Thursday, July 2, 2026

రోహింగ్యాలకు అక్రమంగా సదుపాయాలు కల్పిస్తుంది ఎవరు ??

జర్నలిస్టులను వేదిస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి DPRO_

_నల్లగొండ జిల్లా కలెక్టర్, కట్టంగూర్ తహసీల్దార్ లపై హై కోర్ట్ లో పిటిషన్ దాకలు చేసిన RTI &Human rights activist ఉబ్బని రాజు_

*నల్లగొండ జిల్లా కలెక్టర్, కట్టంగూర్ తహసీల్దార్ లపై హై కోర్ట్ లో పిటిషన్ దాకలు చేసిన RTI &Human rights activist ఉబ్బని రాజు* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 01:

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలo బోల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని SLBC కాల్వ నుండి పెరిందేవి గూడెం నర్సన్న చెరువు వరకు సర్వే నంబర్ 317,318&280 లో ఉన్న దాదాపు 110 ఎకరాల అటవీ భూమి & బంచర భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో JCB పెద్ద పెద్ద యంత్రాలతో అక్రమంగా మైనింగ్ మాఫియా చేసి మట్టిని తరలించారని RTI &Human rights activist ఉబ్బని రాజు తెలిపారు.ఈ సందర్బంగా రాజు మాట్లాడుతు మట్టిని అక్రమంగా తరలించి పర్యావరణానికి & మూగ జంతువులకు హాని తలపెట్టిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని నల్లగొండ జిల్లా కలెక్టర్ గారికి కట్టంగూర్ మండల తహసీల్దార్ గారికి పిర్యాదు చేసి 6 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు, అందుకే ఈ రోజు నల్లగొండ కలెక్టర్ మరియు కట్టంగూర్ తహసీల్దార్ గారిపై తెలంగాణ హై కోర్ట్ లో పిటిషన్ దాకలు చేసినట్టు తెలిపారు, ముఖ్యంగా పశువులకు & మూగ జంతువులకు పక్షులకు ఆవాసం లేకుండా పోయిందని అన్నారు, తక్షణమే హై కోర్ట్ జ్యూడిషల్ రిజిస్టార్ గారు స్పందించి అక్రమ మైనింగ్ మాఫియా పై పూర్తి విచారణ జరిపించి , ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు, నా పిర్యాదును పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన కలెక్టర్ మరియు తహసీల్దార్ గార్లను మందలించి వాళ్లకు ఉన్న విధులు & భాద్యతల గురించి తెలియపరచాలని  నిర్లక్ష్యపు విధులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.

_జర్నలిస్ట్ కేవీఆర్ రెడ్డి అరెస్ట్ గురించి స్పందించిన సామజిక కార్యకర్త, న్యాయవాది వి. రవికృష్ణ_

*చట్టాన్ని పక్కన పెట్టి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టవద్దు...!*

*జర్నలిస్ట్ కేవీఆర్ రెడ్డి అరెస్ట్ గురించి స్పందించిన సామజిక కార్యకర్త, న్యాయవాది వి. రవికృష్ణ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 01:

జర్నలిస్ట్ కేవీఆర్ రెడ్డి అరెస్ట్ విషయంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో, కొన్ని రాజకీయ వర్గాల్లో "ఏపీ పోలీసులు తెలంగాణలో అక్రమంగా అరెస్ట్ చేశారు", "తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అక్రమ అరెస్ట్‌కు సహకరించారు" అనే ప్రచారం జరుగుతోంది.ఆంధ్ర నుంచి వచ్చిన పోలీసులు చట్ట విరుద్ధంగా జర్నలిస్ట్ని అరెస్టు చేసినట్టు ఇంతవరకు ఎటువంటి ఆధారం లేదు. కోర్టు ఇచ్చిన వారెంట్ని స్పష్టంగా మీడియాకు చూపించిన తర్వాత కూడా, సరూర్నగర్ పోలీసుల సమక్షంలో ఆంధ్ర నుంచి వచ్చిన పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆంధ్ర - తెలంగాణ అని మాట్లాడడం అవివేకానికి మూర్ఖత్వానికి నిదర్శనం.

*చట్టం ఏమి చెబుతోంది?*

1. సమర్థ అధికార పరిధి కలిగిన కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) ఉంటే, భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా దానిని అమలు చేసే అధికారం పోలీసులకు ఉంది.

2.అరెస్ట్ చేయడానికి పోలీసులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలనే చట్టం లేదు. సివిల్ డ్రస్‌లో అరెస్ట్ చేయడం మాత్రమే అక్రమం కాదు. అయితే, వారు తమను తాము పోలీసు అధికారులుగా గుర్తించాలి.

3. ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్రంలో వారెంట్ అమలు చేసే సందర్భంలో సాధారణంగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదా సమన్వయం చేసుకోవడం అనేది అనుసరించే విధానం. స్థానిక పోలీసులు శాంతి భద్రతలు కాపాడడం లేదా చట్టబద్ధమైన అరెస్టుకు సహకరించడం మాత్రమే ఆ అరెస్టును అక్రమంగా మార్చదు.

4. ఒకవేళ నిజంగా చెల్లుబాటు అయ్యే కోర్టు వారెంట్ ఆధారంగా అరెస్ట్ జరిగి ఉంటే, ఆ అరెస్టు చట్టబద్ధమా కాదా అనేది BNSS, 2023, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 21, 22, అలాగే సుప్రీంకోర్టు నిర్దేశించిన అరెస్ట్ విధానాలను పాటించారా లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

*సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది:*
D.K. Basu v. State of West Bengal కేసులో అరెస్టు సమయంలో పాటించాల్సిన తప్పనిసరి రక్షణ చర్యలను నిర్దేశించింది. పోలీసు అధికారులు తమ గుర్తింపును తెలియజేయడం, అరెస్ట్ కారణం చెప్పడం, అరెస్ట్ మెమో తయారు చేయడం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం, వైద్య పరీక్షలు, చట్టం ప్రకారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం వంటి విధానాలు తప్పనిసరి.
*Arnesh Kumar v. State of Bihar తీర్పులో కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యున్నత ప్రాధాన్యత ఉందని, చట్ట ప్రక్రియను ఖచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.*
అందువల్ల, కోర్టు నిర్ణయం లేకుండానే...
❌ "ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు."
❌ "తెలంగాణ పోలీసులు అక్రమ అరెస్టుకు సహకరించారు."
❌ "ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం."అని దుష్ప్రచారం చేయడం చట్టపరంగా సరైనది కాదు.ఒకవేళ అరెస్టు ప్రక్రియలో చట్ట ఉల్లంఘన జరిగి ఉంటే, దానిని నిర్ణయించే అధికారం కోర్టుకే ఉంది. సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ డిబేట్లు లేదా రాజకీయ వ్యాఖ్యలు కాదు.
ఏది పడితే అది మాట్లాడి వాక్ స్వాతంత్రం అని, తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరైన పద్ధతి  కాదు.నమోదు చేసిన కేసు తప్పా వోప్పా అరెస్టు తప్పా వొప్పా అనేది తేల్చాల్సింది యూట్యూబర్లు కాదు, సోషల్ మీడియా కాదు, సంబంధిత కోర్టు నిర్ణయిస్తుంది.
*Rule of Law is above Political Narratives and Regional Sentiments.*

Wednesday, July 1, 2026

ఇబ్రహీంపట్నం గురునానాక్ విద్యాసంస్థలను సందర్శించిన అమెరికా విద్యావేత్త

రామంతాపూర్ RTC కాలనీ బంగారు మైసమ్మ వార్షికోత్సవ మహోత్సవంలో ఉప్పల్ MLA

30వ తేదీ సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం - సీఎం రేవంత్ రెడ్డి

*30వ తేదీ సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 29:

తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీ సదస్సు హైదరాబాద్ శిల్పకళా వేదికలో  జరగనుంది. తొలుత మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.30వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు వేదికల నుంచి సమావేశంలో పాల్గొంటారు.