రువపత్రాలు ఎలా జారీ అయ్యాయి? అక్రమ పట్టా పొందడానికి ఎవరు సహకరించారు? ప్రభుత్వ భూముల రికార్డులను తమ ఇష్టానుసారం మార్చుకునే మాఫియాలకు అధికార యంత్రాంగంలో అండదండలు ఉన్నాయా? ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై, వాటికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గందం జ్యోతికి చట్టబద్ధంగా రావలసిన భూమిని అప్పగించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

హైదరాబాద్ ఉప్పుగూడలోని విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ పై ఫిర్యాదు – నర్సరీ విద్యార్థిని పట్ల దుర్వ్యవహారం మరియు నిర్లక్ష్య వైఖరి గురించి.

*హైదరాబాద్ ఉప్పుగూడలోని విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ పై ఫిర్యాదు – నర్సరీ విద్యార్థిని పట్ల దుర్వ్యవహారం మరియు నిర్లక్ష్య వైఖరి గురించి.*

*హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులకు తల్లితండ్రుల ఫిర్యాదు*

*మీడియా టుడే ను ఆశ్రయించిన పేరెంట్స్*

*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 10:

మా కుమార్తె జె. శ్రీనికా (నర్సరీ) ఉప్పుగూడ హనుమాన్ నగర్ లో ఉన్న విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ లో నర్సరీ చదువుతోంది. ఆమెకు సంబంధించిన ఒక తీవ్రమైన అంశాన్ని బాధ్యత గల తల్లితండ్రులుగా మేము జె.శ్రీ సాయి హరికిరణ్ (తండ్రి),
జె. రవళిక (తల్లి)హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తేది 20-04-2026 న తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.20-04-2026 తేదీన మా కుమార్తె రిపోర్ట్ కార్డ్ తీసుకోవడానికి తల్లి జె. రవళిక పాఠశాల వెళ్లినప్పుడు, స్కూల్ అడ్మిన్ సిబ్బంది (శ్రీమతి స్వప్న) రిపోర్ట్ కార్డ్ అందజేసి, ఎటువంటి సరైన కారణం లేదా వివరణ ఇవ్వకుండా మా కుమార్తెను పాఠశాల నుండి తీసుకెళ్లాలని సూచించారు. ఈ విధమైన ప్రవర్తన పూర్తిగా అనుచితమైనది మరియు ఆమోదయోగ్యం కానిది.
అంతేకాకుండా, గతంలో ఒక ఉపాధ్యాయురాలు మా కుమార్తెపై శారీరకంగా దాడి చేసిన సంఘటనను కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఆమె ముఖంపై ఉపాధ్యాయురాలి వేళ్ల గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ఈ విషయంపై మేము పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించినప్పుడు, వారు బాధ్యతారాహిత్యంగా స్పందించి మా ఆందోళనలను సరైన విధంగా పరిష్కరించలేదు.ఇంకా, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవర్తన కూడా అత్యంత అవృత్తిపరమైనది మరియు అవమానకరమైనది. ఆమె అహంకారపూరితమైన మరియు అనుచితమైన భాషను ఉపయోగిస్తూ, “మీరు ఎవరికి కావాలంటే వారికి ఫిర్యాదు చేసుకోండి, నాకు ఎలాంటి సమస్య లేదు” అని సిబ్బంది, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో వ్యాఖ్యానించారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి నుండి ఇటువంటి ప్రవర్తన చాలా ఆందోళనకరమైనది.ఇలాంటి వాతావరణం చిన్నపిల్లల భద్రతకు మరియు మానసిక వికాసానికి హానికరంగా ఉంటుంది.అందువల్ల హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణించి, పాఠశాల యాజమాన్యం మరియు సంబంధిత సిబ్బంది దుర్వ్యవహారంపై తగిన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, విద్యార్థుల భద్రత, గౌరవం మరియు సంక్షేమాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.తేది 13-05-2026 నాడు  RTIA పిటిషన్ హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు... స్పందన కోసం తల్లితండ్రులు వేచి చూస్తున్నాము అని అన్నారు.

Monday, June 8, 2026

_NEET - యూజీ 2026పరీక్ష పేపర్ లీక్ - లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేసింది_

*NEET - యూజీ 2026పరీక్ష పేపర్ లీక్ - లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేసింది*

*ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది*

*CBSE 2026 On Screen Marking - OSM విధానంలో లోపాలు*

*అనురాధ రావు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 8:

ప్రపంచ సమయాన్ని మార్చే ముందు భూమధ్య రేఖ ఎక్కడ ఉందో మన  కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి తెలుసా? April నెల 2026 ఉజ్జయినిలో జరిగిన అంతర్జాతీయ "Master of Time సదస్సు" లో ధర్మేంద్ర ప్రదాన్ గారు మాట్లాడుతూ, ప్రపంచం ఇప్పుడు ఉపయోగిస్తున్న Greenwich Mean Time (GMT)
స్థానంలో మహకాల్ స్టాండర్డ్ టైం పరిగణలోకి  తీసుకోవాలని సూచించిన మహా మేధావి మన కేంద్ర విద్యాశాఖ మంత్రి .ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే,ఉజ్జయినిలో ఈ భుమధ్య రేఖ మరియు కర్కాటక రేఖ  కలుస్తాయని చెప్పారు.అంటే ఎంత మేధావో మన మంత్రి గారు, అవి సమాంతర రేఖలు, భౌగోళికంగా కలిసే అవకాశం లేదు అనే విషయం తెలియదా? అందుకే విద్యాశాఖ మంత్రి అయ్యారు.ప్రపంచ సమయ ప్రమాణాన్ని మార్చడం అనేది అంతంతీయ స్థాయి విషయం అని కూడ తెలియని మేధావి చేతిలో విద్యావ్యవస్థ ఉంది.ఒక దేశ ప్రధాని కాని,మంత్రి కాని ఈ టైం మార్చగలరా? May 3వ తేదిన NEET UG 2026 పరీక్ష నిర్వహించారు,22 లక్షలకు పైగా విద్యార్థులు రాశారు.
ప్రతి సంవత్సరం లాగే పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ కావడం,పరీక్ష రద్దు చేయడం జరిగింది.సంవత్సరాలు మారుతున్నాయి కాని పేపర్ లీకేజీ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ప్రభుత్వం.
పరీక్ష రద్దు,మళ్లి పరీక్ష నిర్వహణ అనే స్థాయికి ఎదిగాం.ఒక పేపర్ లీక్ అంటే లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేయడం.ఎన్ని కుటుంబాలు ఆవేదనకు గురైతాయి? తల్లిదండ్రులు తమ కలలను పిల్లల పై పెట్టుకుంటారు. ఆ కలలు బుడిదైతే బాధ్యత ఎవరిది?.NEET కోసం ఆరవ తరగతి నుండే కోచింగ్ ప్రారంభం అవుతుంది.దానికోసం అధిక ఫీజులు వసూలు చేస్తాయి పాఠశాలలు.ఇంటర్ లో సెపరేట్ కోచింగ్.ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలిసిన విషయమే. ఒక సాధారణ కుటుంబం మళ్లి మళ్లి ఇలా ఖర్చు చేయాలి అంటే ఆ కుటుంబం వీధిన పడ్డట్టు.అటు మానసికంగా, ఇటు ఆర్థికంగా దెబ్బ తింటున్న కుటుంబాలు ఎన్నో.ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇక ఈ సమస్య ఉండగానే CBSE 2026 On Screen Marking - OSM విధానంలో లోపాలు బయట పడ్డాయి. వేల సంఖ్యలో విద్యార్థులు మార్కింగ్ లోపాల పై ఫిర్యాదులు చేశారు.ఒకరి ఆన్సర్ షీట్ వేరే వాళ్ళకు, ఒకరికి ఖాలీ షీట్, ఒక ప్రశ్న కు వేరే ఆన్సర్ అలా రకాల రకాలుగా వచ్చాయి. 
ఇక దరఖాస్తుల పేరిట 100 రూపాయలు, వెరిఫికేషన్కు వంద, ప్రశ్నలు చూడాలి అంటే ప్రతి ప్రశ్నకు 25 రూపాయలు ఇలా దోచుకోవడం. అవకతవకలపై విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్నారు - వ్యత్యాసాలు ఉన్నాయి అని కాజువల్ అన్నారు.కాని ఏం చేశారు ఆ తప్పు చేసిన వారిని ?  
2019 లో గ్లోబరీనా చేసిన నిర్వాకానికి 25 మంది విద్యార్థులు బలి అయ్యారు. ఇలాంటి
అదే గ్లోబరీనా కంపెనీకే (పేరు మార్చుకున్నా) ఈ On Screen Marking పనిని అప్పగించారు.
ఇట్లా జరిగితే వేరే ఏదేశ ప్రజలైనా నిలదిసే వారు, కాని మన దేశంలో నాకెందుకు అని అనుకోవడం.
ఇదే తమ పిల్లలకు జరిగితే ఊరుకుంటారా? మనకున్న చట్టాలను గౌరవిస్తే ఇన్ని దారుణాలు జరిగేవా? ఇంత మంది విద్యార్థులు చనిపోతే కనీసం బాధ్యత లేని ప్రభుత్వం.
మన ప్రధానమంత్రి కి చదువు గురించి పట్టదు, పిల్లలు ఆశగా మన్ కి బాత్ ప్రోగ్రాం చూస్తే/వింటే ఒక్క మాట కూడ ఈ సమస్యలపై స్పందించలేదు.ఎప్పుడైతే విద్యావ్యవస్థ పై నమ్మకం కోల్పోతామో,భవిష్యత్తు పై నమ్మకం కోల్పోతాం.ఇలాంటి వారు వారి పదవులకు రాజీనామ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్.6వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి నిరసన ప్రదర్శన జరిగింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆ ప్రదర్శన లో బాలల హక్కుల సంఘం తరఫున తమ డిమాండ్ తెలిపింది.సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లల సమస్యల పట్ల మన గొంతు విప్పుదాం. మళ్లి ఇవి పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిదే,కాని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా ఉంది, న్యాయ వ్యవస్థను పటిష్ట చట్టపరమైన చర్య తీసుకోవాలి అని విన్నపం.

