Wednesday, August 26, 2026

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో గతంలో బీఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీ లు పట్టించుకోలేదు_

*ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో గతంలో బీఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీ లు పట్టించుకోలేదు*

*విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం..మంత్రి పొన్నం ప్రభాకర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 25:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి ఒక్కరోజు కూడా విద్యార్థుల సమస్యలపై పట్టించుకోలేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించడంతో పాటు, భవిష్యత్‌లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చెల్లింపులు చేసే విధానాన్ని తీసుకొచ్చాం అని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, విద్యా మౌలిక వసతులు, డైనింగ్ చార్జీలు, ఉపాధ్యాయుల నియామకాలు తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది అని అన్నారు.పేద పిల్లల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తున్నాం.పాత బకాయిలను కూడా దశలవారీగా చెల్లిస్తూ , యాజమాన్యాలు విద్యార్థుల విద్యకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయంగా ఉనికిని చాటుకోవడం కోసమే కొందరు నేతలు ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగిస్తున్నారు అని అన్నారు.రాహుల్ గాంధీ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు చేసే ముందు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదే విధంగా ఉచిత విద్య లేదా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నారా మీరు అని మంత్రి ప్రశ్నించారు.తెలంగాణకు నిధులు, హక్కుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యతను విస్మరించి, అంతర్గత రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, పేద ప్రజల విద్యాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకుండా, విద్యా రంగ అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి పని చేయాలి అని అన్నారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యార్థి యువత కి వ్యతిరేకంగా పని చేయడం వల్లే జెన్జీ లాంటి ఉద్యమాలు వస్తున్నాయి అని అన్నారు.

ఇక మాటలు కాదు — అసలు రికార్డులు బయటపెట్టండి_

ప్రెస్ నోట్

*175 ఎకరాల అసైన్డ్ భూమికి 22-A ఎందుకు లేదు? ఎంపీలకు చట్టం వర్తించదా?*

*“22-A లిస్టులో 175 ఎకరాలు ఎందుకు గల్లంతు? సర్వే నెం.294పై అధికారిక రికార్డులే ప్రశ్నిస్తున్నాయా?”*

*సర్వే నెం.294లో 175 ఎకరాల 12 గుంటల అసైన్డ్ భూమి 22-A / ప్రోహిబిటెడ్ లిస్ట్ లో ఎందుకు లేదు?*

*తహసీల్దార్ కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో అసైన్డ్ భూమి అని స్పష్టంగా ఉన్నప్పటికీ NOCలు, రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి?*

*84 ఎకరాల రిజిస్ట్రేషన్లపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి*

*NOCలు జారీ చేసిన అధికారులపై చర్యలు ఎక్కడ?  సమగ్ర విచారణకు డిమాండ్ - వి. రవికృష్ణ,అడ్వకేట్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 25:

సిద్దిపేట జిల్లా, అక్బర్‌పేట్-భూంపల్లి మండలం, చౌదరపల్లి గ్రామం, సర్వే నెం.294కు సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వ రికార్డులు, కోర్టు రికార్డులు, రెవెన్యూ రికార్డులు మరియు అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని అడ్వకేట్ వి. రవికృష్ణ తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం తాజాగా అప్లోడ్ చేసిన ప్రోహిబిటెడ్ ప్రోహిబిటెడ్ / 22-A లిస్ట్ ను పరిశీలించినప్పుడు, సర్వే నెం.294కు సంబంధించిన మొత్తం భూమి అందులో ఎందుకు ప్రతిబింబించలేదనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అక్బర్‌పేట్-భూంపల్లి తహసీల్దార్ గారు  W.P.No.16161 of 2025లో కోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో సర్వే నెం.294కు సంబంధించి సుమారు Ac.175-12 guntas ప్రభుత్వ అసైన్డ్ భూమి అని, G.O.Ms.No.1406, dated 25.07.1958 ప్రకారం భూమిలేని పేదలకు ఈ భూమి అసైన్ చేయబడినట్లు పేర్కొన్న విషయాన్ని రికార్డులు చూపిస్తున్నాయని ఆయన తెలిపారు.అంతేకాకుండా, 1954-55 సెత్వార్ Sethwarలో ఈ భూమి పోరంబోకు /సర్కారి గా నమోదై ఉన్నట్లు కూడా సంబంధిత రికార్డులు సూచిస్తున్నాయని తెలిపారు.

