Friday, June 19, 2026

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్ - నిద్దురమత్తులో తెలంగాణ విద్యాశాఖ

*మీ పిల్లలను ఏ స్కూల్లో చేర్పిస్తున్నారో ఒక్కసారి చెక్ చేయండి.*

*అది ప్రభుత్వ గుర్తింపు పొందినదా? లేదా ?*

*తెలంగాణ విద్యా శాఖ కీలక పెచ్చరికలను జారీ చేసింది.*

*అనురాధ రావు అధ్యక్షురాలు - బాలలహక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 19:

హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు,గుర్తింపు లేకుండా పుట్ట గొడుగుల్లా ప్లే స్కూళ్లు, Primary, High school వెలిసాయి. అవి చిన్న చిన్న  భవనాల్లో బహుళ అంతస్తుల్లో కనీస వసతులు లేకుండా తగినంత ఆటస్థలం, ఫైర్ సేఫ్టీ లేని పాఠశాలలు 500 పైగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్నాయి.మన విద్యాశాఖ మంత్రి, అధికారుల దృష్టికి వచ్చినా, గాఢ నిద్రలో ఉన్నారు,
వారికి ఏమీ పట్టదు.యధేచ్చగా స్కూళ్లు తమ వ్యాపారాలు చేస్తున్నాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన విధంగా ఉంది.తీసుకున్న జీతానికి న్యాయం చేయండి,పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి.విద్యాశాఖ అధికారులు మీ కుర్చిలనుండి దిగి పాఠశాలల తనిఖీలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం విన్నపం.ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్ల వివరాలను జిల్లాల వారిగా, మండలాల వారిగా అధికారిక పోర్టల్లో అందుబాటులో పొందుపరిచారు. Website: 
www.schooledu.telangana,gov.in 
మన ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి, చేసేది వేరే. ఆ శాఖ ముఖ్య మంత్రి గారి దగ్గర వుంది. అధిక ఫిజులకు అడ్డుకట్ట వేస్తా అంటున్నారు  కానీ దోపిడి చేస్తున్న ఉన్నారు స్కూల్ యాజమాన్యాలకు అడ్డుకట్ట వేయడం లేదు.తల్లిదండ్రులకు విజ్ఞప్తి,ఫీజులు కట్టే ముందు ఒక్క విషయం చెక్ చేయకపోతే మీపిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు.ఒక వేళ గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే ...
* విద్యా ప్రమాణాలు సరిగా ఉండవు
* భద్రతా నిబంధనలు పాటించరు, మీ పిల్లల భద్రత మీదే.
* అర్హత లేని సిబ్బందితో భోధన  
* భవిషత్తులో సర్టిఫికెట్లకు సమస్య అవుతుంది.
స్కూల్ రికగ్నిషన్ తప్పనిసరిగా చెక్ చేయండి అధికారిక వెబ్ సైటులో ఆ స్కూల్ పేరు ఉందో లేదో చూడండి.అఫిలియేషన్ వివరాలు తీసుకోండి CBSE, ICSE of State Board  ఏదైనా సరే, దానికి సంబంధించిన వివరాలు.స్కూల్ ను స్వయంగా సందర్శంచండి, ప్రకటనలు చూసి మోసపోకండి. తరగతి గదులు, భద్రత,మరుగుదొడ్లు,తాగునీటి సౌకర్యం,ఆట స్థలం, ఫైర్ సేఫ్టీ, ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఎలా ఉంది, ఒక వేళ బస్సు అయితే, ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉందా? బస్సు లో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్, అన్ని అనుమతి పత్రాల గురించి అడగండి.చెల్లించిన డబ్బుకు రసీదులు అన్ని బద్ర పరుచుకోవాలి.అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలి, విద్యాబోధన ఏవిదంగా ఉంది అని. తెలుసుకోవాలి.అన్ని గుర్తింపు పత్రాలు చూడాలి.
పిల్లల విద్య పెట్టుబడి కాదు, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి.స్కూల్ లో చేర్చుకునే సమయం లో పిల్లలకు ఐడి క్రియేట్ చేస్తారు అదే"పెన్"
నెంబర్,11 డిజిట్స్ తో క్రియెట్ చేస్తారు, దీని వల్ల పిల్లల చదువులు ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు ట్రాక్ చేయడానికి, బోర్డు ఎగ్జామ్స్ కు ఉపయెగ పడుతుంది. ఇది క్రియేట్ అయ్యాక 'అపార్' ఐడి క్రియేట్ చేస్తారు,
ఇది ఒక యూనిక్ ఐడి.12 డిజిట్స్ తో ఉంటుంది. ఈ ఐడి లో పిల్లల మార్కులు, వారి అకాడమిక్ రికార్డ్స్, సర్టిఫికెట్స్ అన్ని ఒక డిజి లాకర్ లో డిజిటల్ గా భద్రపరుస్తారు. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్/ అడ్మిషన్ కోసం సులభం అవుతుంది.
One Nation,One student ID అని నేషనల్ ఎజుకెషన్ పాలసీ 2020 ప్రకారం 2023/25 విద్యా సంవత్సరం నుండి ఇది ప్రారంభం అయింది.

Wednesday, June 17, 2026

_జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది_

*పాత్రికేయ కుటుంబాలకు అండగా తెలంగాణ మీడియా అకాడమీ*

జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 21 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.

తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకం కింద మొత్తం 21 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేయబడింది. ఇందులో 17 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు మరియు 4 మంది అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకం కింద మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1,00,000 ఏకమొత్తo ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.3,000 పెన్షన్, అలాగే కుటుంబంలోని గరిష్టంగా ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 159 మందికి యిలాంటి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు.  

అనంతరం సభలో పాల్గొన్న వారందరూ తమ మధ్య నేడు లేని పాత్రికేయులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన జర్నలిస్టుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు,  మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, జర్నలిస్టులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.                                                              *Bplkm✍️*

Friday, June 12, 2026

మానవత్వం,సహాయం అందించడం లో ఎప్పుడు ముందుడే "క్రైమ్ రిపోర్టర్" విజయ్ కుమార్_

*మానవత్వం పరిమళించే - CPR చేసి మహిళ ప్రాణాలు కాపాడిన "క్రైమ్ రిపోర్టర్"*

*మానవత్వం,సహాయం అందించడం లో ఎప్పుడు ముందుడే "క్రైమ్ రిపోర్టర్" విజయ్ కుమార్*

*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త*
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

మౌలాలి రైల్వే స్టేషన్ లో జనవరి 5,2026 న జరిగింది ఈ సంఘటన.ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వస్తున్న మహిళ మౌలాలి లో స్టేషన్ కు చేరుకున్న తరువాత ట్రైన్ లో నుండి దిగుతూ కాలు జారీ ట్రైన్ కింద పడిపోయింది.అందరు చూస్తున్నారు కానీ ఆపదలో ఉన్న ఆ మహిళ వద్దకు వెళ్లి సహాయం చేద్దాం అనే వారు కరువయ్యారు. ఇదే ట్రైన్ లో ఖమ్మం నుంచి వస్తున్న సురేష్ ఈ సంఘటన చూసి తన మిత్రుడు అయిన *క్రైమ్ రిపోర్టర్ విజయ్ కుమార్* కు ఫోన్ చేయగా  "యాదృచ్ఛికం" గా మౌలాలి పరిసర ప్రాంతంలో ఉన్న విజయ్ కుమార్ వెంటనే మౌలాలి రైల్వేస్టేషన్ కు వెళ్లి ట్రైన్ కింద పడిపోయిన మహిళను పైకి లాగి మహిళకు CPR(కార్డియోపల్మోనరీ రిససిటేషన్ - Cardiopulmonary Resuscitation) చేసి ఆ మహిళను అంబులెన్సు లో తీసుకెళ్లి ప్రాణం కాపాడిన రామంతాపూర్ కి చెందిన హైదరాబాద్ క్రైమ్ రిపోర్టర్ విజయ్ కుమార్.ఎవరైనా గుండెపోటుతో పడిపోయినా లేదా శ్వాస ఆడక స్పృహ కోల్పోయినా, వెంటనే సీపీఆర్ చేయడం వల్ల మెదడుకు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కొనసాగుతుంది. ఇది వారి ప్రాణాలను కాపాడే అవకాశం.ప్రతి ఒక్కరు CPR శిక్షణ (Training), ప్రథమ చికిత్స (First-aid) గురించి అవగాహన చేసుకుంటే ఇలాంటి సమయంలో ప్రాణాలను కాపాడవచ్చు.ఈ సమాజంలో ఎవరికి ఏమైతే నాకు ఏంటి అనుకునే ఈ వ్యవస్థలో మహిళను కాపాడిన సీనియర్ క్రైమ్ రిపోర్టర్ కి అభినందనలు.

బాలకార్మిక వ్యవస్థను రూపు మాపాలి - అనురాధ రావు బాలల హక్కుల సంఘం_

*జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం...*

*బాల కార్మికం కాదు - బాల్యాన్ని హత్య చేయడం*

*బాలకార్మిక వ్యవస్థను రూపు మాపాలి - అనురాధ రావు బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

పాలు కావలని అడిగే చేతులు - పనిముట్లను,ఇటుకలను మోస్తున్నాయి, ఇది బాల కార్మికం కాదు - బాల్యాన్ని హత్య చేయడం. *International labour Organization* 2003 లో బాలకార్మిక వ్యవస్థను రూపు మాపడానికీ, దీని గురించి అవగాహనకల్పించడం, కావల్సిన చర్యలు తీసుకోవడానికి ఈ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది.138 మిలియన్ పిల్లలు అంటే 13.8 కోట్ల చిన్నారులు బాల కార్మికులుగా మగ్గుతున్నారు. దీంట్లో 54 మిలియన్ / 5.4 కోట్ల మంది చిన్నారులు హానికరమైన పనుల్లో బలైతున్నారు.ఒక చిన్నారి రాత్రి 12 గంటల వరకు పని చేసి, ఉదయం పుస్తకాల సంచితో స్కూల్ కు వెళ్ళితే, ఆ బ్యాగు బరువు పుస్తకాలది కాదు, తన బాల్యానిది.చాలా వరకు చిన్న పిల్లలు పాలకోసం లేస్తారు కాని, ఈ చిన్నారులు పనికోసం లేస్తున్నారు. వీరిచేతుల్లో పుస్తకాలకు బదులుగా స్తుత్తి, పార, ఇటుకలు మోస్తూ, హోటల్స్లో టీ కప్పులు కడుగుతూ, ప్లేట్లు తీస్తు కనిపిస్తారు, ఇండ్లల్లో పనులు చేస్తూ ఉంటారు.కారణం పేదరికం, అనాధలుగా మరడం, ప్రజల్లో అవగాహన లేకపోవడం, ట్రాఫికింగ్ కు గురి కావడం.ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి, ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టం గా కనబడుతోంది.మన దేశంలో ప్రతి ఆరునెలలకు ఒక రిస్క్యు ఆపరేషన్ జరుగుతుంది, జులై నెలలో ఆపరేషన్ ముస్కాన్, జనవరిలో ఆపరేషన్ స్మైల్. దీంట్లో తప్పిపోయిన చిన్నారులను, బాలకార్మికులను రెస్క్యూ చేసి వారి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు.కాని సంవత్సరాలు మారుతున్నాయి,
బాలకార్మిక వ్యవస్థలో మార్పు లేదు. ఆపరేషన్ ముస్కాన్లో దొరుకుతున్నారు, ఆపరేషన్ స్మైల్లో దొరుకుతున్నారు. అది
ఒక మొక్కుబడి కార్యక్రమం అని అనుకోవచ్చు. కారణం ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుంతుంది.మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ బాలకార్మికులు ఉన్నారు, వారు ఇతర రాష్ట్రాలకు కూడా ముఠాలు తీసుకుని వెళుతాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ మరియు మహారాష్ట్ర.ప్రతి చిన్నారి స్కులుకు వెళ్లాలి, బాల కార్మిక వ్యవస్థ నుండి విముక్తి కల్పించాలి.బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాన్ని, వారి ఫ్యాక్టరీలను/ సంస్థలను ఇటుక బట్టీలు, నిర్మాణ సంస్థలు, హోటల్స్, గాజుల ఫ్యాక్టరీలు, ముఖ్యంగా బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీలు ఏవైనా సరే సీజ్ చేసి కఠినంగా శిక్షలు,భారి జరిమాన విధించాలి.ప్రతిఒక్కరు తమ బాధ్యతగా ప్రతిజ్ఞ చేయాలి ,నా చుట్టూ ఉన్న పిల్లలను పని చేయకుండా స్కూల్ కు పంపుతాను అనే ప్రతిజ్ఞ చేద్దాం. ఆటపాటలతో వారి బాల్యాన్ని కాపాడటానికి మన వంతు కృషి చేద్దాం. బాల్యాన్ని చిదిమి వేయకుండా బడికి వెళ్లే విధంగా చుద్దాం - వారికి చేయుత నిద్దాం.

GHMC అంబర్పేట్ సర్కిల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు_

*GHMC అంబర్పేట్ సర్కిల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు*

*అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోని GHMC కమీషనర్, సికింద్రాబాద్ జోనల్ కమీషనర్,అంబర్పేట్ డిప్యుటీ కమీషనర్*

*అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను GHMC అధికారులు గౌరవిస్తలేరు - బాపట్ల కృష్ణమోహన్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

అంబర్పేట్ బాపు నగర్ అంబికా సారీస్ పక్కన నిర్మిస్తున్న నిర్మాణం అక్రమమా? సక్రమమా? అంబర్పేట్ సర్కిల్ డిప్యుటీ కమీషనర్ సమాధానం చెప్పాలి.ఐదు ఫ్లోర్లు పెంట్ హౌస్ కూడా వేశారు.అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.ఐదు ఫ్లోర్లు & పెంట్ హౌస్ వేసే దాకా GHMC అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు ? TGBPASS / బిల్డ్ నౌ లో అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ అంతస్తులు నిర్మించడం. సెట్‌బ్యాంక్ ఉల్లంఘనలు అంటే స్థలాన్ని వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేస్తున్నారు. కమర్షియల్ మార్పులు అంటే నివాస భవనాలను వాణిజ్య సముదాయాలుగా మారుస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తుంటే తక్షణమే ఆ నిర్మాణంను ఆపితే యజమానికి నష్టం జరుగదు. లేకపోతే అట్టి అక్రమ నిర్మాణంను అడ్డుపెట్టుకొని అవినీతి GHMC అధికారులతో కుమ్మక్కై కొందరు ప్రజాప్రతినిధులు / రాజకీయ నాయకులు / మీడియా ప్రతినిధులు అక్రమ నిర్మాణ యజమాని వద్ద అక్రమంగా డబ్బులు తీసుకుంటుండ్రు అని నిత్యం ఫిర్యాదులు.వీళందరు కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆధాయానికి గండి కొడుతున్నారు.ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి, వ్యవస్థలకు తీరని నష్టం.మున్సిపల్ చట్టాలను, TGBPASS నిబంధనలు ఉల్లంగించి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు అని గతంలో కూడా "మీడియా టుడే" లో వార్త కథనాలు వచ్చాయి. అధికారులు చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. కానీ ఈరోజు వరకు ఎలాంటి చర్యలు లేవు అంటే అవినీతి కి పాల్పడుతున్న అంబర్పేట్ జిహెచ్ఎంసి అధికారులు అని క్లియర్ గా అర్ధం అవుతుంది. నిబంధనలను ఉల్లంఘించిన వాటిపై GHMC కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి భవనాలను సీజ్ చేస్తున్నాం అన్నారు కానీ ఆలా జరగడం లేదు.సీజ్ చేసిన భవనాలు పూర్తి కూడా అయి గృహప్రవేశం అయిన సందర్భాలు ఎన్నో.
రాజకీయ రక్షణ, ఉన్నతాధికారుల అండదండలు ఉండటం వల్లనే అవినీతి అధికారులు వందల కోట్ల అక్రమాస్తులను కూడబెట్టగలుగుతున్నారు.తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు అని అర్ధం అవుతుంది.ఇలాంటి అక్రమ నిర్మాణాల గురించి నిత్యం ప్రభుత్వ అధికారిక మాద్యమాలు అయిన ట్విట్టర్ / ఇంస్టాగ్రామ్ / ఫేస్ బుక్ ద్వారా సీఎం కమ్ పురపాలక శాఖ మంత్రివర్యులు రేవంత్ రెడ్డికి,తెలంగాణ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ముఖ్య కార్యదర్శికి,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (MA&UD & HMDA) జయేష్ రంజన్,IAS కు,జిహెచ్ఎంసి కమీషనర్ కు,సైబరాబాద్ కమిషనర్ కు, మల్కాజిగిరి కమీషనర్ కు, అన్ని జోనల్ కమిషనర్లకు కు, డిప్యుటీ కమీషనర్లకు వందల ఫిర్యాదులు.GHMC ట్విట్టర్ ఆన్లైన్ లో ఎన్నిసార్లు 
ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటాం అని సమాధానం వస్తుంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు ? అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను గౌరవించరు ఎందుకు ?అక్రమ నిర్మాణాల ముందు అవి ‘నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలు’ అని తెలిసే విధంగా బోర్డులు పెట్టాలని హైకోర్టు గతంలో అభిప్రాయం వ్యక్తం చేసింది. అయినా అధికారులు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?.ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ అక్రమ నిర్మాణాల పై మౌనం వహిస్తే ఎట్లా ? అంబర్పేట్ సర్కిల్ లో చాలా అక్రమ నిర్మాణాల ఫిర్యాదులు ఉన్నాయి వీటిపై పూర్తిగా విచారణ జరిపించాలి... బాపట్ల కృష్ణమోహన్.

Thursday, June 11, 2026

బ్రతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించి భూమి కాజేయాలన్న కుట్ర బట్టబయలు..!

*బ్రతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించి భూమి కాజేయాలన్న కుట్ర బట్టబయలు..!*

*ప్రజావాణిలో ఫిర్యాదు – విచారణకు ఆర్డీఓ ఆదేశాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 10:

నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండలం ఇటుకులపాడు గ్రామానికి చెందిన గందం జ్యోతి భర్త అశోక్ తనకు పూర్వీకుల ఆస్తిలో రావలసిన మూడు ఎకరాల 10 గుంటల భూమిని అక్రమంగా కాజేయడానికి జరిగిన భారీ కుట్రపై న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు వివరాల ప్రకారం, తాను బ్రతికి ఉండగానే చనిపోయినట్టుగా తప్పుడు పత్రాలు, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి, తన అన్న అయిన బొడ్డు విజయ్ (తండ్రి వీరమల్లు) కొందరు అధికారులతో కుమ్మక్కై అక్రమ పట్టా పొందినట్లు ఆరోపించారు. తనకు చట్టబద్ధంగా రావలసిన వాటా భూమిని దోచుకునేందుకు ఈ కుట్ర జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు గందం జ్యోతి ప్రజావాణి ఫిర్యాదు నంబర్: PV-B 172/2026, తేదీ: 04-06-2026 ద్వారా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన నల్లగొండ జిల్లా ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి గారు విచారణ జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శాలి గౌరారం తహసీల్దార్ (ఎంఆర్వో)కు ఆదేశాలు జారీ చేశారు.*ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి..*:ఒక మహిళ బ్రతికి ఉండగానే ఆమెను ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్టుగా చూపించేంత ధైర్యం ఎవరిచ్చారు? తప్పుడు ధ్రువపత్రాలు ఎలా జారీ అయ్యాయి? అక్రమ పట్టా పొందడానికి ఎవరు సహకరించారు? ప్రభుత్వ భూముల రికార్డులను తమ ఇష్టానుసారం మార్చుకునే మాఫియాలకు అధికార యంత్రాంగంలో అండదండలు ఉన్నాయా? ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై, వాటికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గందం జ్యోతికి చట్టబద్ధంగా రావలసిన భూమిని అప్పగించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

హైదరాబాద్ ఉప్పుగూడలోని విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ పై ఫిర్యాదు – నర్సరీ విద్యార్థిని పట్ల దుర్వ్యవహారం మరియు నిర్లక్ష్య వైఖరి గురించి.

*హైదరాబాద్ ఉప్పుగూడలోని విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ పై ఫిర్యాదు – నర్సరీ విద్యార్థిని పట్ల దుర్వ్యవహారం మరియు నిర్లక్ష్య వైఖరి గురించి.*

*హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులకు తల్లితండ్రుల ఫిర్యాదు*

*మీడియా టుడే ను ఆశ్రయించిన పేరెంట్స్*

*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 10:

మా కుమార్తె జె. శ్రీనికా (నర్సరీ) ఉప్పుగూడ హనుమాన్ నగర్ లో ఉన్న విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ లో నర్సరీ చదువుతోంది. ఆమెకు సంబంధించిన ఒక తీవ్రమైన అంశాన్ని బాధ్యత గల తల్లితండ్రులుగా మేము జె.శ్రీ సాయి హరికిరణ్ (తండ్రి),
జె. రవళిక (తల్లి)హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తేది 20-04-2026 న తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.20-04-2026 తేదీన మా కుమార్తె రిపోర్ట్ కార్డ్ తీసుకోవడానికి తల్లి జె. రవళిక పాఠశాల వెళ్లినప్పుడు, స్కూల్ అడ్మిన్ సిబ్బంది (శ్రీమతి స్వప్న) రిపోర్ట్ కార్డ్ అందజేసి, ఎటువంటి సరైన కారణం లేదా వివరణ ఇవ్వకుండా మా కుమార్తెను పాఠశాల నుండి తీసుకెళ్లాలని సూచించారు. ఈ విధమైన ప్రవర్తన పూర్తిగా అనుచితమైనది మరియు ఆమోదయోగ్యం కానిది.
అంతేకాకుండా, గతంలో ఒక ఉపాధ్యాయురాలు మా కుమార్తెపై శారీరకంగా దాడి చేసిన సంఘటనను కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఆమె ముఖంపై ఉపాధ్యాయురాలి వేళ్ల గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ఈ విషయంపై మేము పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించినప్పుడు, వారు బాధ్యతారాహిత్యంగా స్పందించి మా ఆందోళనలను సరైన విధంగా పరిష్కరించలేదు.ఇంకా, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవర్తన కూడా అత్యంత అవృత్తిపరమైనది మరియు అవమానకరమైనది. ఆమె అహంకారపూరితమైన మరియు అనుచితమైన భాషను ఉపయోగిస్తూ, “మీరు ఎవరికి కావాలంటే వారికి ఫిర్యాదు చేసుకోండి, నాకు ఎలాంటి సమస్య లేదు” అని సిబ్బంది, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో వ్యాఖ్యానించారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి నుండి ఇటువంటి ప్రవర్తన చాలా ఆందోళనకరమైనది.ఇలాంటి వాతావరణం చిన్నపిల్లల భద్రతకు మరియు మానసిక వికాసానికి హానికరంగా ఉంటుంది.అందువల్ల హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణించి, పాఠశాల యాజమాన్యం మరియు సంబంధిత సిబ్బంది దుర్వ్యవహారంపై తగిన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, విద్యార్థుల భద్రత, గౌరవం మరియు సంక్షేమాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.తేది 13-05-2026 నాడు  RTIA పిటిషన్ హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు... స్పందన కోసం తల్లితండ్రులు వేచి చూస్తున్నాము అని అన్నారు.