Tuesday, September 8, 2026

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ TGHRC పాత కేసు రికార్డుల తొలగింపు మరియు ధ్వంసానికి సంబంధించి జారీ చేసిన ప్రజా నోటీసు_

*తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ TGHRC పాత కేసు రికార్డుల తొలగింపు మరియు ధ్వంసానికి సంబంధించి జారీ చేసిన ప్రజా నోటీసు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 08:

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కార్యదర్శి మరియు CEO జారీ చేసిన ప్రజా నోటీసును ఇందుమూలంగా జతపరుస్తున్నాము. కమిషన్‌లో పూర్తయిన పాత/పరిష్కరించబడిన కేసు రికార్డుల తొలగింపు (Weeding-out) ప్రక్రియ అనంతరం, మొత్తం 51,798 పాత/పరిష్కరించబడిన కేసు రికార్డులను ధ్వంసం చేయడం ప్రతిపాదించబడింది. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 16,730 రికార్డులు మరియు 12.08.2005 నుండి 20.03.2021 వరకు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 35,068 రికార్డులు ఉన్నాయి.ఈ ప్రజా నోటీసు ద్వారా సంబంధిత వ్యక్తులు తమ అభ్యంతరాలు, హక్కు/దావాలు లేదా వివరణ/స్పష్టీకరణకు సంబంధించిన అభ్యర్థనలను నోటీసు ప్రచురితమైన తేదీ నుండి 15 రోజులలోపు సమర్పించేందుకు అవకాశం కల్పించబడింది. అందువల్ల, ఈ నోటీసు ప్రజల హక్కులు మరియు ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశం కావడంతో, ప్రజా ప్రయోజనార్థం విస్తృత ప్రచారం అవసరం.కావున, జతపరచిన ప్రజా నోటీసును ప్రజలందరికీ సమాచారం అందేలా విస్తృత ప్రచారం కల్పించవలసిందిగా మనవి.

దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ ఆయనను అవమానించేలా మాట్లాడటం కరెక్ట్ కాదు _

*స్పీకర్‌ను కించపరిచేలా, అసభ్య పదజాలంతో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాసనసభ గౌరవానికి అవమానకరం - మంత్రి దామోదర్ రాజనర్సింహ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 07:

అసెంబ్లీ స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఓ ఎమ్మెల్సీ బూతులు తిడుతూ, అమర్యాదకరంగా మాట్లాడటాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్రంగా ఖండించారు.స్పీకర్‌ను కించపరిచేలా, అసభ్య పదజాలంతో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాసనసభ గౌరవానికి అవమానకరం అని మంత్రి పేర్కొన్నారు.రాజకీయ విభేదాలు ఉండవచ్చు. విధానాలపై విమర్శలు చేయవచ్చు. కానీ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం ఏ విధంగానూ సమర్థనీయం కాదన్నారు. ప్రత్యేకించి, దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ ఆయనను అవమానించేలా మాట్లాడటం అత్యంత ఆందోళనకరమైన విషయం అని మంత్రి అన్నారు.దళితులు ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయికి ఎదిగి, అత్యున్నత పదవులను అలంకరించినప్పటికీ వారిపై వివక్ష, చిన్నచూపు, అవమానకరమైన వ్యవహారశైలి ఇంకా కొనసాగుతుండటం దురదృష్టకరమన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి ఎనభై ఏళ్లు అవుతున్నా ఇప్పటికి కూడా దళితుల పట్ల ఇలాంటి మానసిక వివక్ష కొనసాగడం బాధాకరం అని దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, గౌరవం కల్పించినప్పటికీ, దళితులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వారిని ఇంకా చిన్నచూపు చూసే మనస్తత్వం కొనసాగడం సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశమన్నారు.
ఒక దళితుడు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలకు గురికావడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం మాత్రమే కాదని, దళిత సమాజం పట్ల ఉన్న వివక్షపూరిత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు. ప్రజాప్రతినిధులు తమ హోదా, బాధ్యతలను గుర్తించి మాట్లాడాలని, పరస్పర గౌరవాన్ని పాటించాలని ఆయన సూచించారు. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు.సదరు ఎమ్మెల్సీ గారిపై శాసనసభ నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్ గారిని మంత్రి కోరారు.

శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్ కు మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాలుగా నామకరణం_

*శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్ కు మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాలుగా నామకరణం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 07:

శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాలుగా నామకరణం చేసిన ఈ ప్రాంగణ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ శాసనసభ స్పీకర్ శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి గౌరవ సభ్యులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో వెన్నెముక గాయాలతో బాధపడుతున్న దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకోవాలి - నరేష్

*రేవంత్ రెడ్డి సారు మమ్మల్ని ఆదుకోండి*

*రాష్ట్రంలో వెన్నెముక గాయాలతో బాధపడుతున్న దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకోవాలి - నరేష్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 07:

నా పేరు నరేష్ మాది మరికల్ గ్రామం,చౌడపూర్ మండలం,వికారాబాద్ జిల్లా.​జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు.నాకు 18 సంవత్సరాల క్రితం ఆటో ప్రమాదం వల్ల వెన్నుముక విరిగింది అప్పటినుంచి నేను మంచానికి పరిమితం అయ్యాను.ఏ పనులు చేసుకోవాలన్న అమ్మా నాన్నల సహకారం అవసరం. రోడ్డు ప్రమాదం తర్వాత వెన్నుముక్క విరిగి మంచానికి పరిమితమైన నేను నా వల్ల కుటుంబం చాలా ఇబ్బందులు పడింది.ఆ సమయంలో నాకంటే ఎక్కువగా నా కుటుంబం తీవ్ర వేదనను అనుభవించింది.నన్ను పూర్వపు స్థితికి తీసుకురావాలన్న తాపత్రయంతో నిమ్స్ (NIMS) హాస్పిటల్‌లో దాదాపు రెండు సంవత్సరాలకు పైగా చికిత్స చేయించారు.

*ట్రీట్మెంట్ కోసం 20 పశువులను,కొంత భూమిని కూడా అమ్మి నాకోసం ఖర్చు చేశారు*

అయినా కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు మమ్మల్ని చూసుకోవడానికి ఒక సంరక్షకులు ఎప్పుడు మావెంటే ఉండాలి.​ఆ చీకటి రోజుల్లో జీవితంపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ... నా జీవితంలోకి *హోప్ 4 స్పందన* ఒక స్వచ్ఛంద సంస్థ పరిచయమై శ్రీ కోట లక్ష్మీ నరసింహ సర్ ,రఘు అరికపూడి సర్ నా పరిస్థితిని అర్థం చేసుకుని, నేను స్వయం సమృద్ధిగా జీవించడానికి నాకు ఒక చిన్న కిరాణా షాప్ పెట్టి ఇవ్వడం జరిగింది. అలాగే నాలాంటి వెన్నుముక బాధితులకు *హోప్ 4 స్పందన ఫౌండేషన్  *స్పైనల్ కార్డ్ మెడికల్ కిట్* కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో వెన్నెముక గాయాలతో బాధపడుతున్న దివ్యాంగులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలి అని నరేష్ విజ్ఞప్తి చేశాడు.వీల్ చైర్ ఆటల గురించి తెలుసుకొని వీల్ చైర్ క్రికెట్లో *తెలంగాణ వీల్ చైర్ క్రికెట్ టీం* కి ఆడుతున్నాను అలాగే స్టేట్ లెవెల్ ప్యార గేమ్స్ లో జావేలిన్ త్రో లో, మెడల్స్ గెలవడం జరిగింది అని తెలిపాడు.​మంచానికే పరిమితమైన స్థాయి నుంచి నేడు క్రీడా మైదానంలో పతకాలు గెలిచే స్థాయికి చేరుకోవడానికి కారణం నా కుటుంబం చేసిన త్యాగం, "హోప్ ఫర్ స్పందన" అందించిన చేయూత, నాలోని ఆత్మవిశ్వాసం. వైకల్యం శరీరానికే కానీ ఆలోచనలకు, సంకల్పానికి కాదు!.

**ప్రపంచ వెన్నెముక  మరియు వెన్నుపాము గాయాల దినోత్సవాన్ని (World Spinal Cord Injury Day) ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న జరుపుకుంటారు*.

సెప్టెంబర్ 5 న హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం,అవగాహన సదస్సు నిర్వహించారు.తెలంగాణ వెన్నెముక గాయాల దివ్యాంగుల సంఘం (SCIAT) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.డి. షఫీ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇంటర్నేషనల్ స్పైనల్ కార్డ్ సొసైటీ (ISCoS) సంస్థ 2016 వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.వెన్నుముక మరియు వెన్నుపాముకు జరిగే గాయాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు, అధునాతన శస్త్రచికిత్సల ప్రాధాన్యతను వివరించడం. వీల్‌చైర్‌కే పరిమితమైన బాధితులకు సమాజంలో సమాన అవకాశాలు కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపడం.వెన్నెముక గాయం అనేది జీవితాన్ని పూర్తిగా మార్చివేసే తీవ్రమైన సమస్య అని, సకాలంలో సరైన చికిత్స అందకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని మలమూత్రాలు ఆధీనంలో ఉండక డైపర్లు యూరిన్ క్యాటరు వాడాల్సి వస్తుంది. పుండ్లు పడి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని పేర్కొన్నారు.​రోడ్డు ప్రమాదాలు మరియు ఎత్తుల నుండి పడటం వంటి సమయాల్లో వెన్నుముక దెబ్బతినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణులు ఈ సమావేశంలో సూచించారు.

**అవసరమైన సదుపాయాలు:**

బాధితులకు సకాలంలో ఫిజియోథెరపీ, మెరుగైన వైద్యం, వీల్‌చైర్ వంటి సహాయ పరికరాలు అందించాలని కోరారు.వెన్నెముక దెబ్బతిని ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న వారి పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఆంధ్రప్రదేశ్ తరహాలో నెలకు ₹15 వేల ఆర్థిక భరోసా (పెన్షన్/సాయం) కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగ తీవ్రమైన వికలాంగులను గుర్తించి పునారావస కేంద్రాలు ఏర్పాటు చేసి మెరుగైన ఫిజియోథెరపీ అందించాలి స్పైనల్ కార్డ్ బాధితులు ఆర్థికంగా ఎదగడానికి జీవనోపాధి కల్పించి  ప్రభుత్వం సహకారం అందించాలి అని అన్నారు.

Monday, September 7, 2026

హైకోర్ట్ న్యాయవాది బాలకిష్టి శ్రీనివాస రెడ్డి 50వ జన్మదిన వేడుకలు_

*హైకోర్ట్ న్యాయవాది బాలకిష్టి శ్రీనివాస రెడ్డి 50వ జన్మదిన వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 06:

సమాజంలో న్యాయాన్ని కాపాడుతూ, బాధితుల పక్షాన ఉంటూ  న్యాయస్థానంలో మీ వాదనలు ఎంత పదునైనవో, మీ వ్యక్తిత్వం అంత గొప్పది అని మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని,చట్ట పరిధిలో మీరు చేసే ప్రతి పోరాటం విజయవంతం కావాలని, మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ  హైకోర్టు న్యాయవాది బాలకిష్టి శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసి శాలువాతో సత్కరించిన తోటి న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు మిత్రులు. శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్ లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో పులి దేవేందర్,అచలనంద్ అరుగొండ, శ్రీరామ్ రెడ్డి, శ్రవణ్, శాంసుందర్, రామకృష్ణ రెడ్డి,పూండ్రు దామోదర్ రెడ్డి, పెరిచర్ల వెంకట రామరాజు, బాపట్ల కృష్ణమోహన్,మంచోజు నరేష్ కుమార్ 
తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో డీజే వ్యవస్థలపై ఉన్న నిబంధనలు ఏమిటి?_

*"హైదరాబాద్‌లో డీజేల శబ్దం ఎంతవరకు ఉండవచ్చు? చట్టం ఏం చెబుతోంది"*

*సుధాకర్ ఉడుముల - ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 06:

రామ్‌నగర్‌లో జరిగిన గణేష్ ఆగమనం కార్యక్రమంలో 18 ఏళ్ల యువకుడు మరణించడం, హైదరాబాద్ చాలా ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఒక ప్రశ్నకు దృష్టిని ఆకర్షించింది: మతపరమైన ఊరేగింపుల సమయంలో శబ్దాన్ని ఎలా నియంత్రించాలి? శనివారం రాత్రి ఊరేగింపులో నాట్యం చేస్తుండగా బద్రీనాథ్ అనే యువకుడు కుప్పకూలిపోయాడు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. అతని మరణానికి దారితీసిన పరిస్థితులను పోలీసుల దర్యాప్తు మరియు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది. డీజే శబ్దం అతని మరణానికి కారణమైందని అందుబాటులో ఉన్న నివేదికలో నిర్ధారణ కాలేదు.

*"హైదరాబాద్‌లో ఇంతకుముందు కూడా డీజే (DJ) శబ్దాల గురించిన ఫిర్యాదులు వచ్చాయి"*

మతపరమైన ఉత్సవాల సమయంలో పెద్ద శబ్దంతో కూడిన సంగీతంపై ఫిర్యాదులు రావడం కొత్తేమీ కాదు. 2019 సెప్టెంబర్‌లో, గణేష్ పండాల్‌ల వద్ద ధ్వని కాలుష్యంపై డయల్ 100 మరియు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అనుమతులు మంజూరు చేసేటప్పుడు విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ, అనేక పండాల్‌ల నిర్వాహకులు పెద్ద శబ్దంతో డీజేలను ఉపయోగిస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు.ఆ నెలలో వెలువడిన మరో నివేదిక ప్రకారం, గణేష్ ఊరేగింపుల సమయంలో లౌడ్‌స్పీకర్లు, డప్పుల శబ్దాలపై స్థానికులు ఫిర్యాదు చేశారని, అలాగే ప్రస్తుతం ఉన్న ధ్వని నియంత్రణ నిబంధనల అమలును ప్రశ్నించారని పేర్కొంది.2024లో ఈ సమస్య హైదరాబాద్ పండుగల నియంత్రణ అధికారుల దృష్టికి మళ్లీ వచ్చింది. పెద్ద డీజే పరికరాలను ఎక్కువ గంటల పాటు ఉపయోగించడంపై ఫిర్యాదులు పెరిగాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారు పౌర అధికారులు, కాలుష్య నియంత్రణ అధికారులు, రాజకీయ ప్రతినిధులు, నిర్వాహకులతో రౌండ్-టేబుల్ సమావేశం నిర్వహించారు.హైదరాబాద్ పోలీసుల 2024 వార్షిక నివేదిక ప్రకారం, ధ్వని కాలుష్యంపై ఫిర్యాదులు 500 శాతం పెరిగాయి. మతపరమైన ఊరేగింపుల సమయంలో అధిక శబ్దంతో కూడిన డీజే వ్యవస్థలు, బాణసంచా వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు, భద్రతపై కలిగే ప్రభావాలపై కూడా పోలీసులకు సమాచారం అందిందని ఆ నివేదిక పేర్కొంది.

*హైదరాబాద్‌లో డీజే వ్యవస్థలపై ఉన్న నిబంధనలు ఏమిటి?**

అనేక చర్చల అనంతరం, సెప్టెంబర్ 2024లో హైదరాబాద్ పోలీసులు మతపరమైన ఊరేగింపుల సమయంలో డీజే వ్యవస్థలు, డీజే మిక్సర్లు, సౌండ్ యాంప్లిఫైయర్లు మరియు ఇతర అధిక శబ్దంతో కూడిన పరికరాల వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, నిర్దేశిత పరిమితులు మరియు ఇతర షరతులకు లోబడి సౌండ్ సిస్టమ్‌ల వినియోగానికి అనుమతి ఇవ్వబడింది.ఈ పరిమితులు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. నివాస ప్రాంతాల్లో పగటిపూట 55 డెసిబెల్స్ మరియు రాత్రిపూట 45 డెసిబెల్స్ పరిమితి ఉంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో పగటిపూట 65 డెసిబెల్స్ మరియు రాత్రిపూట 55 డెసిబెల్స్ పరిమితి ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో పగటిపూట 75 డెసిబెల్స్ మరియు రాత్రిపూట 70 డెసిబెల్స్ పరిమితి ఉంటుంది.అలాగే, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య లౌడ్‌స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు మరియు డీజే వ్యవస్థల వినియోగాన్ని కూడా ఈ ఉత్తర్వులు నిషేధించాయి. ఇటువంటి కార్యక్రమాల్లో ఉపయోగించే సౌండ్ పరికరాల కోసం పోలీసుల అనుమతి తప్పనిసరి. ఊరేగింపులకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, సంబంధిత అధికారి నుండి ప్రత్యేక అనుమతి పొందితే తప్ప మైక్రోఫోన్లు మరియు ఇతర సౌండ్ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు. నిర్వాహకులు అత్యవసర వాహనాల రాకపోకలకు మార్గాన్ని ఖాళీగా ఉంచాలి మరియు సాధారణ ట్రాఫిక్ కోసం రోడ్డు వెడల్పులో కనీసం మూడు వంతుల భాగాన్ని అందుబాటులో ఉంచాలి.

**ఇప్పుడు అసలు ప్రశ్న పండుగ గురించి కాదు, నిబంధనల అమలు గురించి**

పౌరుల ఫిర్యాదులు మరియు అధికారులు, వైద్య నిపుణుల ఆందోళనల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించబడ్డాయి. అధిక శబ్ద స్థాయిలు భద్రతా ఏర్పాట్ల (బందోబస్తు) సమయంలో సమాచార మార్పిడికి ఆటంకం కలిగిస్తాయని మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందించడంలో ఇబ్బందులు సృష్టిస్తాయని పోలీసులు పేర్కొన్నారు.ఈ సమస్య కేవలం గణేష్ ఉత్సవాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఏప్రిల్ 2025లో, రామ నవమి ఊరేగింపుల సమయంలో డీజే వ్యవస్థలపై ఉన్న నిషేధాన్ని హైదరాబాద్ పోలీసులు నిర్వాహకులకు మరోసారి గుర్తుచేశారు మరియు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆ తర్వాత, ఊరేగింపు నిబంధనలను ఉల్లంఘించి డీజే వ్యవస్థలను ఉపయోగించినట్లు ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు.
కాబట్టి, రామ్‌నగర్ ఘటన లేవనెత్తిన ప్రశ్నను విశ్వాసం మరియు నిబంధనల మధ్య సంఘర్షణగా చూడాల్సిన అవసరం లేదు. మతపరమైన ఊరేగింపులు కొనసాగుతూనే, అదే సమయంలో నిర్వాహకులు మరియు అధికారులు జనసమూహ కదలికలు, వైద్య సేవలకు మార్గం, శబ్ద స్థాయిలు మరియు అత్యవసర సమాచార వ్యవస్థలను సక్రమంగా నిర్వహించేలా చూసుకోవచ్చు.బద్రీనాథ్ విషయంలో, ఆయన మరణానికి గల కారణాన్ని నిర్ధారించడం తక్షణ ప్రాధాన్యత కలిగిన అంశం. అదే సమయంలో, ఊరేగింపుల సందర్భంగా శబ్ద నియంత్రణ నిబంధనలను నిలకడగా పాటిస్తున్నారా, అలాగే నిర్వాహకులు తగిన జన సమూహ భద్రత మరియు అత్యవసర ఏర్పాట్లు చేశారా లేదా అనే విషయాలను పరిశీలించడానికి కూడా ఈ ఘటన ఒక సందర్భాన్ని కల్పిస్తోంది.

తెలంగాణ హైకోర్ట్ లో బోనాల పండుగ సందడి_

*తెలంగాణ హైకోర్ట్ లో బోనాల పండుగ సందడి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 06:

తెలంగాణ హైకోర్ట్ ప్రాంగణంలో ఈరోజు భక్తి శ్రద్దలతో బోనాల పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్ట్ గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. నంద మేడం గారు, జస్టిస్ మౌసమి బట్టాచార్య మేడం గారు, జస్టిస్ వాకిటి రామకృష్ణరెడ్డి గారు,జస్టిస్ మొయినుద్దీన్ గారు, జస్టిస్ జె. శ్రీనివాస్ రావు గారు, జస్టిస్ ఎన్వి. శ్రవణ్ కుమార్ గారు, మరియు తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. సురేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డి.ఎల్. పాండు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీ ఇతర అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు హైకోర్ట్ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.