**అయితే అసలు ప్రశ్న ఏమిటి?**

*(1)*: అంత స్పష్టమైన చారిత్రక మరియు ప్రభుత్వ రికార్డులు ఉన్నప్పుడు సర్వే No.294లోని మొత్తం అసైన్డ్ ల్యాండ్ ను తాజా 22-A / ప్రోహిబిటెడ్ లిస్ట్ లో ఎందుకు చూపించలేదు?

*(2)*: ఇది కేవలం ఒక రెవిన్యూ ఎంట్రీ సమస్య కాదని, ప్రభుత్వ భూమి, పేదలకు జరిగిన అసైన్మెంట్ , అసైన్డ్ ల్యాండ్ పై చట్టపరమైన రక్షణ, తదుపరి NOCలు, మ్యుటేషన్స్ , రిజిస్ట్రేషన్స్ మరియు రెవిన్యూ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతకు సంబంధించిన తీవ్రమైన అంశమని ఆయన పేర్కొన్నారు.

*(3)*: 84 ఎకరాల విషయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమాధానం చెప్పాలి.

*(4)*:ప్రస్తుతం మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి సిట్టింగ్ BJP ఎంపీగా ఉన్న మాధవనేని రఘునందన్ రావుపై ఈ వ్యవహారంలో సుమారు 84 ఎకరాల భూమి ఆయన కుటుంబ సభ్యుల పేర్లకు రిజిస్టర్ అయినట్లు ఉన్న రికార్డులు/ఫిర్యాదుల నేపథ్యంలో ప్రజలలో తలెత్తుతున్న ప్రశ్నలకు ఆయన స్వయంగా సమాధానం ఇవ్వాలని రవికృష్ణ డిమాండ్ చేశారు. అధికారిక పార్లమెంట్ రికార్డుల్లో ఆయన మెదక్ ఎంపీగా కొనసాగుతున్నట్లు నమోదై ఉంది. 

*(5)*: అసైన్డ్ భూమి బదిలీకి చట్టపరమైన నిషేధం ఉన్న పరిస్థితిలో — సుమారు 84 ఎకరాల భూమి మీ కుటుంబ సభ్యుల పేర్లకు ఎలా రిజిస్టర్ అయింది?

*(6)*: ఆ భూములకు NOCలు ఎవరు ఇచ్చారు?

*(7)*: ఏ చట్టం కింద ఇచ్చారు?

*(8)*: ఏ ప్రొసీడింగ్స్ ఆధారంగా ఇచ్చారు?

*(9)*: ఏ రెవిన్యూ రికార్డ్స్ పరిశీలించిన తరువాత ఆ NOCలు జారీ అయ్యాయి?

*(10)*: సర్వే నెంబర్ .294లోని భూమి అసైన్డ్ ల్యాండ్ అని రెవిన్యూ డిపార్ట్మెంట్ కు తెలిసిన పరిస్థితిలో ఆ ట్రాన్సక్షన్స్ ఎలా జరిగాయి?

*(11)*: ఏదైనా డి అసైన్మెంట్ , రీ క్లారిఫికేషన్ , ఎక్సంప్షన్ , రెగ్యులరైసేషన్ లేదా ఇతర చట్టబద్ధమైన ఉత్తర్వు ఉంటే దాన్ని ప్రజల ముందు ఎందుకు ఉంచడం లేదు?

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఎంపీగా ఆయనపై చట్టపరమైన నిందను మోపడం కాదు; ప్రజా జీవితంలో ఉన్న ఎన్నికైన ప్రజాప్రతినిధిగా తన కుటుంబ సభ్యుల పేర్లకు సంబంధించిన ఇంత పెద్ద భూ లావాదేవీలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన ప్రజా బాధ్యతకు సంబంధించిన ప్రశ్న అని రవికృష్ణ పేర్కొన్నారు.
**ఎంపీ పదవికి ప్రజా బాధ్యత కూడా ఉంది**
ఒక ఎంపీగా పార్లమెంటులో ప్రజా సమస్యలను ప్రస్తావించే వ్యక్తి, తన నియోజకవర్గంలోనే పేద రైతులకు కేటాయించిన భూములకు సంబంధించి ఇలాంటి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిపై పూర్తి పారదర్శకతతో స్పందించడం ప్రజాస్వామ్య బాధ్యత అని రవికృష్ణ అన్నారు.పేద రైతుల అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరే ప్రజాప్రతినిధి — తన కుటుంబ సభ్యుల పేర్లకు సంబంధించిన ఇలాంటి భూ లావాదేవీలపై కూడా అదే చట్టపరమైన ప్రమాణాలను ప్రజల ముందు చూపించాలి.అందువల్ల ఎంపీ రఘునందన్ రావును తాము నేరుగా ప్రశ్నిస్తున్నామని ఆయన తెలిపారు:

*“మీ కుటుంబ సభ్యుల పేర్లపై నమోదైనట్లు ఉన్న సుమారు 84 ఎకరాల సర్వే నెంబర్ .294 భూమి అసైన్డ్ భూమి కాదని మీరు భావిస్తే, దానికి సంబంధించిన పూర్తి టైటిల్ చైన్ , NOCలు, ప్రొసీడింగ్స్ మరియు రెవిన్యూ రికార్డ్స్ ను ప్రజల ముందు పెట్టండి.”*
“అది అసైన్డ్ ల్యాండ్ కాదని చెప్పడానికి ఏ ప్రభుత్వ ఉత్తర్వు ఆధారం?”. “అసైన్డ్ ల్యాండ్ అయితే, ఆ భూమి మీ కుటుంబ సభ్యుల పేర్లకు ఎలా వచ్చింది?”.“NOCలు చట్టబద్ధంగా జారీ అయ్యాయని మీరు భావిస్తే — ఏ అధికారి, ఏ తేదీన, ఏ చట్టం కింద వాటిని జారీ చేశారో వెల్లడించండి.”
“ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర విచారణకు మీరు సిద్ధమా?”

*రెవిన్యూ అధికారులు కూడా సమాధానం చెప్పాలి*

*(1)*: సర్వే నెం.294కు సంబంధించి:

*(2)*: సెత్వర్ రికార్డ్స్ ఉన్నాయి;

*(3)*: అసైన్మెంట్ రికార్డ్స్ ఉన్నాయి;

*(4)*: 22-A రికార్డ్స్ ఉన్నాయి;

*(5)*: మ్యుటేషన్ రికార్డ్స్ ఉన్నాయి;

*(6)*: NOC ప్రొసీడింగ్స్ ఉన్నాయి;

*(7)*: రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ఉన్నాయి;

*(8)*: కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి;

*(9)*: రెవిన్యూ డిపార్ట్మెంట్ తరఫున దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ఉంది.

మరి ఇన్ని రికార్డులు ఉన్నప్పటికీ 175 ఎకరాల 12 గుంటల అసైన్డ్ ల్యాండ్ విషయంలో పూర్తి స్థాయి చర్య ఎందుకు లేదు?
22-A / ప్రోహిబిటెడ్ లిస్ట్ లో మొత్తం భూమిని ఎందుకు రక్షించలేదు?
తప్పుడు లేదా అసంపూర్ణ నివేదికను ఎవరు తయారు చేశారు?
ఎవరి ఆదేశాల మేరకు తయారు చేశారు?
ఆ నివేదికపై బాధ్యత వహించాల్సిన అధికారులపై ఏ చర్య తీసుకున్నారు?
NOCలు జారీ చేసిన అధికారులపై డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ జరిగిందా?
జరిగితే దాని ఫలితం ఏమిటి?
జరగకపోతే ఎందుకు జరగలేదు?
మిగిలిన అసైన్డ్ ల్యాండ్ సంగతేంటి?
సర్వే నెం.294లో మిగిలిన అసైన్డ్ ల్యాండ్ కూడా రైతుల నుంచి ఇతర వ్యక్తుల పేర్లకు కొనుగోలు/బదిలీ చేయబడినట్లు ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో, ఆ ట్రాన్సక్షన్స్ పైనా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.మొత్తం భూమి అసైన్డ్ ల్యాండ్ అని రెవిన్యూ డిపార్ట్మెంట్ కోర్టులో పేర్కొన్న పరిస్థితిలో, అదే భూమిలో కొంత భాగం మాత్రమే ప్రోహిబిటెడ్ లిస్ట్ లో లేకపోవడానికి కారణం ఏమిటి?
ఎవరు ఈ భూమిని ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్ గా పరిగణించారు?
ఏ అధికారిక ప్రొసీడింగ్స్ ఆధారంగా పరిగణించారు?
ఎవరి ఆదేశాల మేరకు?
*“పేద రైతుకు ఒక చట్టం – ప్రభావశీలులకు మరో చట్టమా?”*
పేద రైతు అసైన్డ్ ల్యాండ్ ను బదిలీ చేస్తే వెంటనే చట్టం గుర్తుకు వస్తుందని, అదే సమయంలో పెద్ద మొత్తంలో భూములు ప్రభావశీలుల కుటుంబ సభ్యుల పేర్లకు వెళ్లినట్లు రికార్డులు మరియు ఫిర్యాదులు ఉన్నప్పుడు చట్టం ఎందుకు కనిపించడం లేదని రవికృష్ణ ప్రశ్నించారు.చట్టం పేద రైతులకు ఒకటి, ఎంపీలు–ఎమ్మెల్యేలకు మరొకటా?
అధికారం, డబ్బు ఉంటే చట్టాలను పక్కన పెట్టవచ్చా?
ముఖం చూసి బొట్టు పెట్టడమేనా పరిపాలన?
చట్టాలు కొందరికి చుట్టాలుగా, కొందరికి శత్రువులుగా మారిపోయాయా?
*ప్రజలకు సమాధానం కావాలి*.

*ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు*

*(1)*:సర్వే నెంబర్ .294లోని మొత్తం Ac.175-12 guntas భూమి యొక్క అసలు లీగల్ స్టేటస్ ను తక్షణమే నిర్ధారించాలి.

*(2)*:అసైన్డ్ ల్యాండ్ గా తేలిన మొత్తం భూమిని చట్టప్రకారం ప్రభుత్వం రక్షణలోకి తీసుకోవాలి.

*(3)*:చట్టవిరుద్ధంగా జారీ చేసిన NOCలు ఉంటే వాటిని చట్టప్రకారం రద్దు చేయాలి.

*(4)*:చట్టవిరుద్ధమైన మ్యుటేషన్స్ , రిజిస్ట్రేషన్స్ మరియు సబ్సిక్వెంట్ ఎంట్రీస్ పై సమగ్ర విచారణ జరపాలి.

*(5)*:చట్టవిరుద్ధ బదిలీలు నిర్ధారణ అయితే చట్టప్రకారం రిసంప్షన్ మరియు రిస్టోరేషన్ చర్యలు చేపట్టాలి.

*(6)*:NOCలు జారీ చేసిన అధికారులు, మ్యుటేషన్స్ చేసిన అధికారులు, రిజిస్ట్రేషన్స్ కు సహకరించిన అధికారులు మరియు సంబంధిత మధ్యవర్తుల పాత్రపై స్వతంత్ర విచారణ జరపాలి.

*(7)*: అవినీతి, కుట్ర లేదా అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు లభిస్తే ACB/సంబంధిత దర్యాప్తు సంస్థల ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరపాలి.

*(8)*:బాధ్యులపై డిపార్ట్మెంటల్ మరియు క్రిమినల్ ప్రొసీడింగ్స్ చట్టప్రకారం ప్రారంభించాలి.

*(9)*:ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ/విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రజల ముందుంచాలి.

*(19)*: సర్వే నెంబర్ .294కు సంబంధించిన అన్ని ఒరిజినల్ రెవిన్యూ రికార్డ్స్ , అసైన్మెంట్ రికార్డ్స్ , సెత్వర్ , సప్లీమెంటరీ సెత్వర్ , 1-B, పహాణి , మ్యుటేషన్ ఫైల్స్ , NOC ఫైల్స్ , 22-A రికార్డ్స్ , రిజిస్ట్రేషన్ రికార్డ్స్ మరియు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ను భద్రపరచాలి.

*(11)*:తదుపరి సేల్ , ట్రాన్స్ఫర్ , మ్యుటేషన్ , రిజిస్ట్రేషన్ లేదా కన్స్ట్రక్షన్ ద్వారా థర్డ్ పార్టీ రైట్స్ సృష్టించకుండా తగిన చట్టపరమైన రక్షణ చర్యలు తీసుకోవాలి.

*(12)*: చట్టవిరుద్ధ బదిలీలు నిర్ధారణ అయితే భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, చట్టప్రకారం అర్హులైన పేద రైతులకు పునరుద్ధరించాలి.

*“ఇక మాటలు కాదు — రికార్డులు బయటపెట్టండి”*

*ఈ వ్యవహారం వ్యక్తిగత రాజకీయ కక్ష కాదని రవికృష్ణ స్పష్టం చేశారు.*

ఇది:ప్రభుత్వ భూమి – అసైన్డ్ ల్యాండ్ – పేద రైతుల హక్కులు – రెవిన్యూ అడ్మినిస్ట్రేషన్ లో జవాబుదారీతనం – చట్టపాలన – ప్రజాప్రతినిధుల ప్రజా బాధ్యతకు సంబంధించిన అంశమని తెలిపారు.అందువల్ల మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, సంబంధిత జిల్లా అధికారులు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి రికార్డులతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
*ఎవరు NOC ఇచ్చారు?*

*ఎవరు మ్యుటేషన్ చేశారు?*

*ఎవరు రిజిస్ట్రేషన్ కు మార్గం సుగమం చేశారు?*

*ఎవరి ఆదేశాలతో?*

*ఏ చట్టం కింద?*

*ఏ ప్రొసీడింగ్స్ ఆధారంగా?*

175 ఎకరాల 12 గుంటల అసైన్డ్ ల్యాండ్ విషయంలో ఇప్పటివరకు ఎవరి మీద ఏ చర్య తీసుకున్నారు?
84 ఎకరాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యుల పేర్లకు భూమి ఎలా వచ్చింది?
ఆ భూమికి NOC ఎవరు ఇచ్చారు?
అది అసైన్డ్ ల్యాండ్ కాకపోతే దానికి సంబంధించిన పూర్తి ప్రభుత్వ ఉత్తర్వులు ఎక్కడ ఉన్నాయి?
*చివరి డిమాండ్*
ప్రభుత్వం నిజంగా పేద రైతుల పక్షాన ఉంటే — సర్వే నెంబర్ .294లోని మొత్తం Ac.175-12 guntas భూమిపై తక్షణమే చట్టబద్ధమైన చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూమిని రక్షించి, చట్టవిరుద్ధ బదిలీలు ఉంటే వాటిని రద్దు చేసి, అర్హులైన పేద రైతులకు న్యాయం చేయాలి.
*ప్రజలకు సమాధానం కావాలి.*

*ఇక మాటలు కాదు — అసలు రికార్డులు బయటపెట్టండి.*

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR: ప్రజాస్వామ్య హక్కులకు తీవ్రమైన ముప్పు_

*స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR: ప్రజాస్వామ్య హక్కులకు తీవ్రమైన ముప్పు*

*సీతారాం ధూళిపాళ - వ్యవస్థాపక చైర్మన్ ది సిటిజన్స్ కౌన్సిల్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 25:

ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పారదర్శకత, నిష్పక్షపాతత్వం మరియు పౌరుల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణపై తీవ్రమైన సందేహాలను కలిగిస్తోంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత SIR నిర్వహించడం, అందులో ఓటర్లు తమ వివరాలను పరిశీలించి, తప్పులను సరిచేసుకునేందుకు కేవలం 40 రోజుల సమయం ఇవ్వడం ఆందోళనకరం. ముఖ్యంగా ప్రతి ఓటరుకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు తగిన విధమైన ముందస్తు సమాచారాన్ని అందించడంలో స్పష్టత లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంద అని సీతారాం ధూళిపాళ  (వ్యవస్థాపక చైర్మన్ ది సిటిజన్స్ కౌన్సిల్)అన్నారు. ఈ సందర్బంగా సీతారాం ధూళిపాళ మాట్లాడుతూ మరింత తీవ్రమైన విషయం ఏమిటంటే, SIR ముసాయిదా ఓటర్ల జాబితా మరియు సవరణలకు సంబంధించిన నోటీసులను ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచడం ద్వారా, ప్రతి ఓటరే స్వయంగా ఆన్‌లైన్‌లోకి వెళ్లి తన పేరు, వివరాలను పరిశీలించి, తప్పులను గుర్తించి, నిర్ణీత గడువులో సవరణలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. ప్రభావిత ఓటర్లకు SMS, WhatsApp, పోస్టు లేదా ఇతర అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందించే సమగ్ర వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, ఫారం 6, ఫారం 7, ఫారం 8లను సంబంధిత బిఎల్ఓ BLO ద్వారా రూట్ చేయాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో ఓటర్లకు సహాయం చేయాల్సిన అనేక మంది బిఎల్ఓ BLOలకే ఆన్‌లైన్ నోటీసులు, సవరణల ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడం తీవ్రమైన లోపం.బిఎల్ఓ BLOలకే సరైన సమాచారం లేని పరిస్థితిలో సామాన్య ఓటర్లు ఈ ప్రక్రియను ఎలా అర్థం చేసుకుని పూర్తి చేయగలరు?అని ప్రశ్నించారు.
*ఇది ఒక ప్రాథమిక ప్రజాస్వామ్య ప్రశ్నను లేవనెత్తుతోంది:*

ఆన్‌లైన్ నోటీసును చూడలేకపోయినందుకు లేదా సవరణకు సంబంధించిన గడువు తెలియకపోయినందుకు ఒక నిజమైన ఓటరు తన ఓటు హక్కును కోల్పోవడం న్యాయమేనా? ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఓటు హక్కును పరిరక్షించాలి కానీ డిజిటల్ అవరోధంగా మారకూడదు. ముఖ్యంగా వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, డిజిటల్ సదుపాయాలు లేదా అవగాహన లేని ప్రజలు ఈ ప్రక్రియలో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.అందువల్ల ECI ప్రభావిత ఓటర్లకు వ్యక్తిగతంగా మరియు ధృవీకరించగలిగే విధంగా సమాచారం అందించడం, BLOలకు సమగ్ర శిక్షణ ఇవ్వడం, ఆఫ్‌లైన్‌లో కూడా సవరణలకు అవకాశం కల్పించడం, తగినంత సమయం ఇవ్వడం మరియు ఏ నిజమైన ఓటరి పేరును తొలగించే ముందు సమర్థవంతమైన అభ్యంతరం/అప్పీల్ అవకాశం కల్పించడం అత్యవసరం.డెడ్‌లైన్లు, ఆన్‌లైన్ నోటీసుల ద్వారా ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయదు. ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటర్ల జాబితాలో కొనసాగేందుకు న్యాయమైన అవకాశం కల్పించడమే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం.అందువల్ల SIR ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా, ఓటర్‌ అనుకూలంగా మరియు రాజ్యాంగబద్ధంగా జవాబుదారీతనంతో నిర్వహించాలి. ఎన్నికల జాబితా సవరణ పేరుతో ఒక్క నిజమైన ఓటరు కూడా తన ప్రజాస్వామ్య హక్కును కోల్పోకుండా ECI తక్షణ చర్యలు తీసుకోవాలి.

మిలాద్-ఉన్-నబీ" సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!_

https://x.com/Praja_Snklpm/status/2092523606035276160

*_శాంతి, ప్రేమ, మానవతా విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన "మిలాద్-ఉన్-నబీ" సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!... Bplkm✍️_*

*#MiladUnNabi #MiladUnNabi2026 #MiladUnNabiMubarak*
*@IPRTelangana*

https://www.facebook.com/share/p/1K2nTeG1o6/
              *****
https://www.instagram.com/p/Dcfv4jAKi3S/?igsi=MTY1OWNzdWh0N2t2YQ==

Tuesday, August 25, 2026

_తెలంగాణ జైళల్లో దీర్ఘకాలంగానిర్భందంలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు, కార్యకర్తల కేసులను మానవతా దృక్పధంతో పునఃసమీక్షించి వారిని విడుదల చేయాలి_


*_తెలంగాణ జైళల్లో దీర్ఘకాలంగానిర్భందంలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు, కార్యకర్తల కేసులను మానవతా దృక్పధంతో పునఃసమీక్షించి వారిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సారుకు విజ్ఞప్తి చేసిన మానవహక్కుల వేదిక సంస్థ._*

*@TelanganaCMO @TelanganaDGP @MaheshBhagwat95 @dgprisonstg @IPRTelangana @DigitalMediaTG @HRF_Humanrights @BplplH*

https://x.com/Praja_Snklpm/status/2092152845495902384?t=bWa8FSsD8iNOTAz9vGNVjQ&s=08

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’_

*బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’ పోటీలు* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 24:

బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబుతో కలిసి ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్‌ ఫిల్మ్, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈ సారి కొత్తగా జానపద పాటలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలు (ఆర్టికల్స్) కు చోటు కల్పించామని తెలిపారు.గత ఏడాది నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభించిందని,  500కు పైగా లఘు చిత్రాలు, బతుకమ్మ పాటలు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం కూడా యువ ప్రతిభావంతులు పోటీలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టించడానికి, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయి. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు దోహదం చేస్తాయని ఈ పోటీలను నిర్వహిస్తున్నారు అని అన్నారు.లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్‌ 5 నిమిషాలకు మించకూడదు అని ఆయా వీడియోలు 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి అని అన్నారు. ఆసక్తి కలిగిన వారు వాటిని 2026 సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్‌కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి అని అన్నారు. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది.ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. 1 లక్ష. మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ. 20 వేల చొప్పున అందించనున్నారు. ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేస్తారు.

నిబంధనలు ఉల్లంఘించే భవనాలపై కఠిన కూల్చివేత చర్యలు చేపట్టిన సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్_

*నిబంధనలు ఉల్లంఘించే భవనాలపై కఠిన కూల్చివేత చర్యలు చేపట్టిన సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్*

*నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై సీఎంసీ చర్యలను ముమ్మరం చేసింది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 25:

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఈరోజు  నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న 38 అనధికార భవనాలను గుర్తించాయి.
**వాటి వివరాలు* 
 *(1)*: 28 UC నోటీసులు జారీ
*(2)*:  1 భవనం స్వాధీనం
*(3)*:  9 భవనాలు కూల్చివేత
**ఈ కింది అక్రమ నిర్మాణాల మీద చర్యలకు దృష్టి సారించింది:**
*(1)*: 75 చదరపు గజాల లోపు ప్లాట్లు: 7 మీటర్లకు మించిన ఎత్తు ఉన్న నిర్మాణాలు.
*(2)*: 75 చదరపు గజాల పైబడిన ప్లాట్లు: ఎత్తుతో సంబంధం లేకుండా, భవన నిర్మాణ అనుమతి లేకుండా చేసిన నిర్మాణాలు.
పౌరుల ఫిర్యాదుల ద్వారా, అలాగే స్వచ్ఛంద క్షేత్ర తనిఖీల ద్వారా కేసులను గుర్తిస్తున్నారు. అమలు చర్యలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు.