Monday, June 8, 2026

_NEET - యూజీ 2026పరీక్ష పేపర్ లీక్ - లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేసింది_

*NEET - యూజీ 2026పరీక్ష పేపర్ లీక్ - లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేసింది*

*ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది*

*CBSE 2026 On Screen Marking - OSM విధానంలో లోపాలు*

*అనురాధ రావు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 8:

ప్రపంచ సమయాన్ని మార్చే ముందు భూమధ్య రేఖ ఎక్కడ ఉందో మన  కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి తెలుసా? April నెల 2026 ఉజ్జయినిలో జరిగిన అంతర్జాతీయ "Master of Time సదస్సు" లో ధర్మేంద్ర ప్రదాన్ గారు మాట్లాడుతూ, ప్రపంచం ఇప్పుడు ఉపయోగిస్తున్న Greenwich Mean Time (GMT)
స్థానంలో మహకాల్ స్టాండర్డ్ టైం పరిగణలోకి  తీసుకోవాలని సూచించిన మహా మేధావి మన కేంద్ర విద్యాశాఖ మంత్రి .ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే,ఉజ్జయినిలో ఈ భుమధ్య రేఖ మరియు కర్కాటక రేఖ  కలుస్తాయని చెప్పారు.అంటే ఎంత మేధావో మన మంత్రి గారు, అవి సమాంతర రేఖలు, భౌగోళికంగా కలిసే అవకాశం లేదు అనే విషయం తెలియదా? అందుకే విద్యాశాఖ మంత్రి అయ్యారు.ప్రపంచ సమయ ప్రమాణాన్ని మార్చడం అనేది అంతంతీయ స్థాయి విషయం అని కూడ తెలియని మేధావి చేతిలో విద్యావ్యవస్థ ఉంది.ఒక దేశ ప్రధాని కాని,మంత్రి కాని ఈ టైం మార్చగలరా? May 3వ తేదిన NEET UG 2026 పరీక్ష నిర్వహించారు,22 లక్షలకు పైగా విద్యార్థులు రాశారు.
ప్రతి సంవత్సరం లాగే పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ కావడం,పరీక్ష రద్దు చేయడం జరిగింది.సంవత్సరాలు మారుతున్నాయి కాని పేపర్ లీకేజీ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ప్రభుత్వం.
పరీక్ష రద్దు,మళ్లి పరీక్ష నిర్వహణ అనే స్థాయికి ఎదిగాం.ఒక పేపర్ లీక్ అంటే లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేయడం.ఎన్ని కుటుంబాలు ఆవేదనకు గురైతాయి? తల్లిదండ్రులు తమ కలలను పిల్లల పై పెట్టుకుంటారు. ఆ కలలు బుడిదైతే బాధ్యత ఎవరిది?.NEET కోసం ఆరవ తరగతి నుండే కోచింగ్ ప్రారంభం అవుతుంది.దానికోసం అధిక ఫీజులు వసూలు చేస్తాయి పాఠశాలలు.ఇంటర్ లో సెపరేట్ కోచింగ్.ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలిసిన విషయమే. ఒక సాధారణ కుటుంబం మళ్లి మళ్లి ఇలా ఖర్చు చేయాలి అంటే ఆ కుటుంబం వీధిన పడ్డట్టు.అటు మానసికంగా, ఇటు ఆర్థికంగా దెబ్బ తింటున్న కుటుంబాలు ఎన్నో.ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇక ఈ సమస్య ఉండగానే CBSE 2026 On Screen Marking - OSM విధానంలో లోపాలు బయట పడ్డాయి. వేల సంఖ్యలో విద్యార్థులు మార్కింగ్ లోపాల పై ఫిర్యాదులు చేశారు.ఒకరి ఆన్సర్ షీట్ వేరే వాళ్ళకు, ఒకరికి ఖాలీ షీట్, ఒక ప్రశ్న కు వేరే ఆన్సర్ అలా రకాల రకాలుగా వచ్చాయి. 
ఇక దరఖాస్తుల పేరిట 100 రూపాయలు, వెరిఫికేషన్కు వంద, ప్రశ్నలు చూడాలి అంటే ప్రతి ప్రశ్నకు 25 రూపాయలు ఇలా దోచుకోవడం. అవకతవకలపై విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్నారు - వ్యత్యాసాలు ఉన్నాయి అని కాజువల్ అన్నారు.కాని ఏం చేశారు ఆ తప్పు చేసిన వారిని ?  
2019 లో గ్లోబరీనా చేసిన నిర్వాకానికి 25 మంది విద్యార్థులు బలి అయ్యారు. ఇలాంటి
అదే గ్లోబరీనా కంపెనీకే (పేరు మార్చుకున్నా) ఈ On Screen Marking పనిని అప్పగించారు.
ఇట్లా జరిగితే వేరే ఏదేశ ప్రజలైనా నిలదిసే వారు, కాని మన దేశంలో నాకెందుకు అని అనుకోవడం.
ఇదే తమ పిల్లలకు జరిగితే ఊరుకుంటారా? మనకున్న చట్టాలను గౌరవిస్తే ఇన్ని దారుణాలు జరిగేవా? ఇంత మంది విద్యార్థులు చనిపోతే కనీసం బాధ్యత లేని ప్రభుత్వం.
మన ప్రధానమంత్రి కి చదువు గురించి పట్టదు, పిల్లలు ఆశగా మన్ కి బాత్ ప్రోగ్రాం చూస్తే/వింటే ఒక్క మాట కూడ ఈ సమస్యలపై స్పందించలేదు.ఎప్పుడైతే విద్యావ్యవస్థ పై నమ్మకం కోల్పోతామో,భవిష్యత్తు పై నమ్మకం కోల్పోతాం.ఇలాంటి వారు వారి పదవులకు రాజీనామ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్.6వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి నిరసన ప్రదర్శన జరిగింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆ ప్రదర్శన లో బాలల హక్కుల సంఘం తరఫున తమ డిమాండ్ తెలిపింది.సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లల సమస్యల పట్ల మన గొంతు విప్పుదాం. మళ్లి ఇవి పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిదే,కాని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా ఉంది, న్యాయ వ్యవస్థను పటిష్ట చట్టపరమైన చర్య తీసుకోవాలి అని విన్నపం.

మృగశిర కార్తె శుభ సందర్భంగా అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

*మృగశిర కార్తె శుభ సందర్భంగా అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 8:

వానాకాలం వ్యవసాయానికి శ్రీకారం చుట్టే మృగశిర కార్తె ప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయం పండుగగా, తొలకరి పలకరింపు రైతులు, రైతు కూలీల ఇళ్లల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. వాతావరణ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలను పరిగణలోకి తీసుకుని రైతులు పంటలకు సిద్ధం కావాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల్లో వేగంగా వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రైతాంగాన్ని కోరారు.కొన్ని పరిమితమైన పంటల సాగుపైన దృష్టి సారించడం వల్ల పప్పుధాన్యాలు, వేరుశనగ, పెసలు, మినుములు, నువ్వులు వంటి పంటలను దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.ఇలాంటి సమస్యలను అధిగమించడంతో పాటు వరుసగా ఒకే పంటను సాగు చేయడం వల్ల నేల సారం తగ్గి తెగుళ్ల సమస్యలు కూడా పెరుగుతున్నాయని, వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంట మార్పిడి వల్ల నేల సారం పెరగడమే కాకుండా దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలని సూచించారు.ఈ మృగశిర కార్తె అన్నదాతలకు శుభారంభం కావాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పుష్కలమైన పంటలు పండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

_శికం-సర్కారీ" భూమి, "శికం-పట్టా" భూమి మధ్య తేడా ఏమిటో ఆరోపణలు చేస్తున్నవారికి తెలుసా? వి. రవికృష్ణ_

*"శికం-సర్కారీ" భూమి, "శికం-పట్టా" భూమి మధ్య తేడా ఏమిటో ఆరోపణలు చేస్తున్నవారికి తెలుసా? వి. రవికృష్ణ*

*సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ భూముల వ్యవహారంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను ప్రశ్నించిన సామజిక కార్యకర్త,న్యాయవాది వి. రవికృష్ణ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 7:

ఇప్పుడు కొందరు చెబుతున్నట్లుగా సర్వే నం.706 నిజంగానే ప్రభుత్వ భూమి, శికం-సర్కారీ భూమి లేదా అక్రమ కబ్జా అయితే దాదాపు పదేళ్ల పాటు మీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది?. నిజంగా అది ప్రభుత్వ భూమి అయితే:
▪️ రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది?
▪️ మ్యుటేషన్ ఎలా జరిగింది?
▪️ పట్టాదారు పాస్‌బుక్‌లు ఎలా జారీ అయ్యాయి?
▪️ రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ "శికం-పట్టా"గా ఎందుకు చూపిస్తున్నారు?
▪️ సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?.
➡️డాక్యుమెంట్ నం.3213/2014 తేదీ 15-12-2014న శంకర్‌పల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ అయింది.
➡️02-06-2014 నుంచి డిసెంబర్ 2023 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ కాలంలో మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు స్వయంగా ఎంపీగా, అనంతరం ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రభుత్వ రికార్డులు, ధరణి వివరాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ వర్గీకరణలను పక్కన పెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ నిర్వహించడం వల్ల నిజాలు మారవు.కనీసం "శికం-సర్కారీ" భూమి, "శికం-పట్టా" భూమి మధ్య తేడా ఏమిటో ఆరోపణలు చేస్తున్నవారికి తెలుసా?.
*ప్రశ్నలు చాలా సులభం:*
భూమి అక్రమమైతే మీ ప్రభుత్వం పదేళ్ల పాటు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. అక్రమం కాకపోతే ఇప్పుడు రాజకీయ కథనాల కోసం "కబ్జా", "ల్యాండ్ గ్రాబింగ్" అంటూ ప్రచారం ఎందుకు చేస్తున్నారు. చట్టం, అధికారిక రికార్డులు, సమర్థ అధికారుల విచారణే నిజాన్ని తేల్చాలి — యూట్యూబ్ తీర్పులు కాదు.

Sunday, June 7, 2026

_సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన_

*పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి*

*సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన*
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి.కానిస్టేబుల్ రాజు  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఎస్పీ.డాక్టర్.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ IPS.నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉల్పారా గ్రామానికి చెందిన మద్దమల్ల.రాజు 2014 బ్యాచ్ ఏ ఆర్ కానిస్టేబుల్ గా ఎంపికై నాగర్ కర్నూల్ ఆర్మూడ్ రిజర్వులో విధులు నిర్వర్తిస్తున్నాడు.గత రెండు రోజులుగా సీఎం బందోబస్తు నిమిత్తం సోమశిల లో విధులు నిర్వర్తిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా  మామిళ్ళపల్లి గ్రామం సమీపంలో  పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించడం జరిగింది.ఈ సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు మృతదేహాన్ని నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ  గారు స్పందిస్తూ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్లి  ఏఆర్ కానిస్టేబుల్ రాజు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించినారు.వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పడం జరిగింది.అలాగే రేపు వారి యొక్క స్వగ్రామమైన ఉల్పర గ్రామం వంగూరు మండలం నందు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.

_సోషల్ మీడియా లో పోస్ట్లు చేసేటప్పుడు ఆలోచించండి_

*సోషల్ మీడియా లో పోస్ట్లు చేసేటప్పుడు ఆలోచించండి*

*సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే జైలుకు - తెలంగాణ పోలీస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తి పై  కేసు (395/2026) నమోదు చేసి జైలుకు పంపించిన తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాలో మితిమీరినవ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగితజ్ఞానం మర్చిపోవద్దు. అలా చేస్తే చట్టం పని చట్టం చేస్తుంది.

_రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు_

*న్యాయం కోసం ఎదురుచూసి కన్నుమూసిన వృద్ధురాలు*

*రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు*

*మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "వృద్ధ మహిళ న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

వికారాబాద్ జిల్లా, తాండూర్ పట్టణంకు చెందిన చెన్‌బసమ్మ మరణం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమా?. అనారోగ్యంతో బాధపడుతూ, తనకు సంబంధించిన ఆస్తి మరియు న్యాయ సమస్య పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి చివరకు పక్షవాతంతో మంచానికి పరిమితమైన 75 ఏళ్ల వృద్ధురాలు శ్రీమతి చెన్‌బసమ్మ గారు చివరకు 29-05-2026న కన్నుమూశారు.మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "75 ఏళ్ల వృద్దురాలు పక్షవాతంతో మంచాన పడ్డా సంవత్సరాలనుండి న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది. అయినా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వ అధికారిక మాధ్యామాల ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం CMOHYD,వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు, స్థానిక చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశవేశ్వరరెడ్డి కి, తాండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు మనోహర్ రెడ్డి కి,తాండూర్ మున్సిపల్ చైర్మన్ కు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇదేనా ప్రజాపాలన - ప్రగతి పాలన అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్న ఏమిటంటే — తన జీవితకాలంలో న్యాయం కోసం ఎదురు చూసిన ఒక వృద్ధురాలికి న్యాయం చేయలేకపోతే, రాజ్యాంగం కల్పించిన హక్కులు సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?
ప్రభుత్వ కార్యాలయాలు,జిల్లా కలెక్టర్ కార్యాలయం,రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ప్రజావాణి, ఉన్నతాధికారులు, ఇంకా అనేక వేదికల ద్వారా సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిష్కారం దొరకకపోవడం బాధాకరం.అనేక ఫిర్యాదులు, పత్రాలు, వినతులు, ఆధారాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, చెన్‌బసమ్మ గారు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి సంవత్సరం మహిళా హక్కుల గురించి గొప్పగా మాట్లాడే సమాజం, ఒక వృద్ధ మహిళ న్యాయం కోసం ఎదురుచూస్తూ కన్నుమూసినప్పుడు ఎక్కడ ఉంది? ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలు ఈ పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?
"న్యాయం ఆలస్యమైతే అది కూడా అన్యాయమే" అనే సూత్రాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.చెన్‌బసమ్మ గారు ఇక లేరు.కానీ ఆమె అడిగిన ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి.
పేదలకు న్యాయం పొందే హక్కు ఉందా?వృద్ధుల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత కాదా?రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పుస్తకాలకే పరిమితమా?అధికారులు స్పందించకపోతే సామాన్యుడు ఎవరిని ఆశ్రయించాలి? కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ఏమిటంటే, చెన్‌బసమ్మ గారు జీవించి ఉండగా పరిష్కారం కాలేకపోయిన ఈ సమస్యను ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి.అదే "ఆమె ఆత్మకు నిజమైన శాంతి కలిగించే మార్గమని" వారు కోరుతున్నారు.
— కుటుంబ సభ్యులు

Sunday, May 31, 2026

జాతీయ జంతువు,గో మాంసం అమ్మడం,ఎగుమతుల నిషేధం తీసుకురావొచ్చు కదా - ఆకునూరి మురళి,IAS రిటైర్డ్*

*జాతీయ జంతువు,గో మాంసం అమ్మడం,ఎగుమతుల నిషేధం తీసుకురావొచ్చు కదా - ఆకునూరి మురళి,IAS రిటైర్డ్*

*ట్విట్టర్ వేదికగా సూచనలు చేసిన ఆకునూరి మురళి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 29:

మీ వైపు(ముస్లీములు) నుండి ఇట్లాంటి ప్రతిపాదన రావడం మంచి పరిణామం.మరి అధికార పార్టీ బీజేపీ ఇలాంటి చట్టం (జాతీయ జంతువు,గో మాంసం అమ్మడం,ఎగుమతుల నిషేధం) తీసుకురావొచ్చు కదా.ఇలాంటిదే మైక్ లో రోజు నమాజ్ (Azaan) ను కూడా ఆపేస్తే బెటర్.దీని వలన అందరికి disturbance ముసలి వాళ్లకు,రోగులకు,చంటి పిల్లలకు చాలా disturbance. హిందువులు కూడా గుడులలో రకరకాల పండగలప్పుడు వేడుకల పేరు మీద అర్ధరాత్రి వరకు మైకుల ద్వారా పాటలు పెట్టడం కూడా అందరికి disturbance. అక్కడక్కడా చర్చీలు కూడా మైకులు మొదలు పెట్టిండ్రు. ఇవ్వన్నీ కూడా ఆపేస్తే ఒక మంచి సమాజం ను నిర్మించినట్టు అవుతుంది.మూడు మతాల పెద్దలు కూర్చొని ఈ విషయాల మీద మాట్లాడుకొని ప్రభుత్వాలకు ప్రతిపాదనలు ఇస్తే సమాజం లో మంచి సామరస్య వాతావరణం నెలకొల్పవచ్చు.లేకపోతే రాజకీయ స్వార్ధపరులు మతాలను తమ తమ రాజకీయాలకు వాడుకోడం ఇలాగే నడుస్తుంది .దాని ద్వారా సమాజం నాశనం కావడానికి దారి తీస్తుంది.