మృగశిర కార్తె శుభ సందర్భంగా అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

*మృగశిర కార్తె శుభ సందర్భంగా అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 8:

వానాకాలం వ్యవసాయానికి శ్రీకారం చుట్టే మృగశిర కార్తె ప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయం పండుగగా, తొలకరి పలకరింపు రైతులు, రైతు కూలీల ఇళ్లల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. వాతావరణ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలను పరిగణలోకి తీసుకుని రైతులు పంటలకు సిద్ధం కావాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల్లో వేగంగా వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రైతాంగాన్ని కోరారు.కొన్ని పరిమితమైన పంటల సాగుపైన దృష్టి సారించడం వల్ల పప్పుధాన్యాలు, వేరుశనగ, పెసలు, మినుములు, నువ్వులు వంటి పంటలను దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.ఇలాంటి సమస్యలను అధిగమించడంతో పాటు వరుసగా ఒకే పంటను సాగు చేయడం వల్ల నేల సారం తగ్గి తెగుళ్ల సమస్యలు కూడా పెరుగుతున్నాయని, వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంట మార్పిడి వల్ల నేల సారం పెరగడమే కాకుండా దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలని సూచించారు.ఈ మృగశిర కార్తె అన్నదాతలకు శుభారంభం కావాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పుష్కలమైన పంటలు పండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

_శికం-సర్కారీ" భూమి, "శికం-పట్టా" భూమి మధ్య తేడా ఏమిటో ఆరోపణలు చేస్తున్నవారికి తెలుసా? వి. రవికృష్ణ_

*"శికం-సర్కారీ" భూమి, "శికం-పట్టా" భూమి మధ్య తేడా ఏమిటో ఆరోపణలు చేస్తున్నవారికి తెలుసా? వి. రవికృష్ణ*

*సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ భూముల వ్యవహారంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను ప్రశ్నించిన సామజిక కార్యకర్త,న్యాయవాది వి. రవికృష్ణ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 7:

ఇప్పుడు కొందరు చెబుతున్నట్లుగా సర్వే నం.706 నిజంగానే ప్రభుత్వ భూమి, శికం-సర్కారీ భూమి లేదా అక్రమ కబ్జా అయితే దాదాపు పదేళ్ల పాటు మీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది?. నిజంగా అది ప్రభుత్వ భూమి అయితే:
▪️ రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది?
▪️ మ్యుటేషన్ ఎలా జరిగింది?
▪️ పట్టాదారు పాస్‌బుక్‌లు ఎలా జారీ అయ్యాయి?
▪️ రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ "శికం-పట్టా"గా ఎందుకు చూపిస్తున్నారు?
▪️ సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?.
➡️డాక్యుమెంట్ నం.3213/2014 తేదీ 15-12-2014న శంకర్‌పల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ అయింది.
➡️02-06-2014 నుంచి డిసెంబర్ 2023 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ కాలంలో మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు స్వయంగా ఎంపీగా, అనంతరం ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రభుత్వ రికార్డులు, ధరణి వివరాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ వర్గీకరణలను పక్కన పెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ నిర్వహించడం వల్ల నిజాలు మారవు.కనీసం "శికం-సర్కారీ" భూమి, "శికం-పట్టా" భూమి మధ్య తేడా ఏమిటో ఆరోపణలు చేస్తున్నవారికి తెలుసా?.
*ప్రశ్నలు చాలా సులభం:*
భూమి అక్రమమైతే మీ ప్రభుత్వం పదేళ్ల పాటు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. అక్రమం కాకపోతే ఇప్పుడు రాజకీయ కథనాల కోసం "కబ్జా", "ల్యాండ్ గ్రాబింగ్" అంటూ ప్రచారం ఎందుకు చేస్తున్నారు. చట్టం, అధికారిక రికార్డులు, సమర్థ అధికారుల విచారణే నిజాన్ని తేల్చాలి — యూట్యూబ్ తీర్పులు కాదు.

Sunday, June 7, 2026

_సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన_

*పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి*

*సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన*
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి.కానిస్టేబుల్ రాజు  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఎస్పీ.డాక్టర్.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ IPS.నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉల్పారా గ్రామానికి చెందిన మద్దమల్ల.రాజు 2014 బ్యాచ్ ఏ ఆర్ కానిస్టేబుల్ గా ఎంపికై నాగర్ కర్నూల్ ఆర్మూడ్ రిజర్వులో విధులు నిర్వర్తిస్తున్నాడు.గత రెండు రోజులుగా సీఎం బందోబస్తు నిమిత్తం సోమశిల లో విధులు నిర్వర్తిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా  మామిళ్ళపల్లి గ్రామం సమీపంలో  పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించడం జరిగింది.ఈ సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు మృతదేహాన్ని నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ  గారు స్పందిస్తూ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్లి  ఏఆర్ కానిస్టేబుల్ రాజు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించినారు.వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పడం జరిగింది.అలాగే రేపు వారి యొక్క స్వగ్రామమైన ఉల్పర గ్రామం వంగూరు మండలం నందు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.

_సోషల్ మీడియా లో పోస్ట్లు చేసేటప్పుడు ఆలోచించండి_

*సోషల్ మీడియా లో పోస్ట్లు చేసేటప్పుడు ఆలోచించండి*

*సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే జైలుకు - తెలంగాణ పోలీస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తి పై  కేసు (395/2026) నమోదు చేసి జైలుకు పంపించిన తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాలో మితిమీరినవ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగితజ్ఞానం మర్చిపోవద్దు. అలా చేస్తే చట్టం పని చట్టం చేస్తుంది.

_రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు_

*న్యాయం కోసం ఎదురుచూసి కన్నుమూసిన వృద్ధురాలు*

*రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు*

*మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "వృద్ధ మహిళ న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

వికారాబాద్ జిల్లా, తాండూర్ పట్టణంకు చెందిన చెన్‌బసమ్మ మరణం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమా?. అనారోగ్యంతో బాధపడుతూ, తనకు సంబంధించిన ఆస్తి మరియు న్యాయ సమస్య పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి చివరకు పక్షవాతంతో మంచానికి పరిమితమైన 75 ఏళ్ల వృద్ధురాలు శ్రీమతి చెన్‌బసమ్మ గారు చివరకు 29-05-2026న కన్నుమూశారు.మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "75 ఏళ్ల వృద్దురాలు పక్షవాతంతో మంచాన పడ్డా సంవత్సరాలనుండి న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది. అయినా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వ అధికారిక మాధ్యామాల ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం CMOHYD,వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు, స్థానిక చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశవేశ్వరరెడ్డి కి, తాండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు మనోహర్ రెడ్డి కి,తాండూర్ మున్సిపల్ చైర్మన్ కు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇదేనా ప్రజాపాలన - ప్రగతి పాలన అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్న ఏమిటంటే — తన జీవితకాలంలో న్యాయం కోసం ఎదురు చూసిన ఒక వృద్ధురాలికి న్యాయం చేయలేకపోతే, రాజ్యాంగం కల్పించిన హక్కులు సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?
ప్రభుత్వ కార్యాలయాలు,జిల్లా కలెక్టర్ కార్యాలయం,రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ప్రజావాణి, ఉన్నతాధికారులు, ఇంకా అనేక వేదికల ద్వారా సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిష్కారం దొరకకపోవడం బాధాకరం.అనేక ఫిర్యాదులు, పత్రాలు, వినతులు, ఆధారాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, చెన్‌బసమ్మ గారు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి సంవత్సరం మహిళా హక్కుల గురించి గొప్పగా మాట్లాడే సమాజం, ఒక వృద్ధ మహిళ న్యాయం కోసం ఎదురుచూస్తూ కన్నుమూసినప్పుడు ఎక్కడ ఉంది? ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలు ఈ పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?
"న్యాయం ఆలస్యమైతే అది కూడా అన్యాయమే" అనే సూత్రాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.చెన్‌బసమ్మ గారు ఇక లేరు.కానీ ఆమె అడిగిన ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి.
పేదలకు న్యాయం పొందే హక్కు ఉందా?వృద్ధుల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత కాదా?రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పుస్తకాలకే పరిమితమా?అధికారులు స్పందించకపోతే సామాన్యుడు ఎవరిని ఆశ్రయించాలి? కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ఏమిటంటే, చెన్‌బసమ్మ గారు జీవించి ఉండగా పరిష్కారం కాలేకపోయిన ఈ సమస్యను ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి.అదే "ఆమె ఆత్మకు నిజమైన శాంతి కలిగించే మార్గమని" వారు కోరుతున్నారు.
— కుటుంబ సభ్యులు

Sunday, May 31, 2026

జాతీయ జంతువు,గో మాంసం అమ్మడం,ఎగుమతుల నిషేధం తీసుకురావొచ్చు కదా - ఆకునూరి మురళి,IAS రిటైర్డ్*

*జాతీయ జంతువు,గో మాంసం అమ్మడం,ఎగుమతుల నిషేధం తీసుకురావొచ్చు కదా - ఆకునూరి మురళి,IAS రిటైర్డ్*

*ట్విట్టర్ వేదికగా సూచనలు చేసిన ఆకునూరి మురళి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 29:

మీ వైపు(ముస్లీములు) నుండి ఇట్లాంటి ప్రతిపాదన రావడం మంచి పరిణామం.మరి అధికార పార్టీ బీజేపీ ఇలాంటి చట్టం (జాతీయ జంతువు,గో మాంసం అమ్మడం,ఎగుమతుల నిషేధం) తీసుకురావొచ్చు కదా.ఇలాంటిదే మైక్ లో రోజు నమాజ్ (Azaan) ను కూడా ఆపేస్తే బెటర్.దీని వలన అందరికి disturbance ముసలి వాళ్లకు,రోగులకు,చంటి పిల్లలకు చాలా disturbance. హిందువులు కూడా గుడులలో రకరకాల పండగలప్పుడు వేడుకల పేరు మీద అర్ధరాత్రి వరకు మైకుల ద్వారా పాటలు పెట్టడం కూడా అందరికి disturbance. అక్కడక్కడా చర్చీలు కూడా మైకులు మొదలు పెట్టిండ్రు. ఇవ్వన్నీ కూడా ఆపేస్తే ఒక మంచి సమాజం ను నిర్మించినట్టు అవుతుంది.మూడు మతాల పెద్దలు కూర్చొని ఈ విషయాల మీద మాట్లాడుకొని ప్రభుత్వాలకు ప్రతిపాదనలు ఇస్తే సమాజం లో మంచి సామరస్య వాతావరణం నెలకొల్పవచ్చు.లేకపోతే రాజకీయ స్వార్ధపరులు మతాలను తమ తమ రాజకీయాలకు వాడుకోడం ఇలాగే నడుస్తుంది .దాని ద్వారా సమాజం నాశనం కావడానికి దారి తీస్తుంది.

పిల్లల ప్రాణాలు గొప్పవా? లేక 179 సంవత్సరాల చరిత్ర గొప్పదా?

*పిల్లల ప్రాణాలు గొప్పవా? లేక 179 సంవత్సరాల చరిత్ర గొప్పదా?*

*అనూరాధ రావు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 30:

179 ఏళ్లుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నాం,ఇది సంప్రదాయం అని చెప్పుతున్నారు బత్తిన ఫ్యామిలీ.ఇది ఎక్కడ శాస్త్రీయంగా నిరూపించని ప్రసాదం.దీనిలో ఎలాంటి ఔషధ గుణాలు లేవని నిరూపించింది బాలల హక్కుల సంఘం.2013లో- గతంలో దీన్ని చేప మందు అని చేప్పవారు,బాలల హక్కుల సంఘం 2013లో లోకాయుక్త దృష్టికి తీసుకు వచ్చింది.దీనిలో ఎలాంటి మందు / ఔషధం లేదు కేవలం పిండి,పసుపు,నూనె మాత్రమే ఉంది అని లాబరెటరీ పరీక్షల ద్వారా నిరూపించింది.
దీన్ని మందు అనకూడదు ప్రసాదం అనాలి అని జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు తీర్పు ఇచ్చారు.పిల్లలకు WHO సూచించిన మందులనే వాడాలి.పిల్లలపై ప్రయోగాలు చేసే అధికారం ఎవ్వరికి లేదు.ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం.లాలాజలం ద్వారా ఎన్ని రకాల అంటు వ్యాధులు వస్తాయో తెలుసా? ఒకరి నోట్లో పెట్టిన చేయి,ఇంకొకరి నోట్లో పెట్టడం వల్ల అనేక అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.చేపమింగడం చిన్న పిల్లలకు చాలా కష్టం.ఒక్కోసారి శ్వాస ఆగిపోవచ్చు గొంతులో చేప అడ్డుపడి.ప్రతి తల్లి తండ్రి ఆలోచించాల్సిన విషయం.ఇంత వరకు ఆస్తమా తగ్గిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటే ఎలాంటి ఇతర ఔషధాలు వాడకుండా, ఒక్క ఫిష్ ప్రసాదం తీసుకుని ఆస్తమా తగ్గిన వారు ఉన్నారా?చేపలోని మెర్క్యురీ, మెటల్స్ చిన్న పిల్లల నాడి వ్యవస్థ పైనా,కిడ్నీ ప్రభావం చూపెడతాయి.పిల్లలకు ఫిష్ ప్రసాదం వేయడం పూర్తిగా  నిషేదించాలి.బత్తిన సోదరులు సైంటిఫిక్గా నిరూపణ చేయ్యాలి.
ప్రభుత్వం మూఢనమ్మకాలను ప్రచారం చేయడం,ప్రోత్సహించడం కరెక్ట్ కాదు.బత్తిన సోదరులు పంపిణీ చేసే ఈ అశాస్త్రీయ ప్రసాదం కోసం ఆరెంజ్మెట్స్ ఆపేయాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్.

మెట్లచిట్టాపూర్ లో కాలిపోయిన దాదాపు 2వేల చెట్ల ఈత వనం గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలి*

*మెట్లచిట్టాపూర్ లో కాలిపోయిన దాదాపు 2వేల చెట్ల ఈత వనం గీత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలి*

*జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ (IAS) మరియు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ సానుకూల స్పందన*

బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే, మే 30:

జగిత్యాల జిల్లా,కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం,మెట్పల్లి మండలం,మెట్లచిట్టాపూర్ గ్రామంలో కొద్దిరోజుల క్రితం కాలిపోయిన దాదాపు 2వేల చెట్ల ఈత వనం కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం కోసం,గ్రామానికి చెందిన పలు అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే గారి చొరవతో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ (IAS)ను కలిసిన గీత కార్మిక కుటుంబ సభ్యులు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని అంచనావేసి ఆ నివేదికను ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరుపున సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.ఈ సందర్బంగా కోరుట్ల ఎమ్ఎల్ఏ కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ మెట్లచిట్టాపూర్ గ్రామ అభివృద్ధిలో తాను ఎప్పుడు ముందుంటానని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం కట్టుబడిఉంటానని అన్నారు. నిన్న గ్రామాన్ని సందర్శించి కాలిపోయిన దాదాపు 2వేల చెట్ల ఈత వనం ప్రాంతంను సందర్శించి గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించేలా చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది.గ్రామంలో త్రాగునీటి కొరకు మరియు ప్రజా అవసరాల నిమిత్తం బోరు బావులు వేయించడం కోసం,శిథిలావస్థ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మాణం మరియు అసంపూర్తిగా మిగిలిపోయిన పాఠశాల భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ కు గ్రామ సర్పంచ్ అరుణ గంగాధర్ విన్నవించగా వారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ద్వారా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్ జల వ్యవస్థ – విచ్ఛిన్నమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ*

*హైదరాబాద్ జల వ్యవస్థ – విచ్ఛిన్నమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ*

*సీతారాం ధూళిపాళ - వ్యవస్థాపక అధ్యక్షులు,ది సిటిజన్స్ కౌన్సిల్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 30:

హైదరాబాద్ నగరం ఒకప్పుడు కుతుబ్ షాహీలు,నిజాంలు అభివృద్ధి చేసిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువుల (Chain-Link Lakes) వ్యవస్థతో ప్రసిద్ధి చెందింది.ఒక చెరువు నిండితే అదనపు నీరు కాలువలు, వాగులు,నాళాల ద్వారా తదుపరి చెరువుకు చేరేది.ఈ సహజ ప్రక్రియ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు సమృద్ధిగా పునరుద్ధరించబడేవి. అదే సమయంలో వరదల తీవ్రత కూడా తగ్గేది.నేడు కోటి మందికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ మహానగర ప్రాంతంలో ఈ సహజ జల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వేలాది చెరువులు,కుంటలు, వాటిని అనుసంధానించే ఫీడర్ ఛానెల్లు ఆక్రమణలు,రియల్ ఎస్టేట్ అభివృద్ధి,ప్రణాళికలేని పట్టణీకరణ కారణంగా కనుమరుగవుతున్నాయి లేదా పరస్పర అనుసంధానం కోల్పోతున్నాయి.ముఖ్యంగా ఫీడర్ ఛానెల్ల ఆక్రమణలు, నాళాల కాంక్రీటీకరణ ఆందోళనకర అంశాలు. గతంలో మట్టి నాళాలు వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచేవి. ప్రస్తుతం కాంక్రీటు నాళాలు నీటిని వేగంగా తరలిస్తున్నప్పటికీ, భూమిలోకి నీరు ఇంకే అవకాశాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నాయి. అలాగే రోడ్లు,కాలనీలు,వాణిజ్య సముదాయాల విస్తృత కాంక్రీటీకరణ కారణంగా నగరంలోని సహజ జల శోషణ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది.దీని ఫలితంగా హైదరాబాద్ వర్షాకాలంలో వరదలు,వేసవిలో నీటి కొరత అనే విరుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోంది. తగినంత వర్షపాతం నమోదవుతున్నప్పటికీ,అధిక భాగం వర్షపు నీరు ఉపరితల ప్రవాహంగా వెళ్లిపోతోంది.దీంతో భూగర్భ జలాలు క్షీణించి బోర్‌వెల్లు,ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.దీర్ఘకాలిక జల భద్రత కోసం ప్రభుత్వం గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫీడర్ ఛానెల్లలోని ఆక్రమణలను తొలగించడం, చెరువులను పరస్పరం అనుసంధానం చేయడం,బఫర్ జోన్లను పరిరక్షించడం,నాళాల అనవసర కాంక్రీటీకరణను నివారించడం, ప్రతి భవనం మరియు కాలనీలో వర్షపు నీటి సంరక్షణ గుంతలు (Rain Water Harvesting Pits) మరియు ఇంకుడు గుంతలను తప్పనిసరి చేయడం అత్యవసరం. హైదరాబాద్‌లో భూగర్భ జలాల సంక్షోభం వర్షాల కొరత వల్ల కాదు; ప్రకృతి సిద్ధమైన జల నిర్వహణ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం వల్ల ఏర్పడింది. భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించాలంటే గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ,భూగర్భ జలాల రీఛార్జ్‌కు ప్రాధాన్యతనిచ్చే పట్టణ ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Saturday, May 30, 2026

*_కొలువు తెచ్చిన గౌరవం_*

*కొలువు తెచ్చిన గౌరవం*

*హైడ్రా ఉద్యోగంతో వచ్చిన ఆత్మవిశ్వాసం*

*హైడ్రా ఈగల్ టీమ్గా ప్రత్యేక గుర్తింపు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 29:

హైడ్రాలో ఉద్యోగం… ట్రాన్స్జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది.కొలువు తెచ్చిన గౌరవం.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక వారు వెనక్కి చూడడంలేదు. విధులు ఎక్కడైనా.. ఎప్పుడైనా సిద్ధమంటున్నారు.చెరువులు, నాలాల కబ్జాలను తొలగించడంలో భాగస్వామ్యమౌతున్నారు. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో ముందుంటున్నారు. మొత్తం 16 మంది ట్రాన్స్జెండర్లకు హైడ్రా అవకాశం కల్పించింది. ఇందులో ట్రాన్స్ ఉమెన్ 11 మంది ఉంటే.. ట్రాన్స్మెన్ ఐదుగురున్నారు.ఆక్రమణదారులు ఎంతటి వారైనా వెరవకుండా..విధులు నిర్వహించి ప్రజా ఆస్తులు కాపాడడంలో భాగస్వామ్యమౌతున్నారు. హైడ్రా (HYDRAA)లో మాకు దక్కిన ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదు.. మా జీవితాలకు కొత్త గుర్తింపు అని అంటున్నారు. హైడ్రా యూనీఫామ్ వేసుకోవడం గౌరవంగా భావిస్తున్నామని అంటున్నారు. "హైడ్రా ఈగల్ టీమ్" గా నామకరణం చేసి..విధుల్లో భాగస్వామ్యులను చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్రాన్స్జెండర్లు చెబుతున్నారు.హైడ్రాఈగల్ టీమ్గా సేవలు..కబ్జాదారులు ఎంతటి వారైనా.. హైడ్రా వెనుకడుగు వేయదు.హైడ్రా ఇచ్చిన ధైర్యంతో ఈగల్ టీమ్ పని చేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం,ఐలాపూర్లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడంలో ట్రాన్స్జెండర్లు చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల మాదాపూర్ లో ఈదులకుంట కాపాడడంలో చురుకైన పాత్రపోషించారు. ప్రజలకు నచ్చజెప్పడం, మహిళలతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పడం, అధికారులు–ప్రజల మధ్య సమన్వయం చేయడం వంటి పనుల్లో వారు ప్రత్యేక పాత్ర పోషించారు. వారిలో సహనం ఎక్కువ.భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణం ఉంది. అందుకే ఫీల్డ్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు అని హైడ్రా అధికారులు ప్రశంసిస్తున్నారు. హైడ్రాలో పనిచేస్తున్న చాలామంది ట్రాన్స్జెండర్లు ఇప్పుడు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. నెల జీతం వస్తోంది. సమాజంలో గౌరవం పెరిగింది. ముఖ్యంగా “మేము కూడా పనికి పనికొచ్చే వాళ్లమే” అన్న నమ్మకం వారిలో బలపడింది.
➡️మా జీవితాల్లో వెలుగులు:  
గాయత్రి -మా జీవితాల్లో డబ్బుకంటే గౌరవమే ముఖ్యమైంది.ఇప్పుడు హైడ్రా యూనిఫాం వేసుకుని బయటికి వెళ్తే గౌరవంగా ఉంది. అది మా జీవితంలో పెద్ద మార్పు. “అవకాశం ఇస్తే ట్రాన్స్జెండర్లు ఏ రంగంలోనైనా రాణిస్తారు.” హైడ్రాలో మా విధులు  అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. హైడ్రాలో అధికారులతో పాటు.. ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు. విధులు నిర్వర్తించడంలో సమానంగా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, హైడ్రా కమిషనర్కు ధన్యవాదాలు. 
➡️హైడ్రాతో ప్రత్యేక గుర్తింపు:  రుచిత -ప్రకృతిలో అందరూ భాగమే. ఆ ప్రకృతిని రక్షించడంలో మేము భాగస్వామ్యమయ్యాం. పార్కులు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. హైడ్రాలో పని చేయడంతో మాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. హైడ్రా అంటే ప్రజలకు ఎంతో విశ్వాసం.. ఆ సంస్థలో మేము భాగస్వామ్యం అవ్వడంచాలా సంతోషంగా ఉంది.
➡️బాధ్యతగా వ్యవహరిస్తున్నాం: తాన్షీరాయ్ - బిక్షాటన చేసుకుంటూ జీవితాలు వెల్లదీసేవాల్లం. ట్రాన్స్జెండర్లంటే ఇంతకుముందు ఎక్కడికి వెళ్లినా ఎగతాళి చేసేవారు.పని అడిగితే తిరస్కరించేవారు. కానీ ఇప్పుడు యూనిఫాం వేసుకుని విధులకు వెళ్లినప్పుడు అందరూ గౌరవంగా మాట్లాడుతున్నారు.

*_ఎస్సీ ఎస్టీ కేసుల కొట్టివేత_*

*_ఎస్సీ ఎస్టీ కేసుల కొట్టివేత_*
# స్వాగతించిన అనంచిన్ని వెంకటేశ్వరరావు 
# అడ్వకేట్ సంగెం సుధీర్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు 
# హైకోర్టు అడ్వకేట్ యల్లంకి పుల్లారావుకు కృతజ్ఞతలు 
# ప్రముఖ పాత్రికేయులు రవిప్రకాష్ కు ధన్యవాదాలు 

(ఆదిలాబాద్ న్యాయస్థానం నుంచి న్యాయవాద విద్యార్థి శ్రీ విష్ణు శివ పరమాత్మ)

ఆరు సంవత్సరాల క్రితం నాటి నియంత ప్రభుత్వంపై పోరాడుతున్న ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, ఈ దశాబ్ది ఉత్తమ పాత్రికేయ అవార్డు గ్రహీత అనంచిన్ని వెంకటేశ్వరరావుపై సంకసర్ల సువర్ణ అనే మహిళ పెట్టిన రెండు కేసులను ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. 

అసలేం జరిగింది.?:
గత ప్రభుత్వంలోని ఒక బ్యాచ్ తో కుమ్మక్కైన కొందరు అనంచిన్ని వెంకటేశ్వరరావుపై కేసులు పెట్టడంలో తహతహలాడారు. అందుకోసం ఒక మహిళను ఎన్నుకున్నారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అప్పటికే ఎలాంటి ఆధారాలు లేకుండా రెండు కేసులు పెట్టిన సంకసర్ల సువర్ణచేత సుమారు 50 రోజుల క్రితం వాట్సాప్ లో కులం పేరుతో తిట్టినట్లు కట్టు కథ అల్లారు. అందుకు తోడుగా ఓ ఏడుపు వీడియో కూడా విడదల చేసింది.

రెండో కేసు: ఈ కేసుకు ముందు ఖమ్మంలో వాకింగ్ చేస్తున్న అనంచిన్ని వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఒక్కసారిగా కంగుతిన్న గత ప్రభుత్వం అదే రోజు విడుదల చేసింది.

ఇదీ కుట్ర:
కిడ్నాప్ అనంతరం 4 రోజుల తర్వాత మైలార్ దేవులపల్లిలో పోలీసులు స్వీ మోటో కేసు నమోదు చేయగా.. ఇక్కడ కూడా సంకసర్ల సువర్ణ రంగ ప్రవేశం చేసి అదే రోజు రాత్రి 2వ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సుమారు 40 రోజులు అనంతరం 'నెట్ కాల్' బాగోతానికి తెర లేపింది. అనంచిన్ని వెంకటేశ్వరరావు సెల్ ఫోన్ నెంబర్ కు అసలు నెట్ కాల్ సౌకర్యం లేకపోవడం గమనార్హం.

కోటి రూపాయల కథ - కోర్టులో మరో విధంగా..:

సంకసర్ల సువర్ణ గత ఆరేళ్ళుగా "కోటి రూపాయలు ఇస్తానంటే నేను లొంగలేదని" బొంకుతూ వచ్చింది. తీరా కోర్టులో వాంగ్మూలం ఇస్తూ... 'కోటి రూపాయలకు పరువునష్టం నోటీసు' అంటూ చెప్పడం జరిగింది. 

చెల్లితో అక్రమ సంబంధం:
బావమరిది భార్యతో అనంచిన్ని వెంకటేశ్వరరావుకు లింకు పెడుతూ అవాకులు చవాకులు పేలింది. బిడ్డ ఇక్కడ కూడా అడ్డంగా దొరికింది. 

బాక్స్:

కోర్టు తీర్పులను స్వాగతించిన అనంచిన్ని వెంకటేశ్వరరావు

ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను తాను స్వాగతిస్తునట్లు అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా కోర్టు వద్ద తనను కలసిన విలేఖరులకు చెప్పారు. ఇక ఇతర కేసుల విషయంలో తన న్యాయవాదులందరూ వేగంగా న్యాయపరమైన పనులు చెపట్టాలని అంతే కాకుండా ఇక నుంచి చిన్న అసంబద్దంగా ఎవరు మాట్లాడినా వెంటనే ఆధారాలతో న్యాయస్థానంలో కేసులు వేయాలని ఆయన కోరారు. 'నాటి ప్రభుత్వానికి ఇది చెప్పు దెబ్బ' అని, ఇక నుంచి అనంచిన్ని బ్రాడ్ కాస్టింగ్, అనంచిన్ని ఫౌండేషన్ లతో కార్యక్రమాలను చేపడతానని, అలాగే పలు ఆర్థిక కార్యక్రమాలను స్వంత ఖర్చులతో చేపడతానని, తనపై పెట్టిన కేసుల వాళ్ళ సంగతి తమ న్యాయవాదులు చూసుకుంటారని ఈ సందర్భంగా చెప్పారు.

బాక్స్:
కృతజ్ఞతలు 

తనకు గత ఆరేళ్లుగా న్యాయపరంగా సేవలందించిన అడ్వకేట్ సంగెం సుధీర్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ యల్లంకి పుల్లారావు, సీనియర్ పాత్రికేయులు , అఖిల భారత జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు కే.కోటేశ్వర్ రావుకు అనంచిన్ని వెంకటేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బాక్స్:
ప్రముఖ పాత్రికేయులు రవిప్రకాష్ కు ధన్యవాదాలు

టివి9 వ్యవస్థాపకులు, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, ఆర్టీవి బాధ్యులు రవిప్రకాష్ కు అనంచిన్ని వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన కష్టకాలంలో దేవుడు ఇచ్చిన సోదరుడిలా వెన్నంటి ఉన్నారని, ఆర్థికంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారని, ఆ ఋణం తీర్చుకోలేనిదని ఈ సందర్భంగా అనంచిన్ని వెంకటేశ్వరరావు చెప్పారు.

బాక్స్:
ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ హైదరాబాద్ లలో బాణాసంచాలతో అనంచిన్ని వెంకటేశ్వరరావు అభిమానులు, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

బాక్స్:

తనపై కేసులు పెట్టిన వారి వెనుక ఉన్న వెధవలు, సంఘ నాయకుల గురించి స్పష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా చెప్పారు.

*_SC/ST Cases Dismissed_*



*_SC/ST Cases Dismissed_*

_Anamchinni Venkateswara Rao Welcomes the Judgments_

_Special Congratulations to Advocate Sangem Sudheer Kumar_

_Gratitude to High Court Advocate Yallanki Pulla Rao_

_Thanks to Senior Journalist Ravi Prakash_

_(From Adilabad Court – Law Student Sri Vishnu Shiva Paramatma)_

*_Two SC/ST cases filed six years ago against noted investigative journalist and recipient of the “Best Journalist of the Decade” award, Anamchinni Venkateswara Rao, by a woman named Sankasarla Suvarna, have been dismissed by the Adilabad District SC/ST Court._*

*_What Actually Happened?_"
Several individuals allegedly associated with a faction of the previous government were eager to implicate Anamchinni Venkateswara Rao in criminal cases. For this purpose, they allegedly chose a woman. About 50 days after two earlier cases had already been filed without substantial evidence, a new story was allegedly fabricated claiming that Venkateswara Rao had abused her in the name of caste through WhatsApp messages. A video showing her crying was also circulated in support of the allegations.

*_The Second Case_*
Prior to the registration of this case, Anamchinni Venkateswara Rao was allegedly abducted while on a morning walk in Khammam and taken to Hyderabad. The then government, reportedly taken aback by the developments, released him on the same day.

*_The Alleged Conspiracy_*

Four days after the alleged abduction, the police at Mylardevpally registered a suo motu case. Subsequently, Sankasarla Suvarna entered the scene and filed a second SC/ST case on the very same night.

Approximately forty days later, a new allegation involving a “net call” was introduced. It is noteworthy that Anamchinni Venkateswara Rao’s mobile number allegedly did not have any net-calling facility.

*_The One-Crore Rupee Story – A Different Version in Court_*

For the past six years, Sankasarla Suvarna had allegedly claimed that she had been offered one crore rupees and refused to yield. However, while giving testimony before the court, she reportedly stated that the issue related to a legal notice seeking damages of one crore rupees for defamation.

*_Allegations of an Illicit Relationship_*
She allegedly made statements linking Anamchinni Venkateswara Rao with the wife of his brother-in-law. According to supporters of Venkateswara Rao, these allegations were also exposed during the proceedings.
---

Box Item

*_Anamchinni Venkateswara Rao Welcomes the Court Judgments_*

Speaking to media representatives who met him outside the court, Anamchinni Venkateswara Rao stated that he welcomed the judgments delivered by the Adilabad District SC/ST Court.

He said that his legal team would expedite proceedings in the remaining cases and that, henceforth, any person making irresponsible or defamatory statements against him would face legal action supported by evidence.

Describing the judgment as a “strong reply to the previous government,” he announced plans to undertake various initiatives through Anamchinni Broadcasting and the Anamchinni Foundation. He also stated that he intends to launch several welfare and economic programs at his own expense. Regarding those responsible for the cases filed against him, he said his legal team would handle the matter appropriately.
---

Box Item

*_Gratitude_*
Anamchinni Venkateswara Rao expressed his sincere gratitude to Advocate Sangem Sudheer Kumar, High Court Advocate Yallanki Pulla Rao, senior journalist and President of the All India Journalists Association K. Koteswara Rao, all of whom provided him with legal and moral support over the past six years.
---
Box Item

*_Special Thanks to Senior Journalist Ravi Prakash_*

Anamchinni Venkateswara Rao extended special thanks to Ravi Prakash, founder of TV9, senior journalist, and head of RTV.

He stated that Ravi Prakash stood by him during difficult times like a brother sent by God and had spent several lakhs of rupees to support him financially. Venkateswara Rao remarked that such a debt of gratitude could never be fully repaid.
---
Box Item
*_Celebrations Across Telangana_*
Supporters of Anamchinni Venkateswara Rao and members of the Telangana State Welfare Association reportedly celebrated the court verdicts with fireworks and gatherings in Khammam, Warangal, Karimnagar, Nalgonda, and Hyderabad.
---
Box Item

Anamchinni Venkateswara Rao stated that he possesses clear evidence regarding certain individuals and organizational leaders who allegedly operated behind the scenes in filing cases against him. He indicated that these matters would be addressed through appropriate legal channels.

Thursday, May 28, 2026

ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్ - సీఎం రేవంత్ రెడ్డి

*ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్ - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే,మే 28:

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా,ఏ పథకం కింద,ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు.తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు.సమగ్ర సంక్షేమ కార్డ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని  ముఖ్యమంత్రి అన్నారు.ఈ డేటాను అన్ని కోణాల్లో  ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు.నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం  సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు,ఐటీ శాఖ ఆధ్వర్యంలో  సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సీఎం సూచించారు.టెక్నాలజీపై పట్టున్న,చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు.ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి,ఫీజు రీయింబర్స్‌మెంట్,కార్మిక శాఖ, విద్యా శాఖ,ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకువస్తున్న  బీమా పథకాల వివరాలు ఉండాలని చెప్పారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చేలా ఆలోచించాలన్నారు. ఇటీవల ప్రభుత్వం  నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డ్‌కు అనుసంధానించాలన్నారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు.ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని సీఎం సూచించారు ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డ్ తో  లింక్ చేయాలని చెప్పారు.కేరళ నుంచి  గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ షూటర్ ఇషా సింగ్ కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

*హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ షూటర్ ఇషా సింగ్ కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 28:

ISSF ప్రపంచ కప్-2026 షూటింగ్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి చారిత్రాత్మక విజయం సాధించిన ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మ్యూనిచ్‌లో జరుగుతున్న ISSF వరల్డ్ కప్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 43 హిట్స్ సాధించి అద్భుతమైన స్కోర్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ఇషా, సాధించిన విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్ తన అంకితభావం, క్రమశిక్షణ మరియు పట్టుదలతో లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రశంసించారు.ఆమె అద్భుతమైన ప్రదర్శన భారత క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని, భారత క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనమని అన్నారు.ఇషా సింగ్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆమె దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

Friday, May 22, 2026

తెలంగాణలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉందా ?

*కడపర్తి గ్రామ మహిళ ఆవేదన – నకిరేకల్ సి.ఐ పై కక్షపూరిత చర్యల ఆరోపణలు*

*తెలంగాణలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉందా ?*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 22:

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన బెల్లి బద్రమ్మ,భర్త సాయమల్లు కుటుంబ సభ్యులు తమపై నకిరేకల్ సి.ఐ హరిబాబు గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర డి.జి.పి, నల్గొండ ఎస్.పీ, డి.ఎస్.పీ అధికారులకు ఫిర్యాదు చేశారు.బద్రమ్మ తెలిపిన వివరాల ప్రకారం,తమ పట్టా భూమిలో ఇప్పటికే మూడు పీట్ల దారి ఇచ్చినప్పటికీ,మరింత దారి ఇవ్వాలని బెల్లి వెంకన్న మరియు వారి కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చి వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ వివాదంలో ప్రత్యర్థులతో కుమ్మక్కైన నకిరేకల్ సి.ఐ హరిబాబు తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు నెంబర్ 121/2026 నమోదు చేయించారని ఆరోపించారు. అలాగే తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోగా, ఫిర్యాదు రసీదు కూడా ఇవ్వలేదని తెలిపారు.ఈ విషయమై 15-04-2026న రిజిస్టర్ పోస్టు ద్వారా నల్గొండ జిల్లా ఎస్.పీ గారికి ఫిర్యాదు చేసినందుకు కక్ష పెట్టుకొని,తనను ఒక మహిళనని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకా తన భర్త సాయమల్లును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, “మీపై ఫిర్యాదు వచ్చింది” అంటూ ఒక రోజు మొత్తం స్టేషన్‌లో కూర్చోబెట్టి, ఫోన్ స్వాధీనం చేసుకొని మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే తొలగించి, తాము ఇచ్చిన ఫిర్యాదుపై చట్టపరమైన కేసు నమోదు చేయాలని,విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన నకిరేకల్ సి.ఐ హరిబాబు మీద శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని బెల్లి బద్రమ్మ ప్రభుత్వాన్ని కోరారు.

నిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపిన - సీఎం రేవంత్ రెడ్డి

*నిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపిన - సీఎం రేవంత్ రెడ్డి*

*2 వేల కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసిన నిమ్స్ వైద్య బృందం* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 22:

కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (#NIMS) యూరాలజీ విభాగం, 2 వేల కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. కిడ్నీ మార్పిడులలో దక్షిణ భారత దేశంలో నిమ్స్​ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లలో గుజరాత్‌లోని ఐకేడీఆర్‌సీ మొదటి స్థానంలో, లూధియానా క్రిస్టియన్ మెడికల్ కాలేజీ రెండో స్థానంలో ఉండగా, నిమ్స్ మూడో స్థానంలో ఉంది.ఈ అరుదైన మైలురాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.ఈ 2 వేల మందిలో 1,900 మంది అంటే 95 శాతం మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవడం విశేషం.2023 జనవరి నుంచి గడిచిన మూడు సంవత్సరాల నాలుగు నెలల్లోనే 500 కిడ్నీ మార్పిడులు చేసి రికార్డు సృష్టించింది.

Saturday, May 9, 2026

హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం & ఆధునీకరణ,నగరీకరణ చేయడం - సీఎం రేవంత్ రెడ్డి

*“హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం & ఆధునీకరణ,నగరీకరణ చేయడం - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 09:

ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి గారు సమావేశంలో సవివరంగా ఆవిష్కరించారు.ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఇతర సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు గారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెబుతూ, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు."హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కీలకమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్‌ల వంటి మూడు విధానాల్లో ట్రాఫిక్‌కు సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నాం.ట్రాఫిక్ నియంత్రణ కోసం కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే చేపడితే సరిపోదు. బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం” అని వివరించారు.
“తెలంగాణ రాష్ట్రాన్ని CURE, PURE, RARE విభాగాలుగా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా గుర్తించాం. ఓఆర్ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమి (PURE) ప్రాంతాన్ని ప్రధానంగా మాన్యూఫ్యాక్చర్ సెక్టార్‌గా గుర్తించాం.ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE) గా వ్యవసాయం, దానిక అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేశాం” అని చెప్పారు."రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికే ఆవిష్కరించుకున్నాం. లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నాం.
నగరంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. హైదరాబాద్‌లో ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నాం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.హైదరాబాద్ నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వం స్టాండింగ్‌ కమిటీకి విజ్ఞప్తి చేసింది.మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్‌తో పాటు ఇతర సభ్యులు అభివర్ణించారు. హైదరాబాద్ నగర జీవన స్థితిగతులను మెరుగుపరిచే మూసీ పునరుజ్జీవ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ నగర ప్రజలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును చేపట్టడంపై ఈ సందర్భంగా కమిటీ ముఖ్యమంత్రి గారిని అభినందించింది. దీంతో పాటు రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కమిటీ ప్రశంసించింది. అంతకుముందు సమావేశం ప్రారంభంలో స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులను ముఖ్యమంత్రి గారు సత్కరించారు.తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి అనుగుణంగా సమగ్ర ప్రణాళికలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్‌ను స్టాండింగ్ కమిటీ సభ్యులకు  అందజేశారు.

Thursday, May 7, 2026

ఆమె సీపీ సుమతి కాబట్టి ఎవరేం అనడంలేదు.అదే వేరే మహిళ అయ్యుంటే..?

*వస్తావా?  రేట్ ఎంత?*

*ఆమె సీపీ సుమతి కాబట్టి ఎవరేం అనడంలేదు.అదే వేరే మహిళ అయ్యుంటే..?*

*రాత్రిపూట మహిళ బయట ఉంటే, ఆమెను ఏమైనా అడిగే హక్కు తమకు ఉందనే భ్రమలో వీరు బతుకుతున్నారు...సైకాలజిస్ట్ విశేష్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 07:

మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, అంతరిక్షంలోకి వెళ్తున్నాం,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచాన్ని శాసిస్తున్నాం.కానీ, మల్కాజ్‌గిరి పోలీస్ కమీషనర్ బి.సుమతి నిర్వహించిన ఒక్క 'స్టింగ్ ఆపరేషన్' మన నాగరికత అట్టడుగున ఇంకా ఎంతటి కుళ్ళిన మనస్తత్వం దాగి ఉందో బట్టబయలు చేసింది.ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారిణి సాధారణ మహిళగా రోడ్డు మీద నిలబడితే,40 మంది మగవారు ఆమెను చుట్టుముట్టి వేధించారంటే... అది కేవలం ఒక క్రైమ్ రిపోర్ట్ కాదు; అది మన సమాజం సామూహిక మానసిక వైఫల్యం.ఈ 40 మందిలో ప్రతి ఒక్కరూ ఒక వేటగాడిలా (Predator) ప్రవర్తించడం వెనుక ఉన్న వికృత సైకాలజీని మనం లోతుగా తవ్వాల్సి ఉంది.ఒక సైకాలజిస్ట్ గా ఈ 40 మంది ప్రదర్శించిన ఆ Predatory Filth పై నా విశ్లేషణ ఇక్కడ ఇస్తున్నాను.
*1️⃣ Serial Predatory Behavior*
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే — ఆ 40 మంది ఒకే గుంపుగా లేరు.విడివిడిగా వెళ్తున్న బ్యాచ్‌లు కూడా ఆమెను చూడగానే ఒకేలా స్పందించాయి.అంటే, రాత్రిపూట తిరుగుతున్న యువతలో ఎంతమంది ఈ Objectification (స్త్రీని వస్తువుగా చూడటం) అనే మానసిక రోగంతో ఉన్నారో అర్థమవుతోంది.వీరి దృష్టిలో రాత్రిపూట ఒంటరిగా కనిపించే మహిళ ఒక మనిషి కాదు,కేవలం తమ శారీరక వాంఛలను తీర్చుకునే ఒక 'వ్యాపార వస్తువు'."రేట్ ఎంత?" అని అడిగే ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే — అది మన పితృస్వామ్య వ్యవస్థ వారికి ఇచ్చిన Unconscious License. 
ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి, గౌరవించాల్సిన పనిలేదు, ఆమెకు ఒక ధర కట్టి కొనొచ్చు అనే అహంకారం వీరి రక్తంలో ఇంకిపోయింది.
*2️⃣ The Psychology of Male Entitlement*
ఈ 40 మందిలో అత్యధికులు చదువుకున్న విద్యార్థులే కావడం అత్యంత విషాదకరం. వీరి మెదడులో ఒక ప్రమాదకరమైన Cognitive Distortion ఉంది. తాము 'మగవారం' కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే Entitlement Mindsetతో బతుకుతున్నారు.రాత్రిపూట మహిళ బయట ఉంటే, ఆమెను ఏమైనా అడిగే హక్కు తమకు ఉందనే భ్రమలో వీరు బతుకుతున్నారు.ఒక మహిళను మాటలతో లొంగదీసుకోవాలని చూడటం, ఆమెను భయపెట్టడం ద్వారా తాము 'శక్తివంతులం' అని నిరూపించుకోవాలని చూస్తారు. దీనినే సైకాలజీలో Toxic Masculinity అంటారు. అంటే తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి స్త్రీపై అధికారాన్ని ప్రదర్శించడం.
*3️⃣ ఇద్దరు ముగ్గురు కలిస్తే చాలు.. మృగం నిద్రలేస్తుంది!*
ఆ 40 మంది విడివిడిగా ఇద్దరు ముగ్గురు చొప్పున వేధించారు.దీన్ని Small Group Deindividuation' అంటారు. ఒక్కడున్నప్పుడు భయపడేవాడు కూడా, పక్కన ఇంకో స్నేహితుడు తోడవ్వగానే తన నైతికతను చంపేసుకుంటాడు.ఒకడు నీచంగా వాగితే, పక్కన ఉన్నవాడు నవ్వి ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహం వారిని మరిన్ని అసభ్య పదజాలం వాడేలా చేస్తుంది.రాత్రి చీకటి తమను గుర్తుపట్టనివ్వదు అనే ధీమా వారిని 'కవర్డ్స్' (పిరికిపందలు) నుండి 'ప్రిడేటర్స్' (వేటాడే మృగాలు) గా మారుస్తుంది.
*4️⃣ Dark Triad*
మనస్తత్వ శాస్త్రం ప్రకారం, ఇలాంటి నేరస్తులలో మూడు ప్రధాన వికృత లక్షణాలు ఉంటాయి.
*🔹 Narcissism:* తమ కోరికలే ముఖ్యం,ఎదుటివారి గౌరవం తృణప్రాయం అనే అహంభావం.
*🔹Psychopathy:* ఒక మహిళకు అంతటి నీచమైన ప్రశ్న వేస్తున్నప్పుడు కనీసం మనస్సాక్షి (Conscience) అడ్డుపడకపోవడం. ఎదుటివారి వేదన వీరికి వినోదం.
*🔹Machiavellianism:* పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని, బాధితురాలిని మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించడం.
సీపీ సుమతి గారు ఆ 40 మందికి ఇచ్చిన ట్రీట్‌మెంట్ సామాన్యమైనది కాదు. దీనిని సైకాలజీలో Cognitive Shock అంటారు."తాము ఒక 'వస్తువు' అనుకుని రేటు కట్టాలని చూసిన వ్యక్తి, తమ మెడకు బేడీలు వేసే 'అత్యున్నత శక్తి' అని తెలిసినప్పుడు వారి అహంకారం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది." "నువ్వు ఏ అమ్మాయిని చూసినా, ఆమె వెనుక ఒక సిపీ సుమతి ఉండొచ్చు అనే భయం నీ మెదడులో నిరంతరం ఉండాలి" అని ఈ ఘటన ద్వారా ఆమె సమాజానికి స్పష్టమైన ఇచ్చిన సందేశం ఇచ్చారు.ఈ భయం మాత్రమే ఇలాంటి మృగాలను అదుపులో ఉంచుతుంది. గౌరవం లేని చోట భయమైనా ఉండాలి.ఆమె సీపీ సుమతి కాబట్టి ఎవరేం అనడంలేదు. అదే వేరే మహిళ అయ్యుంటే.. "అంత అర్ధరాత్రి ఆమె అక్కడ ఎందుకు ఉంది?" అని అడిగే వెధవలు కూడా మన చుట్టూనే ఉన్నారు.మనం ఇంకా Victim Blaming దశలోనే ఉంటే, ఈ 40 మంది మృగాల కంటే మనం భయంకరమైన వాళ్ళం.హీరోయిన్ వెంటపడటమే హీరో లక్షణం అని నమ్మే పిచ్చితనం నుండి యువత బయటకు రావాలి.తోటి మనిషి బాధను పంచుకునే 'సహానుభూతి' లేని సమాజం శవాల కుప్పతో సమానం.డిగ్రీలు వస్తున్నాయి కానీ క్యారెక్టర్ రావడం లేదు. ఈ 40 మంది విద్యార్థులకు ఇప్పుడు కావాల్సింది జైలు శిక్షతో పాటు Behavioral Therapy. 
"నైట్ కు వస్తావా?" అని అడిగిన ఆ 40 మంది యువకులు మన సమాజపు 'నైతిక పతనానికి' సజీవ సాక్ష్యాలు. 
సిపీ సుమతి గారు కేవలం ఆ 40 మందిని పట్టుకోలేదు,మన కళ్లముందు ఉన్న ముసుగును తొలగించారు.ఆ బస్టాండ్‌లో ఉన్నది కేవలం ఒక అధికారిణి కాదు,ఆమె మన సమాజపు ఆత్మగౌరవం.శిక్ష పడటం వల్ల నేరస్థుడు భయపడతాడు, కానీ సరైన సంస్కారం ఉన్నప్పుడు అసలు నేరస్తుడే పుట్టడు. ఈ 40 మంది పోకిరీల ఉదంతం ప్రతి తల్లికి, తండ్రికి ఒక మేలుకొలుపు — మీ అబ్బాయిలను మనుషులుగా పెంచుతున్నారా లేక మృగాలుగా మారుస్తున్నారా?
*పునరాలోచించుకోండి!*
*సైకాలజిస్ట్ విశేష్*
Founder, Genius Matrix Hub

జూబ్లీ హిల్స్‌లోని కేబీఆర్ జాతీయ పార్కులో 'చెట్ల నరికివేత అనుమతుల'ను నిలిపివేయాలి-డాక్టర్ లుబ్నా సర్వత్

*జూబ్లీ హిల్స్‌లోని కేబీఆర్ జాతీయ పార్కులో 'చెట్ల నరికివేత అనుమతుల'ను నిలిపివేయాలి-డాక్టర్ లుబ్నా సర్వత్*

*'వృక్ష సంరక్షణ కమిటీ' అనేది ఒక బూటకపు కమిటీ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 07:
                      
జూబ్లీ హిల్స్‌లోని కేబీఆర్ జాతీయ పార్కులో 'చెట్ల నరికివేత అనుమతుల'పై హైదరాబాద్ జిల్లా కలెక్టర్,హైదరాబాద్ జిల్లా వాల్టా అథారిటీ ఛైర్‌పర్సన్,ఐఏఎస్ శ్రీమతి ప్రియాంక ఆలాతో లక్డికాపుల్, హైదరాబాద్‌లో సమావేశం అయిన అడ్వకేట్ డాక్టర్ లుబ్నా సర్వత్ నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం, ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు మాజీ సభ్యులు, 'ఎన్విరాన్‌మెంటల్ జస్టిస్' ఎడిటర్ డాక్టర్ నారాయణ రావు, పర్యావరణ కార్యకర్త ఇంజనీర్ విజయ్‌లతో కలిసి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కమ్ మేజిస్ట్రేట్ శ్రీమతి ప్రియాంక ఆలా, ఐఏఎస్‌ను ఆమె కార్యాలయంలో కలిసి, చెట్ల నరికివేతకు సంబంధించిన 'చెట్ల పరిరక్షణ కమిటీ ఆమోదాల' కాపీలతో పాటు వినతిపత్రాలను సమర్పించారు.వాల్టా చట్టం మరియు నిబంధనలను చూపిస్తూ కలెక్టర్ గారికి వివరంగా తెలియజేయడం జరిగింది. 'వృక్ష సంరక్షణ కమిటీ' అనేది ఒక బూటకపు కమిటీ అని, వారు నిరంతరం వాల్టా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అయితే, చెట్లను నరికివేయడానికి అధికారాన్ని ఇచ్చే 'వృక్ష సంరక్షణ కమిటీ' అనే నిబంధన వాల్టా చట్టంలో ఏదీ లేదని తెలియజేయడం జరిగింది.చెట్లను నరికివేయడానికి అనుమతులు ఇచ్చే అధికారం కేవలం వాల్టా అథారిటీకి మాత్రమే ఉందని, అయితే 2014 నుండి వాల్టా అథారిటీ సమావేశం ఏదీ జరగలేదని కూడా కలెక్టర్ గారికి చట్టాన్ని చూపించడం జరిగింది.ఆమె హైదరాబాద్ జిల్లా వాల్టా అథారిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నందున,కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆధారంగా మారిన చెట్ల నరికివేత కోసం ఇచ్చే నకిలీ అనుమతుల సమస్యను ఆమె తప్పక పరిష్కరించాలని కోరడం జరిగింది.జల, రెవెన్యూ, నీటిపారుదల, భూగర్భ జల శాఖ మొదలైన విభాగాల నుండి ఇతర పదవీరీత్యా సభ్యులతో పాటు, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ మరియు హెచ్‌ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ కూడా హైదరాబాద్ జిల్లా వాల్టా అథారిటీలో పదవీరీత్యా సభ్యులుగా ఉన్నారనే విషయంపై కూడా కలెక్టర్ దృష్టికి తీసుకరావడం జరిగింది. అధికారులు జీవో 539ని ఉదహరిస్తున్నారు. 11.12.2008 నుండి, శ్రీ వేద కుమార్ (ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్), శ్రీ చెలికాని (యుఫెర్వాస్) మరియు వరల్డ్ వైడ్ ఫండ్ వంటి అదే వ్యక్తుల పేర్లను 18 సంవత్సరాలుగా ఉపయోగించడం పూర్తిగా అధికార పరిధికి మించినది. ఇది ప్రజలను, న్యాయస్థానాలను, సహ-అధికారులను కూడా అక్షరాలా మోసం చేయడమే. పైన పేర్కొన్న ముగ్గురు పౌర సమాజ సభ్యులు చెట్లు నరికే అనుమతి పత్రాలపై సంతకం చేశారో లేదో తెలియదు, ఎందుకంటే ఆ అనుమతి పత్రాలు రహస్యంగా ఉంచబడ్డాయి.అభ్యర్థనలకు, ఆర్టీఐకి గానీ, లేదా బహిరంగంగా గానీ అవి అందుబాటులో లేవు అని కలెక్టర్ కు తెలియచేశారు.తాను ఈ పదవికి కొత్త అని, ఈ విషయాన్ని పరిశీలిస్తానని ఆమె బదులిచ్చారు.ప్రజలమైన మేము, పారదర్శకత, జవాబుదారీతనం మరియు స్పందన ద్వారా ప్రతి పౌరుడికి అత్యంత గౌరవం కావాలని కోరుకుంటున్నాము, ఎందుకంటే ఇక్కడ ప్రమాదంలో ఉన్నది ప్రజల డబ్బు మరియు జీవితాలు.ఇది మన ప్రజల ప్రభుత్వం మరియు పరిపాలనలోని ప్రతి స్థాయిలో, ఎక్కడైనా ప్రజల గొంతుక, చట్టబద్ధమైన పాలన మరియు సహజ న్యాయ సూత్రాలు నిలబెట్టబడాలని మేము కోరుకుంటున్నాము అని డాక్టర్ లుబ్నా సర్వత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అన్నారు.

Wednesday, May 6, 2026

కొత్త డీజీపీకి బొకే అందిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకులు

*కొత్త డీజీపీకి బొకే అందిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకులు*

*నూతన డీజీపీని కలిసిన ఓయూ విద్యార్ధి నాయకుడు: జి యుగంధర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,మే 06:

తెలంగాణ రాష్ట్ర పోలీస్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ ను ఓయూ స్టూడెంట్ లీడర్ జి యుగంధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖను సామర్ధ్యవంతంగా ముందుకు నడిపించాలని కోరారు. ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణలో మరింత మెరుగైన సేవలు అం దించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సమస్యల  పరిష్కారంలో పోలీసుల సహకారం అవసరమని క్యాంపస్ లలో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు.నూతన డిజిపి సీవీ ఆనంద్ నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ స్టూడెంట్ నాయకులు  రమేష్, వెంకట్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం విద్యుత్ శాఖ నిర్లక్ష్యం – రైతు నూక గణేష్‌కు భారీ నష్టం

*నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం విద్యుత్ శాఖ నిర్లక్ష్యం – రైతు నూక గణేష్‌కు భారీ నష్టం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 06:

నల్గొండ జిల్లా,శాలిగౌరారం మండలం, పెర్కకొండారం గ్రామానికి చెందిన కోళ్ళ ఫాం రైతు నూక గణేష్ గారు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. గత ఆదివారం వచ్చిన ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కానీ అడ్లూర్ పరిధిలో ఉన్న లైన్మెన్ నిర్లక్ష్యం, సంబంధిత విద్యుత్ అధికారుల స్పందన లోపం కారణంగా గంటలు కాదు... రోజులు గడిచినా కరెంటు పునరుద్ధరణ జరగలేదు.దీంతో కోళ్ల ఫామ్‌లో తాగునీరు అందక, సుమారు 320 కోళ్లు మృతి చెందడం అత్యంత దురదృష్టకరం మాత్రమే కాదు — ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. రైతు కష్టాన్ని అర్థం చేసుకోని వ్యవస్థ వైఫల్యం ఇది.
శాలిగౌరారం మండలం వ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉంది. లైన్మెన్లు తమ విధులు నిర్వర్తించకుండా, ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని పనులు చేయించడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది. గ్రామాల్లో కరెంటు సమస్యలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి.ఈ విషయంపై శాలిగౌరారం ఏఈ గారిని, నల్లగొండ డీఈ గారిని సంప్రదించినప్పటికీ సరైన స్పందన లేకపోవడం అత్యంత విచారకరం. బాధ్యతల నుండి తప్పించుకోవడం కాదు — ప్రజల సమస్యలపై స్పందించడం అధికారుల ప్రథమ కర్తవ్యం.
•ప్రజల డిమాండ్లు:
-కోళ్ళ మృతి చెందిన ఘటనపై తక్షణ విచారణ చేపట్టాలి.
-రైతు నూక గణేష్ గారికి పూర్తి నష్టపరిహారం వెంటనే అందించాలి.
-నిర్లక్ష్యం చేసిన ఏఈ, లైన్మెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-మండలంలో విద్యుత్ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించి, అత్యవసర సేవలను బలోపేతం చేయాలి.
ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం తప్పదని హెచ్చరిస్తున్నాము.
“రైతు నష్టం – ప్రభుత్వ నిర్లక్ష్యం… ఇక సహించేది లేదు!”

*హైడ్రా ప్ర‌జావాణికి 4 వారాల విరామం*

*హైడ్రా ప్ర‌జావాణికి 4 వారాల విరామం*

*పెండింగ్ ఫిర్యాదుల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు*

బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే, మే 06:

ప్ర‌జావాణికి 4 వారాల పాటు విరామాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారు ప్ర‌క‌టించారు.  వేలాదిగా వ‌చ్చిన‌ ఫిర్యాదుల‌ను ప్రాధాన్య క్ర‌మంలో ప‌రిష్క‌రిస్తున్నామ‌ని.. మిగిలి ఉన్న‌వి కూడా క్లియ‌ర్ చేసేందుకే 4 వారాలు విరామాన్నిచ్చిన‌ట్టు బుధ‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జూన్ 8వ తేదీ నుంచి య‌థావిధిగా హైడ్రా ప్ర‌జావాణి కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జావాణితో పాటు.. వివిధ రూపాల్లో వ‌చ్చిన ఫిర్యాదుల‌న్నీ క్లియ‌ర్ చేయాల‌నే ఉద్దేశంతోనే ఈ విరామ‌న్ని ప్ర‌క‌టించిన‌ట్టు తెలిపారు. అయితే గ‌తంలో ఇచ్చిన ఫిర్యాదుదారులు అత్య‌వ‌స‌ర‌మ‌ని భావిస్తే కార్యాల‌యానికి వ‌చ్చి నేరుగా క‌ల‌వ‌చ్చ‌న్నారు. అలాగే ముఖ్య‌మైన స‌మ‌స్య‌లున్నా నేరుగా కార్యాల‌యానికి వ‌చ్చి ఫిర్యాదు చేయ‌వ‌చ్చున‌ని తెలిపారు.

Wednesday, April 15, 2026

ప్రజలు మరియు న్యాయ వ్యవస్థ అనవసరంగా ఇలాంటి సమస్యల్లో ఇరుక్కుపోతున్నారా?

*ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ & హిమాయత్ సాగర్ రిజర్వాయర్ లను పరిరక్షించుకుందాం*

*కేసు శీర్షిక*: *డా. లుబ్నా సర్వత్ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం – ఉస్మాన్ సాగర్ త్రాగునీటి రిజర్వాయర్ & హిమాయత్ సాగర్ త్రాగునీటి రిజర్వాయర్.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఏప్రిల్ 15:

ఈరోజు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ రిజర్వాయర్లపై జరిగిన విచారణలో, (1) FTL మ్యాపులలో మార్పులు (tampering) మరియు (2) రిజర్వాయర్లలో అధికారికంగా గుర్తించిన వందలాది ఆక్రమణల అంశాలపై, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (చెన్నై) తెలంగాణ రాష్ట్ర ప్రతివాదులను 1950కి ముందున్న అసలు మ్యాపులు మరియు తాజా మ్యాపులను సమర్పించాలని ఆదేశించింది.
పిటిషనర్ బెంచ్ దృష్టికి తీసుకువచ్చిన విషయమేమిటంటే, HMWSSB RTI ద్వారా ఇచ్చిన FTL మ్యాప్‌లో ఉస్మాన్ సాగర్ విస్తీర్ణం 6,335 ఎకరాలు అని చూపించగా, HMDA వెబ్‌సైట్‌లో ఉన్న మ్యాప్‌లో అది 6,039 ఎకరాలుగా చూపించబడింది.అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సవరణ జరగలేదు.
రెండవది, అధికారిక మ్యాప్‌లో గుర్తించిన వందలాది ఆక్రమణలు ఇప్పటికీ తొలగించబడలేదని, అంతేకాకుండా FTL పరిధినే తగ్గిస్తున్నారని పిటిషనర్ తెలిపారు.రాష్ట్ర ప్రతివాదులు HYDRAను కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని అభ్యర్థించారు. దీనిపై పిటిషనర్ స్పష్టం చేసినది ఏమిటంటే, ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు HMWSSB ఆధీనంలోనే ఉన్నాయని, అలాగే మంజీరా, ఎల్లంపల్లి వంటి ఇతర రిజర్వాయర్లు కూడా అదే సంస్థ పరిధిలోనే ఉన్నాయని తెలిపారు.
మనకు ఒక స్పష్టత అవసరం ఉంది: HMWSSB, HMDA, GHMC వంటి అధికార సంస్థల పాత్ర ఏమిటి? ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను HYDRAపై మళ్లించాలనుకుంటే, ఇది అధికార పరిధుల మధ్య పొరపాట్లకు (overlapping) సంకేతమా?
ప్రజలు మరియు న్యాయ వ్యవస్థ అనవసరంగా ఇలాంటి సమస్యల్లో ఇరుక్కుపోతున్నారా?
ధన్యవాదాలు,
అడ్వకేట్ డా. లుబ్నా సర్వత్
సామాజిక కార్యకర్త & పర్యావరణ ఆర్థిక శాస్త్రవేత్త
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, హైదరాబాద్

Tuesday, April 14, 2026

*Save Musi Movement*

https://x.com/i/status/2043945729509724360

*_మీడియా టుడే :జాతీయ తెలుగు దినపత్రిక_*

*Participate In Our Email Campaign* 🚨

*@MusiProject @HRF_Humanrights*

Telangana Government is Planning to Destroy 55 kms of Musi River Bank On The Name of River Front Development & Beautification. 

*Until 15th April Govt is Taking Public Opinion on this Project* ⌛ so Kindly Requesting You all to Please Use the Link Below and Participate in Our E-mail Campaign 👇🏻
letindiabreathe.org/v2/SaveMusiRiv… 🔗🔗🔗

*In Solidarity*
*Save Musi Movement*

*Cc: @RahulGandhi @priyankagandhi @PIB_India @PTI_News @MNatarajanINC @LubnaSarwath @Bmaheshgoud6666 @KVishReddy @INC_Ponguleti @KTRBRS @sravandasoju @AkbarOwaisi_MIM @N_RamchanderRao @NAPM_Telangana @GHMCOnline @HMDA_Gov @IPRTelangana @PrlsecyMAUD @Eatala_Rajender @HydREGuide @swachhhyd*

https://www.facebook.com/share/p/1BugcjkE82/
                    *****
https://www.instagram.com/p/DXGl9vyippo/?igsh=MWk3ZjVmaHE5YTlidQ==

Monday, April 13, 2026

అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు....

https://x.com/i/status/2043895258325676363

*#AmbedkarJayanti  #BhimJayanti*

*_"నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనం హృదయాల్లో నిలిచిపోతావు."ఈ ప్రత్యేకమైన రోజున,డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాన్ని గౌరవిస్తూ,న్యాయం మరియు సమానత్వంపై ఆధారపడిన సమాజం కోసం కృషి చేద్దాం.అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు.... Bplkm✍️_*

*@ambedkar_center*
*@IPRTelangana @IPR_AP @PIB_India @PTI_News*

https://www.facebook.com/share/p/1AqxP8ccFe/

_మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్ - ప్రజాభిప్రాయ సేకరణకు స్పందనగా బాపట్ల కృష్ణమోహన్ లేఖ_

*మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్ - ప్రజాభిప్రాయ సేకరణకు స్పందనగా బాపట్ల కృష్ణమోహన్ లేఖ*

*మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్ పై అధికారిక అభ్యంతరాలు*

*శాస్త్రీయ పర్యావరణ నివేదికలు మరియు బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కోసం డిమాండ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఏప్రిల్ 13:

గౌరవనీయులైన మంత్రుల
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MRDCL)
యాజమాన్యానికి,

అయ్యా/అమ్మ,
ప్రభుత్వం ఏప్రిల్ 15, 2026 వరకు గడువు ఇచ్చిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రజాభిప్రాయ సేకరణకు స్పందనగా ఈ లేఖను రాస్తున్నాను. మూసీ నది ప్రక్షాళన మరియు పునరుజ్జీవనం అవసరమని మేము గుర్తిస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను సేకరించే విధానం అసంపూర్ణంగా ఉందని మరియు దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని మేము భావిస్తున్నాము.
వేల కోట్ల రూపాయల విదేశీ రుణాలు, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మరియు వేల కుటుంబాల స్థానభ్రంశంతో ముడిపడి ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై కేవలం ఈమెయిల్ అభిప్రాయాలతో ముందుకు వెళ్లడం సరైన పద్ధతి కాదు. ఈ సందర్భంగా ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను:
1. EIA నివేదికను బహిర్గతం చేయాలి:
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నవంబర్ 2025లోనే 'టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్' (ToR) మంజూరయ్యాయని మాకు తెలిసింది. అంటే, దీనిపై పర్యావరణ ప్రభావ అంచనా (EIA) అధ్యయనం జరగాల్సి ఉంది. ప్రాజెక్ట్ వల్ల కలిగే పర్యావరణ మరియు జీవనోపాధి నష్టాల గురించి పూర్తి స్థాయి శాస్త్రీయ నివేదిక (EIA Report), మ్యాపులు మరియు హైడ్రోలాజికల్ డేటాను ప్రజల ముందు ఉంచకుండా అభిప్రాయాలు కోరడం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది.
2. చట్టబద్ధమైన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ (Public Hearing):
ప్రస్తుతం జరుగుతున్న ఈమెయిల్ ప్రక్రియ చట్టబద్ధమైన 'పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ'కు ప్రత్యామ్నాయం కాజాలదు. ప్రభుత్వం అధికారికంగా బాధితుల మరియు నిపుణుల సమక్షంలో బహిరంగ విచారణ నిర్వహించి, ప్రాజెక్ట్ వల్ల కలిగే లాభనష్టాలను వివరించాలి. అప్పుడే ప్రజలు ఇచ్చే అభిప్రాయాలకు ఒక విలువ ఉంటుంది.
3. సుందరీకరణ కంటే నది ఆరోగ్యం ముఖ్యం: కేవలం పర్యాటకం మరియు ఆదాయం కోసం చేసే "సుందరీకరణ" (Beautification) కంటే నదిని కాలుష్య రహితంగా మార్చడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. 2019 నాటి CSIR-NEERI కార్యాచరణ ప్రణాళికలో సూచించిన 21 కొత్త మురుగునీటి శుద్ధి ప్లాంట్లను (STPs) వెంటనే నిర్మించి, మూసీలోకి మురుగునీరు చేరకుండా చూడటమే అసలైన పునరుజ్జీవనం.
4. ప్రజలే అసలైన భాగస్వాములు: మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలు ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన భాగస్వాములు. వారిని "అక్రమ కట్టడాలు"గా చూడకుండా, వారి అవసరాలను మరియు హక్కులను గౌరవించే విధంగా ముఖాముఖి సంప్రదింపులు జరపాలి. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కంటే సామాన్య ప్రజల జీవనోపాధికే పెద్దపీట వేయాలి.
ముగింపు మరియు విన్నపం:
ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏమిటంటే:
● వెంటనే పూర్తి స్థాయి EIA నివేదికను మరియు ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
● ఈ అశాస్త్రీయ ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేసి, ప్రభావిత ప్రాంతాల్లో అధికారికంగా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ (Public Hearings) నిర్వహించాలి.
● మూసీ నది సుందరీకరణ/కాంక్రీటీకరణ (Concretization) ప్రాజెక్ట్‌ను తిరస్కరిస్తూ, కేవలం నది ప్రక్షాళన మరియు పర్యావరణ పునరుద్ధరణ (Ecological Restoration) ప్రక్రియను మాత్రమే ఆమోదించాలని కోరుతున్నాను.
సమాచారం లేకుండా తీసుకునే అభిప్రాయాలు ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధం. కావున పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను.

భవదీయులు,
బాపట్ల కృష్ణమోహన్,
సామజిక కార్యకర్త,
మానవ హక్కుల బాద్యులు,
జర్నలిస్ట్