Saturday, July 25, 2026

డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ (FAC) అధికారిపై సమగ్ర విచారణ చేపట్టాలి_

*డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ (FAC) అధికారిపై సమగ్ర విచారణ చేపట్టాలి*

*నో యువర్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్‌కు ఫిర్యాదు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 25:

నో యువర్ రైట్స్ సొసైటీ (రిజి. నెం. 177/2019) అధ్యక్షులు ఎస్. ఉమేష్ కుమార్ ఈరోజు హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) డైరెక్టర్‌ను కలిసి, ప్రస్తుతం *డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ (FAC)గా పనిచేస్తున్న శ్రీ వాపర్ల ఆనందరావు* సేవా వ్యవహారాలకు సంబంధించిన అభియోగాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.
వినతిపత్రంలో అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు, న్యాయస్థానాల్లో జరిగిన న్యాయ ప్రక్రియలు మరియు ఇతర సమాచారం ఆధారంగా పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, నోషనల్ ప్రమోషన్లు, ప్రభుత్వ అనుమతి లేకుండా స్వీయ రిలీవింగ్ ఆర్డర్ జారీ చేసుకున్నారనే అభియోగాలు, అలాగే అసాధారణ సెలవు (E.O.L.) తదితర అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
అదేవిధంగా, సంబంధిత న్యాయస్థానాల్లో దాఖలైన కేసులు, ప్రభుత్వ ఉత్తర్వులు, సేవా నియమావళి మరియు శాఖ రికార్డులను పరిశీలించి, నోషనల్ ప్రమోషన్లు నిబంధనలకు అనుగుణంగా మంజూరయ్యాయా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.నో యువర్ రైట్స్ సొసైటీ అధ్యక్షులు ఎస్. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు పూర్తిగా ప్రజా ప్రయోజనం, పారదర్శకత, జవాబుదారీతనం మరియు సహజ న్యాయం (Natural Justice) సూత్రాల పరిరక్షణ కోసమే సమర్పించబడిందని తెలిపారు. వాస్తవ నిర్ధారణ అవసరమైన అంశాలన్నింటినీ వినతిపత్రంలో "అభియోగాలు" (Alleged) అనే పదంతోనే పేర్కొన్నామని, ఎవరిపైనా ముందస్తు నిర్ణయానికి రావడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.సంబంధిత అధికార యంత్రాంగం ఈ అంశంపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరిపి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నో యువర్ రైట్స్ సొసైటీ కోరింది.

ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్_

*"ప్రతి నీటి చుక్కను సంరక్షించుకుందాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం"*

*ప్రజలు కూడా దీనిని తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలి*

*ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 25:

హైదరాబాద్‌లో భూగర్భ జలాలను పరిరక్షించడం, వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) ఆధ్వర్యంలో నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజెక్షన్ పాయింట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, హార్వెస్టింగ్ బోర్‌వెల్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం "ప్రతి నీటి చుక్కను సంరక్షించుకుందాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం" అనే నినాదంతో మొక్కలు నాటి, వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సైఫాబాద్ సైన్స్ కళాశాల విద్యాబోధనతో పాటు వర్షపు నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలుస్తూ సమాజానికి మార్గదర్శకత్వం వహించడం అభినందనీయమన్నారు.నేటి పరిస్థితుల్లో ప్రతి వ్యవస్థ నీటిపైనే ఆధారపడి ఉందని, కురిసే వర్షపు నీటిని డ్రైనేజీల ద్వారా వృథాగా కాలువల్లోకి వెళ్లనివ్వకుండా భూగర్భ జలాల్లోకి ఇంకేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో రాతి నిర్మాణాలు, సిమెంట్ రోడ్ల విస్తరణ కారణంగా వర్షపు నీరు సహజంగా భూమిలోకి ఇంకే పరిస్థితి తగ్గిపోయిందని, అందువల్ల నగరంలోని ప్రతి ఇల్లు, ప్రతి సంస్థలో ఇంకుడు గుంతలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.నిజాం కాలం నుంచే హైదరాబాద్‌లో నీటి సంరక్షణ కోసం అనేక చెరువులు నిర్మించారని గుర్తు చేసిన మంత్రి, ఆ సంప్రదాయాన్ని ఆధునిక పద్ధతులతో కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. 2016 నుంచి హైదరాబాద్‌లో భవన నిర్మాణ అనుమతుల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను తప్పనిసరి చేసిన విషయాన్ని గుర్తుచేశారు.గత కొద్ది రోజులుగా నగరంలో రోజువారీ నీటి ట్యాంకర్ల వినియోగం సుమారు 4 వేల నుంచి 12 వేల వరకు పెరిగిందని పేర్కొంటూ, ఇది రాబోయే నెలల్లో నీటి అవసరం మరింత పెరిగే సూచనగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే 3 వేల నుంచి 4 వేల వరకు బోర్‌వెల్స్ ఎండిపోయాయని, అలాంటి బోర్‌వెల్స్‌కు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేస్తే అవి తిరిగి నీటి నిల్వలను పొందే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం హార్వెస్టింగ్ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రజలు కూడా దీనిని తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు.కృష్ణా, గోదావరి, నాగార్జునసాగర్, సింగూరు, మంజీరా, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల ద్వారా రైతుల అవసరాలను సమన్వయం చేస్తూ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తున్నప్పటికీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటి సంరక్షణే శాశ్వత పరిష్కారమని మంత్రి అన్నారు.2024 అక్టోబర్ 2న రాష్ట్రంలో భారీ స్థాయిలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఈ కార్యక్రమం అమలులో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉండగా, త్వరలోనే మొదటి స్థానానికి చేరుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
త్వరలోనే మంత్రుల నివాసాలు, కార్యాలయాలు, శాసనసభ, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్‌ను తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబం తమ ఇళ్లలోనే కాకుండా బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసేలా చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు.రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను ఒక ఉద్యమంగా, సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకోవాలని, తద్వారా భావితరాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించగలమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విధానాన్ని అమలు చేస్తోందని, వాహనం కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ ఒక మొక్కను అందించే కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ అద్దంకి దయాకర్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రియాంక అల, జలమండలి ఎండీ శ్రీ అశోక్ రెడ్డి, సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Thursday, July 23, 2026

బాలలహక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి అచ్యుతరావు 6వ వర్ధంతి

*బాలల హక్కుల కార్యకర్త (Child Rights Activist) మరియు బాలల హక్కుల సంఘం వ్యవస్థాపకుడు పీ. అచ్యుతరావు 6వ వర్ధంతి*

*బాలల హక్కుల ఉద్యమకారుడిగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన అచ్యుత రావు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 21:

బాలల హక్కుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ అచ్యుత రావు గారు మనలను విడిపోయి అప్పుడే ఆరు సంవత్సరాలు అయింది. బాలల హక్కులకు ఎక్కడ ఆటంకమైన మరు నిమిషం తను వారికి అండగా ఉండేవారు,24/7 వారికి నేనున్న అనే భరోసా ఇచ్చేవారు.ఎక్కడ ఎవరికి తలొగ్గే వారు కాదు. చిన్నారులకు న్యాయం జరిగే వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త (Child Rights Activist) మరియు బాలల హక్కుల సంఘం వ్యవస్థాపకుడు పీ. అచ్యుతరావు. సుమారు 30 ఏళ్లకు పైగా హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసిన ఆయన, బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ, మరియు పిల్లలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారు.తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బాలల హక్కుల ఉల్లంఘన జరిగినా స్పందించి, పిల్లల రక్షణకు, పునరావాసానికి తన ఎన్జీవో ద్వారా ఎనలేని కృషి చేశారు.ఆయన జూలై 22, 2020న కరోనా వైరస్ (COVID-19) బారిన పడి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.అచ్యుత రావు గారి జ్ఞాపకార్థం ఈ రోజు  22 వ తేది హిమాయత్ నగర్ లోని భూలక్ష్మి గుడి దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించాము అని బాలలహక్కుల సంఘం ప్రస్తుత అధ్యక్షురాలు అనూరాధ రావు గారు తెలియచేశారు.ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో 500 కు పైగా  పాల్గొన్నారు.

Wednesday, July 22, 2026

"నల్లబాలు" కేసు - తెలంగాణ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది_

*"నల్లబాలు" కేసు - తెలంగాణ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది*

*భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) నల్లబాలు అలియాస్ దుర్గం శశిధర్ గౌడ్ (Nalla Balu alias Durgam Shashidhar Goud) సోషల్ మీడియా కేసును కొట్టివేస్తూ, ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.*

*రాజకీయ నాయకులను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన నేరం కాదని, అది భావప్రకటనా స్వేచ్ఛ (Article 19(1)(a)) కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది*

*పోలీసులకు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 21:

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై సోషల్ మీడియాలో (ట్విట్టర్ /Twitter) విమర్శనాత్మక పోస్టులు పెట్టారని మరియు బీఆర్ఎస్ (BRS) అధికారిక పోస్టులను రీ-ట్వీట్ చేశారని నల్లబాలుపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు, రాజకీయ విమర్శలు చేయడం నేరం కాదంటూ 2025 సెప్టెంబర్‌లో నల్లబాలుపై నమోదైన FIRలను కొట్టేసింది. అంతేకాకుండా, సోషల్ మీడియా పోస్టులపై ఇష్టానుసారంగా కేసులు పెట్టకూడదని పోలీసులకు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది.హైకోర్టు ఇచ్చిన ఆ మార్గదర్శకాలను, కేసు కొట్టివేతను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తేదీ :02-02-2026 ఈ విషయం ఈరోజు విచారణకు వచ్చింది.దీనిని విచారించిన *ధర్మాసనం :గౌరవనీయులైన Mr. జస్టిస్ JB పార్దివాలా గౌరవనీయులు Mr. పిటిషనర్(ల) కోసం జస్టిస్ విజయ్ బిష్ణోయ్* ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.తెలంగాణ రాష్ట్రం తరఫున హాజరైన  సీనియర్ న్యాయవాది శ్రీ సిద్ధార్థ్ లూత్రా. ప్రతివాది(ల) తరపున న్యాయవాదుల వాదనలు విన్న తరువాత కోర్టు ఈ క్రింది ఉత్తర్వును జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన ఈ పిటిషన్లు, తెలంగాణ హైకోర్టు 10.09.2025 తేదీన ఇచ్చిన తీర్పు మరియు ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలు చేయబడ్డాయి. ఆ తీర్పు ద్వారా హైకోర్టు పలు క్రిమినల్ పిటిషన్ల సమూహాన్ని పరిష్కరించి, తద్వారా సదరు ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొన్న నేరాలకు గాను ఇక్కడి ప్రతివాదులపై నమోదు చేసిన క్రిమినల్ విచారణలను రద్దు చేసింది.
*ఉత్తర్వులోని క్రియాశీలక భాగం ఈ విధంగా ఉంది:-*
పై ఆదేశాల దృష్ట్యా, క్రిమినల్ పిటిషన్ నెం. 4905, 4903, మరియు 8416/2025 అనుమతించబడ్డాయి. తత్ఫలితంగా, పిటిషనర్‌పై (i) తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) పరిధిలోని CCPS రామగుండం పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIR నెం. 08/2025; (ii) TSCSB పరిధిలోని CCPS కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIR నెం. 13/2025; మరియు (iii) రామగుండం, GDK-I టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIR నెం. 146/2025 కేసులలోని విచారణలు ఇందుమూలంగా రద్దు చేయబడ్డాయి.రాష్ట్రం తరఫున హాజరైన  సీనియర్ న్యాయవాది శ్రీ సిద్ధార్థ్ లూత్రా, ఈ విషయం యొక్క యోగ్యతల వరకు తాను వాదించడానికి ఏమీ లేదని చాలా నిష్పక్షపాతంగా సమర్పించారు.అయితే, సవాలు చేయబడిన తీర్పులోని 29వ పేరాలో హైకోర్టు నిర్దేశించిన విస్తృత మార్గదర్శకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పవలసినది ఉంది. శ్రీ లూత్రా ప్రకారం, హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి మరియు అటువంటి పరిస్థితులలో, ఈ కోర్టు ఆ మార్గదర్శకాలను పరిశీలించి, ఆ పొంతనలేనితనాలను సరిదిద్దాలని ఆయన కోరారు. 
*29వ పేరా ఈ విధంగా ఉంది:-*
ఈ తీర్పును ముగించే ముందు, ఈ కోర్టు కొన్ని పరిశీలనలు చేయడం అవసరమని భావిస్తోంది. ఇందులో చర్చించిన వాస్తవ మరియు చట్టపరమైన స్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రాథమిక హక్కులను పరిరక్షించడంతో పాటు, క్రిమినల్ ప్రక్రియను యాంత్రికంగా లేదా ఏకపక్షంగా ప్రారంభించకుండా నిరోధించే ఉద్దేశ్యంతో, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ప్రారంభించిన విచారణలతో వ్యవహరించేటప్పుడు పోలీసు అధికారులు మరియు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ల కోసం కార్యాచరణ మార్గదర్శకాల సమితిని సూచించడం సముచితం. అటువంటి పోస్టులకు సంబంధించి ప్రథమ సమాచార నివేదికల (FIRలు) నమోదును కోరే కేసులలో ఈ ఆదేశాలు ప్రత్యేకంగా వర్తిస్తాయి. తదనుగుణంగా, పోలీసు అధికారులు ఈ క్రింది మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని ఆదేశించడమైనది:
*(i). దావా వేసే అర్హతను ధృవీకరించుకోవడం*: పరువు నష్టం లేదా అలాంటి ఇతర నేరాలకు సంబంధించి ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు, ఫిర్యాదుదారుడు చట్ట ప్రకారం "బాధితుడు" అవునో కాదో పోలీసులు ధృవీకరించుకోవాలి. దావా వేసే అర్హత లేని, సంబంధం లేని మూడవ పక్షాల ఫిర్యాదులు చెల్లుబాటు కావు, అయితే ఆ ఫిర్యాదు గుర్తించదగిన నేరానికి సంబంధించినది అయితే మినహాయింపు ఉంటుంది.
*(ii). విచారణార్హమైన నేరాలలో ప్రాథమిక విచారణ*: ఒక విజ్ఞప్తి/ఫిర్యాదు విచారణార్హమైన నేరాన్ని వెల్లడించినప్పుడు, పోలీసులు, నేరాన్ని నమోదు చేయడానికి ముందు, ఆరోపించబడిన నేరానికి సంబంధించిన చట్టబద్ధమైన అంశాలు ప్రాథమికంగా రుజువయ్యాయో లేదో నిర్ధారించుకోవడానికి ప్రాథమిక విచారణను నిర్వహించాలి.
*(iii). మీడియా పోస్ట్/ప్రసంగ సంబంధిత నేరాలకు అధిక ప్రమాణం*: హింస, ద్వేషం లేదా ప్రజా అశాంతికి ప్రేరేపించడాన్ని వెల్లడించే ప్రాథమిక సాక్ష్యం (ప్రైమబీ మెటీరియల్) ఉంటే తప్ప, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, ఉద్దేశపూర్వక అవమానం, ప్రజా అశాంతి, ప్రజా భద్రతకు ముప్పు లేదా రాజద్రోహం వంటి ఆరోపణలు ఉన్న ఏ కేసునూ నమోదు చేయరాదు. కేదార్ నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ , 1962 సప్ (2) ఎస్.సి.ఆర్ 769, మరియు శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, (2015) 5 ఎస్.సి.సి 1 కేసులలో నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా ఈ ప్రమాణాన్ని తప్పనిసరిగా వర్తింపజేయాలి.
*(iv). రాజకీయ ప్రసంగం/పోస్ట్‌కు రక్షణ*: కఠినమైన, అభ్యంతరకరమైన లేదా విమర్శనాత్మక రాజకీయ ప్రసంగాలకు సంబంధించి పోలీసులు యాంత్రికంగా కేసులు నమోదు చేయరాదు. ఆ ప్రసంగం హింసను ప్రేరేపించేదిగా ఉన్నప్పుడు లేదా ప్రజాశాంతికి తక్షణ ముప్పు కలిగించినప్పుడు మాత్రమే క్రిమినల్ చట్టాన్ని ప్రయోగించవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(l)(a) కింద స్వేచ్ఛాయుత రాజకీయ విమర్శకు కల్పించిన రాజ్యాంగ రక్షణలను ఖచ్చితంగా అమలు చేయాలి.
*(v). విచారణార్హం కాని నేరంగా పరువు నష్టం*: పరువు నష్టం అనేది విచారణార్హం కాని నేరంగా వర్గీకరించబడినందున, పోలీసులు అటువంటి విషయాలలో నేరుగా FIR లేదా నేరాన్ని నమోదు చేయలేరు. ఫిర్యాదుదారుని సంబంధిత మేజిస్ట్రేట్‌ను సంప్రదించమని ఆదేశించాలి. BNSSలోని సెక్షన్ 174(2) కింద మేజిస్ట్రేట్ యొక్క నిర్దిష్ట ఉత్తర్వుపై మాత్రమే పోలీసు చర్య తీసుకోవచ్చు.
*(vi). అరెస్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవడం*: అన్ని సందర్భాల్లో, పోలీసులు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ , (2014) 8 SCC 273 కేసులో నిర్దేశించిన సూత్రాలను ఖచ్చితంగా పాటించాలి. ఆటోమేటిక్ లేదా యాంత్రిక అరెస్టులు అనుమతించబడవు, మరియు క్రిమినల్ ప్రాసెస్ అమలులో అనుపాత సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలి.
*(vii). సున్నితమైన కేసులలో ముందస్తు న్యాయ పరిశీలన*: రాజకీయ ప్రసంగం/పోస్ట్ లేదా ఇతర సున్నితమైన భావప్రకటనా రూపాలకు సంబంధించిన విషయాలలో, ప్రతిపాదిత చర్య చట్టబద్ధంగా నిలబడగలదని నిర్ధారించుకోవడానికి, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుండి ముందస్తు న్యాయ సలహా పొందాలి.
*(viii). అసంబద్ధమైన లేదా దురుద్దేశపూరిత ఫిర్యాదులు*: ఒక ఫిర్యాదు అసంబద్ధమైనదని, వేధించేదని, లేదా రాజకీయ ప్రేరేపితమైనదని తేలితే, దర్యాప్తు చేయడానికి తగినంత ఆధారాలు లేవని పేర్కొంటూ, పోలీసులు BNSS లోని సెక్షన్ 176(1) కింద ఆ విషయాన్ని మూసివేయాలి.మేము 29వ పేరాను క్షుణ్ణంగా పరిశీలించాము. హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలతో సహా, హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పు మరియు ఉత్తర్వులో మేము జోక్యం చేసుకోకూడదనే అభిప్రాయానికి వచ్చాము.పైన పేర్కొన్న వాటితో, ప్రత్యేక అనుమతి పిటిషన్లు కొట్టివేయబడ్డాయి. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తు(లు) ఏవైనా ఉంటే, అవి పరిష్కరించబడినట్లుగా పరిగణించబడతాయి.

దుర్గం చెరువు పునరుద్ధరణ వేగవంతం_

*దుర్గం చెరువు పునరుద్ధరణ వేగవంతం*

*దుర్గం చెరువు పునరుద్ధరణ చర్యల సమీక్ష*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 21:

చెరువు నీటి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు దాని నిర్వహణను పర్యవేక్షించడానికి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, సిఎంసి, హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, టిజిఐఐసి మరియు ఇరిగేషన్ అండ్ సిఎడి అధికారులతో కలిసి దుర్గం చెరువును తనిఖీ చేశారు.తనిఖీ సందర్భంగా, కమిషనర్ ఈ క్రింది ఆదేశాలు జారీ చేశారు:

*(1)* :టిజిఐఐసి పరిధిలోని ఎస్‌టిపి అవుట్‌లెట్ల నుండి విడుదలయ్యే నీరు శుద్ధి చేసిన నీరా లేక శుద్ధి చేయని మురుగునీరా అని నిర్ధారించుకోవడానికి, తెలంగాణ పిసిబి నమూనాలను సేకరించాలి.
*(2)*: దుర్గం చెరువులోకి శుద్ధి చేయని మురుగునీటి ప్రవాహాన్ని టిజిఐఐసి తక్షణమే నిలిపివేయాలి.
*(3)*: రాహేజా మరియు హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్&ఎస్‌బి చెరువుపై తేలుతున్న చెత్త మరియు నాచును తొలగించాలి.
*(4): మాదాపూర్ సర్కిల్ అధికారులు ఈ రాత్రిలోగా చెరువు నుండి తొలగించిన తేలియాడే చెత్తను తొలగించి, తరలించాలి.
*(5)*: టెండర్ ప్రక్రియ ఖరారయ్యే వరకు చెరువు తీర నిర్వహణ కోసం స్వయం సహాయక బృందాల (SHG) సభ్యుల ద్వారా చెరువు ప్రవేశ రుసుమును వసూలు చేయాలి.

ఆర్జీఐఏ RGIA (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో ఆహార దుకాణాల నిర్లక్ష్యం – ప్రయాణికుల హక్కులు ఎక్కడ?_

*ఆర్జీఐఏ RGIA (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో ఆహార దుకాణాల నిర్లక్ష్యం – ప్రయాణికుల హక్కులు ఎక్కడ?*

*ధూళిపాళ సీతారాం - వ్యవస్థాపక అధ్యక్షులు ది సిటిజన్స్ కౌన్సిల్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 21:

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆర్జీఐఏ(RGIA)లో ఆహార దుకాణాల నిర్వహణపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి గణనీయమైన మార్పు కనిపించడం లేదు. ప్రయాణికుల సౌకర్యం కంటే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజులు, ఆహార దుకాణాల అద్దెల వసూళ్లపైనే విమానాశ్రయ యాజమాన్యం, అలాగే భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది అని ది సిటిజన్స్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ధూళిపాళ సీతారాం అన్నారు.FSSAI నిబంధనల ప్రకారం ఆహార దుకాణాలు వినియోగదారులకు సురక్షితమైన తాగునీటిని ఉచితంగా అందించడం తప్పనిసరి అన్నారు. అయితే ఆర్జీఐఏలోని అనేక ఆహార దుకాణాలు తాగునీరు ఇవ్వకుండా, పక్కనే ఉన్న మరో దుకాణానికి వెళ్లాలని లేదా ఒక నిర్దిష్ట బ్రాండ్‌కు చెందిన ఒక లీటర్ నీటి సీసా కొనుగోలు చేయాలని సూచించడం అత్యంత విచారకరం అని అన్నారు. కేవలం ఒక గ్లాసు నీరు కావాలనుకునే ప్రయాణికులను కూడా ఇలా ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదు.ఇప్పటికే ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్నప్పటికీ, కనీస వినియోగదారుల హక్కుగా తాగునీటిని అందించకపోవడం లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనే. అలాంటి దుకాణాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? వారి లైసెన్సులను ఎందుకు రద్దు చేయడం లేదు?అని ప్రశ్నించారు.ప్రస్తుత పరిస్థితిని చూస్తే ప్రయాణికుల ప్రయోజనాల కంటే ఒక నిర్దిష్ట బ్రాండ్‌కు చెందిన ఒక లీటర్ నీటి సీసాల విక్రయాలను ప్రోత్సహించడానికే ఆర్జీఐఏ యాజమాన్యం ఆసక్తి చూపుతున్నట్లుగా అనుమానం కలుగుతోంది.ఆర్జీఐఏ యాజమాన్యం మరియు FSSAI వెంటనే జోక్యం చేసుకొని అన్ని ఆహార దుకాణాల్లో ఉచిత తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించేలా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకొని ప్రయాణికుల హక్కులను పరిరక్షించాలి.

Tuesday, July 21, 2026

ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు_

*హైడ్రాకు రెండేళ్లు.. న‌గ‌రంలో సంబ‌రాలు*

*నెక్లెస్ రోడ్డులో ర్యాలీ తీసిన‌ న‌గ‌ర ప్ర‌జ‌లు*

*ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 20:

హైడ్రాకు రెండేళ్లు.. న‌గ‌ర‌వ్యాప్తంగా సంబ‌రాలు.. శ‌నివారం రోజు వివిధ ప్రాంతాల్లో జ‌రిగిన వేడుక‌లు నిరూపించాయి. పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడి మా కాల‌నీల‌కు జీవం పోశార‌ని కొన్ని కాల‌నీల్లో వేడుక‌లు చేసుకోగా.. చెరువుల‌ను పున‌రుద్ధ‌రించి అక్క‌డ ఆహ్లాద‌క‌ర‌ వాతావ‌ర‌ణం ఉండేలా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంద‌ని మ‌రి కొన్ని ప్రాంతాల వారు సంబ‌రాలు చేసుకున్నారు. కొండ‌లు గుట్ట‌ల‌తో ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం ఉన్న ప్ర‌భుత్వ భూములు క‌బ్జాలు కాకుండా చ‌ర్య‌లు తీసుకున్నారంటూ మ‌రి కొంత‌మంది వేడుక చేసుకున్నారు.  హైడ్రా ఫెన్సింగ్ వేసి కాపాడిన ప్ర‌భుత్వ భూముల్లో ట‌పాసులు పేల్చి కేరింతలు కొట్టారు.న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగ‌ర్‌, నెక్లెస్ రోడ్డుకు చేరుకుని  భారీ ర్యాలీ తీశారు. ఎన్‌టీఆర్ గార్డెన్ నుంచి లుంబినీ పార్కు వ‌ర‌కూ భారీ ర్యాలీ నిర్వ‌హించి ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసి న‌గ‌రానికి భ‌విష్య‌త్తునిచ్చిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిలువెత్తు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దేశానికే ఆద‌ర్శ‌మంటూ ప‌లువురు ఈ సంద‌ర్భంగా కితాబునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాను విస్త‌రించి జిల్లాల్లో కూడా చెరువులు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు డిమాండ్ చేశారు. రెండేళ్ల‌లో 3315 ఎక‌రాల భూమిని కాపాడిన హైడ్రాను అభినందించారు. ఈ భూముల విలువ లెక్క‌ల్లో చూస్తే రూ. 1.50 ల‌క్ష‌ల కోట్లు అయినా.. ప్రాణ‌వాయువును అందించే పార్కుల రూపంలో.. భూగ‌ర్భ జ‌లాల‌ను పెంపొందించి.. వ‌ర‌ద‌ల క‌ట్ట‌డి చేసిన చెరువుల విభాగంలో చూస్తే విలువ అనంత‌మంటూ కీర్తించారు. హైడ్రా ఏర్పాటు చేయ‌డం ప్ర‌భుత్వ సాహ‌సోపేత నిర్ణ‌యంగా ప‌లువురు అభివ‌ర్ణించారు. అనంత‌రం స‌చివాల‌యంలో వివిధ శాఖ‌ల అధికారుల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేశారు.