Tuesday, July 21, 2026

ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు_

*హైడ్రాకు రెండేళ్లు.. న‌గ‌రంలో సంబ‌రాలు*

*నెక్లెస్ రోడ్డులో ర్యాలీ తీసిన‌ న‌గ‌ర ప్ర‌జ‌లు*

*ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 20:

హైడ్రాకు రెండేళ్లు.. న‌గ‌ర‌వ్యాప్తంగా సంబ‌రాలు.. శ‌నివారం రోజు వివిధ ప్రాంతాల్లో జ‌రిగిన వేడుక‌లు నిరూపించాయి. పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడి మా కాల‌నీల‌కు జీవం పోశార‌ని కొన్ని కాల‌నీల్లో వేడుక‌లు చేసుకోగా.. చెరువుల‌ను పున‌రుద్ధ‌రించి అక్క‌డ ఆహ్లాద‌క‌ర‌ వాతావ‌ర‌ణం ఉండేలా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంద‌ని మ‌రి కొన్ని ప్రాంతాల వారు సంబ‌రాలు చేసుకున్నారు. కొండ‌లు గుట్ట‌ల‌తో ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం ఉన్న ప్ర‌భుత్వ భూములు క‌బ్జాలు కాకుండా చ‌ర్య‌లు తీసుకున్నారంటూ మ‌రి కొంత‌మంది వేడుక చేసుకున్నారు.  హైడ్రా ఫెన్సింగ్ వేసి కాపాడిన ప్ర‌భుత్వ భూముల్లో ట‌పాసులు పేల్చి కేరింతలు కొట్టారు.న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగ‌ర్‌, నెక్లెస్ రోడ్డుకు చేరుకుని  భారీ ర్యాలీ తీశారు. ఎన్‌టీఆర్ గార్డెన్ నుంచి లుంబినీ పార్కు వ‌ర‌కూ భారీ ర్యాలీ నిర్వ‌హించి ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసి న‌గ‌రానికి భ‌విష్య‌త్తునిచ్చిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిలువెత్తు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దేశానికే ఆద‌ర్శ‌మంటూ ప‌లువురు ఈ సంద‌ర్భంగా కితాబునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాను విస్త‌రించి జిల్లాల్లో కూడా చెరువులు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు డిమాండ్ చేశారు. రెండేళ్ల‌లో 3315 ఎక‌రాల భూమిని కాపాడిన హైడ్రాను అభినందించారు. ఈ భూముల విలువ లెక్క‌ల్లో చూస్తే రూ. 1.50 ల‌క్ష‌ల కోట్లు అయినా.. ప్రాణ‌వాయువును అందించే పార్కుల రూపంలో.. భూగ‌ర్భ జ‌లాల‌ను పెంపొందించి.. వ‌ర‌ద‌ల క‌ట్ట‌డి చేసిన చెరువుల విభాగంలో చూస్తే విలువ అనంత‌మంటూ కీర్తించారు. హైడ్రా ఏర్పాటు చేయ‌డం ప్ర‌భుత్వ సాహ‌సోపేత నిర్ణ‌యంగా ప‌లువురు అభివ‌ర్ణించారు. అనంత‌రం స‌చివాల‌యంలో వివిధ శాఖ‌ల అధికారుల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేశారు.

నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల చొప్పున‌ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి_

*క్యూర్ ప‌రిధిలో కొత్త  ఇందిర‌మ్మ ఇళ్ల నుంచే వ‌చ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తాం - మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి*

*త్వ‌ర‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు శుభవార్త‌*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 20:

హైద‌రాబాద్ ప్రాంతంలోని క్యూర్ ప‌రిధిలో తొలి విడ‌త‌గా 16 నియోజ‌వ‌ర్గాల్లో  ప్రయోగాత్మ‌కంగా నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల చొప్పున‌   ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామ‌ని, త్వ‌ర‌లో మ‌రో 8 నియోజ‌క‌వ‌ర్గాల‌లో కూడా ఈ ప‌ధ‌కం అమ‌లు చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తొలివిడ‌త‌లో 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో 8వేల ఇళ్లు,జూలై 21 నుంచి ఆగ‌స్టు 10 వ‌ర‌కు  ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ ప్రక్రియ జరుగుతుంది అని అన్నారు.త్వ‌ర‌లో మ‌రో 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో స్ధ‌లాల గుర్తింపు చేయడం జరుగుతుంది అని అన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఇళ్ల మంజూరులో రిజ‌ర్వేష‌న్‌,ఒక్కో ఇంటికి రూ.11 ల‌క్ష‌లు,రూ.5ల‌క్ష‌లు ప్ర‌భుత్వ స‌బ్సిడీ ఉంటుంది అని అన్నారు.రూ.40-60 ల‌క్ష‌ల విలువ‌చేసే స్ద‌లం ల‌బ్దిదారునిపేరిట ఉచిత రిజిస్ట్రేష‌న్ చేయడం జరుగుతుంది.ల‌బ్దిదారుని వాటా రూ.6 ల‌క్ష‌లు ఉంటుంది.నాలుగు విడ‌త‌ల్లో చెల్లింపు సౌక‌ర్యం కల్పించడం జరిగింది అన్నారు. పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేరేవ‌ర‌కు ఇందిర‌మ్మ ఇళ్ల య‌జ్ఞం కొన‌సాగుతుంద‌ని, చివ‌రి ల‌బ్దిదారునికి ఇల్లు అందేవ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని , ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని పేర్కొన్నారు.సోమ‌వారం నాడు స‌చివాల‌యంలో స‌హ‌చ‌ర మంత్రులు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్, మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌ త‌దిత‌రుల‌తో క‌లిసి క్యూర్ ప‌రిధిలోని ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా  ఇందిర‌మ్మ ఇళ్ల బ్రోచ‌ర్‌ , మీసేవ‌, వాట్సాప్ ద‌ర‌ఖాస్తు ల‌ను  ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కం పేరును ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స‌హేతుకంగా వివ‌రించిన న‌ల్గొండ జిల్లా న‌కిరేక‌ల్ గ్రామానికి చెంద‌ని కొండా నాగ‌రాజుకు ల‌క్ష రూపాయిల న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేసి మంత్రులు స‌త్క‌రించారు.రాష్ట్రంలో తొలివిడ‌త‌గా 4.50 లక్ష‌ల ఇళ్ల మంజూరు చేయ‌గా రెండ‌వ విడ‌త‌లో 2.50 ల‌క్ష‌ల ఇళ్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామ‌ని ఇప్ప‌డు క్యూర్ ప‌రిధిలో ల‌క్ష ఇళ్లు ప్రారంభిస్తూ 8ల‌క్ష‌ల ఇళ్లు పేద‌ల‌కు అందిస్తున్నామ‌ని అన్నారు. వ‌చ్చే నెలలోగా రెండు ల‌క్ష‌ల‌కు పైగా ఇళ్లు పూర్తికానున్నాయ‌ని అన్నారు. గ‌త పాల‌కులు ప‌నికిరాని ఆలోచ‌న కార‌ణంగా ఎన్నిక‌ల స‌మయంలో హైద‌రాబాద్‌కు  30-35 కిలోమీట‌ర్ల దూరంగా ఇళ్ళ‌ను నిర్మించ‌డం వ‌ల‌న కేవ‌లం 8-9 వేల మంది మాత్ర‌మే నివాసాల్లో దిగార‌ని , మిగిలిన వారు మంజూరు ప‌త్రాలు తీసుకున్నారే త‌ప్ప దిగ‌లేద‌న్న విష‌యం త‌మ ప‌రిశీల‌న‌లో వెల్ల‌డైంద‌న్నారు.ఈ ప‌రిస్ధితుల్లో  పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా నియోజ‌క‌వ‌ర్గాన్ని యూనిట్‌గా తీసుకొని పేద‌లు నివ‌సిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణాలు చేప‌డుతున్నాం.  
పేద‌ల నివాస ప్రాంతాల్లోనే 525 చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యంతో సుమారు 40-60 ల‌క్ష‌ల రూపాయిల విలువ క‌లిగిన స్ధలాల‌ను ఆడ‌ప‌డుచుల పేరిట రిజిస్ట్రేష‌న్ చేసి ఇస్తామ‌ని తెలిపారు. దీనిని ప‌దేళ్ల వ‌ర‌కు అమ్ముకునే అవ‌కాశం ఉండ‌ద‌ని, అయితే బ్యాంకులో రుణం కోసం త‌న‌ఖా పెట్టుకోవ‌చ్చున‌ని తెలిపారు. ఇళ్ల మంజూరులో  ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు  రిజ‌ర్వేష‌న్ ఉంటుంద‌న్నారు.ఒక‌వేళ ఇల్లు మంజూరు కాక‌పోతే క‌ట్టిన రూ.10 వేల రూపాయిలు తిరిగి చెల్లిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వం ఒక్కో ఇంటికి రూ.5 ల‌క్ష‌ల రూపాయిల‌ను ఉచితంగా ఇస్తుంద‌ని, ఒక్కో ఇంటి నిర్మాణానికి 11 ల‌క్ష‌ల రూపాయిల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతున్నందున ల‌బ్దిదారుల నుంచి మిగిలిన ఆరు  ల‌క్ష‌ల రూపాయిల‌ను నాలుగు వాయిదాల్లో తిరిగి తీసుకుంటామ‌ని , ఆ మొత్తంలో ఈ 10 వేల రూపాయిల‌ను మిన‌హాయిస్తామ‌ని మంత్రి గారు తెలిపారు.ఏనియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌న్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా స్ధానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించి స్ధ‌లాల‌ను ఎంపిక చేయ‌డం జ‌రిగింది. ఈనెల 21వ తేదీ నుంచి మీసేవ‌, వాట్సాప్ ( నెంబ‌ర్ 8096958096), వెబ్‌సైట్  ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చున‌ని తెలిపారు. ల‌బ్దిదారుని కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండాల‌ని, ద‌రఖాస్తు దారుని పేరిట క్యూర్ ప‌రిధిలో స్ధ‌లం గానీ, స్వంత ఇల్లుకానీ ఉండ‌కూడ‌ద‌న్నారు. ఒక కుటుంబం నుంచి  ఒక ద‌ర‌ఖాస్తు మాత్ర‌మే స్వీక‌రిస్తార‌ని. అర్హ‌త బ‌ట్టి కేటాయింపు జ‌రుగుతుంద‌న్నారు. 360 డిగ్రీల ప‌రిధిలో  ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల వ‌డ‌పోత జ‌రుగుతుంద‌ని, అప్ప‌టికీ ఎక్కువ ద‌ర‌ఖాస్తులు వ‌స్తే అంద‌రి ముందూ బ‌హిరంగంగా లాట‌రీ తీసి ఇళ్లు మంజూరు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ప‌ధ‌కం కింద ప్ర‌తిపాదించిన 525 చ‌ద‌రపు  అడుగుల‌  ఫ్లాట్ లో ఒక బెడ్ రూమ్‌, హాల్‌, కిచెన్ ఉంటాయన్నారు.హైద‌రాబాద్ లోప్ర‌స్తుతం జ‌రుగుతున్న బోనాల జాతర శుభ సంద‌ర్బంలో క్యూర్ ప‌రిధిలో పేద‌ల ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టామ‌ని వచ్చే ఏడాది క్యూర్ ప‌రిధిలో కొత్త  ఇందిర‌మ్మ ఇళ్ల నుంచే వ‌చ్చే ఏడాది బోనాలు ఎత్తించే విధంగా నిర్మాణాలు శ‌ర‌వేగంగ‌గా పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా పేద‌వాని సంక్షేమం విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డ‌డం లేదు.  ఇందిర‌మ్మ ఇళ్ల పురోగ‌తిని బ‌ట్టి ప్ర‌తిసోమ‌వారం చెల్లింపులు జ‌రుపుతున్నాం. ఈ ప్ర‌భుత్వం పేద‌వాని గురించే కాకుండా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం గురించి కూడా ఆలోచ‌న చేస్తోంది. ఇళ్ల  విష‌యంలో   త్వ‌ర‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్రజానీకానికి కూడా శుభావార్త అందిస్తామ‌న్నారు.క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ఒక చారిత్రాత్మ‌క కార్య‌క్ర‌మ‌ని ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధర్‌బాబు  అన్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌న్నారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీనీ నిల‌బెట్టుకుంటున్నామ‌ని  ఉచిత బ‌స్సు, ఉచిత క‌రెంట్, అర్హులంద‌రికీ రేష‌న్ కార్డులు ఇందిర‌మ్మ ఇళ్లు ఇలా అనేక కార్య‌క్రమాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ హైద‌రాబాద్ ప‌రిధిలో పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌డం శుభప‌రిణామం అన్నారు.
ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టే  నియోజ‌క‌వ‌ర్గాలు:
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి; 
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని జల్‌పల్లి; 
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాయదుర్గం; 
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని తట్టిఅన్నారం, బండ్లగూడ; 
మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కౌకూర్; 
నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని  రెడ్‌హిల్స్ మ‌రియు  నీలోఫర్ ఆసుపత్రి సమీప పోలీస్ క్వార్టర్స్; 
ఖైరతాబాద్  అసెంబ్లీ నియోజకవర్గంలోని  హకీంపేట్ ద‌ర్గ  మరియు   జూబ్లీహిల్స్, ఎమ్మెల్యేకాలనీ
కార్వాన్  అసెంబ్లీ నియోజకవర్గంలోని కుల్సుంపురా సమీప  పోలీస్క్వార్టర్స్; 
బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలోని నందిముసలిగూడ; 
అంబర్‌పేట్   అసెంబ్లీ నియోజకవర్గంలోని  సిటీపోలీస్ లైన్స్  
కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీకాలనీ; 
మేడ్చల్   అసెంబ్లీ నియోజకవర్గంలోని పోచారం ఎల్‌ఐజీకాలనీ;
కుత్బుల్లాపూర్ అసెం బ్లీ  నియోజకవర్గంలోని  గాజులరామారం; 
సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పాటిగడ్డ; 
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మారేడ్‌పల్లి–మహేంద్రహిల్స్; 
మలక్‌పేట్ అసెంబ్లీ  నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం ఆర్అం డ్ బీ   క్వార్టర్స్ ఉన్నాయి.ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న‌మండ‌లి స‌భ్యులు అద్దంకి ద‌యాక‌ర్‌, శాస‌న‌స‌భ్యులు దానం నాగేంద‌ర్‌, మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాంధీ, మాధ‌వ‌రం కృష్ణారావు, కాలేరు వెంక‌టేష్ , ప్ర‌కాష్ గౌడ్‌, శ్రీ‌గ‌ణేష్‌,  మాజిద్ హుస్సేన్‌, కౌస‌ర్ మొహినుద్దీన్ ,జుల్ఫీక‌ర్ అలీ, జాఫ‌ర్ హుస్సేన్‌, ముబీన్‌, హౌసింగ్ శాఖ ఎండీ వి.పి. గౌత‌మ్‌, క‌లెక్ట‌ర్ ప్రియాంక ఆల‌, క‌మీష‌న‌ర్లు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన_

*ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 20:

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు.రాత్రి కొడంగల్‌లో బసచేసి మరుసటి రోజు (22వ తేదీన) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

Sunday, July 19, 2026

భారత దేశంలో దాదాపు 23% పైగా ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు_

*అటకెక్కిన ఆటలు - చిన్నారుల భవిష్యత్తు ఇబ్బందుల్లో - అనూరాధ రావు అధ్యక్షురాలు బాలల హక్కుల సంఘం*

*భారత దేశంలో దాదాపు 23% పైగా ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు*

*ప్రైవేటు పాఠశాలల పరిస్థితి చూస్తే 50%*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15:

ఒకప్పుడు ప్రతి వీధిలో, ప్రతి పాఠశాలల్లోని మైదానంలో కబడ్డీ, ఖోఖో, దాగుడు మూతలు, తోక్కుడుబిళ్ల, క్రికెట్ లాంటివి ఆడుతుండె వారు.. రాను రాను ఈ విషయం కథలుగా చెప్పుకోవాల్సిన దుస్థితితో ఉన్నాం...
నేడు మైదానాలు ఖాళీగా ఉన్నాయి, పిల్లల చేతిలో బంతి, బ్యాటు ఏవి లేవు, వీరి చేతుల్లో మొబైల్ మాత్రమే ఉంది. మార్కులకు ఇచ్చే ప్రాధాన్యం ఆటలకు లేదు,ఆటల సమయం అంటే వృధా అనే ఫీలింగ్ ఉన్నారు అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాలలు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం - 5-17 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. కాని నేటి పిల్లలు ఉదయం నుండి సాయంత్రం వరకు క్లాసులు, ట్యూషన్లు, హోం వర్కులు, కాస్త సమయం దొరిగితే మొబైల్లో బాగా బిజిగా గడిపేస్తున్నారు. ఫలితం పిల్లల్లో ఊబకాయం, కంటి సమస్యలు, బత్తికి గురికావడం,మానసిక సమస్యలు,ఏకాగ్రత లోపం, చదువుపై శ్రద్ద తగ్గడం,మధుమేహ ప్రమాదం పొంచి ఉంది అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆటలు కేవలం వినోదం కోసం కాదు. ఆటలు క్రమ శిక్షణను నేర్పిస్తాయి. జట్టుగా ఆడడం వల్ల స్నేహం మరియు ఏ సమస్య అయిన సమిస్టిగా ఎదుర్కోవచ్చు అని నేర్పుతుంది. ఓటమిని అంగీకరించి, మళ్లీ గెలుపు కోసం ప్రయత్నం చేయడం నేర్పుతాయి.
మన దేశం అత్యంత అధిక జనాభ కలిగిన దేశం కాని ప్రపంచ దేశాల వేదికలపై భారతదేశ పతాకం ఎగరాలంటే కచ్చితంగా పిల్లలకు క్రీడలు అవసరం.2024 ఒలింపిక్స్ లో మనదేశానికి 6 పతకాలు వచ్చాయి, 1 రజతం, 5 కాంస్యం సాధించాయి. అంటే ఎంత వెనుకబడి ఉన్నామో అర్ధం అవుతుంది.భారత దేశంలో దాదాపు 23% పైగా పాఠశాలలకు ఆట స్థలాలు లేవు,అవి ప్రభుత్వ పాఠశాలలు.ఇంక ప్రైవేటు పాఠశాలల పరిస్థితి చూస్తే 50% .చిన్న అపార్ట్మేంట్లలో,ఇరుకైన భవనాల్లో పాఠశాలలు నడుస్తున్నాయి.అనుమతులు తీసుకునే సమయంలో తప్పుడు సమాచారంతో సంప్రదించడం,అధికారుల పర్యవేక్షణ లేకపోవడం. కోర్టు ఆదేశాలు ఉన్న, ఆ ఆదేశాలను అమలు చేయకపోవడం.
ఇక తెలంగాణలో ఆట స్థలం లేని ప్రభుత్వ పాఠశాలలు 7967 ఉన్నాయి. 2273 పాఠశాలల్లో కరెంటు కనెక్షన్ కూడ లేదు అని రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.ఇకనైన ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలకు ఆట స్థలం ఉండేవింధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. విద్య తో పాటు సమాన ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వాలి. స్పోర్ట్స్ స్కూల్స్ ప్రతి జిల్లాలో ఏర్పాటుచేయాలి, టైం టెబుల్ లో కచ్చితంగా ప్రతి రోజు ఆటల కోసం ఒక గంట సమయం కేటాయించాలి.
కోర్టు ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పాఠశాలల అనుమతులు జారి చేసే సమయంలో అధికారులు తనిఖీలు నిర్వహించి, ఆటస్థలం ఉంటేనే ఇవ్వాలి. 
మీ పిల్లలను పాఠశాలలో చేర్పించే సమయంలో ఆట స్థలం ఉంటేనే జాయిన్ చేయండి.
పిల్లల ఆరోగ్యమే మహభాగ్యం.
భారత దేశ పతాకం ప్రపంచ దేశాల వేదికల పై ఎగరాలంటే క్రీడాకారుల అవసరం ఎంతో ఉంది.

స్కిల్స్ వ్యక్తిగత విజయానికే కాదు, సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది - సీఎం రేవంత్ రెడ్డి_

*స్కిల్స్ వ్యక్తిగత విజయానికే కాదు, సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15:

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శరవేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని యువత విద్యతో పాటు జీవితానికి, ఉపాధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను నేర్చుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు.యువత తమలోని ప్రతిభను, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఎదగాలని “వరల్డ్ యూత్ స్కిల్స్ డే”సందర్భంగా పేర్కొన్నారు. స్కిల్స్ వ్యక్తిగత విజయానికే కాదు, సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని పేర్కొన్నారు.యువత ఎప్పటికప్పుడు స్కిల్స్ అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను ఆధునిక సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆధునిక ప్రపంచంలో వ్యవస్థలకు అవసరమైన నైపుణ్యత అందుబాటులో లేకపోవడం నిరుద్యోగానికి దారితీస్తోందని పేర్కొన్నారు."నేర్చుకోవడం ఆపొద్దు... స్కిల్స్ పెంచుకోవాలి... మీ విజయంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా మీ వంతు పాత్ర పోషించండి. నైపుణ్యమే ఆత్మవిశ్వాసానికి, ఉపాధికి, సుస్థిర భవిష్యత్తుకు మార్గం. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు" అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు_

*ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 18:

"జయ జయహే తెలంగాణ" గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, తన కలాన్ని ఉద్యమ జెండాగా మలిచి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రజాకవి అందెశ్రీ  జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్పూర్తిని అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవి అందెశ్రీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ప్రతి గేయం ప్రజల హృదయాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని పేర్కొన్నారు. అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సమాజానికి ఆయన అందించిన సాహిత్య సంపద చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అందెశ్రీ  పేరు,ఆయన సాహిత్యం, ఆయన ప్రబోధించిన ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి, తరతరాలను చైతన్యపరుస్తూనే ఉంటాయని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

నీట్-యూజీ (NEET-UG) పరీక్షల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల (TGSWREIS) విద్యార్థుల ప్రతిభ_

*నీట్-యూజీ (NEET-UG) పరీక్షల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల (TGSWREIS) విద్యార్థుల ప్రతిభ*

*విద్యార్థులను అభినందించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 18:

నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల (TGSWREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులతో కలిసి విద్యార్థులు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.