Sunday, July 19, 2026

భారత దేశంలో దాదాపు 23% పైగా ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు_

*అటకెక్కిన ఆటలు - చిన్నారుల భవిష్యత్తు ఇబ్బందుల్లో - అనూరాధ రావు అధ్యక్షురాలు బాలల హక్కుల సంఘం*

*భారత దేశంలో దాదాపు 23% పైగా ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు*

*ప్రైవేటు పాఠశాలల పరిస్థితి చూస్తే 50%*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15:

ఒకప్పుడు ప్రతి వీధిలో, ప్రతి పాఠశాలల్లోని మైదానంలో కబడ్డీ, ఖోఖో, దాగుడు మూతలు, తోక్కుడుబిళ్ల, క్రికెట్ లాంటివి ఆడుతుండె వారు.. రాను రాను ఈ విషయం కథలుగా చెప్పుకోవాల్సిన దుస్థితితో ఉన్నాం...
నేడు మైదానాలు ఖాళీగా ఉన్నాయి, పిల్లల చేతిలో బంతి, బ్యాటు ఏవి లేవు, వీరి చేతుల్లో మొబైల్ మాత్రమే ఉంది. మార్కులకు ఇచ్చే ప్రాధాన్యం ఆటలకు లేదు,ఆటల సమయం అంటే వృధా అనే ఫీలింగ్ ఉన్నారు అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాలలు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం - 5-17 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. కాని నేటి పిల్లలు ఉదయం నుండి సాయంత్రం వరకు క్లాసులు, ట్యూషన్లు, హోం వర్కులు, కాస్త సమయం దొరిగితే మొబైల్లో బాగా బిజిగా గడిపేస్తున్నారు. ఫలితం పిల్లల్లో ఊబకాయం, కంటి సమస్యలు, బత్తికి గురికావడం,మానసిక సమస్యలు,ఏకాగ్రత లోపం, చదువుపై శ్రద్ద తగ్గడం,మధుమేహ ప్రమాదం పొంచి ఉంది అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆటలు కేవలం వినోదం కోసం కాదు. ఆటలు క్రమ శిక్షణను నేర్పిస్తాయి. జట్టుగా ఆడడం వల్ల స్నేహం మరియు ఏ సమస్య అయిన సమిస్టిగా ఎదుర్కోవచ్చు అని నేర్పుతుంది. ఓటమిని అంగీకరించి, మళ్లీ గెలుపు కోసం ప్రయత్నం చేయడం నేర్పుతాయి.
మన దేశం అత్యంత అధిక జనాభ కలిగిన దేశం కాని ప్రపంచ దేశాల వేదికలపై భారతదేశ పతాకం ఎగరాలంటే కచ్చితంగా పిల్లలకు క్రీడలు అవసరం.2024 ఒలింపిక్స్ లో మనదేశానికి 6 పతకాలు వచ్చాయి, 1 రజతం, 5 కాంస్యం సాధించాయి. అంటే ఎంత వెనుకబడి ఉన్నామో అర్ధం అవుతుంది.భారత దేశంలో దాదాపు 23% పైగా పాఠశాలలకు ఆట స్థలాలు లేవు,అవి ప్రభుత్వ పాఠశాలలు.ఇంక ప్రైవేటు పాఠశాలల పరిస్థితి చూస్తే 50% .చిన్న అపార్ట్మేంట్లలో,ఇరుకైన భవనాల్లో పాఠశాలలు నడుస్తున్నాయి.అనుమతులు తీసుకునే సమయంలో తప్పుడు సమాచారంతో సంప్రదించడం,అధికారుల పర్యవేక్షణ లేకపోవడం. కోర్టు ఆదేశాలు ఉన్న, ఆ ఆదేశాలను అమలు చేయకపోవడం.
ఇక తెలంగాణలో ఆట స్థలం లేని ప్రభుత్వ పాఠశాలలు 7967 ఉన్నాయి. 2273 పాఠశాలల్లో కరెంటు కనెక్షన్ కూడ లేదు అని రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.ఇకనైన ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలకు ఆట స్థలం ఉండేవింధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. విద్య తో పాటు సమాన ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వాలి. స్పోర్ట్స్ స్కూల్స్ ప్రతి జిల్లాలో ఏర్పాటుచేయాలి, టైం టెబుల్ లో కచ్చితంగా ప్రతి రోజు ఆటల కోసం ఒక గంట సమయం కేటాయించాలి.
కోర్టు ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పాఠశాలల అనుమతులు జారి చేసే సమయంలో అధికారులు తనిఖీలు నిర్వహించి, ఆటస్థలం ఉంటేనే ఇవ్వాలి. 
మీ పిల్లలను పాఠశాలలో చేర్పించే సమయంలో ఆట స్థలం ఉంటేనే జాయిన్ చేయండి.
పిల్లల ఆరోగ్యమే మహభాగ్యం.
భారత దేశ పతాకం ప్రపంచ దేశాల వేదికల పై ఎగరాలంటే క్రీడాకారుల అవసరం ఎంతో ఉంది.

స్కిల్స్ వ్యక్తిగత విజయానికే కాదు, సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది - సీఎం రేవంత్ రెడ్డి_

*స్కిల్స్ వ్యక్తిగత విజయానికే కాదు, సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15:

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శరవేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని యువత విద్యతో పాటు జీవితానికి, ఉపాధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను నేర్చుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు.యువత తమలోని ప్రతిభను, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఎదగాలని “వరల్డ్ యూత్ స్కిల్స్ డే”సందర్భంగా పేర్కొన్నారు. స్కిల్స్ వ్యక్తిగత విజయానికే కాదు, సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని పేర్కొన్నారు.యువత ఎప్పటికప్పుడు స్కిల్స్ అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను ఆధునిక సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆధునిక ప్రపంచంలో వ్యవస్థలకు అవసరమైన నైపుణ్యత అందుబాటులో లేకపోవడం నిరుద్యోగానికి దారితీస్తోందని పేర్కొన్నారు."నేర్చుకోవడం ఆపొద్దు... స్కిల్స్ పెంచుకోవాలి... మీ విజయంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా మీ వంతు పాత్ర పోషించండి. నైపుణ్యమే ఆత్మవిశ్వాసానికి, ఉపాధికి, సుస్థిర భవిష్యత్తుకు మార్గం. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు" అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు_

*ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 18:

"జయ జయహే తెలంగాణ" గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, తన కలాన్ని ఉద్యమ జెండాగా మలిచి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రజాకవి అందెశ్రీ  జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్పూర్తిని అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవి అందెశ్రీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ప్రతి గేయం ప్రజల హృదయాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని పేర్కొన్నారు. అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సమాజానికి ఆయన అందించిన సాహిత్య సంపద చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అందెశ్రీ  పేరు,ఆయన సాహిత్యం, ఆయన ప్రబోధించిన ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి, తరతరాలను చైతన్యపరుస్తూనే ఉంటాయని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

నీట్-యూజీ (NEET-UG) పరీక్షల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల (TGSWREIS) విద్యార్థుల ప్రతిభ_

*నీట్-యూజీ (NEET-UG) పరీక్షల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల (TGSWREIS) విద్యార్థుల ప్రతిభ*

*విద్యార్థులను అభినందించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 18:

నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల (TGSWREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులతో కలిసి విద్యార్థులు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు_

*తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు*

*వికారాబాద్ జిల్లాకు రోడ్ల అభివృద్ధికి గాను 900 కోట్ల రూపాయల నిధులు*

*ప్రజా పాలన లో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 18:

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు, బలోపేతం చేయడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి,  కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కందనెల్లి జెపిఆర్ గార్డెన్ లో  జరిగిన సభలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.... రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాల నిమిత్తం అత్యధిక నిధులను కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా  తాండూరు నియోజకవర్గానికి 290 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రోడ్ల సౌకర్యం మెరుగ్గా ఉంటే పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన అన్నారు.   మంజూరు అయిన పనులు వెంటనే చేపడతామని ఆయన అన్నారు.    ప్రజా పాలన లో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అర్హుడైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు  సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.  500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.మహిళల ఆర్థిక అభివృద్ధికి మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే 900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని ఆ నీ సందర్భంగా తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచే దిశగా యంగ్ ఇండియా పాఠశాలలను స్థాపించడం జరుగుతుందని మంత్రి అన్నారు. కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే  94 కోట్ల వ్యయంతో  రైల్వే ఓవర్ వే బ్రిడ్జి పనులను 18 వారాల్లో చేపడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. 261 కోట్ల వ్యయంతో  ప్రధాన రహదారులను నిర్మించేందుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.  రవాణా వ్యవస్థ మెరుగుపరిస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి అన్నారు.కాగ్న నదిలో మురుగునీరు కలవకుండా 30 కోట్లను మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం జరిగిందని మంత్రి అన్నారు.రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయలను మాఫీని ప్రభుత్వం చేపట్టిందన్నారు.   గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు నిర్వహించి 70 వేల మందికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించదని మందు తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తూనే ఉదయం అల్పాహారం సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఆయన అన్నారు.తాండూర్ మున్సిపల్ పరిధిలో 571 మంది అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు మంత్రి తెలిపారు.అంతర్గత మురుగు కాలువల సమస్యలపై ప్రణాళికలు  సిద్ధం చేస్తే అనుమతులు ఇస్తామని మంత్రి అన్నారు.శాసన మండలి చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం పేదల అభ్యున్నతి కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేయబడుతుందన్నారు.  వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు ఇచ్చారని, రోడ్ల అభివృద్ధితో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. కర్ణాటక సరిహద్దు రోడ్లకు నిధులను కేటాయించి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.స్థానిక శాసనసభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.... తాండూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులను తీసుకురావడం జరుగుతుందన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం 75 కోట్ల వ్యయంతో ఏటీసీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గత సంవత్సరం 165 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. బషీరాబాద్ రోడ్ల అభివృద్ధియే కాకుండా 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కళాశాలలను మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఉమాశంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఇ.వెంకటాచారి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డిఓ అనిత, ఆర్ అండ్ బి ఎస్.ఇ వసంత నాయక్, ఆర్య వైశ్య కార్పొరేషన్ సంస్థ చైర్ పర్సన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కందనెల్లి సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు మరియు విద్యావ్యవస్థలో పారదర్శకత కోసం జరుగుతున్న పోరాటానికి మానవ హక్కుల వేదిక (HRF) మద్దతు_

*సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు మరియు విద్యావ్యవస్థలో పారదర్శకత కోసం జరుగుతున్న పోరాటానికి మానవ హక్కుల వేదిక  (HRF) మద్దతు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15:

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28, 2026 నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న పట్ల హ్యూమన్ రైట్స్ ఫోరమ్ (HRF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
NEET-UG 2026 పరీక్షా విధానంలో జరిగిన అక్రమాలపై విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా, గత 17 రోజులుగా శ్రీ వాంగ్‌చుక్ దీక్ష చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాగత వైఫల్యాల వల్ల తమ భవిష్యత్తును కోల్పోతున్న విద్యార్థులకు న్యాయం జరగాలని, అలాగే ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరగాలని కోరుతున్న నిరసనకారులకు HRF సంపూర్ణ మద్దతు తెలుపుతోంది.
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల విశ్వసనీయత పదేపదే దెబ్బతినడం, మన విద్యాపాలనలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. ఇది దేశంలోని యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శాంతియుత నిరసనకారుల ఆరోగ్యం క్లిష్ట పరిస్థితికి చేరుకునే వరకు వేచి చూడకుండా, వారితో వెంటనే చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిరసనకారుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని, బాధితులైన కుటుంబాలకు న్యాయం చేయాలని మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము.
నిరసన తెలపడం మరియు అసమ్మతిని వ్యక్తం చేయడం మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, అలాగే తప్పు జరిగినప్పుడు సర్దుకోవడం ప్రభుత్వం బాధ్యత.

S. జీవన్ కుమార్,
మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు
తిరుపతయ్య,
మానవ హక్కుల వేదిక - తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
M. సురేష్ బాబు,
మానవ హక్కుల వేదిక - హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు

Friday, July 17, 2026

సినియర్ సిటిజన్లకు బ్రతికే అర్హత లేదా? - మాదిరెడ్డి రవిందర్ రెడ్డి(హార్ట్ పెషేంట్ )శంభునిపల్లి గ్రామం, జమ్మికుంట_

*హైకోర్ట్ ఉత్తర్వులను గౌరవించని కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ*

*సినియర్ సిటిజన్లకు బ్రతికే అర్హత లేదా? - మాదిరెడ్డి రవిందర్ రెడ్డి(హార్ట్ పెషేంట్ )శంభునిపల్లి గ్రామం, జమ్మికుంట*

*మేము బ్రతికి ఉండగానే మా పేరిట ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయమని  కుతుర్లు అల్లుళ్లు కొడుతున్నారు - సహాకరిస్తున్న స్థానిక జమ్మికుంట సి.ఐ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15

వ్యవసాయ భూములను తమపేరిట పట్టాచేయలని కూతుర్లు అల్లుళ్లు, గత 9 నెలల నుండి ఇంట్లో అక్రమంగా ఉంటు కొడుతూ చంపాలని చూస్తున్నారు అని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామం కు చెందిన మాదిరెడ్డి రవిందర్ రెడ్డి తండ్రి: తిరుపతిరెడ్డి వయస్సు 70 సంవత్సరాలు మరియు మాదిరెడ్డి సుబాషిణి భర్త: రవిందర్ రెడ్డి వయుస్సు 67  సంవత్సరాలు.మాకు ముగ్గురు కూతుళ్ళు 1) పెద్దిరెడ్డి రమాదేవి 2) గుడిపాట మౌనిక 3) చిట్టెటి స్వాతి అందరికి వివాహాలు జరిగిన్నాయి. మొదటి కూతురు హైదరాబాద్ లో , రెండవ కూతురు హన్మకొండలో నివాసముంటున్నారు. మాకు ఉండటానికి ఇల్లు లేనందున మా చిన్న కూతురు శంభునిపల్లి గ్రామం లో 
కట్టుకున్న సొంత ఇంట్లో నివాసం ఉంటున్నాము.మా వృత్తి వ్యవసాయం.మాకు ఆరోగ్యం బాగాలేనందున మా వ్యవసాయ భూములు వేరేవాళ్లకి కౌలుకు ఇచ్చి వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాము. మా అన్న అయిన మాదిరెడ్డి రాజిరెడ్డి 70 సంవత్సరాల క్రితం సొంత అమ్మమ్మ అయిన వంగల మాణిక్యమ్మ గారికి దత్తత వెళ్లాడు.మా తండ్రి గారు అయిన తిరుపతి రెడ్డి 2020 సంవత్సరంలొ చనిపోగానే ఆస్తి కోసం మాకు వున్నటువంటి భూములపై మా అన్న కేసులు వేయగా  అట్టి కేసు పెండింగ్లో లో ఉంది.కేసు పెండింగ్ లో ఉండగా పై చెప్పిన మా కూతుళ్లు పెద్దిరెడ్డి రమాదేవి,గుడిపాటి మౌనిక మరియు వారి భర్తలు మా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి మమ్మల్ని కొడుతు తిడుతూ భయబ్రాంతులకు గురిచేసి ఇంట్లో నుండి గెంటివేశారు .మాకు తినడానికి తిండిలేక, ఉండటానికి గూడులేక కట్టుకోవడానికి బట్టలు లేకుండా, వైద్యానికి డబ్బులు లేక రోడ్ల మిద జీవనం వెళ్లతీస్తున్నాము.మా ఇంట్లోకి మేము వెళ్దాం అని ప్రయత్నించగా మాపై దాడి చేశారు.ప్రతి సంవత్సరం మాకు కౌలు ద్వారా వచ్చే ఆదాయము రాకుండా అడ్డుపడి స్థానిక సి.ఐ రామక్రిష్ణ  కౌలుకు చేసే వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించగా అతను కౌలుకు చేయలేదు. మేము సొంతంగా అయిన చేసుకుందాం అని భూమి మిదకు వెళ్లగా నా రెండవ కూతురు అయిన మౌనిక పైపు లైను, మోటరు, స్టాటరు, వైర్లు అన్ని పగలకొట్టి తీసుకెళ్లడం జరిగింది. ఇట్టి విషయం అయి ఆమెను అడగగా నా పై నా భార్యపై దాడికి దిగారు. ఇట్టి విషయమై స్థానిక పోలిసుస్టేషన్లో  అధికారులకు దరఖాస్తు ఇవ్వగా ఎలాంటి చర్యలు తీసుకొలేదు.గత ఎనమిది నెలలుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లినా దరఖాస్తు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు.మేము ఇట్టి విషయమై రెవెన్యూ అధికారులకు వయెవృద్దుల చట్టం కింద ఆశ్రయించగా వారు మా కూతుళ్లని నెల నెల పోషణ నిమ్మిత్తం డబ్బులు ఇవ్వమని మరియు ఇంట్లోనే ఉండమని భూములు రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించకూడదని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా స్థానిక పోలిసులను ఆశ్రయించగా ఎలాంటి ఫలితం లేదు.అట్టి అర్డరు తీసుకొని మా ఇంటి వెళ్లగా మరల ఇద్దరు కుతుర్లు అల్లుళ్లు కలిసి దాడికి ప్రయత్నం చేసారు. చివరంగా గౌరవ హై కోర్టును ఆశ్రయించంగా డబ్ల్యూ పి నెం. 20003/ 2026 మాకు భద్రత కల్పించమని స్థానిక సి.ఐ కి గౌరవ హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఆ తరువాత మేము తేది 1/07/2026 నాడు స్థానిక సి.ఐ ని సంప్రదించగా మాకు భద్రత కల్పించకుండ ఎలాంటి విచారణ లేకుండా మా దరఖాస్తు మూసి వేయడం జరిగింది.ఇట్టి విషయాన్ని సిరియస్ గా తీసుకున్న న్యాయ స్థానం 09.07.2026 నాడు తిరిగి మాకు మా కూతుర్లు అల్లుళ్ల నుండి భద్రత కల్పించమని సీఐ కి ఆదేశించడం అయినది.ఈరోజు అనగా 15/07/2026 హై కోర్ట్ ఉత్తర్వులను తీసుకెళ్లి సీఐ కూ చూపించాగా అతను ఆ ఆర్డర్ కాపీ ని చూసి మా మొఖం పైన విసిరేసి బయటకు వెళ్ళండి అని గద్దరించాడు. మేము ఇచ్చిన ఆర్డర్ కాపీ ని చూసిన తరువాత రసీదు ఇవ్వమని అడుగగా ఇది పోస్ట్ ఆఫీస్ కాదు పోలీస్ స్టేషన్ అని గద్దరించాడు.గతంలో స్థానిక సి.ఐ సినియర్ సిటిజన్ లు అయిన మమ్నల్ని పొలిసు స్టేషన్ కు పిలిచి మా భూములను మా కుతుర్లకు రిజిస్ట్రేషన్ చేయమని లేకపోతే మీ మిద తప్పుడు కేసులు పెడతామని బెదిరించినాడు.ఇట్టి భూముల పై కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా మా ఇద్దరు కుతుర్లుని ప్రోత్సహించి మా తల్లిగారు అయిన మాదిరెడ్డి ఈశ్వరమ్మ భర్త: లేట్ తిరుపతి రెడ్డి వయస్సు: 85 సంవత్సరాలు తో తప్పుడు కేసు పెట్టించినాడు. మాకు అనుమతిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ని, హాంమంత్రి ని , డైరెక్టర్ జనరల్ ఆప్ పోలిసు ను కలిసి వస్తావాలతో మా గోడు విన్నవించుకుంటామని మా మనవి. మా పై గతంలో హత్యా ప్రయత్నం చేయగా మా కుతుర్లు అల్లుళ్ల పై స్థానిక పొలిసు స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ 180/2026 కేసు నమోదు చేసారు. పోలీసు వారు ముందుగానే స్పందించి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చిఉండేది కాదు. మేము బ్రతికి ఉండగానే మా పేరిట ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయమని కొడుతున్న మరియు చంపే ప్రయత్నం చేస్తున్న మా కుతుర్లు అల్లుళ్లకు సహాకరిస్తున్న స్థానిక జమ్మికుంట సి.ఐ పై చట్టరిత్యా చర్యతీసుకోగలరు అలాగే మాకు మా కూతుర్లు మరియు అల్లుళ్ళ తో మరియు స్థానిక సీఐ తో ప్రాణభయం ఉంది. కేవలం మొదట్లో సీఐ చెప్పినట్లుగా మా కూతుర్ల పేరు మీద భూములను రిజిస్ట్రేషన్ చేయనందుకు మా ఈ దుస్థితి వచ్చింది. కావున మాకు న్యాయం చేయగలరని మనవి.