Wednesday, April 1, 2026

CYBER FRAUD BUSTED – FAKE TRADING CALL CENTER EXPOSED!

🚨 CYBER FRAUD BUSTED – FAKE TRADING CALL CENTER EXPOSED!

Malkajgiri Cyber Crime Police have busted a cyber fraud call center involved in an #InvestmentFraud case.

👤 A 35-year-old faculty from Nagole was cheated through a fake WhatsApp group “Barclays” with fake profits up to ₹7 Crores shown to trap him.

💸 Total Loss: ₹36,30,010/-

👮‍♂️ 8 Accused Arrested 
📱 Seized Items:
45 Mobile Phones | 1 Laptop | 3 Routers | 2 Tabs
40 ATM Cards | 20 SIM Cards | 22 Cheque Books & more
🔍 Fraudsters posed as traders and lured victims into investing on fake platforms.
⚠️ Stay Alert:
✔️ Don’t trust online investment groups blindly
✔️ Verify before investing
✔️ If it sounds too good to be true, it’s a scam
📢 Report Cyber Frauds immediately at 1930 or cybercrime.gov.in
#CyberCrime #StayAlert #OnlineFraud #TradingScam #PublicSafety #HyderabadPolice

https://x.com/MalkajgiriCop/status/2039365063098941823?t=fSmWE1RpqdVPxxDpYkkW6Q&s=19

Tuesday, March 31, 2026

*ట్యాంక్ బండ్ శివకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సహాయం*

*ట్యాంక్ బండ్ శివకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సహాయం* 
                                                                  ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయంతో పాటు ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగం ఇస్తూ అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని అందజేశారు.ప్రమాదవశాత్తు, లేదా ఇతరత్రా హుస్సేన్ సాగర్‌ (ట్యాంక్ బండ్) లో పడిన ఎంతోమంది ప్రాణాలను శివ కాపాడారు. అయితే, కుటుంబ పోషణ భారమై శివ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియడంతో ముఖ్యమంత్రి గారు స్పందించారు.శివకు అవసరమైన సహాయం అందించాలని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శివ కుటుంబం ముఖ్యమంత్రి గారిని కలిశారు.ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్‌ నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా శివ కోరడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. అలాగే శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. సహృదయంతో స్పందించడమే కాకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సాయం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ట్యాంక్‌బండ్‌ శివ కుటుంబ సభ్యులు అన్నారు.

Friday, March 27, 2026

తెలంగాణ రాష్ట్రంలో చట్టాలు అందరికీ ఒకేలా వర్తిస్తున్నాయా.?

https://x.com/i/status/2037769239516619156

*_Breaking News_*

*రేవంత్ సార్.. ఒకసారి డిజిపి సార్ కు చెప్పండి.!*

మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చట్టాలు అందరికీ ఒకేలా వర్తిస్తున్నాయా.? అంటే లేవనే చెప్పవచ్చు. సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలపై అసాంఘిక, నిరాధారమైన పోస్ట్ లు పెడితే వెంటనే చర్యలు. అదే పేదలు, సామాన్యులు ఇచ్చే ఫిర్యాదులకు దిక్కే ఉండటం లేదు. ఉదాహరణకు 
1). Kareem Nagar 1 Town police station:
Your Petition has been created successfully. Your ID: KNR/KRMNGR1TN_KAR/130326/00279  
TS POLICE

2). LALAGUDA POLICE STATION:
Your Petition has been created successfully. Your ID: HYD/LLG_HYD/120326/00058  
 TS POLICE,

3). OSMANIA UNIVERSITY POLICE STATION:
Your petition HYD/OU/160326/00370 has been assigned to an Enquiry Officer successfully 
 TS POLICE

4). KHAMMAM 1 TOWN POLICE STATION:
Your Petition has been created successfully. Your ID: KMM/KMM1T_KMM/180326/00143  
 TS POLICE,

5). Nalgonda 2 Town police station :
H88819926 is delivered on 22/3/2026 to STATION HOUSE OFFICER Share feedback https://1jx.in/DTDCCR/4999b9c8 DTDC won't ask for any payment OTP

ఈ ఫిర్యాదులకు సంబంధించి సాంకేతిక ఆధారాలు అనగా 65బి సర్టిఫికెట్లు, సిడీ, పెన్ డ్రైవ్ రూపంలో కూడా సాక్ష్యాలు అందించడానికి బాధితులు సిద్దంగా ఉన్నారు.


*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaDGP @KarimnagarCp @KhammamCp @NalgondaCop @hydcitypolice @SajjanarVC_IPS @OsmaniaPolice @sholallaguda @sho_knr1t_knr @shonlg2town @IPRTelangana @CPRO_TGCM @DigitalMediaTG @TelanganaCOPs*

https://www.facebook.com/share/p/18Pkb4vt8m/
                    *****
https://www.instagram.com/p/DWavCSSCn4p/?igsh=Mm5xanloNWNwdGVu

Tuesday, March 24, 2026

_# హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మళ్లీ మలుపు_

*_రేవంత్ యు టర్న్..!_*
_# హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మళ్లీ మలుపు_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత,9440000009)_

హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇన్నాళ్లు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఒక్కసారిగా స్టాండ్ మార్చడం జర్నలిస్టు వర్గాల్లో ఆవేదనకు కారణమైంది. ముఖ్యంగా జవహర్‌లాల్ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ (జేఎన్‌జే) సభ్యుల ఆశలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి.

*_18 ఏళ్ల నిరీక్షణకు బ్రేక్.?_*
ఏళ్ల తరబడి డబ్బులు చెల్లించి, స్థలాల కోసం పోరాడుతున్న జేఎన్‌జే సభ్యులు ఇప్పుడు మళ్లీ మొదటి దశకు చేరిన పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ హయాంలో కేటాయించిన రెండు స్థలాలపై ఆశలు పెట్టుకున్నా, సుప్రీంకోర్టు తీర్పుతో అవి రద్దయ్యాయి. దీంతో “ఇన్నాళ్ల పోరాటం వృథా అయిందా?” అనే ప్రశ్న ఉత్కంఠగా మారింది.

*_లీగల్ మార్గాలు మూసుకుపోయినట్టే.!_*
సుప్రీంకోర్టు తీర్పుతో:
పాత కేటాయింపులు రద్దయ్యాయి. ఈ భూములు ప్రభుత్వానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంది. నాటి జర్నలిస్టులు చెల్లించిన డబ్బుపై అనిశ్చితి నెలకొంది. ఈ విషయంలో ప్రభుత్వంపై జర్నలిస్టుల్లో “నమ్మక ద్రోహం” అన్న భావన బలపడుతోంది.

*_కొత్త ఫార్ములా… సొసైటీలకు చెక్!_*
తాజా ప్రకటనలో సీఎం స్పష్టం చేసిన విషయంలో
సొసైటీలకు వేరుగా కేటాయింపులు ఉండవు. 
అర్హులైన జర్నలిస్టులందరికీ ఒకేసారి కేటాయింపు చేయాలనే ప్రతిపాదన పలు ఆలోచనలకు తావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇవ్వాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

*_పీటముడి_*
“అందరూ కలిసి ప్రతిపాదనలు ఇవ్వండి. లేకపోతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది” అని సీఎం హెచ్చరిక స్వరంలో పేర్కొన్నారు. దీంతో జేఎన్‌జేకు షాక్ ఇచ్చినట్లు అయింది. ఈ నిర్ణయం వల్ల మిగతావారికి ఆశ కలిగింది. జేఎన్‌జే సొసైటీ
ఇప్పటివరకు “ముందు మాకు న్యాయం” అన్న డిమాండ్ పక్కకు వెళ్లిపోయి, అందరినీ ఒకే వరుసలో నిలబెట్టిన పరిస్థితి ఏర్పడింది.

