Monday, August 31, 2026

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్1వ తేదీ నాటికి విజయవంతంగా 1000 రోజుల మైలురాయిని చేరుకుంది_

*వెయ్యి రోజుల ప్రజాపాలన..*

*సంక్షేమం నుంచి ప్రపంచస్థాయి తెలంగాణ*

*ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్1వ తేదీ నాటికి విజయవంతంగా 1000 రోజుల మైలురాయిని చేరుకుంది.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 31:

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల మైలురాయిని చేరుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్నిర్మించడం, సంక్షేమాన్ని విస్తరించడం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, రైతులు–మహిళలు–యువతకు భరోసా కల్పించడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడం, భవిష్యత్తు తెలంగాణకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించడంలో ఈ వెయ్యి రోజుల పాలన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చుఏసింది.
**ఆర్థిక ప్రగతి – బలపడుతున్న తెలంగాణ*
2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరింది. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే దాదాపు 91 శాతం అధికం.సంక్షేమాన్ని కొనసాగిస్తూనే పెట్టుబడులు, ఉపాధి, మౌలిక సదుపాయాలు, సాంకేతిక      రంగాల విస్తరణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు.రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో సాధించిన సమష్టి ప్రగతి.
**రైతన్నకు అండ.. వ్యవసాయంలో తెలంగాణ నంబర్‌–1*.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ. 25 లక్షలకుపైగా      రైతు కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి.రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం. ఒకే విడతలో 9 రోజుల్లో      దాదాపు రూ.9 వేల కోట్ల జమ.సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతు      బీమాతో నిరంతర భరోసా.గడిచిన 32 నెలల కాలానికి      సంబంధించిన లెక్కల ప్రకారం వ్యవసాయం, రైతు సంక్షేమానికి      దాదాపు రూ.1.68 లక్షల కోట్ల వ్యయం.వరి సాగు, ఉత్పత్తిలో పంజాబ్‌ను      అధిగమించి దేశంలో నంబర్‌–1గా తెలంగాణ. గత యాసంగిలో 81.12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి కొత్త రికార్డు.కృష్ణా, గోదావరి జలాల్లో      తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం రాజీలేని పోరాటం.యూరియా కొరత వంటి క్లిష్ట పరిస్థితులను అర్థం      చేసుకుని ప్రభుత్వానికి సహకరించిన రైతన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
**మహిళా సాధికారతలో కొత్త అధ్యాయం*
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత      ప్రయాణం. 335 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు; మహిళలకు దాదాపు రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం      ఆదా.గృహజ్యోతి కింద 53 లక్షలకుపైగా      కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.రాష్ట్రంలోని 4.54 లక్షల మహిళా      సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60,487 కోట్ల      రుణాలు. రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ.
పాఠశాల యూనిఫాంలు, చీరల తయారీ      నుంచి పెట్రోలు బంకులు, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వరకు      మహిళా సంఘాలకు కొత్త వ్యాపార అవకాశాలు.కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న      లక్ష్యంతో మహిళలను తెలంగాణ ఆర్థిక ప్రగతిలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దే      దిశగా ప్రభుత్వం.
**ఆహార భద్రత – ప్రతి పేద కుటుంబానికి భరోసా*
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 15 లక్షలకుపైగా కొత్త రేషన్‌ కార్డుల జారీ.దాదాపు 3.38 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రత.
రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం      పంపిణీతో దేశానికి కొత్త నమూనాగా తెలంగాణ.
ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ.
**సామాజిక భద్రతను మరింత విస్తరిస్తూ కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు.*
మొత్తం 43 లక్షలకుపైగా      వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు,      ఇతర అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు.
**ఇందిరమ్మ ఇండ్లు – పేదవాడి సొంతింటి కలకు భరోసా*
తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ      ఇండ్ల నిర్మాణం. అర్హమైన ప్రతి కుటుంబానికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం.గిరిజనులు, చెంచులు, అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం.
**హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల      టవర్ల నిర్మాణానికి భారీ ప్రణాళిక.*

**సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు*
రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి,      రాజకీయ, కుల సర్వే నిర్వహించి కులాల వారీ      సామాజిక స్థితిగతుల వెల్లడి.సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, ఎస్సీ      వర్గీకరణ అమలు చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ.బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే      బిల్లులకు శాసనసభ ఆమోదం.
12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల      సవరణతో దాదాపు కోటి 11 లక్షల మంది కార్మికులకు      ప్రయోజనం.
గిగ్‌ కార్మికులకు చట్టబద్ధ గుర్తింపు, సంక్షేమ బోర్డు, సామాజిక భద్రత కల్పించే      ప్రత్యేక చట్టం.
**విద్యలో సంస్కరణలు.. ప్రభుత్వ బడులకు కొత్త రూపం*
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్‌      గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి పురోగతి.ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌      రెసిడెన్షియల్‌ స్కూల్‌. 105 స్కూళ్ల మంజూరు.ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు; తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లతో ప్రభుత్వ విద్యకు కొత్త రూపం.ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 22 లక్షలకుపైగా విద్యార్థులకు అల్పాహారం, పాలు,      పోషకాహారం. రూ.720 కోట్ల కేటాయింపు.సంక్షేమ హాస్టళ్లలో డైట్‌ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్‌ ఛార్జీలు 212 శాతం పెంపు.
**మెగా డీఎస్సీ ద్వారా 10,006 మంది ఉపాధ్యాయుల నియామకం.*
దాదాపు 11 లక్షల మంది      విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌.      ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్ల      కేటాయింపు.
**యువతకు ఉద్యోగాలు – నైపుణ్యాలకు కొత్త వేదిక*
ప్రజా ప్రభుత్వ తొలి వెయ్యి రోజుల్లో 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. గ్రూప్‌–1 నుంచి డీఎస్సీ వరకు కీలక నియామకాల పూర్తి.టీజీపీఎస్సీ ద్వారా మరో 456 పోస్టులు, పోలీసు నియామక బోర్డు ద్వారా 7,437      పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో 1,190 మంది శిక్షణ పూర్తి చేయగా 838 మందికి ప్రముఖ      సంస్థల్లో ఉద్యోగాలు.65 ప్రభుత్వ ఐటీఐలు, 57 పాలిటెక్నిక్‌ కాలేజీలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా      తీర్చిదిద్దడం.యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌      స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌      డిస్ట్రిక్ట్‌తో క్రీడా రంగానికి కొత్త దిశ.
**వైద్య రంగంలో భారీ విస్తరణ – సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు అండ*
రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌లో మూడు టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు.తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు; మరో 17 కాలేజీల నిర్మాణం.
నిమ్స్‌లో 2,000 కిడ్నీ మార్పిడి      శస్త్రచికిత్సల మైలురాయి.
2023 డిసెంబర్‌ 7     నుంచి 2026 ఆగస్టు 12 వరకు      ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5,18,186 మందికి రూ.2,526.12 కోట్ల సాయం.
సీఎంఆర్‌ఎఫ్‌ వైద్య రీయింబర్స్‌మెంట్‌ ద్వారా 4,78,789 మంది పేద రోగులకు రూ.1,635.34 కోట్లు;      39,712 మందికి రూ.798.41 కోట్ల ఎల్‌ఓసీలు.
**ఆహార కల్తీపై ఉక్కుపాదం – కొత్తగా టీజీ సేఫ్‌ ఆహార కల్తీపై తనిఖీలు,శాంపిల్‌ పరీక్షలు, కఠిన చర్యలు.*
ఆహార కల్తీ, డ్రగ్స్‌ ముప్పును      సమగ్రంగా ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్‌ సంస్థ ఏర్పాటు.
ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్‌ నియంత్రణను ఒకే వ్యవస్థ కిందకు తీసుకువచ్చి లీగల్‌, ల్యాబొరేటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలతో      బలోపేతం.
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై విస్తృత దాడులు, కఠిన చట్టపరమైన చర్యలు.
**డ్రగ్స్‌పై రాజీలేని పోరాటం – విద్యాసంస్థలకూ బాధ్యత*
డ్రగ్స్‌పై ఈగల్‌ వ్యవస్థ ద్వారా ప్రత్యేక పోరాటం.      సైబర్‌ నేరాలు, మహిళలు, పిల్లల      భద్రతకు ప్రత్యేక పోలీసింగ్‌.
పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో యాంటీ డ్రగ్‌ అండ్‌ సేఫ్టీ కమిటీలు తప్పనిసరి      చేసే దిశగా చర్యలు.ప్రతి విద్యాసంస్థలో క్యాంపస్‌ కోఆర్డినేటర్లు, స్పాటర్ల ఏర్పాటు; విద్యార్థుల్లో అనుమానాస్పద      ప్రవర్తనా మార్పులను గుర్తించి విద్యాశాఖ, పోలీసులకు      సమాచారం.
విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేసే      విద్యాసంస్థలపై గుర్తింపు సస్పెన్షన్‌ వరకు చర్యలు.
**ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు ప్రత్యేక వ్యవస్థ*
పట్టణాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ, హైవేలు–ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాలను తగ్గించేందుకు కొత్తగా టీజీ      ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరో.పట్టణ ట్రాఫిక్‌ నిర్వహణ, హైవే పెట్రోలింగ్‌, ప్రమాదాల నివారణకు అవసరమైన      నిధులు, ఆధునిక సదుపాయాలతో ప్రత్యేక వ్యవస్థ.ప్రజలకు సాఫీగా, సురక్షితంగా      ప్రయాణం అందించడం ప్రధాన లక్ష్యం.
**ప్రజల వద్దకే పాలన – మండల స్థాయికి ప్రజావాణి*
రాష్ట్ర, జిల్లా, డివిజన్‌ స్థాయి ప్రజావాణి విజయవంతమైన నేపథ్యంలో ప్రజల సమస్యలను వారి      మండలంలోనే పరిష్కరించేలా అన్ని ఎంపీడీవో కార్యాలయాలకు మండల ప్రజావాణి      విస్తరణ.ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులంతా ఒకేచోట      అందుబాటులో ఉండి అర్జీల పరిష్కారం. చిన్న సమస్యల కోసం ప్రజలు జిల్లా, రాష్ట్ర స్థాయికి వెళ్లాల్సిన అవసరం తగ్గింపు.త్వరలో ఆన్‌లైన్‌ ప్రజావాణి పోర్టల్‌.      రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఆన్‌లైన్‌లో అర్జీల నమోదు. అర్జీల పరిష్కార పురోగతిపై ప్రత్యేక డాష్‌బోర్డు.   ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిరంతర      పర్యవేక్షణ.99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో 12,758      గ్రామసభలు, 3,175 వార్డుసభల నిర్వహణ.
**భూ పరిపాలన – ఉద్యోగులకు భరోసా – డిజిటల్‌ గవర్నెన్స్‌*
భూ భారతి చట్టం, భూధార్‌,      ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు. 3.76 లక్షల      కొత్త పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ జారీ.ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందించేలా ఆర్థిక      క్రమశిక్షణ.కొన్నేళ్లుగా పేరుకుపోయిన రిటైర్డ్‌ ఉద్యోగుల      బకాయిల్లో వంద రోజుల్లో రూ.600 కోట్ల చెల్లింపు.
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య      భద్రతకు ఎంప్లాయీ హెల్త్‌ స్కీమ్‌.
ప్రభుత్వ ఆదాయం పెంచడం నుంచి సంక్షేమ పథకాలను      చివరి లబ్ధిదారుడికి చేర్చడం వరకు కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేక అభినందనలు.36 సచివాలయ శాఖల్లో 100 శాతం ఈ-ఆఫీస్‌.
దేశంలో తొలి పూర్తిస్థాయి డిజిటల్‌ కేబినెట్‌.      వాట్సాప్‌లో 581కిపైగా ప్రభుత్వ సేవలు.
**ఆదాయ లీకేజీలకు చెక్‌ – ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు*
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టకుండా      విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖల్లో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌      విభాగాల ఏర్పాటు.
పౌరసరఫరాలు, మైన్స్‌ అండ్‌      మినరల్స్‌, జీఎస్టీ తదితర రంగాల్లో ఆదాయ నష్టాలు,      ఎగవేతలను గుర్తించి అరికట్టే ప్రత్యేక చర్యలు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచి అదే వనరులను ప్రజా      సంక్షేమం, అభివృద్ధికి వినియోగించాలన్న ప్రభుత్వ లక్ష్యం.
**ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు*
హైదరాబాద్‌ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్డు.
రాష్ట్రవ్యాప్తంగా 6,092     కిలోమీటర్ల హ్యామ్‌ రోడ్ల ప్రణాళిక.హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణ. మామునూరు విమానాశ్రయం, ఆదిలాబాద్‌ ఎయిర్‌ఫీల్డ్‌ అభివృద్ధి.
మూసీ పునరుజ్జీవనంలో 55 కిలోమీటర్ల సమగ్ర అభివృద్ధి; 39 కొత్త      ఎస్టీపీలు.
గోదావరి నుంచి 2.5 టీఎంసీల      స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించే ప్రణాళిక.
**పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ*
బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌లో కీలక      రంగాల్లో తెలంగాణ టాప్‌ అచీవర్‌.
టీజీ-ఐపాస్‌ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు.తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు.టీజీఐఐసీ భూముల్లో రూ.92,281 కోట్ల పెట్టుబడులు; 78 వేలకుపైగా ఉద్యోగ      అవకాశాలకు మార్గం.నెక్స్ట్‌-జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీతో రూ.73,360 కోట్ల పెట్టుబడులు, 3.5 లక్షల ఉద్యోగ అవకాశాల      లక్ష్యం.తెలంగాణపై విశ్వాసంతో పెట్టుబడులు పెడుతున్న దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కృతజ్ఞతలు.
**ఐటీ – ఏఐ – గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లలో దూసుకెళ్తున్న తెలంగాణ*
2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97      లక్షల కోట్లు. 12.14 లక్షల ప్రత్యక్ష ఐటీ      ఉద్యోగాలు.హైదరాబాద్‌లో 355కిపైగా గ్లోబల్‌      కెపాబిలిటీ సెంటర్లు. 2026లోనే మరో 40 కొత్త కేంద్రాలు హైదరాబాద్‌ను ఎంచుకోవడం.
డేటా సెంటర్లు, క్లౌడ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో దేశంలో అత్యంత వేగంగా      ఎదుగుతున్న గమ్యస్థానాల్లో తెలంగాణ.అమెజాన్‌ నుంచి తెలంగాణకు అదనంగా 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి.దేశంలో తొలి స్టేట్‌ ఏఐ డేటా ఎక్స్చేంజ్‌–టీజీడెక్స్‌      ఏర్పాటు.
**పర్యాటకం – తెలంగాణ సంస్కృతికి కొత్త గుర్తింపు*
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సమగ్ర టూరిజం      పాలసీ–2025.ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల      పెట్టుబడుల లక్ష్యం పెట్టుకోగా తొలి ఏడాదిలోనే రూ.23,174 కోట్ల పెట్టుబడులు.యువ టూరిజం క్లబ్‌ల ఏర్పాటులో తెలంగాణ దేశంలో      నంబర్‌–1.
*‘జయ జయహే తెలంగాణ’ గీతానికి అధికారిక      గౌరవం. తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ.*
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి సముచిత గౌరవం      కల్పించేందుకు ప్రత్యేక కమిటీ.
**తెలంగాణ రైజింగ్‌–2047.. వెయ్యి రోజుల తర్వాత మరింత పెద్ద లక్ష్యం*
వెయ్యి రోజుల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి వేసిన పునాదులపై      భవిష్యత్తు తెలంగాణ నిర్మాణం.2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్‌      డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌      డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యం.క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ అభివృద్ధి వలయాలతో హైదరాబాద్‌ నుంచి గ్రామీణ తెలంగాణ వరకు      సమగ్ర అభివృద్ధి.భారత్‌ ఫ్యూచర్‌ సిటీని దేశంలో తొలి నెట్‌-జీరో      స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళిక.ఏఐ సిటీ, డేటా సెంటర్లు,      రీజనల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రెండో దశ,      మూసీ పునరుజ్జీవనం, యంగ్‌ ఇండియా      స్కిల్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీతో      భవిష్యత్తు తెలంగాణకు బలమైన పునాదులు.

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి_

*తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి*

*దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమావేశం*

*₹50,870 కోట్ల అంచనా వ్యయంతో, 2,023 కి.మీ మేర విస్తరించి ఉన్న 17 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు (DPRలు)*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 31:

రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించేందుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం నాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్ మరియు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలు, భూసేకరణ, వివిధ శాఖల నుండి అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులు మరియు ప్రాజెక్టుల సకాలంలో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సహకారం వంటి అంశాలపై చర్చించారు.తెలంగాణ ఆర్థిక, పారిశ్రామిక మరియు ప్రాంతీయ అభివృద్ధికి రైల్వే అనుసంధానం అత్యంత కీలకమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను మరియు జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ₹50,870 కోట్ల అంచనా వ్యయంతో, 2,023 కి.మీ మేర విస్తరించి ఉన్న 17 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ DPRలను రైల్వే బోర్డుకు సమర్పించినట్లు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు.
**పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి*
రైల్వే అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం, అప్రోచ్ రోడ్లు, రోడ్ల విస్తరణ, రైల్వే లైన్ల డబ్లింగ్, చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రజా రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడం వంటి సుమారు 21 సమస్యలను ఈ సమావేశంలో సమీక్షించారు.పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తగిన పరిష్కారాలను గుర్తించేందుకు, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సంయుక్త తనిఖీలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఫ్యూచర్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాంతాలలో రైల్వే లైన్ల విస్తరణకు తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే ప్రాజెక్టుల అమలును సులభతరం చేయడానికి పురపాలక పరిపాలన, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్ (HMWSSB), రెవెన్యూ, ఇంధన, రోడ్లు & భవనాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కూడా ఆయన సూచించారు.ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరంతర సమన్వయం పాటించాలని ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అవసరమైన సహకారం, మద్దతు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
**పిఎమ్ PM గతి శక్తి కింద నిధుల సమీకరణ*
భారత ప్రభుత్వ 'పిఎమ్ గతి శక్తి' (PM Gati Shakti) పథకం కింద నిధులను పొందేందుకు సమగ్రమైన 'వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికల'ను (DPRs) సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అలాగే, నగరం యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని MMTS విస్తరణ, హైదరాబాద్ చుట్టూ ఉన్న ORR మరియు RRR ప్రాంతాలలో రైల్వే టెర్మినళ్ల ఏర్పాటు, మరియు బుల్లెట్ ట్రైన్ కారిడార్లతో సహా భవిష్యత్తు రైల్వే అనుసంధానానికి అవసరమైన భూసేకరణ కోసం సమగ్ర DPRలను రూపొందించాలని ఆయన సూచించారు.రాష్ట్ర భవిష్యత్తు వృద్ధి మరియు అభివృద్ధికి అత్యవసరమైన రైల్వే మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.ఈ సమావేశంలో GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, TGIIC MD శశాంక, RTC MD నాగిరెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, మేడ్చల్-మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సిటీ పోలీస్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, నిర్మల్, జనగాం మరియు వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, అలాగే దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సేవలను గుర్తుచేసుకుంటూ ఘనంగా సన్మానం చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, IPS_

*సైబరాబాద్‌లో ఐదుగురు పోలీస్ అధికారుల పదవీ విరమణ*

*సేవలను గుర్తుచేసుకుంటూ ఘనంగా సన్మానం చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, IPS.*

బాపట్ల కృష్ణమోహన్, ఆగస్టు 31:

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీస్ అధికారులకు వీడ్కోలు కార్యక్రమం సోమవారం సైబరాబాద్ సీపీ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.పదవీ విరమణ పొందుతున్న SI ఎం. రవీందర్ రెడ్డి (కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్), SI పి. విజయ్ భాస్కర్ రెడ్డి (SB సైబరాబాద్), RSI ఫరీద్ ఖాన్ (సైబరాబాద్ CAR హెడ్‌క్వార్టర్స్), ASI టి. కేశవులు (అత్తాపూర్), HG ఏబీ శర్మ (బాలానగర్ ట్రాఫిక్)లను పోలీస్ శాఖ ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన అధికారులు పదవీ విరమణ పొందడం ఒక కొత్త జీవిత అధ్యాయానికి నాంది అని అన్నారు. విధి నిర్వహణలో అధికారులు అందించిన సేవలు, అనుభవం పోలీస్ శాఖకు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు తమ విధులను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో వారి సహధర్మచారులు, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని సీపీ అన్నారు. కుటుంబ సభ్యుల మద్దతు లేకుండా పోలీసు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు.పదవీ విరమణ అనంతరం అధికారులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందంగా సమయం గడపాలని సీపీ సూచించారు. ఖాళీగా ఉండకుండా సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి తమ వంతు సేవ చేయాలని కోరారు. హైదరాబాద్ నగరం, సైబరాబాద్ ప్రాంతం అభివృద్ధిలో పోలీస్ శాఖ కూడా తన వంతు కీలక పాత్ర పోషించిందని, ఆ అభివృద్ధిలో భాగస్వాములైన పోలీస్ అధికారులు గర్వపడాలని సీపీ అన్నారు.
 పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి అందే రిటైర్మెంట్ ప్రయోజనాలు, డబ్బులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. పోలీస్ శాఖకు అవసరమైన సందర్భాల్లో పదవీ విరమణ పొందిన అధికారులు తమ అనుభవం, సూచనలతో శాఖకు సహకరించాలని సీపీ కోరారు. అనంతరం పదవీ విరమణ పొందిన అధికారులను సీపీ సన్మానించి, వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ శ్రీమతి అన్నపూర్ణ, ఎస్ బీ డీసీపీ సుధీంద్ర,  హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్  , హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ షమీర్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ తో నెరవేరిన సొంత ఇంటి కల 16 నియోజకవర్గాల్లో 7340 ఫ్లాట్ల (flats) కేటాయింపు_

*ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ తో నెరవేరిన సొంత ఇంటి కల 16 నియోజకవర్గాల్లో 7340 ఫ్లాట్ల (flats)  కేటాయింపు*

*నాలుగు రోజుల పాటు కొనసాగిన లాటరీ ప్రక్రియ పారదర్శకంగా,నిష్పాక్షపాతం గా ఎంపిక*

బాపట్ల కృష్ణమోహన్, ఆగస్టు 31:

అవుటర్ రింగ్ రోడు పరిధిలో ఉన్న  అల్పాదాయ వర్గాల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లో 7340 మంది కి ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. నగరంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  నాలుగు రోజుల పాటు నిర్వహించిన లాటరీ ప్రక్రియ సోమవారం నాడు ముగిసింది. గౌరవనీయ రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగస్టు 28 వ తేదీ నాడు  లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మినహాయించి మిగిలిన 15 నియోజకవర్గాల్లో 480 ఇండ్ల చొప్పున  కేటాయించారు. కంటోన్మెంట్ పరిథిలో తొలివిడతలో 140 ఇండ్లను మాత్రమే నిర్మిస్తున్నందున ఆ సంఖ్యలోనే ఇండ్లను కేటాయించారు.ప్రతి నియోజకవర్గంలోనూ, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారికే ఇండ్లు కేటాయించాలన్న ఉద్దేశ్యంతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టి, హౌసింగ్ బోర్డు ద్వారా దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇలా అందుబాటులో ఉన్న స్థలాల్లో ప్రతిపాదించిన మొత్తం 7340 ఇండ్లకు గాను,  60,720 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో అర్హులైన వారి పేర్లతో పూర్తి  పారదర్శకంగా,నిష్పాక్షపాతం గా, బహిరంగంగా లాటరీ నిర్వహించి ఇండ్లను కేటాయించారు.ఆగస్టు 28 వ తేదీ నుంచి 31 వరకు ఆయా నియోజకవర్గాల్లోనే దరఖాస్తుదారులు, అధికారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ జరిగింది. లాటరీ నిర్వహణ ప్రక్రియపై దరఖాస్తుదారుల్లో సంతృప్తి వ్యక్తం కాగా, లాటరీ ద్వారా ఇండ్లు పొందిన కుటుంబాల్లో పండుగ సీజన్ ను మరింత సంతోషాలను నింపింది.
అవుటర్ రింగ్ రోడ్ పరిథిలో మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 16 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు పూర్తి కాగా,  4 నియోజకవర్గాల్లో(mention the constituency names) ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మిగిలిన  నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే  వెలువడనున్నది.
**ఆన్ లైన్ లో వివరాలు....అభ్యంతరాల స్వీకరణ*
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో లాటరీ ద్వారా ఇండ్లు పొందిన వారి వివరాలన్నిటినీ tghb.telangana.gov.in లో ప్రజలకు అందుబాటులో  ఉంచుతున్నామని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి. గౌతం తెలిపారు. ఇలా ఎంపికైన vaaru meedha ప్రజలు తమ అభ్యంతరాలను తెలియచేసే అవకాశం కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ అభ్యంతరాలను కూడా వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లోనే సమర్పించవచ్చన్నారు. 
అలాగే , లాటరీలో ఎంపికైన దరఖాస్తు దారుల వివరాలను పరిశీలించడానికి అధికారుల బృందం క్షేత్ర స్థాయి పరిశీలనను చేపడుతుందని ఆయన వెల్లడించారు. పూర్తి పారదర్శకంగా, అర్హులైన వారికే ఇండ్లు లభించేలా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. లాటరీలో ఇండ్లు వచ్చిన వారు క్షేత్ర స్థాయిలో తమ ఇండ్లకు వచ్చే అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
*త్వరలో మరిన్ని ప్రాజెక్టులు*
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కోసం దరఖాస్తు చేసుకుని, లాటరీ ప్రక్రియలో ఇండ్లు రాని వారు ఏమాత్రం నిరుత్సాహం చెందవద్దని, త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులను చేపడతామని, అందులో  ఇండ్లు వచ్చే అవకాశం ఉందని బోర్డు వైస్ ఛైర్మన్ విపి గౌతం తెలిపారు.  ఇలా అర్హులైన వారికి ఇండ్లను నిర్మించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన వివరించారు.

"50,565 ఎకరాలు మరియు లక్ష ఇళ్లు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయా? అయితే పూర్తి జాబితాను బహిర్గతం చేయండి"_

*ప్రెస్ నోట్*

*“50,565 ఎకరాలు మరియు లక్ష ఇళ్లు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయా? అయితే పూర్తి జాబితాను బహిర్గతం చేయండి”*

*ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉంది - వి. రవికృష్ణ న్యాయవాది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 30:

మాజీ మంత్రి టి. హరీశ్‌రావు మరియు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇటీవల సుమారు 50,565 ఎకరాల వ్యవసాయ భూములు, దాదాపు లక్ష ఇళ్లు సెక్షన్ 22-A ప్రొహిబిటెడ్ లిస్టులో చిక్కుకున్నాయని ఆరోపిస్తూ, వాటిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. సమస్య పరిష్కారం కాకపోతే సంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని కూడా హెచ్చరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వ రికార్డులు ఏమి చెబుతున్నాయో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.నేను అమీన్‌పూర్ మరియు పటాన్‌చెరు మండలాలకు సంబంధించిన సమీకృత ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ రికార్డులను సర్వే నంబర్ వారీగా పరిశీలించాను.
*ఆ రికార్డుల ప్రకారం:*

**అమీన్‌పూర్ మరియు పటాన్‌చెరు మండలాలు**

*(1)*: వ్యవసాయ భూములు: 1,631.6690 ఎకరాలు.
*(2)*:  వ్యవసాయేతర భూములు / ప్లాట్లు: 673.3775 ఎకరాలు.
*(3)*: మొత్తం: 2,305.0465 ఎకరాలు.
అంటే మొత్తం విస్తీర్ణం సుమారు 1,11,56,425.06 చదరపు గజాలు.
*అయితే ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని ప్రజలు గమనించాలి.*
ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న ప్రతి ఆస్తిని  *“ప్రైవేట్ వ్యవసాయ భూమి”* గా పేర్కొనడం సరైనది కాదు. రికార్డుల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ , ఇరిగేషన్ –శిఖం (వాటర్ బాడీస్ ), అసైన్డ్ ల్యాండ్స్ తదితర విభిన్న వర్గీకరణలు ఉన్నాయి.
అందువల్ల 50,565 ఎకరాలు వ్యవసాయ భూములే, అలాగే లక్ష ఇళ్లు ప్రొహిబిటెడ్ లిస్టులోనే ఉన్నాయి అని చెప్పిన వారు ఆ సంఖ్యలకు సంబంధించిన పూర్తి అధికారిక ఆధారాలను ప్రజల ముందుంచాలి.
*మా ప్రశ్న చాలా సూటిగా ఉంది:*
50,565 ఎకరాలు మరియు లక్ష ఇళ్లకు సంబంధించిన పూర్తి Survey-wise List ఎక్కడ ఉంది?.
*ఆ జాబితాను ప్రజల ముందుంచండి.*
మండలాల వారీగా...గ్రామాల వారీగా ...సర్వే నంబర్ల వారీగా ...విస్తీర్ణం వారీగా ...
వర్గీకరణ వారీగా...పూర్తి వివరాలను బహిర్గతం చేయండి.
ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు చట్టవిరుద్ధంగా ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చబడి ఉంటే, వాటిని చట్ట ప్రకారం పరిశీలించి తొలగించాల్సిందే. దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వ భూములు, చెరువులు/నీటి వనరులకు సంబంధించిన శిఖం భూములు, అసైన్డ్ ల్యాండ్స్ మరియు చట్టపరంగా సెక్షన్ 22-A పరిధిలోకి వచ్చే ఇతర ఆస్తులను కేవలం రాజకీయ ఒత్తిడి కారణంగా తొలగించడం సాధ్యం కాదు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రికార్డుల్లో డి నోటిఫికేషన్ / డిలేషన్ ఫ్రమ్ ప్రోహిబిషన్ కు సంబంధించిన ప్రత్యేక జాబితాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే డీ-నోటిఫై లేదా ప్రొహిబిషన్ నుంచి తొలగించిన ఆస్తులను ప్రస్తుత ప్రొహిబిటెడ్ లిస్టు విస్తీర్ణంలో కలిపి చూపడం కూడా సరికాదు.
**ప్రజలకు ఒకే ఒక్క విజ్ఞప్తి:**
రాజకీయ ఆరోపణలు కాదు  పూర్తి రికార్డులు బయటకు రావాలి.సంఖ్యలు కాదు సర్వే వైస్ ఎవిడెన్స్ కావాలి.
*ఎవరి భూమి?*
*ఏ సర్వే నెంబర్ ?*
*ఎంత విస్తీర్ణం?*
*ఏ క్లాసిఫికేషన్ ?*
*ఏ చట్టం కింద ప్రోహిబిటెడ్ ?*
ఇవన్నీ ప్రజలకు తెలియాలి. పూర్తి జాబితాను బహిర్గతం చేయండి.ప్రజలే రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ణయించనివ్వండి.
*“రాజకీయాల కంటే వాస్తవాలకే ప్రాధాన్యత ఉండాలి.”*
50,565 ఎకరాలు + లక్ష ఇళ్లకు సంబంధించిన పూర్తి సర్వే వైస్ ప్రోహిబిటెడ్ లిస్ట్ ను ప్రజల ముందుంచండి.

ఈ రోజు, నా కళ్లు కృతజ్ఞతా భావంతో తడిసిపోయాయి_

*ఈరోజు మనం మరో మంచి అధికారిణి, ఐఏఎస్ దివ్య మిట్టల్‌ను కోల్పోయాము.*

*ఆమె రాజీనామా చేశారు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 30:

ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్.ఐఐటీ IIT ఢిల్లీ నుండి బి.టెక్ మరియు ఐఐఎమ్ IIM బెంగళూరు నుండి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు.దివ్య మిట్టల్ ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన పరిపాలనా పదవులను నిర్వహించారు. ఇందులో డియోరియా, మీర్జాపూర్ మరియు సంత్ కబీర్ నగర్ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలు కూడా ఉన్నాయి.ఆమె మొదట లండన్‌లో ఆర్థిక రంగానికి సంబంధించిన ఉద్యోగం చేశారు. విదేశాలలో వృత్తిపరంగా విజయం సాధించినప్పటికీ, దివ్య మిట్టల్ భారతదేశానికి తిరిగి వచ్చి దేశం కోసం ఏదైనా చేయాలని భావించారు.చివరికి ఆమె లండన్‌లోని ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత, క్షేత్రస్థాయిలో సేవ చేయడానికి ఆమె UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.యూపీలోని ఒక గ్రామంలో ప్రజలు 75 ఏళ్లుగా ట్యాంకర్ల నీటిపై ఆధారపడి జీవించిన ఉదంతం అందరికీ తెలిసిందే.అక్కడి ప్రజలు,గ్రామస్థులు ఎంపీని, ఎమ్మెల్యేను ఎన్నోసార్లు వేడుకున్నా ఏమీ జరగలేదు.ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ ఆ గ్రామానికి కుళాయి నీళ్లు తెచ్చారు. కానీ, నీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించలేదనే కారణంతో ఆమెను బదిలీ చేశారు. ఆ తర్వాత, గ్రామానికి నీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌ను కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు.నిజాయితీ గల అధికారులను శిక్షించడానికే మన వ్యవస్థ రూపొందించబడినట్లు అనిపిస్తుంది.భారత ప్రజలకు సేవ చేయడానికి ఆమె తన లండన్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. కానీ ఈరోజు రాజీనామా చేశారు.ఆమె రాజీనామాకు కారణం ఎవరు? కానీ ఆమె నిజాయితీ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది అని ప్రజలు అనుకుంటున్నారు.
*దివ్య మిట్టల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలకు ఇచ్చిన సందేశం* 
ఈ రోజు, నా కళ్లు కృతజ్ఞతా భావంతో తడిసిపోయాయి. ఒక దృశ్యం నా మనసులో చెరగని ముద్ర వేసింది: లహురియా దాహ్ కొండ ప్రాంతానికి చెందిన ఆ వృద్ధ తల్లి, తన గ్రామానికి నీరు మొదటిసారిగా చేరడాన్ని చూసి ఏమీ మాట్లాడలేదు—కేవలం వణుకుతున్న చేతులతో నా తలను తాకి నన్ను ఆశీర్వదించింది. నేను ఈ రోజు నా అధికారిక పదవి నుండి దిగి ఉండవచ్చు, కానీ ఆ స్పర్శ నన్ను ఎప్పటికీ వీడిపోదు; అలాగే, ఈ దేశపు నేల నాకు ప్రసాదించిన ఆ కల కూడా నా నుండి చెరిగిపోదు.
నేను ఎంతో కృషి చేసే అవకాశాన్ని పొందాను మరియు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సరైన దాని కోసం నిలబడటం అనేది కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదు, అది ఒక బాధ్యత అని డియోరియా నాకు నేర్పింది. 'అసాధ్యం' అనేది ఒక వాస్తవం కాదని, అది కేవలం ఒక అభిప్రాయం మాత్రమేనని మీర్జాపూర్ నాకు బోధించింది. ఇక వింధ్యవాసిని అమ్మవారి సన్నిధిలో కూర్చున్నప్పుడు, నిజమైన శక్తి అనేది అధికార పదవి నుండి కాకుండా, అమ్మవారి అనుగ్రహం మరియు ప్రజల విశ్వాసం నుండే లభిస్తుందని నేను తెలుసుకున్నాను. అన్నిటికంటే గొప్ప పాఠం ఏమిటంటే—నా కోసం నేను కన్న కలలు అప్పటికే సాకారమయ్యాయి; ఇక ఇప్పుడు, నా ప్రజల కోసం నేను కన్న కలలను నిజం చేసుకుంటూ జీవించాల్సిన సమయం ఆసన్నమైంది. తమ భూమిపై హక్కులను మొట్టమొదటిసారిగా పొందిన కుటుంబాల కళ్ళలో ఈ జీవితానికి సంబంధించిన నిజమైన తృప్తిని నేను చూశాను.గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం పొందిన దివ్యాంగుడితోనూ, తన పొలాలకు నీటి సౌకర్యం సమకూరిన రైతుతోనూ కలిసి నడుస్తున్నప్పుడు నేను ఒక విషయాన్ని గ్రహించాను: ప్రతి ప్రభుత్వ ఫైలు వెనుక ఒక మనిషి ఉంటాడు—వారి గౌరవాన్ని కాపాడటమే నిజమైన న్యాయం.
నేను ఏదో ఇవ్వడానికి వచ్చానని అనుకోవడం నా అవివేకం. నిజానికి, అత్యధికంగా పొందింది నేనే; ఆ రుణభారం అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది. నా సంతోషాన్ని చూసి నాకంటే ఎక్కువగా ఇతరులే ఆనందించారు. నేను అలసిపోయినట్లు లేదా కృంగిపోయినట్లు అనిపించినప్పుడు కూడా, వారు నాపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచారు. ఆ నమ్మకమే నాకు ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చింది. నాకు లభించిన అపారమైన ప్రేమ, గౌరవం మరియు 'ఇది నా కుటుంబం' అనే భావన నా హృదయాన్ని పూర్తిగా నింపేశాయి. నాతో అడుగడుగునా అండగా నిలిచి, స్థిరంగా సహకరించిన నా సహచరులు, అధికారులు మరియు సిబ్బందికి దీనికి సంబంధించిన గొప్ప గుర్తింపు దక్కుతుంది.

Sunday, August 30, 2026

తెలంగాణ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి_

*తెలంగాణ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 29:

తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కారణంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అలాగే అనర్హులైన ఓటరు ఎవరూ జాబితాలో చేరకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ఎన్నికల సంఘం ECI ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ గారికి ముఖ్యమంత్రి  లేఖ రాశారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును పొడిగించడంతో పాటు ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 73.39 లక్షల మందిని 21.7 శాతం,గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా అసడ్ గుర్తించినట్లు ముఖ్యమంత్రి  ECISVEEP గణాంకాలను ఉటంకించారు. ఈ వర్గంలో దాదాపు 62 శాతం మంది అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మరోవైపు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉండగా, 32.36 లక్షల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం చేయబడలేదని తెలిపారు. దీంతో సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని ఎన్నికల సంఘానికి వివరించారు.ప్రస్తుత సవరణ విధానంలో కొన్ని కీలకమైన లోపాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు లేఖలో పేర్కొన్నారు. గణన సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే విధంగా పరిగణిస్తున్నారని తెలిపారు.నిజంగా నివాసం మారిన వారికి కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా ఎలాంటి సహాయం అందించకుండానే పాత నివాసంలోని ఓటు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా నివాసం మారిన వారి పేర్లను తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను పాటించడం లేదని తెలిపారు.దీనివల్ల ఓటర్లు పోలింగ్ రోజున కేంద్రానికి వెళ్లే వరకు తమ ఓటు హక్కు తొలగిపోయిన విషయం తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లలో 58.6 శాతం, పరిశీలన నోటీసుల్లో 41.9 శాతం కేంద్రీకృతమై ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.ఉద్యోగాలు, వివాహాలు, తాత్కాలిక నివాస మార్పుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున సవరణ ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.సమీప భవిష్యత్తులో తెలంగాణ లో ఎలాంటి ఎన్నికలు లేవని, అందువల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించి, నిర్ణయించిన తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ అక్టోబర్ 19 నుంచి సవరించాలని కోరారు.గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించి, కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలను బహిరంగంగా చదివి వినిపించాలని విజ్ఞప్తి చేశారు.నోటీసులు అందుకున్న రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు తమ పత్రాలను సమర్పించేందుకు వారం రోజుల సమయం సరిపోదని, కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. 
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ, పోలింగ్ కేంద్ర స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఓటర్లకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని పొందేందుకు సహకరించాలని సూచించారు.ప్రభుత్వ ఉత్తర్వు  జీవో నంబర్ 172 ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా అంగీకరించేలా ఆధారాల జాబితాను సవరించి విస్తరించాలని సూచించారు.హైదరాబాద్ లోని ప్రతి నియోజకవర్గంలో సగటున 78 వేలకుపైగా కేసులు ఉన్నందున కేవలం కొంతమంది  అధికారుల నియామకం సరిపోదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓటర్ల నమోదు అధికారి స్థాయికి దిగువన అదనపు అధికారులను నియమించి, ముద్రిత నోటీసుల్లోనే నిర్దిష్ట తేదీలు, సమయాలను పేర్కొంటూ వికేంద్రీకృత విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభల నిర్వహణతో పాటు పరిపాలనా, ఇతర అవసరమైన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు.