Tuesday, March 29, 2022

వాట్సాప్ కంటే టెలిగ్రాం ఎందుకు బెస్ట్…?

వాట్సాప్ కంటే టెలిగ్రాం ఎందుకు బెస్ట్…?

Courtesy by : తొలివెలుగు మీడియా website

ఈ రోజుల్లో వాట్సాప్ లేని ఫోన్ లేదు అనే మాట వాస్తవం. కేవలం వాట్సాప్ కోసమే ఫోన్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో వాట్సాప్ వాడకం తగ్గడం టెలిగ్రాం సహా మరికొన్ని యాప్స్ వాడకం అనేది క్రమంగా పెరిగింది. అయితే వాట్సాప్ కంటే టెలిగ్రాం చాలా బెస్ట్ అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.

Telegram Now Lets You Transfer WhatsApp Chat History Without Losing Photos & Videos

ప్రైవసీ విషయంలో వాట్సాప్ కంటే కూడా పటిష్టంగా ఉంటుంది ఈ యాప్. మీ ఫోన్ నంబర్ ఎవరికీ కనపడకుండా కూడా ఇది వాడుకునే అవకాశం ఉంది. గ్రూప్స్ లో నెంబర్ కనపడటం అనేది ఎప్పటికి అయినా ప్రమాదమే. కాని ఈ యాప్ లో గ్రూప్స్ లో నెంబర్ లు కనపడకుండా కంట్రోల్ చేయవచ్చు. ఒక గ్రూప్ లో జాయిన్ అయితే మాత్రం గత మెసేజ్ లు చూడవచ్చు. గ్రూప్ లో గరిష్ట సభ్యుల సంఖ్య 2,00,000 మంది ఉండవచ్చు.

WhatsApp vs Telegram feature by feature comparison - Dignited

కాని వాట్సాప్‌లో మాత్రం 256. గ్రూప్ లో మన నెంబర్ కనపడకుండా కంట్రోల్ చేయవచ్చు. గ్రూప్ లో పంపిన మెసేజ్ లు ఎప్పుడైనా ఎడిట్ చేయవచ్చు లేదా రిమూవ్ చేయవచ్చు. మెసేజ్ ను పిన్ చేసే ఆప్షన్ గ్రూప్స్ లో ఉంటుంది. 1.5 GB వీడియో లు పంపే అవకాశం ఉంది. ఇంటర్నెట్ లింక్స్ ను అందులోనే ఓపెన్ చేయవచ్చు. పోల్స్ కూడా ఇందులో పెట్టె అవకాశం ఉంది. ఇక టెలిగ్రాం పూర్తిగా ఉచితం. వాట్సాప్ మాదిరిగా అమ్ముడుపోలేదు అంటారు నిపుణులు

వెంకయ్యే కాబోయే రాష్ట్రపతి అంటూ వార్తలు – వదంతులేనని ఖండించిన ఉపరాష్ట్ర పతి కార్యాలయం

వెంకయ్యే కాబోయే రాష్ట్రపతి అంటూ వార్తలు – వదంతులేనని ఖండించిన ఉపరాష్ట్ర పతి కార్యాలయం

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ప్రతిపాదించారంటూ వస్తున్న వార్తల్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. ఉదయం నుంచి సోషల్మీడియాలోనూ, పలు మీడియా చానళ్లలోనూ ఈ వార్త హల్ చల్ చేసింది. అయితే అవన్నీ వదంతులేనని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. 2022 నాటికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. శరద్ పవార్, మాయావతి, గులాంనబీ ఆజాద్ లు రాష్ట్రపతి రేసులో ఉన్నారని మొన్నటివరకు చర్చ నడిచింది.

Monday, March 28, 2022

టీఎస్ ఎంసెట్ ....2022 నోటిఫికేషన్...... విడుదల!

*టీఎస్ ఎంసెట్ ....2022 నోటిఫికేషన్...... విడుదల!*

హైదరాబాద్: టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్‌ను ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారమని కన్వీనర్ పేర్కొన్నారు.కేటగిరిల అభ్యర్థులు రూ. 800 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ తెలిపారు. ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 800, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అగ్రికల్చర్, మెడికల్ పరీక్షను జూన్ 14, 15వ తేదీల్లో, నిర్వహిస్తామన్నారు. ఇంజినీరింగ్ ఎగ్జామ్‌ను 18, 19, 20వ తేదీల్లో నిర్వహిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

నయీమ్ కేసులో ఐటీ శాఖ దూకుడు.....!

*నయీమ్ కేసులో ఐటీ శాఖ దూకుడు.....!*

హైదరాబాద్: నయీమ్ కేసులో ఐటీ శాఖ దూకుడు పెంచింది. బినామీ ఆస్తులను ఐటీ అధికారులు సీజ్ చేశారు. రూ. 150 కోట్ల విలువైన 10 ఆస్తులను సీజ్ చేశారు.గతంలో విచారణ చేసిన పోలీస్ అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకుని అధికారులు చర్యలు చేపట్టారు. నయీమ్ భార్య హాసినికి నోటీసులు జారీ చేశారు. 45 ఆస్థుల్లో 10 ఆస్తులను సీజ్ చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

దారుణ ఘటన.. బీజేపీకి సపోర్టు చేయడమే శాపమైంది..!

కుషీనగర్‌లోని రామ్​కోలా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కథ్ఘార్హీ గ్రామంలో బాబర్ అనే ముస్లిం యువకుడు మోదీకి వీరాభిమాని. ఈ క్రమంలో యూపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశాడు. ఇక ఈ ఎన్నికల్లో రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాబర్ సంతోషంగా స్వీట్లు పంచాడు.అయితే, ఇది చూసి సహించలేని ఇరుగు పొరుగు వారు బాబర్‌ను మార్చి 20న చుట్టుముట్టి చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన అతడిని కుటుంబసభ్యులు రామ్​కోలా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమించడం వల్ల లఖ్నోలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ బాబర్ చనిపోయాడు.

కాగా, బీజేపీకి సపోర్ట్ చేయవద్దని బాబర్‌ను పలుమార్లు అదే సామాజికవర్గానికి చెందిన వారు హెచ్చరించారు. చంపుతామని బెదిరించారు. అయితే ఈ బెదిరింపులపై గతంలో బాబార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని బాబర్ సోదరుడు అలాం అన్నారు. కలెక్టర్​ను కూడా కలిసిననట్లు పేర్కొన్నారు. బాబర్.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పీఎన్ పాఠక్​ కోసం ప్రచారం చేసినట్లు వివరించారు.

బాబర్ మరణ వార్త తెలిసిన అనంతరం పాఠక్​ అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.


Sunday, March 27, 2022

Hyderabad fourth most polluted city in India, says World Air Quality report

Hyderabad fourth most polluted city in India, says World Air Quality report

Telangana's capital, Hyderabad, was found to be the fourth-worst polluted city in India, seeing a concerning rise in particulate matter (PM 2.5) levels in 2021.

Courtesy by : INDIA TODAY web Desk
Hyderabad fourth most polluted city in India, says World Air Quality report
Hyderabad is ranked fourth after Delhi, Kolkata and Mumbai. (File photo/AFP)
Telangana's capital, Hyderabad, was found to be the fourth-worst polluted city in India, seeing a concerning rise in particulate matter (PM 2.5) levels from 34.7 ug/m3 in 2020 to 39.4 ug/m3 in 2021, according to the World Air Quality Report 2021 by IQAir.

Hyderabad was ranked fourth after Delhi, Kolkata and Mumbai. The report has analysed 6,475 cities in 117 countries.

While not mentioning specifically what has led to the rise in particulate pollution in Hyderabad, the report suggests India’s rising vehicular pollution is the culprit.

“It is estimated that 20% to 35% of total urban PM2.5 concentrations is directly or indirectly due to internal combustion engines in motor vehicles. Annual vehicle sales in India are expected to increase, with an estimated fleet number reaching 10.5 million in 2030,” the report notes.

Though the average PM 2.5 during 2021 was 39.4 g/m3, it touched as high as 68.4 g/m3 during December. July was relatively better with PM 2.5 hovering in the 12 g/m3 range. However, even the lowest of 12 g/m3 is twice the value of 5 g/m3 — the permissible limit set by the World Health Organisation (WHO).

While the city did record a declining trend in PM 2.5 between 2017 and 2020, perhaps due to green drive and strict automobile emission norms, it began to rise in 2021.

Small particles (PM 2.5) pose the greatest risk to human health. While the nose can filter most coarse particles, fine and ultrafine particles are inhaled deeper into the lungs where they can be deposited or even pass into the bloodstream," the report warned



సుప్రీం మెట్లెక్కిన ఉక్రెయిన్ విద్యార్థులు

సుప్రీం మెట్లెక్కిన ఉక్రెయిన్ విద్యార్థులు

Courtesy by : తొలివెలుగు మీడియా website

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ఇటీవల కేంద్రం ఆపరేషన్ గంగా చేపట్టింది. అందులో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఇండియాకు తీసుకు వచ్చింది.

తాజాగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. ఉక్రెయిన్ లో పరిస్థితులు ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని తమకు ఇండియాలోనే చదువుకునే అవకాశం ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.

ఈ మేరకు ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణ, ఏపీ, కేరళ రాష్ట్రాలకు చెందిన వైద్య విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.భారత్ లోనే తమ విద్యను పూర్తి చేసేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును వారు కోరారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడులు 32 వ రోజుకు చేరుకున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పశ్చిమ నగరమైన లైవీవ్ పై నగరంపై రష్యా ఆదివారం నాలుగు క్షిపణి దాడులు చేసింది.

అమెరికాలో కేటీఆర్ పర్యటన.. ఆ సంస్థల ప్రతినిధులతో భేటీ

అమెరికాలో కేటీఆర్ పర్యటన.. ఆ సంస్థల ప్రతినిధులతో భేటీ

Courtesy by : తొలివెలుగు మీడియా website

https://twitter.com/MinisterKTR/status/1507612070535041033?t=iWz8_jvEwCNUk2-PJd-CqQ&s=19

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ పనిచేస్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఐటీ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేశారు.

టాప్ 15లో మూడు భారత నగరాలు

టాప్ 15లో మూడు భారత నగరాలు

Courtesy by : తొలివెలుగు మీడియా website

శబ్ధ కాలుష్యం పరంగా పలు నగరాలకు ర్యాంకులు కేటాయిస్తూ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం…

ప్రపంచంలోనే అత్యంత ధ్వని కాలుష్యం గల నగరంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా(119 డెసిబెల్స్) నిలిచింది. ఆ తర్వాత స్థానంలో యూపీకి చెందిన మొరాదాబాద్ (114 డెసిబెల్స్) ఉంది.

ఇక మూడో స్థానంలో పాకిస్తా్న్ రాజధాని ఇస్లామాబాద్ (105 డెసిబెల్స్) ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఇక టాప్ మూడు స్థానాల్లో దక్షిణ ఆసియా నుంచి ఉండటం గమనార్హం.

ఇక ప్రపంచంలోనే అత్యంత ధ్వని కాలుష్యం గల టాప్ 61 నగరాల జాబితాలో భారత నగరాలు ఢిల్లీ(83), కోల్ కతా(89), అసన్ సోల్ (89), జైపూర్(84) లు ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత శబ్ద కాలుష్యం గల 15 నగరాల్లో భారత్ కు చెందిన మూడు నగరాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జోర్డాన్ దేశానికి చెందిన ఐర్బిడ్ (60 డెసిబెల్స్), ఫ్రాన్స్ లియాన్(69 డెసిబెల్స్), స్విడన్ రాజధాని స్టాక్ హోమ్(70) అతి తక్కువ శబ్ధ కాలుష్యం గల నగరాలుగా నిలిచాయి.

పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ … తండ్రి కూతురు మృతి

పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ … తండ్రి కూతురు మృతి

Courtesy by : తొలివెలుగు మీడియా website

తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వేలూరు జిల్లా అల్లాపురంలో ఎలక్ట్రిక్ స్కూటర్ పెలింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు మరణించారు.

మృతులను దురై వర్మ(49), మోహనా ప్రీతిలుగా పోలీసులు గుర్తించారు. దురై వర్మ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మోహనా ప్రీతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.

ఘటన వివరాల్లోకి వెళితే… తిరువణ్ణ మలైలో రెండు రోజుల క్రితం ఎలక్ట్రిక్ స్కూటర్ ను దురై వర్మ కొనుగోలు చేశారు. శుక్రవారం సాయంత్రం స్కూటర్ లో బ్యాటరీ డౌన్ అయింది.దీంతో స్కూటర్ కు దురై మళ్లీ చార్జింగ్ పెట్టారు. కొద్ది సేపటి తర్వాత ఛార్జింగ్ అయిందో లేదా చూద్దామని స్కూటర్ దగ్గరు తండ్రీ కూతురు వచ్చారు. ఇంతలో అకస్మాత్ముగా స్కూటర్ పేలిపోయింది.దీంతో సమీపంలో ఉన్న మరో రెండు బైకులకు నిప్పు అంటుకుంది. బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వారిద్దరూ బాత్ రూంలో దాక్కుకున్నారు.కానీ పెద్ద ఎత్తున పొగలు ఇళ్లంతా వ్యాపించాయి. దీంతో వారిద్దరూ ఊపిరాడక మరణించారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Friday, March 25, 2022

పోరాటాలకు సిద్ధమైన కాంగ్రెస్....... టీపీసీసీ సమావేశంలో కీలక నిర్ణయం

*పోరాటాలకు సిద్ధమైన కాంగ్రెస్....... టీపీసీసీ  సమావేశంలో కీలక నిర్ణయం*

హైదరాబాద్‌: ఛార్జీల పెంపుపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది.ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని పీసీసీ వర్కింగ్‌ కమిటీ ఆర్గనైజింగ్‌ ఇన్‌ఛార్జి మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ జూమ్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అండగా ఉండే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఉద్యమించి రైతులకు న్యాయం జరిగేలా క్షేత్ర స్థాయి పోరాటాలు చేయాలని నిర్ణయించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు పేర్కొన్నారు.

విద్యుత్‌ ఛార్జీల పెంపు పేదలకు గుదిబండగా మారిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జీలు పెంచుతూ వారే ఒకరిపై ఒకరు పోరాటాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ క్రియాశీల ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. ప్రజలకు కాంగ్రెస్‌ హయాంలో ఉన్న ధరలు, ఇప్పటి ధరలు తెలియజేసి వారిని చైతన్య పరచాలని నేతలు అభిప్రాయపడ్డారు. 111 జీవోపై నిపుణులతో అధ్యయన కమిటీ వేయడంతో పాటు, పోరాటం చేయాలని నిర్ణయించారు. దళితబంధు పథకంలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్రామస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండటంతో ఎంపీలు సమావేశానికి హాజరుకాలేక పోయారని నేతలు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్‌, రేణుకాచౌదరి, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, సీనియర్‌ ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ పై కేసు నమోదు చేసిన..... ఏసీబి

*రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ పై కేసు నమోదు చేసిన..... ఏసీబి*

రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ అర్షద్ అలీ పై అవినీతి నిరోధక శాఖ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.అర్షద్ అలీ కోటీ 87 లక్షల అక్రమ ఆస్తులు కలిగి వున్నారని అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. అధికారులు చేసిన తనిఖీల్లో లక్ష రూపాయల నగదు, కోటీ 28 లక్షల విలువైన స్థిరాస్తులు, 328 గ్రాముల బంగారం, 24 లక్షల విలువైన రెండు కార్లు, 5 లక్షల విలువైన రెండు బైక్‌లు, బ్యాంకులో 21 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవలే అర్షద్ అలీ లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు.

link Media ప్రజల పక్షం🖋️ 

తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు......డీజీపీ

*తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు......డీజీపీ*

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటుచేస్తున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సొసైటీ ద్వారా పోలీసు కుటుంబాలకు అవసరమైన సహాయం చేస్తామని అన్నారు.
పోలీసుల సంక్షేమం కోసమే వెల్ఫేర్‌ సొసైటీని ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. పోలీసుల్లో కొవిడ్‌ మృతుల కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. కాగా తెలంగాణలో సీసీ టీవీల నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తున్నట్టుకూడా డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

link Media ప్రజల పక్షం🖋️ 

నేరస్థులకు కునుకులేకుండా చేస్తోంది – రేపిస్టులనూ పట్టిస్తోంది – యూపీలో బుల్డోజర్లు ఏం చేస్తున్నాయో తెలుసా?

నేరస్థులకు కునుకులేకుండా చేస్తోంది – రేపిస్టులనూ పట్టిస్తోంది – యూపీలో బుల్డోజర్లు ఏం చేస్తున్నాయో తెలుసా?

Courtesy by : MyIndMedia Twitter

బుల్డోజర్ . యూపీ ఎన్నికల్లో మార్మోగిన పేరిది. యోగీ ఆదిత్యనాథ్ మళ్లీ అధికారంలోకి రావడంలో బుల్డోజర్ కూడా కీలకపాత్రే పోషించిందని చెప్పవచ్చు. ఆక్రమణలు, అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో తొలగించడం ద్వారా నేరగాళ్ల గుండెల్లో నిద్రపోయారు యోగీ. అదే సమయంలో ఆయన్ని అభిమానులు ముద్దుగా బుల్డోజర్ బాబా అనీ పిలుచుకోవడం మొదలైంది.

యూపీలో యోగీ హయాంలో ఈ బుల్డోజర్ చేస్తున్న పనులెన్నో. ఇక గతవారం కొందరు దుండగులు ట్రక్ నిండా 35 లక్షల ఇనుపరాడ్ ను దొంగిలించారు. ట్రక్కుతో పాటే ఓ గోడౌన్ లో దాచారు. దుకాణదారు ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు. ముందుగా ఒకతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు అక్కడికివెళ్లారు. అయితే గోడౌన్ కు లాక్ చేసి ఉండడంతో… ప్రహారీ గోడను బుల్డోజర్ సాయంతో ధ్వంసం చేశారు పోలీసులు. అందులో ఉన్న ఇనుపరాడ్ ను ట్రక్కు సహా స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రతాప్ గఢ్ పోలీసులు కూడా ఓ అత్యాచారం కేసులో నిందితుడినీ పట్టుకునేందుకు బుల్డోజర్ ను వాడారు. నిందితుడి ఇంటిముందు ఆ భారీ వాహనాన్ని నిలిపి అతను లొంగిపోకుంటే ఇంటిని ధ్వంసం చేస్తామని భయపెట్టారు. దీంతో విధిలేని స్థితిలో నిందితుడు పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఇలా బుల్డోజర్ బాబా ఏలికలో ఆ భారీ వాహనం చేస్తున్న మంచిపనులు ఎన్నో ఎన్నెన్నో.

Thursday, March 24, 2022

సిటీ, జనులకు షాక్......బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు!

,*సిటీ, జనులకు షాక్......బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు!*

హైదరాబాద్‌: డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్నిరకాల బస్‌పాస్‌ చార్జీలను ఆర్టీసీ పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి.జనరల్‌ బస్‌ టికెట్‌ (జీబీటీ) పాసులు భారీగానే పెరిగాయి. ఈ కేటగిరీలో ఆర్డినరీ పాస్‌ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెరిగింది.

ఎన్‌జీఓ బస్‌పాస్‌లకు సంబంధించి.. ఆర్డినరీ పాస్‌ చార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్‌-ఆర్టీసీ కోంబో టికెట్‌ చార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది. ఇటీవలే సేఫ్టీ సెస్‌ పేరుతో టికెట్‌పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్‌ చేయటంతో గరిష్టంగా టికెట్‌ ధర రూ.5 మేర పెరిగింది. గతం లో రౌండాఫ్‌ ధర కాస్త ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో దాన్ని తగ్గించిన ఆర్టీసీ మళ్లీ పాత ధరలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. తాజాగా బస్‌పాస్‌ చార్జీలను సవరించింది. అసలైన ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన ప్రస్తుతం సీఎం వద్ద పెండింగులో ఉంది. ఆయన అనుమతిస్తే అవి కూడా పెరగనున్నాయి.

link Media ప్రజల పక్షం🖋️ 

Wednesday, March 23, 2022

టెట్ వ్యాలిడిటీ ఇక జీవితకాలం......!

*టెట్ వ్యాలిడిటీ ఇక జీవితకాలం......!*

*హైదరాబాద్‌.....*
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే టెట్‌ మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు, చేర్పులకు కూడా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. టీచర్‌ పోస్టుల భర్తీ కంటే ముందు టెట్‌ను నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో 2017 తర్వాత ఇప్పటివరకు టెట్‌ జరగలేదు. టెట్‌ పేపర్‌-1 పాసైన అభ్యర్థులు సుమారు 70 వేల మంది ఉన్నారు. అలాగే పేపర్‌-2లో అర్హత సాధించిన అభ్యర్థులు మరో లక్షమంది వరకు ఉన్నారు. టెట్‌ అర్హత లేని అభ్యర్థులు సుమారు 3లక్షల మంది వరకు ఉంటారు. వీరిలో 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసినవారు కూడా ఉన్నారు. అలాగే.. టెట్‌లో తాజాగా కొన్ని మార్పులు చేశారు. ఇంతకుముందున్న పద్ధతి ప్రకారం డిప్లొమా (డీఎడ్‌) చేసిన అభ్యర్థులు టెట్‌ పేపర్‌-1, బీఎడ్‌ చేసినవారు టెట్‌ పేపర్‌-2 పరీక్షలు రాయడానికి అర్హులు.

అయితే నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు పేపర్‌-1 పరీక్షలు రాయడానికి కూడా అర్హులవుతారు. అలాగే టెట్‌ వ్యాలిడిటీ ఇక నుంచి జీవితకాలం ఉంటుంది. ఒకసారి టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. దాని ఆధారంగా ఎప్పుడైనా టీచర్‌ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. ఈ నిర్ణయం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి వర్తించనుంది. గతంలో టెట్‌ వ్యాలిడిటీ 7 సంవత్సరాలు ఉండేది. టెట్‌ రాయడానికి ఇంటర్మీడియట్‌, డిగ్రీ కోర్సుల్లో అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు 45శాతం మార్కులు అవసరం. కాగా.. టెట్‌ను జూన్‌లో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మే నెల చివరి వారం లేదా జూన్‌ మొదటి వారంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. మే చివరివారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే టెట్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు. మొత్తం టెట్‌ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

ఫోన్ చార్జింగ్ 100 శాతం ఉండటం మంచిది కాదా…?

ఫోన్ చార్జింగ్ 100 శాతం ఉండటం మంచిది కాదా…?

Courtesy by : తొలివెలుగు మీడియా website

స్మార్ట్ ఫోన్ వాడకం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాం. చార్జింగ్ అయిపోతుందనే భయం మనను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. సోషల్ మీడియా సహా యూట్యూబ్ వీడియోలు అలాగే సినిమాలు చూడటానికి వాడే యాప్స్ తో ఫోన్ చార్జింగ్ ఆగడం లేదు. అయితే ఫోన్ కి ఎప్పుడూ వంద శాతం చార్జింగ్ ఉండాలి అనుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది.

ఫోన్ లో 80 శాతం చార్జింగ్ ఉన్నా సరే వంద శాతం ఉండాలని పిన్ పెట్టేస్తూ ఉంటారు. సరే అసలు ఫోన్ కి వంద శాతం చార్జింగ్ పెట్టడం ఎంత వరకు మంచిది…?మొబైల్ ఫోన్ కి పూర్తిగా చార్జింగ్ పెట్టడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. 95 శాతం దాటాక ఆపడం ఫోన్ కి చాలా మంచిది. దానికి కారణం వేరే ఉంది. ఫోన్ పూర్తిగా చార్జింగ్ చేస్తే ఎక్కువగా హీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఎక్కువగా హీట్ అవ్వడంతో దీనివల్ల బ్యాటరీ తొందరగా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మొబైల్ ఫోన్ ను 95 శాతం కంటే ఎక్కువ చార్జింగ్ పెట్టడం మంచిది కాదు. అలాగే 20 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉన్నప్పుడు వెంటనే పెట్టడం కూడా మంచిది.20 కంటే ఎక్కువ 95 కంటే తక్కువ చార్జింగ్ మొబైల్ ఫోన్ ఉంటే బ్యాటరీకి లైఫ్ ఎక్కువగా ఉంటుంది.

అలా చేస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతాం

అలా చేస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతాం

Courtesy by : తొలివెలుగు మీడియా website

మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయడంపై బీజేపీని ఢిల్లీ ముఖ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తీవ్రంగా విమర్శించారు.

aravind kejriwal

మున్సిపల్ ఎన్నికలను సమయానికి నిర్వహించి అందులో గెలిచి చూపించాలని బీజేపీకి ఆయన సవాల్ విసిరారు. అలా చేస్తే రాజకీయాల నుంచి తమ పార్టీ తప్పుకుంటుందని అన్నారు.
ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనానికి సంబంధించిన బిల్లుకు కేంద్రం మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలను బీజేపీ సమయానికి నిర్వహించి, అందులో బీజేపీ గెలిచి సత్తా చూపిస్తే రాజకీయాల నుంచి మా పార్టీ తప్పుకుంటుంది’ అని ప్రకటించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ తనకు తాను గొప్పలు చెప్పుకుంటోందని, కానీ ఇప్పుడు ఒక చిన్న పార్టీకి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు.

ఎన్నికలను వాయిదావేయడం అంటే బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి త్యాగం చేసిన అమరవీరులను అవమానించడమే’ అని ట్వీట్ చేశారు

షర్మిల పాదయాత్రలో తేనెటీగలు.. పరుగో పరుగు..!

షర్మిల పాదయాత్రలో తేనెటీగలు.. పరుగో పరుగు..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

స్థానికులతో షర్మిల మాట్లాడుతుండగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో కార్యకర్తలు పరుగులు తీశారు. షర్మిలను అనుచరులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. తర్వాత ఆమె యాత్రను కొనసాగించారు.

షర్మిల చుట్టూ ఉన్నవారు తేనేటీగలను కండువాలతో తరిమారు. వారి అప్రమత్తతతో ఆమె వాటి నుంచి తప్పించుకున్నారు. అయితే.. తేనెటీగల దాడిలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయ్యాయి.

ష‌ర్మిల ప్రజా ప్రస్థానం పాద‌యాత్ర 400 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం మోట‌కొండూరు మండ‌లం చండేప‌ల్లి గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు షర్మిల.


Tuesday, March 22, 2022

ఏసీబీ కీ చిక్కిన ట్రాన్స్ కో డీఈ!

*ఏసీబీ కీ చిక్కిన ట్రాన్స్ కో డీఈ!*
నల్లగొండ : రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్‌కో డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో డీఈ మురళీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం .. లైన్‌మెన్‌గా పనిచేస్తున్న గుంటూరు శ్రీనివాస్ తన సెలవుల క్రమబద్ధీకరణ చేయాలని డీఈ మురళీధర్ రెడ్డిని కోరారు.

అందుకు గాను డీఈ రూ.2.50 లక్షలు డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పినా డీఈ ససేమిరా అన్నారు. విసిగిపోయిన లైన్ మెన్ శ్రీనివాస్ నల్లగొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు మంగళవారం రూ.2 లక్షలు తీసుకుంటుండగా డీఈ మురళీధర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అదేవిధంగా డీఈ మురళీధర్‌కు చెందిన హైదరాబాద్‌లో ఒక ఇల్లు, నల్లగొండలో రెండు ఇండ్లపై దాడులు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో 40 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*link Media ప్రజల పక్షం🖋️*   prajasankalpam1.blogspot.com

Monday, March 21, 2022

విచ్చలవిడిగా కబ్జాలు.. పట్టించుకునేది ఎవరు..?

విచ్చలవిడిగా కబ్జాలు.. పట్టించుకునేది ఎవరు..?

Courtesy by : తొలివెలుగు మీడియా website

నారగోని ప్రవీణ్‌ కుమార్‌, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సాయి ప్రియ నగర్ పరిధిలోని రోడ్ నెంబర్ 6లో 1,200 గజాల పార్క్ స్థలం కబ్జాకు గురైంది. దాని విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా ఇళ్ల మధ్య కంపెనీ ఏర్పాటు చేశారు. దానికి పర్మిషన్‌ ఇచ్చిన అధికారి ఎవరో తెలియాలి.

రోడ్ నెంబర్ 3లో 1,200 గజాల పార్క్ స్థలంలో మున్సిపల్ కార్పొరేషన్ బోర్డు లేదు. కనీసం ఫెన్సింగ్‌ వేయలేదు. దాన్ని కూడా మింగేసేందుకు భూ బకాసురులు సిద్ధంగా ఉన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. గతంలో రోడ్ నెంబర్ 2లో 2,400 గజాల పార్క్ స్థలం కబ్జా అయితే.. దానిపై ఫిర్యాదు చేయగా ఇంతకుముందున్న కమిషనర్ ఇచ్చిన పర్మిషన్ ను రద్దు చేశారు.అయితే.. ఆ పార్క్ కు బదులు మరోచోట 1,200 గజాల స్థలాలు కబ్జాదారుడికి అధికారులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.10 కోట్ల విలువైన పార్క్ లను కాపాడాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తిపడితే పట్టించుకునేది ఎవరు. ఇందులో సాయి ప్రియ నగర్ అసోసియేషన్ పాత్రపై అనుమానాలు ఉన్నాయి.ప్రభుత్వం పార్క్‌ స్థలం లేని కారణంగా ఎల్‌ఆర్‌ఎస్‌ లో అదనంగా ప్రతి ప్లాట్ ఓనర్ దగ్గర చార్జీ వసూలు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలు బాధితులను పీడించేలా ఉంటాయి కానీ.. కబ్జాదారుడిపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఉండవు. ఎందుకంటే ఎక్కువ భూములు కబ్జా చేసే బ్యాచ్ లో రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఉంటున్నారు.

సాలార్ జoగ్ సర్వే నెంబర్ 1లో 6 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా అయింది. మేడిపల్లి సేజ్ స్కూల్ వెనుక 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా పెట్టారు. పీర్జాదిగూడలో కబ్జాలపై ఏ ఒక్కరూ మాట్లాడరు. పట్టించుకోవాల్సిన కలెక్టర్‌ కు తీరిక ఉండదు. అధికారులందరిపై ఏసీబీ రైడ్ చేస్తే పాపాల పుట్టలు కదులుతాయి.



Citizens angry as GHMC delays granting birth-death certificates

Citizens angry as GHMC delays granting birth-death certificates

Saturday, March 19, 2022

మంత్రులతో కేసీఆర్‌ భేటీ.. ఐటీ రెయిడ్స్ ఎఫెక్టేనా..?

మంత్రులతో కేసీఆర్‌ భేటీ.. ఐటీ రెయిడ్స్ ఎఫెక్టేనా..?

Courtesy by : తొలివెలుగు మీడియా website

తెలంగాణపై బీజేపీ ఆపరేషన్‌ ప్రారంభమైందని రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ. హైదరాబాద్‌ తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో ఈ విషయాన్ని చెబుతున్నారు విశ్లేషకులు. ఐటీ రెయిడ్స్ జరిగిన కేఎన్‌ఆర్ కన్‌ స్ట్రక్షన్స్ అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులకు పని చేస్తోంది. కాళేశ్వరం కింద దాదాపుగా రూ.10వేల కోట్ల వరకు ఈ కంపెనీ పలు ప్యాకేజీల పనులు నిర్వహిస్తోంది.

సాధారణంగా తాము టార్గెట్ చేసిన పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం బీజేపీకి అలవాటే అనే అభిప్రాయం ఉంది. కేంద్ర సంస్థల ద్వారా దాడులు చేయించి కోలుకోలేని దెబ్బ కొడుతుందనే విమర్శలు ఉన్నాయి. కేఎన్‌ఆర్ సంస్థ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. టీఆర్‌ఎస్‌ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఐటీ దాడులు జరగడంతో.. టీఆర్‌ఎస్‌ పై బీజేపీ ఫోకస్‌ చేసిందనే వార్తలు వస్తున్నాయి.

అటు ఐటీ దాడులపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండగా… సీఎం కేసీఆర్‌ మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఎర్రవల్లి ఫాంహౌస్ కు రావాలంటూ మంత్రులకు ఫోన్స్‌ వెళ్లడంతో ముగ్గురు మినహా మిగిలినవారంతా వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కూడా చేరుకున్నారు. దీంతో ఈ అత్యవసర సమావేశంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

ఇంత అర్జెంట్‌ గా మంత్రులను కేసీఆర్‌ కలవడానికి గల కారణం ఏంటని దానిపై చర్చిస్తూ.. అనేక అనుమానాలు తెరపైకి తెస్తున్నారు విశ్లేషకులు. కేంద్రంపై యుద్ధం.. జాతీయ రాజకీయాలు అని తిరుగుతున్న కేసీఆర్‌.. మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన చేశారని అంటున్నారు. అదీగాక ఐటీ దాడులు జరగడంతో కేంద్రం తమపై సైలెంట్‌ యుద్ధం మొదలు పెట్టిందా? అనే అనుమానంతో కేసీఆర్‌ మంత్రులతో భేటీ అయ్యారా? అనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

తెగిన బంధం - ఆపరేషన్ కమలం ఆట....మైహోం, కేసీఆర్ లడాయిమధ్యలో చిన్నజీయర్

Courtesy by : Q Group Media (తీన్మార్ మల్లన్న)

తెగిన బంధం - ఆపరేషన్ కమలం ఆట....మైహోం, కేసీఆర్ లడాయి
మధ్యలో చిన్నజీయర్
ఆపరేషన్ కమలం ఆట
మోడీ దెబ్బకు కేసీఆర్ విలవిల
ప్రెస్ మీట్ తో బట్టబయలు
త్వరలో మై హోంకు రాజ్యసభ
బ్యాక్ స్టెప్ లో ప్రశాంత్ కిషోర్
శనార్తి తెలంగాణ: ఒక్క టూర్ తో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టారు మోడీ షాల జోడి.. ముచ్చింతల్ సమతామూర్తి ఓపెనింగ్ టూర్ తో కేసీఆర్ మైహోంల బంధం దాదాపుగా తెగిపోయింది.. ఇన్నిరోజులు ఆధ్యాత్మిక ఆత్మియుడిగా ఉన్న చిన్నజీయర్ సైతం కేసీఆర్ తో కయ్యానికి దిగిపోయాడు.. కేసీఆర్ కు పవర్ ఫుల్ సెంటర్లుగా ఉన్న మై హోం.. చిన్నజీయర్లు దూరం కావడంతో కేసీఆర్ ప్రతిక్షణం ఆందోళన పడుతున్నట్టు తెలుస్తుంది.. కేసీఆర్ కు సంపదను కొల్లగొట్టడం తెలిస్తే.. ఆ కొల్లగొట్టిన సంపద ఏ రూంలో దాచారో ఆ రూంకు తాళం వేయడం మోడీషాలకు తెలిసిన జిమ్మిక్కు..

ఇంతకీ ఏమైంది..?
సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మోడీని.. వేడుకలకు రావలసిందిగా అమీత్ షాను ఆహ్వానించారు మైహోం రామేశ్వర్ రావు, చిన్నజీయర్ ఉమ్మడిగా.. ఈ కార్యక్రమానికి ఓకే చెప్పిన మోడీషా ఉద్దండులు వేడుకను సరిగ్గా వాడేసుకున్నారు.. సమతామూర్తి ఓపెనింగ్ శిలాఫలకంపై కేసీఆర్ పేరు ఉండొద్దు అని అమీత్ షా చేసిన సూచనను కాదనలేకపోయిన జీయర్.. మోడీ మరియు తన పేరుతో సరిపెట్టాడు.. అప్పటివరకు విగ్రహ ఏర్పాట్లు మంచి చెడూ చూస్తూ వచ్చిన కేసీఆర్ కు కోపం తెప్పించింది.. ఆక్షణం నుండి ముచ్చింతల్ కు వెళ్లడం బందు పెట్టాడు కేసీఆర్.. ఒక్క ప్లాన్ తో మై హోం, జీయర్ లకు కేసీఆర్ ను దూరం చేశాడు.. విషయం తెలిసిన వెంటనే బడ్జెట్ పేరుతో ప్రెస్ మీట్ పెట్టినా అసలు విషయం మాత్రం ఈ వ్యవహారమే అనేది కొందరికి మాత్రమే తెలుసు.. తన అధికార పీఠానికి మూల స్థంభాలుగా భావించిన జీయర్, మై హోంలను కేసీఆర్ కు దూరం చేశారు.. యాదాద్రి ఆయల నిర్మాణం.. పేరు మార్పు దగ్గరి నుండి పర్యవేక్షించిన జీయర్ ను ఏకంగా యాదాద్రి ఓపెనింగ్ కే పిలవకుండా దూరం పెట్టేశాడు.. ఇదే అంశంపై జీయర్ ను విలేకరులు ప్రశ్నించగా దూరం ఉండేవాళ్ల ఖర్మ అంటూ కుండబద్దలు కొట్టాడు..

మోడీ దెబ్బకు కేసీఆర్ విలవిల
తెలంగాణ రాష్ట్రంలో పాగావేయాలని తహతహగా ఉన్న బీజేపీ ఆటను ఎప్పుడో మొదలు పెట్టింది.. కేసీఆర్ ప్రధాన వనరులపై దృష్టి పెట్టి ఆట ప్రారంభించింది.. కేసీఆర్ శక్తులు ఎక్కడున్నాయో కనుక్కోని మరీ వేట ప్రారంభించింది.. కేసీఆర్ బినామీ ఆస్తులపై ఓవైపు ఐటీ సోదాలు జరుగుతుండగా ఆప్తుల మధ్య గ్యాప్ పెంచింది.. దేశంలో మోడీషాల జోడీని ఎదుర్కోని వాళ్ల వ్యూహాలను కనిపెట్టడంలో కేసీఆర్ ఇంకా మెర్చ్యూర్ కాలేదు.. తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ ను డీలా చేసి బీజేపీని డెవలప్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ గట్టెక్కుతాననుకున్న కేసీఆర్ వ్యూహానికి ఈ రకంగా చెక్ పెట్టారు మోడీషా.. కేసీఆర్ నమ్మకున్నవారిని ఒక్కొక్కరిని బుట్టలో వేసుకుంటూ వస్తున్నారు..

త్వరలో మైహోం రాజ్యసభకు
మైహోం చేత టీవీ9 గ్రూప్.. ఎన్టీవీ, టెన్ టీవీ ఛానెళ్లను కొనిపిచ్చిన కేసీఆర్ వాటి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని కళకన్నాడు.. కానీ ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కేంద్రం మాయల ఫకీరు ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు.. కేసీఆర్ ప్రాణాలు మై హోంలో ఉన్న విషయం గమనించి మై హోంకు బీజేపీ తీర్థం తాగించే పని మొదలు పెట్టారని తెలిసింది.. ఇందుకోసం మై హోంకు రాజ్యసభ సీటు ఆఫర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.. ఇక మై హోం కూడా రాజ్యసభ వ్యవహారాన్ని చూడాల్సిందిగా.. టీవీ9 భరత్ వర్ష్ డైరెక్టర్ గా పనిచేస్తున్న హేమంత్ శర్మకు అప్పగించినట్టు సమాచారం.. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలనే భేటీ అయిన హేమంత్ శర్మ.. సీటు కన్ఫర్మేషన్ విషయాన్ని మై హోంకు చెప్పినట్టు అత్యంత కీలక సమాచారం..

ఏకు మేకైంది
ఏలు పెట్టె సందిస్తే కాలు పెట్టే బ్యాచ్ మోడీ, అమీత్ షాది అలాంటి వారిని కూడా ఫూల్స్ ను చేయాలని ప్రయత్నించిన కేసీఆర్ బొక్కబోర్లా పడ్డాడు.. రాష్ట్రంలో అధికారంనేను తీసుకుంట కేంద్రంలో మీకు సహకరిస్తా అనే సూత్రాలు ఇంటర్నల్ మీటింగ్ లో చెప్తూ వస్తున్న కేసీఆర్ కు పూర్తిగా చదివేశారు మోడీ షాలు.. వలలో చిక్కేవరకు రానిచ్చారు.. అక్వేరియంలో పెంచుతారని ఆశపడ్డ కేసీఆర్ కు.. అది కర్రీకి సిద్దమైన సంగతి ఇటీవలే బోధపడింది.. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ కంపెనీకి చెక్ పెట్టి కుర్చింది బీజేపీ..

చేతులెత్తేశిన ప్రశాంత్ కిషోర్
ఎలాగైనా గట్టెక్కిస్తాడనుకున్న ప్రశాంత్ కిషోర్ సైతం మోడీ షాల దెబ్బకు గిలగిల కొట్టుకుంటున్నాడు.. ఓ వైపు ఉద్యోగాల భర్తీ , అభివృద్ధి పనుల డ్రామాకు తెరలేపినా.. మోడీ షాలు మొదళ్ల నుండి నరుక్కుంటూ వస్తుండడంతో ప్రశాంత్ కిషోర్ సైతం చేతులెత్తేశినట్టు తెలుస్తుంది.. కేంద్రం సహకరిస్తుంది.. నిలువరించాల్సింది కాంగ్రెస్ నే అంటూ ఇన్నాళ్లు పీకేకు చెప్పుకుంటూ వచ్చిన కేసీఆర్.. తీరా బీజేపీ ఫ్లెట్ ఫిరాయించడంతో పీకే కూడా కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. ఇటీవల ఒక నేషనల్ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పీకే టీఆర్ఎస్ అసైన్ మెంట్ కు సంబంధించి ఇంకా కుదరలేదన్న వ్యాఖ్యలు చేశారు.. మొత్తానికి మోడీ, షా సైలెంట్ గా వాయ్ లెంట్ స్టార్ట్ చేశారు.. ఇది జనానికంటే ముందు.. కేసీఆర్ అండ్ కంపెనీకి అర్థమైంది గంతే.. జనానికి తెలియడానికి మరికొన్నిరోజులు సమయం పట్టే అవకాశం ఉంది.
 

Friday, March 18, 2022

అమెరికా టూర్ కు..... KTR

*అమెరికా టూర్ కు..... KTR*

హైదరాబాద్‌: రాష్ట్రానికి ఐటీ, పారిశ్రామిక పెట్టుబడుల సాధన కోసం మంత్రి కేటీఆర్‌ 10 రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు.శనివారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరుతున్న కేటీఆర్‌ బృందం ఈ నెల 29 వరకు అమెరికాలోని తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో పర్యటించనుంద. కేటీఆర్‌ బృం దంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్, ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి ఉన్నారు.

లాస్‌ ఎంజిలెస్‌తో మొదలయ్యే కేటీఆర్‌ పర్యటన 20న శాండియాగో, 21న శాన్‌జోస్, 24న బోస్టన్, 25న న్యూయార్క్‌లో కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థల అధిపతులు, సీఈవో లతో కేటీఆర్‌ భేటీ అవుతారు

link Media ప్రజల పక్షం🖋️ 

ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించనున్న....... కేజ్రీవాల్

*ఏప్రిల్ 14  అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించనున్న....... కేజ్రీవాల్!*

*ఢిల్లీ....!*
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి మంచి ఉత్సాహంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ  ఇప్పుడు ఇతర రాష్ట్రాలపైదృష్టి పెట్టింది. ఈ ఏడాది చివర్లో జరిగే  అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది.ఇదే సమయంలో దక్షిణాదిలోనూ పార్టీని విస్తరించాలని భావిస్తుంది. త్వరలోనే ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కేజ్రీవాల్ హైదరాబాద్ కు రానున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి.

తెలంగాణ యువతతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మద్దతు ఆప్ కు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఆప్ ఇప్పటికే తెలంగాణా సెర్చ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోఆమ్ ఆద్మీ పాదయాత్రలు చేపట్టనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. తెలంగాణ లో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలతోనే ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఆప్ తెలంగాణ ఇన్చార్జిగా సోమనాథ్ భారతిని నియమించారు. త్వరలోనే ఆయన రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర ఏర్పాట్లు చూడనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

link Media ప్రజల పక్షం🖋️ 

Thursday, March 17, 2022

హిందూ మారణహోమం – కాశ్మీర్ ఫైల్స్ – ప్రజల చలనచిత్రం

హిందూ మారణహోమం – కాశ్మీర్ ఫైల్స్ – ప్రజల చలనచిత్రం

Wednesday, March 16, 2022

24 గంటల్లో.. 4 లక్షల కేసులు: కరోనా మళ్లీ..!!

24 గంటల్లో.. 4 లక్షల కేసులు: కరోనా మళ్లీ..!!

దక్షిణ కొరియాలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే 4,00,741 కొవిడ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,629,275 కు చేరినట్టు అధికారులు తెలిపారు.

అంతకు ముందు రోజు కొవిడ్ కేసుల సంఖ్య 362,329గా ఉందని అధికారులు తెలిపారు. ఒక్క రోజులో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదుకావడం పట్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ వల్ల సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇటీవల కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నట్టు అధికారలు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో 81,395 సియోల్ నుంచే నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక కొత్తగా జియోంగ్గీ ప్రావిన్స్ లో 94,806, పశ్చిమ ఓడరేవు నగరమైన ఇంచియాన్‌లో 28,453 కొవిడ్ కేసులు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. తాజాగా వైరస్ బారిన పడి 293 మంది మరణించడం అధికారులను కలవర పెడుతోంది.

Osmansagar, Himayatsagar may meet the same fate of Hussainsagar, fear officials

Osmansagar, Himayatsagar may meet the same fate of Hussainsagar, fear officials

If GO 111 is scrapped, the twin reservoirs are likely to meet the fate of Hussainsagar which has become completely polluted and its water unfit for consumption.

Courtesy by : THE NEW INDIAN EXPRESS Twitter By S Bachan Jeet Singh

HYDERABAD: With Chief Minister K Chandrasekhar Rao announcing in the Assembly that GO 111 would be scrapped as it has become redundant, both serving and retired officials expressed concern over the serious impact on the 100-year-old twin reservoirs Osmansagar and Himayatsagar due to the imminent large-scale urbanisation within the 10 km buffer zone. 

About 1,32,000 acres covering 84 villages in the mandals of Shamshabad, Shabad, Rajendranagar, Chevella, Moinabad and Shankarapally, which hold huge real estate potential owing to their proximity to IT corridors, come under the purview of GO 111, issued on March 8, 1996. If GO 111 is scrapped, the twin reservoirs are likely to meet the fate of Hussainsagar which has become completely polluted and its water unfit for consumption. The GO was issued mainly to stop construction activities like industries, major hotels, residential colonies and other polluting establishments within the 10 km radius of the reservoirs.

The reservoirs are the major drinking water source for the people of the twin cities even today as Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMSW&SB) draws 30 million gallons of water per day (MGD) from them through gravity. 

Constructions will also block flow of rainwater from catchment areas into the reservoirs. Lifting of the ban on constructions would also increase commercial engagements, transform the residential projects in the nearby villages and chances are that it would threaten the ecological balance through encroachments and pollution.

A retired officer said that Bharat Ratna awardee Mokshagundam Visvesvaraya had designed these reservoirs as Flood Protection Reservoirs to deal with floods in Musi and later used as drinking water sources for the city. The government should drop the idea of scrapping the GO 111, he said.

భగవంత్ మాన్ అనే నేను..!

భగవంత్ మాన్ అనే నేను..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు.
సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం ఖట్కాడ్ కలాన్ లో ఘనంగా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు.
మీరంతా (కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు) అహంకారాన్ని ప్రదర్శించవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు ఓటు వేయని వారిని సైతం మనం గౌరవించాలి. మీ అందరికీ నా ధన్యవాదాలు” అని అన్నారు.

Monday, March 14, 2022

రేపటి నుంచే 12-14 ఏళ్ల వారికి...,... టీకా

*రేపటి నుంచే 12-14 ఏళ్ల వారికి...,... టీకా*

*బయో-ఈ రూపొందించిన కోర్బెవాక్స్‌ టీకా ఇవ్వనున్నట్టు కేంద్రం వెల్లడి*

*60 ఏళ్లు దాటినవారంతా మూడో డోసు తీసుకోవడానికి అర్హులే*

*దేశంలో 12-14 ఏళ్లవారు 7.11 కోట్లు*

*5 కోట్ల డోసులు ఇచ్చిన బయో-ఈ*

*కార్యాచరణ సిద్ధం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ*

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ టీకాలు వేసే కార్యక్రమం బుధవారం (16వ తేదీ) నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు.హైదరాబాద్‌కు చెందిన బయొలాజికల్‌-ఈ లిమిటెడ్‌ అభివృద్ధి చేసిన కోర్బెవాక్స్‌ టీకాను వారికి ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే.. 60 ఏళ్లు దాటి, మధుమేహం, అధికరక్తపోటు వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి మాత్రమే ఇస్తున్న ముందు జాగ్రత్త (మూడో) డోసును ఇకపై 60 ఏళ్లు దాటినవారందరికీ ఇవ్వనున్నట్టు తెలిపారు. ''పిల్లలు సురక్షితంగా ఉంటే దేశం కూడా సురక్షితంగా ఉన్నట్టు. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని మార్చి 16 నుంచి ప్రారంభించబోతున్న విషయం తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అలాగే, 60 ఏళ్లు దాటినవారంతా ప్రికాషన్‌ డోసు వేసుకోవడానికి ఇక అర్హులే'' అని ఆయన ట్వీట్‌ చేశారు.

12-14 ఏళ్ల పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్న కుటుంబాలు సత్వరమే వారికి టీకాలు వేయించాలని సూచించారు. శాస్త్రీయ సంస్థలతో విస్తృత చర్చలు జరిపిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం దేశంలో 12-14 ఏళ్లవారు (2008 నుంచి 2010 నడుమ జన్మించినవారు) 7.11 కోట్ల మంది ఉన్నారు. వీరికోసం బయొలాజికల్‌ ఈ సంస్థ ఇప్పటికే 5 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేసినట్లు సమాచారం. కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోయి దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ తెరుచుకుంటున్న నేపథ్యంలో కొవిడ్‌ను మరింత సమర్థంగా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. రాష్ట్రంలో 12-14 ఏళ్ల పిల్లలు 17,23,000 మంది ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా బుధవారం నుంచి వారికి టీకాలు వేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు

link Media ప్రజల పక్షం🖋️ 

Sunday, March 13, 2022

బిజెపి గెలుపు లో మజ్లీస్ పాత్ర!....86 స్థానాల్లో మజ్లిస్‌కు గణనీయంగా ఓట్లు

*బిజెపి గెలుపు లో మజ్లీస్ పాత్ర!*

*86 స్థానాల్లో మజ్లిస్‌కు గణనీయంగా ఓట్లు*

*లక్నో ......*
యూపీ ఎన్నికల్లో బీజేపీ రెం డోసారి గెలవడంలో మజ్లిస్‌ పార్టీ పాత్ర ఉందా?ఆ పార్టీ వల్లే ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ ఆశలు గల్లంతయ్యాయా? యూపీలో మొత్తం 403 స్థానాలకుగాను బీజేపీ స్వయంగా 255 స్థానాల్లో, కూటమిగా 273 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. సమాజ్‌వాది పార్టీ 111 సీట్లు, ఆర్‌ఎల్డీతో కలిసి 119 సీట్లే గెలిచింది. బీజేపీ కూటమి గెలిచిన సీట్లలో 86 మంది అభ్యర్థుల మెజారిటీ 2 వేల లోపే.

వీరిలో 49 మంది కేవలం 1000 ఓట్ల తేడాతో గెలవగా, 23 మంది 500 లోపు, ఏడుగురు 200లోపు ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించారు. ఈ స్థానాల్లో పలు చోట్ల ఎంఐఎం అభ్యర్థులు బీజేపీకి వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లు పొందారు. అవన్నీ ముస్లింల ఓట్లేనని, ఎంఐఎం బరి లో లేకపోతే ఆ ఓట్లు ఎస్పీ అభ్యర్థులకే దక్కేవని, తద్వారా ఎస్పీ కూటమి గెలుపొందేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

link Media ప్రజల పక్షం🖋️ 

18,334 పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి 'ఉద్యోగ'ప్రతిపాదనలు పంపిన పోలీస్‌ శాఖ

*18,334 పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ రంగం..... సిద్ధం*

*18,334 పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి 'ఉద్యోగ'ప్రతిపాదనలు పంపిన పోలీస్‌ శాఖ*

*వారంలో గ్రీన్‌సిగ్నల్‌ లభించే అవకాశం*

*60%పైగా పోస్టులు 'లోకల్‌'లోనే భర్తీ*

*కోచింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు డీజీపీ ఆదేశం*

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన 18,334 పోస్టుల భర్తీకి పోలీస్‌ శాఖ రంగం సిద్ధం చేసింది.ఈ మేరకు నోటిఫికేషన్‌ అనుమతి నిమిత్తం ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం వారంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే తాజా ఉద్యోగాల భర్తీలోనూ పోలీస్‌ శాఖనే ముందు నోటిఫికేషన్‌ ఇచ్చినట్లవుతుంది. ఇక ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్, సివిల్, ఆర్మ్‌డ్‌(ఏఆర్‌), కమ్యూనికేషన్‌ విభాగాల్లో భర్తీ ఉండనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 1,500కు పైగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టులను పోలీస్‌ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. నూతన జిల్లాలు, రేంజ్‌లను దృష్టిలో పెట్టుకొని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక మిగిలినవన్నీ కానిస్టేబుల్‌ పోస్టులు కాగా, వాటిని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌), టీఎస్‌ఎస్‌పీ, కమ్యూనికేషన్‌ విభాగాల్లో నియామకానికి ప్రతిపాదించినట్లు పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.*ఇప్పటికే 28,000 పోస్టుల భర్తీ...*
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు పోలీస్‌ శాఖ దాదాపు 28,000 పోస్టులను భర్తీ చేసింది. సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్, స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌(టీఎస్‌ఎస్‌పీ), పోలీస్‌ కమ్యూనికేషన్, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (పీటీవో) విభాగాల్లోని కానిస్టేబుల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీని మూడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేశారు. తాజాగా 18,334 పోస్టుల్లో 80 శాతం కానిస్టేబుల్, 20 శాతం సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, కొత్త సర్కిల్, పోలీస్‌స్టేషన్లకు మరింత మంది సిబ్బందిని కేటాయించేందుకు ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
*స్థానికంగానే అధికం...*
ప్రస్తుతం భర్తీ చేయాలనుకున్న పోలీస్‌ పోస్టులు 60 శాతానికి పైగా లోకల్‌ కేడర్‌లోనే భర్తీ కానున్నాయి. గతంలో పోలీస్‌ శాఖలో నాలుగు రేంజ్‌లు ఉండేవి. తాజాగా రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం.. 7 రేంజ్‌లు ఏర్పడ్డాయి. అలాగే రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడి.. కొత్త పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్‌ ఆఫీస్‌ల ఏర్పాటుతో స్థానికంగా సిబ్బంది అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో సివిల్, ఏఆర్‌ (ఆర్మ్డ్‌ రిజర్వ్‌) కేటగిరీలో ఎక్కువ పోస్టులు భర్తీ చేయనున్నారు. స్పెషల్‌ పోలీస్, కమ్యూనికేషన్‌ విభాగంలోని కానిస్టేబుల్, ఎస్‌ఐ ర్యాంక్‌ పోస్టులు రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉంటాయి. దీంతో ఈ పోస్టుల సంఖ్య తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, స్థానికత ఆధారంగా జరిగే మొట్టమొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే కావడం గమనార్హం.
*జిల్లాల్లో కోచింగ్‌ సెంటర్లు...*
రాబోతున్న నోటిఫికేషన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రీ రిక్రూట్‌మెంట్‌ కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశించారు. నిరుద్యోగ యువతను ప్రోత్సహించేలా ఈ సెంటర్లు ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంతో సమన్వయం చేసుకొని ఈ కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు ఉండాలని డీజీపీ సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్లో ఉచిత ప్రీ రిక్రూట్‌మెంట్‌ కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటుచేయడం వేగవంతం చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

టచ్ చేసి...... చూడు!

*టచ్ చేసి...... చూడు!*

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ ఏరియాకు నీళ్లు, కరెంటు కట్‌ చేస్తామంటూ అసెంబ్లీలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు.భారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించడం అత్యంత దుర్మార్గమని, ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యేనని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో పార్టీ నాయకులు రాజాసింగ్, డి.ప్రదీప్‌కుమార్‌ తదితరులతో కలిసి 'కశ్మీర్‌ ఫైల్స్‌'సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుtuభారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించడం అత్యంత దుర్మార్గమని, ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యేనని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో పార్టీ నాయకులు రాజాసింగ్, డి.ప్రదీప్‌కుమార్‌ తదితరులతో కలిసి 'కశ్మీర్‌ ఫైల్స్‌'సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ
*ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి....*
పాతబస్తీలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన కరెంట్‌ బిల్లులను వసూలు చేయడం చేతగాని దద్దమ్మ.. కంటోన్మెంట్‌కు కరెంటు, నీళ్లు కట్‌ చేస్తామని చెప్పడం సిగ్గు చేటు. దేశాన్ని విచ్ఛి న్నం చేసేలా మాట్లాడుతున్న కేసీఆర్‌ కుటుం బం ముమ్మాటికీ దేశద్రోహులే. కంటోన్మెం ట్‌లో కరెంట్‌ కట్‌ చేస్తారా? అసలు కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటి? కంటోన్మెంట్‌లో భూములు కబ్జాలు చేయాలి.

ఫాంహౌస్‌లు కట్టుకోవాలి. పన్నులు పెంచాలి. నిధులు మళ్లించాలి. పేద ప్రజల రక్తం తాగాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లున్నరు. కంటోన్మెంట్‌ లో సైనికులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా నివాసం ఉంటారనే సోయి మర్చిపోయిండు. దేశంలో అన్ని ఉగ్రవాద సంస్థలకు నంబర్‌ వన్‌ టార్గెట్‌గా ఉన్న ప్రాంతమది. అక్కడే కరెంటు, నీళ్లు కట్‌ చేస్తరా? 'అని సంజయ్‌ ప్రశ్నించారు.

ఇలాగే దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ కుటుంబాన్ని ఉరికించి కొట్టడం ఖాయమని, వారు వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పా లని ఆయన డిమాండ్‌ చేశారు. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన వాస్తవ విషయాలను 'కశ్మీర్‌ ఫైల్స్‌'లో కళ్లకు కట్టినట్లు చూపించిన నిర్మాతలను అభినందిస్తున్నామని అన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

15 నుండి ఒక్క‌పూట బ‌డి..!

15 నుండి ఒక్క‌పూట బ‌డి..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

ఎండాకాలం రానే వ‌చ్చేసింది. ఎప్పుడు పాఠ‌శాల‌లకు సెల‌వులు ప్ర‌క‌టిస్తారా అని చిన్న పిల్ల‌లు ఎదురు చూస్తూ రోజులు లెక్క‌పెట్టుకుంటారు. స్కూల్స్ మూసేసే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో విద్యార్ధుల్లో ఆనందం హ‌ద్దులు దాటుతోంది.

ఈ నేప‌థ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులుంటాయి. కొన్ని ఉపాధ్యాయ సంఘాల వినతి నేపథ్యంలో గతంలో మాదిరిగానే ఒంటిపూట బడులు నడపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ క్రమంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ప్రతిపాదనలు పంపారు.

పదో తరగతి పరీక్షలు మే 20వ తేదీ వరకు జరగనున్నందున ఈ విద్యా సంవత్సరానికి అదే చివరి పనిదినం కానుంది. క‌రోనా నేప‌థ్యంలో పాఠ‌శాల‌లు లేట్ గా ప్రారంభం అయిన‌ప్ప‌టికీ.. స‌మానుకూలంగా విద్యార్ధుల‌కు సిల‌బ‌స్ పూర్తి చేసిన‌ట్టు స‌బితాఇంద్రారెడ్డి తెలిపారు.

Saturday, March 12, 2022

రాజీనామా యోచనలో సోనియా.... రాహుల్.... ప్రియాంక.....!

*రాజీనామా యోచనలో   సోనియా.... రాహుల్.... ప్రియాంక.....!*

కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల వెల్లడైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవం పొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఉండి కూడా పంజాబ్‌లో అధికారాన్ని దక్కించుకోలేకపోయింది.ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలో కూడా గెలవలేకపోయింది. అయితే కాంగ్రెస్‌ జీ23 నేతల భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌లోని తమ పదవులకు రాజీనామాలు ప్రకటించనున్నట్లు సమాచారం. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీ భేటీలో రాజీనామాల విషయాన్ని వారు వెల్లడించే అవకాశం ఉంది.

కాగా 5 రాష్ట్రాల ఎన్నికల పరాజయాలపై చర్చించేందుకు ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశం కాబోతోంది. ఈ భేటీకి సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటికే ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా పంజాబ్‌లోనూ అధికారం పొగొట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇక మిగిలిన రెండు రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు. వర్చువల్ విధానంలో జరిగే సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ,రాహుల్ గాంధీతో పాటు దిగ్విజయ్ సింగ్, ఏకే ఆంటోనీ, ఇతర నేతలు కూడా పాల్గొంటారు. అలాగే సీడబ్ల్యూసీలో ఉన్న జీ23 నేతలు కూడా ఈ భేటీలో తమ అభిప్రాయాలు వెల్లడించబోతున్నారు.మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజీనామాలు చేస్తారనే వార్తలను ఆ పార్టీ ఖండించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత, అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు. రాజీనామా చేయడం పూర్తి అవాస్తవమని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Friday, March 11, 2022

తెలంగాణ నిరుద్యోగులు మరో సారి మోసపోవద్దు .

తెలంగాణ నిరుద్యోగులు మరో సారి మోసపోవద్దు .
ఉద్యోగ భర్తీ ప్రక్రియకు  Deadline లేకుండా కేవలం ఎన్నికల స్టంట్ గా తీస్కొచ్చి మరోసారి మోసం చేయడానికి సిద్ధం అయ్యారు పాలకులు.
ఎప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పే దమ్ము ఉందా ...?
మెజారిటీ ప్రజల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వం.ఆ ప్రజల కొరకు పని చేయడం దాని కర్తవ్యం.
ఆ ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చేరడానికి కొంతమంది అధికారుల అవసరం ఉంటుంది.అలాంటిది 
#KCR అనే దొంగ నాయకుడు ఇన్ని సం.. ఇంత మంది అధికారులు లేకుండా,ప్రజల కోసం ఏం చేసినట్టు.
#ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప.
ఉదా:మంచి విద్యను అందించడం ప్రభుత్వం బాధ్యత.ఆ విద్యను చెప్పే టీచర్లను నియమించి,విద్యా వ్యవస్థను నడిపించాల్సిన పూర్తి బాధ్యత మనం ఎన్నుకున్న #ముఖ్యమంత్రిది కదా!
#ఎక్కడున్నారు ఉపాధ్యాయులు?
#గురువులేని విద్య గుడ్డి విద్య,గుడ్డిగా చదివి ఏం సాధిస్తారు మన బిడ్డలు.
నిన్నే అడిగేది #voter #ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇవ్వాల్సింది,వాడికి నచ్చినప్పుడు కాదు.ప్రజలకు అవసరం వచ్చినప్పుడు.ప్రజలకు అధికారుల అవసరం,రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి ఉంది కదా!
#ఉద్యోగాలు వాడు చేసే సహాయం కాదు.ఓట్లు వేసి మీ కృతజ్ఞత చూపించడానికి.
#అడుగు ఇన్ని సం. ప్రజల సమస్యలు తీర్చకుండా దాచిన డబ్బు ఎక్కడని?
 Courtesy by : https://twitter.com/RSPraveenSwaero/status/1502488860399640576?t=yfGRqzcir6TZoXxzKPZ2vQ&s=19