*_అర్హులెవరు.?_*
సిఎం రేవంత్ రెడ్డి ప్రకటన కొత్త వివాదానికి నాంది పలికినట్లయింది.
ఇప్పుడు ప్రధాన ప్రశ్న...
18 ఏళ్ల క్రితం సభ్యులేనా అర్హులు.?
లేక ఇప్పటి వరకు వచ్చిన జర్నలిస్టులందరా.?
ప్రింట్, టీవీ, వెబ్, డిజిటల్ రంగాల జర్నలిస్టులందరినీ ఎలా గుర్తిస్తారు.? ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

*_పాత భూములపై ఫుల్ స్టాప్_*
పేట్ బషీరాబాద్, నిజాంపేట వంటి కీలక భూములను ఇవ్వడం లేదని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో పాత కేటాయింపులపై ఆశలు పూర్తిగా చెదిరిపోయినట్టే.
ఈ సమావేశంలో  క్లారిటీ లేదు. ప్రెస్ క్లబ్ అంశంపై జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులు సీఎంను కలిశారు.
అయితే సొసైటీలకు ఇస్తారా? వ్యక్తులకు ఇస్తారా? అన్న కీలక ప్రశ్నకు స్పష్టత రాలేదు.

*_చివరి జంజాట మాటలు_*
ఇది ఇప్పుడు కేవలం హౌజింగ్ సమస్య కాదు.! ఇది పాత హక్కులు vs కొత్త విధానం. ఇది న్యాయం × సమానత్వం
ఒకవైపు 18 ఏళ్ల పోరాటం.! మరోవైపు అందరికీ సమాన న్యాయం అనే వాదన. మొత్తం మీద... 'రేవంత్ యు టర్న్‌'తో హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య మళ్లీ మొదటికి చేరింది. పరిష్కారం మాత్రం ఇంకా దూరంగానే కనిపిస్తోంది.!

Monday, March 23, 2026

మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఎవరినీ నిరాశ్రయులను చేయం

మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు హామీ ఇచ్చారు.

✅శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి గారు సమాధానమిస్తూ, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సహాయాన్ని అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

✅మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ప్రణాళికలను క్షుణ్ణంగా చదివి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు చేస్తే ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని చెప్పారు.

✅హైదరాబాద్ నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు, 1 లక్షకు పైగా చ.కి.మీ మేర విస్తరించిన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన #TelanganaRising2047  దార్శనికతను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సభముందు సమగ్రంగా వివరించారు.

✅“దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో తలెత్తుతున్న విషమ పరిస్థితులను గమనంలోకి తీసుకుని చరిత్రాత్మక హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకురావడానికి, అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉంది.

✅నల్గొండ ప్రజల జీవన స్థితిగతులు, వారి ఆవేదనా భరితమైన జీవిత సత్యాల గురించి ఆలోచన చేసే వారెవరూ ఈ ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన చేయరు. కావాలనుకుంటే మూసీ ప్రక్షాళన అంశంపై సలహాలు, సూచనలు తీసుకోవడానికి ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారి నేతృత్వంలో మంత్రులు @OffDSB గారు, @Ponnam_INC గార్లతో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తాం.

✅ఏ రాష్ట్ర ప్రగతి అయినా ఆ రాష్ట్ర నగరాలు, పెట్టుబడులు, ప్రజల జీవన స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఎప్పుడు చర్చ జరిగినా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల గురించి ఎక్కువగా చర్చిస్తారు. హైదరాబాద్ అనగానే ప్రధానంగా ఫార్మా రంగంతో పాటు లివబుల్ సిటీగా గుర్తుచేసుకుంటారు.

✅ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా ఉన్న ముంబై వర్షాలొస్తే నివసించలేని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం, బెంగళూరులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లు. భారీ వర్షాలొస్తే చెన్నైలో పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి.

✅ఆ మహానగరాల్లో ఎదురవుతున్న అనుభవాలను చూసిన తర్వాత అత్యంత ప్రశాంత వాతావరణంలో, ఒకప్పుడు లేక్ అండ్ రాక్ సిటీగా విలసిల్లిన చారిత్రాత్మక హైదరాబాద్ ఇప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలు భూ భౌగోళిక పరిస్థితుల కారణంగా తలెత్తినవి కాదు. మానవ తప్పిదాల కారణంగా తలెత్తిన సమస్యలు.

✅కులీకుతుబ్ షాహీల కాలంలో గుల్జార్ హౌజ్, ఫలక్‌నుమా, తారామతి భారాదరి, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఈరోజు సమావేశాలు నిర్వహించుకుంటున్న శాసనమండలి హాలు.. ఇలా ఎంతో చరిత్ర కలిగిన అద్భుతమైన నగరం ఇప్పుడు కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందుల వంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది.

✅అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణను #CURE (క్యూర్), #PURE (ప్యూర్), #RARE (రేర్) మూడు ప్రాంతాలుగా విభజించి సమగ్రమైన ప్రణాళికలతో ఒక కార్యాచరణతో ముందుకు వెళుతున్నాం. 1.34 కోట్ల జనాభా కలిగిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని కోర్ అర్భన్ రీజియన్‌గా గుర్తించి కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ జోన్‌లో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని నిర్ణయించాం.

✅తద్వారా ఈ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఈ క్రమంలోనే  హిల్ట్ పాలసీ #HILTP తీసుకొచ్చాం. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలి వైపునకు తరలించి, ఇక్కడి పారిశ్రామిక జోన్‌లో ఉన్న భూములను మల్టీయూజ్ జోన్‌లోకి మార్చుతున్నామే, తప్ప యాజమాన్యపు హక్కులు మారవు. మల్టీయూజ్ జోన్‌లోకి మార్చడం వల్ల మధ్య తరగతి నివాస ప్రాంతాలుగా మారుతాయి.

✅పరిశ్రమలను తరలించడం ద్వారా నగరం కాలుష్య రహిత ప్రాంతంగా ఉంటుందన్నది మొట్టమొదటి ప్రణాళిక. 20 టీఎంసీ గోదావరి నీటని తరలించి అందులో 17 టీఎంసీ జంటనగరాల తాగునీటి కోసం, మిగిలిన నీటిని మూసీలో నిరంతరం నీరు ప్రవహించేలా వినియోగిస్తాం.

✅రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం సమగ్రమైన ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేసుకున్నాం. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలివ్వండి. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఎవరినీ నిరాశ్రయులను చేయం. వారికి మరిన్ని మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తాం. ఏ ఒక్కరికి నష్టం చేయం..” అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వివరించారు.

Sunday, March 22, 2026

ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ‘ఉగాది పురస్కారాలు - 2026’: అర్హుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆధ్వర్యంలో..
 
ఉత్తమ తెలుగు జర్నలిస్టు - 2026 పురస్కారాలు

తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టుల ప్రతిభను గుర్తించి, వారిని గౌరవించేందుకు మొత్తం 40 విభాగాలలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఆయా విభాగాల వివరాలు మరియు అర్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

పురస్కార విభాగాలు & అర్హతలు:
1. సామాజిక స్పృహ, బాధ్యత, భద్రత: సమాజం పట్ల బాధ్యతతో హక్కుల రక్షణ కోసం కృషి చేస్తూ, బాధితులకు భద్రత కల్పించిన జర్నలిస్టులు.
2. అగ్రికల్చర్ జర్నలిజం: వ్యవసాయ రంగంపై ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందించే విలేకరులు.
3. విద్యా జర్నలిజం: విద్యార్థులకు స్టడీ మెటీరియల్, బోధనా అంశాలు మరియు పరీక్షల సన్నద్ధతపై కథనాలు రాసేవారు.
4. వైద్య విభాగం (కంటెంట్ రైటర్స్): పేదలకు ఉచిత వైద్య సలహాలు, ఆరోగ్య అవగాహన కల్పించే కథనాలు రాసే వైద్యులు/రచయితలు.
5. క్రైమ్ జర్నలిజం: నేర సంబంధిత వార్తలు కవర్ చేస్తూ ప్రమాదాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న జర్నలిస్టులు.
6. ఫోటో జర్నలిజం: గుర్తింపు పొందిన ప్రెస్ ఫోటోగ్రాఫర్లు (ప్రచురితమైన ఫోటోల ఆధారంగా ఎంపిక ఉంటుంది).
7. సినిమా జర్నలిజం: ఫిల్మ్ రివ్యూలు, కంటెంట్ రైటర్లు మరియు సామాజిక సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు (RNI కార్డు తప్పనిసరి).
8. క్రీడా జర్నలిజం: క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, క్రీడారంగంపై ప్రత్యేక కథనాలు అందించే వారు.
9. స్ట్రింగర్/గ్రామీణ విలేకరి: గ్రామీణ సమస్యలపై ప్రత్యేక కథనాలు రాసే ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా విలేకరులు.
10. చిన్న పత్రికల ప్రోత్సాహం: RNI గుర్తింపు కలిగి, సామాజిక బాధ్యతతో నడుస్తున్న డైలీ, వీక్లీ, పక్ష, మాస పత్రికలు.
11. సామాజిక చైతన్యం: కళల ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తున్న జర్నలిస్టులు.
12. జంతు సంరక్షణ & బాలకార్మికుల నిర్మూలన: జంతువుల రక్షణ, బాలకార్మికుల విముక్తిపై కథనాలు రాసిన జర్నలిస్టులు.
13. మహిళా జర్నలిస్ట్ ప్రత్యేక గుర్తింపు: కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండి, ప్రస్తుతం మీడియాలో కొనసాగుతున్న మహిళా జర్నలిస్టులు.
14. సీనియర్ వీడియో జర్నలిస్ట్: 5 ఏళ్లకు పైగా అనుభవం ఉండి, కీలక వార్తా కథనాలు షూట్ చేసిన వీడియో జర్నలిస్టులు (ID కార్డు తప్పనిసరి).
15. తెలుగు న్యూస్ వెబ్‌సైట్: సొంతంగా వెబ్‌సైట్ నిర్వహిస్తూ కనీసం ఇద్దరు కంటెంట్ రైటర్లకు ఉపాధి కల్పిస్తున్న వారు.
16. యూట్యూబ్ ఛానల్ (సీనియర్ జర్నలిస్ట్): గతంలో సీనియర్ జర్నలిస్టులుగా పనిచేసి, ప్రస్తుతం సొంతంగా న్యూస్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వారు.
17. మానవీయ కోణంలో కథనం: పాఠకుల మనసులను తట్టి, ఆలోచింపజేసే మానవీయ కథనాలను రూపొందించిన వారు.
18. జర్నలిజంలో బహుముఖ ప్రజ్ఞాశాలి: జర్నలిస్టుగా ఉంటూనే కవి, రచయిత, ఎనలిస్ట్ వంటి బహుముఖ నైపుణ్యాలు కలిగిన వారు.
19. ఎడిటోరియల్ విభాగం: RNI గుర్తింపు పొందిన పత్రికల్లో సంపాదకీయాలు, ఎడిట్ పేజీ వ్యాసాలు రాసేవారు.
20. ప్రజాదరణ పొందిన పత్రిక: ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ మరియు ప్రజల ఆదరణ కలిగిన పత్రికలు.
21. పరిశోధనాత్మక పాత్రికేయులు: వ్యవస్థల్లోని అవినీతిని, దాగి ఉన్న నిజాలను వెలికితీసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు.
22. వెటరన్ జర్నలిస్ట్: జర్నలిజం రంగంలో అపారమైన అనుభవం, పట్టు కలిగిన సీనియర్లు.
23. న్యూస్ రీడర్: కేబుల్/న్యూస్ ఛానల్స్‌లో వార్తలు చదివే విధానంలో ప్రత్యేకత కలిగిన వారు.
24. ట్రావెల్ జర్నలిజం: చారిత్రక కట్టడాలు, కొత్త ప్రాంతాల విశేషాలను సోషల్ మీడియా/మీడియా ద్వారా అందించే వారు.
25. పౌర జర్నలిజం: వృత్తిపరమైన జర్నలిస్టులు కాకపోయినా, న్యూస్ యాప్స్ ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన పౌరులు.
26. ఆర్ట్స్ జర్నలిజం: కార్టూన్స్, పెయింటింగ్, గ్రాఫిక్స్ మరియు సాంస్కృతిక విభాగాల్లో పనిచేసే వారు.
27. పొలిటికల్ రిపోర్టింగ్: రాజకీయ అంశాలను ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే రిపోర్టర్లు (3 క్లిప్పింగ్స్ జతచేయాలి).
28. పర్యావరణ పరిరక్షణ: పర్యావరణాన్ని కాపాడే దిశగా కథనాలు రాసిన వారు (3 క్లిప్పింగ్స్ జతచేయాలి).
29. టాబ్లాయిడ్ జర్నలిజం: ప్రధాన పత్రికల అనుబంధ విభాగాల్లో (వసుంధర, ఫ్యామిలీ, చెలి వంటివి) ప్రత్యేక కథనాలు రాసేవారు.
30. స్ట్రింగ్ ఆపరేషన్ జర్నలిజం: రహస్య కెమెరాల ద్వారా అవినీతిని, అక్రమాలను సాహసోపేతంగా బయటపెట్టిన వారు.
31. సమీక్షా జర్నలిస్టులు: ప్రధాన వార్తలను లోతుగా విశ్లేషిస్తూ సోషల్ మీడియా/ఛానల్స్ ద్వారా వివరించే వారు.
32. బిజినెస్/ఎకనామిక్ జర్నలిజం: ఆర్థిక అంశాలు, స్టాక్ మార్కెట్, బడ్జెట్ విశ్లేషణ చేసే నిపుణులు.
33. డేటా జర్నలిజం: గణాంకాలు, ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా వార్తలను విశ్లేషించే వారు.
34. ఫ్యాక్ట్ చెకింగ్ & సైన్స్: తప్పుడు వార్తలను అరికట్టే వారు మరియు సైన్స్ & టెక్నాలజీ అంశాలను వివరించే వారు.

*35.జర్నలిస్ట్ & కథా రచయిత*
      జర్నలిస్ట్ అయ్యిండి, ప్రత్యేక విషయాలు, సంఘటనలు,చారిత్రక కధనాలు మరియు వార్తా కధనాలు బై లైన్ ఆధారంగా ప్రచురణ కాబడి ఉన్నవారు.

*36. ది బెస్ట్ న్యూస్ ఎడిటర్ (కేబుల్ టీ.వి)*:
      కేబుల్ టీవీ రంగంలో సిటీ కేబుల్,ఇతర కేబుల్ టి.వి లలో న్యూస్ ఎడిటర్స్ కొరకు, న్యూస్ బులెటిన్స్ ఆధారంగా ఎంపిక.

*37.మహిళలకు ప్రత్యేక ఎంపిక*
         న్యూస్ యాంకర్, న్యూస్ ప్రెజెంటర్,వాయిస్ ఓవర్.

*38.ది బెస్ట్ న్యూస్ డిబేట్ నిర్వాహకులు*
       సామాజిక విషయాలపై మంచి మంచి డిబేట్స్ నిర్వహించే  ఛానల్స్.


39. ది బెస్ట్ ప్రెస్ క్లబ్: జర్నలిస్టుల సంక్షేమం కోసం వివాద రహితంగా పనిచేస్తున్న రిజిస్టర్డ్ ప్రెస్ క్లబ్‌లు.
40. జీవిత సాఫల్య పురస్కారం: 25-30 ఏళ్ల నిరంతర సేవ, మచ్చలేని వ్యక్తిత్వం మరియు కొత్త తరానికి మార్గదర్శకులుగా నిలిచిన వారు.



📅 నామినేషన్ చివరి తేదీ:
👉 05 ఏప్రిల్ 2026

🌐 వెబ్‌సైట్:
👉 www.tjss.co.in
 
నామినేషన్ పత్రాలు పంపించండి :

పూర్తి చేసిన నామినేషన్ పత్రాలు వాట్సప్ ద్వారా గానీ, ఇమెయిల్ ద్వారా గానీ, పోస్టల్ అడ్రస్ కు గానీ పంపించగలరు.

#గడ్డం సత్యనారాయణ
C/O తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం 
ప్లాట్ నంబర్. 81, రోడ్డు నంబర్. 2, శుభోదయ కాలనీ, కుంట్లూర్ రోడ్డు, హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా,  తెలంగాణ 501505.
ఫోన్ : 9505021222


📩వాట్సప్ : 7036602022

ఇమెయిల్ ఐడి : tjss6602022@gmail.com


పత్రికా ప్రకటన :

*ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ‘ఉగాది పురస్కారాలు - 2026’*: 

అర్హుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం

తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు ఇది సువర్ణావకాశం

దరఖాస్తుకు చివరి తేదీ: 05-ఏప్రిల్ -2026

అమరావతి/హైదరాబాద్:
ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ, అక్షరాయుధాలతో సమాజాన్ని చైతన్యపరుస్తున్న జర్నలిస్టులను  గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు పేర్కొన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన జర్నలిస్టులకు ఉత్తమ తెలుగు జర్నలిస్టు పురస్కారాలు  అందజేయనున్నట్లు  గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రంగనాయకులు మాట్లాడుతూ.. "కేవలం నిరసనలు, పోరాటాలకే పరిమితం కాకుండా, వృత్తిపరంగా జర్నలిస్టులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 2023లో ఈ పురస్కారాల ప్రక్రియను ప్రారంభించాం. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ నగరాల్లో విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించాం. అదే స్పూర్తితో ఈ ఏడాది (2026) కూడా ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నాం" అని వెల్లడించారు. సమాజాన్ని తన అక్షరాస్రాలతో చైతన్యపరిచే కలం యోధులకు ఈ పురస్కారాలు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటాయని అశాభావం వ్యక్తం చేసిన ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలోని జర్నలిస్టులు ఈ సువర్ణావకాశం  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాల నుంచి 40 విభాగాలలో వివిధ రకాల ఉత్తమ తెలుగు  జర్నలిస్టులను ఎంపిక చేసి పురస్కారాలు అందించబడతాయని, అందుకు అర్హులైన తెలుగు జర్నలిస్టుల నుండి నామినేషన్ పత్రాలు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.  
 అందిన దరఖాస్తులను ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి, అర్హులైన వారిని విజేతలుగా ఎంపిక చేయనున్నట్లు వివరించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేయబోతున్నట్లు తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు తమ దరఖాస్తులను, సంబంధిత ఆధారాలను జత చేస్తూ.. వాట్సప్ ద్వారా గానీ, ఇమెయిల్ ద్వారా గానీ, పోస్టల్ చిరునామా ద్వారా గానీ,  *ఏప్రిల్ 05, 2026 సాయంత్రం 7 గంటల లోపు* పంపాల్సి ఉంటుందన్నారు. అలాగే  దరఖాస్తుదారులు తాము ఏ విభాగానికి పోటీ పడుతున్నారో నామినేషన్ పత్రం పై స్పష్టంగా రాయాలని సూచించారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం కలిగిన జర్నలిస్టులకు ఈ పురస్కారాలు మరింత ఉత్తేజాన్నిస్తాయని రంగనాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇట్లు..,
మీడియా కోఆర్డినేటర్,
*తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం*.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ. 7036602022.

Friday, March 20, 2026

*_తెలంగాణ రాష్ట్ర బడ్జెట్-2026-27_*

*తెలంగాణ రాష్ట్ర బడ్జెట్-2026-27*

*తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందజేసిన ఉప ముఖ్యమంత్రి,  ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు.*

రూ. 3,24,234 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

మూలధన వ్యయం - రూ. 47,267 కోట్లు

రెవెన్యూ వ్యయం - రూ. 2,34,406 కోట్లు

వ్యవసాయ శాఖ - రూ. 23,179 కోట్లు

విద్యుత్ శాఖ - రూ. 21,285 కోట్లు

పౌరసరఫరాల శాఖ - రూ. 7,366 కోట్లు

పశుసంవర్ధక శాఖ - రూ. 1,529 కోట్లు

విద్యా శాఖకి 26, 674 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖకు 13679 కోట్లు

కార్మిక శాఖకు 998 కోట్లు

మహిళా శిశు సంక్షేమ శాఖ కి 3143 కోట్లు

షెడ్యూల్ కులాలకు 11784 కోట్లు

షెడ్యూల్ తెగలకు 7937 కోట్లు

వెనక బడిన తరగతులకు 12511 కోట్లు 

మైనార్టీ సంక్షేమానికి 3769 కోట్లు

రాజీవ్ యువ వికాసం కు 6వేల కోట్లు

గృహ నిర్మాణానికి 7430 కోట్లు

ఐటీ శాఖకు 875 కోట్లు

పరిశ్రమల శాఖకి 3490 కోట్లు

చేనేత శాఖకు 258 కోట్లు

పంచాయతీ రాజ్ శాఖ కు 33,688 కోట్లు 

ఇరిగేషన్ కు 22,615 కోట్లు

రవాణా రోడ్డు భవనాల శాఖకి 12,789 కోట్లు

న్యాయ శాఖకు 2367 కోట్లు 

పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు 

హోం శాఖకు 11,907 కోట్లు

గోదావరి పుష్కరాలకు 500 కోట్లు

పర్యాటక శాఖకు 1224 కోట్లు

6 గ్యారంటీలకు 50,713 కోట్లు

రైతు భరోసాకు 18,000 కోట్లు

చేయుతకు 14,861 కోట్లు

ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు

మహాలక్ష్మికి 4,305 కోట్లు 

సన్న వడ్ల బోనస్ కు 3,500 కోట్లు

గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) 2,080 కోట్లు

రాజీవ్ ఆరోగ్య శ్రీ 1,143 కోట్లు

మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ 723 కోట్లు

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు 600 కోట్లు 

పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు

బియ్యం సబ్సిడీ 3,000 కోట్లు

కల్యాణలక్ష్మి / షాది ముబారక్ 3,683 కోట్లు

విద్యార్థుల డైట్ ఛార్జీలు 2,170 కోట్లు

స్కాలర్‌షిప్‌లకు 4,343 కోట్లు

తప్పనిసరి కార్యాలయ ఖర్చులు 2,323 కోట్లు

 పంచాయతీరాజ్ రోడ్లకు 2, 062 కోట్లు

రోడ్లు భవనాల శాఖకు 6416 కోట్లు

హ్యాంమ్ రోడ్లకు 3053 కోట్లు

రీజనల్ రింగ్ రోడ్డుకు 1525 కోట్లు

రాజీవ్ యువ వికాసానికి 5800 కోట్లు 

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు 5000 కోట్లు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు 

పంట బీమా పథకానికి 1886 కోట్లు 

మూసి రివర్ ఫ్రంట్ కు 1500 కోట్లు

CURE ఏరియా అభివృద్ధికి 2654 కోట్లు

ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు 

ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు 1056 కోట్లు

ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 1500 కోట్లు

*ఈ బడ్జెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క*

 *రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమాను జూన్ 2 నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క*