Saturday, May 30, 2026

*_కొలువు తెచ్చిన గౌరవం_*

*కొలువు తెచ్చిన గౌరవం*

*హైడ్రా ఉద్యోగంతో వచ్చిన ఆత్మవిశ్వాసం*

*హైడ్రా ఈగల్ టీమ్గా ప్రత్యేక గుర్తింపు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 29:

హైడ్రాలో ఉద్యోగం… ట్రాన్స్జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది.కొలువు తెచ్చిన గౌరవం.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక వారు వెనక్కి చూడడంలేదు. విధులు ఎక్కడైనా.. ఎప్పుడైనా సిద్ధమంటున్నారు.చెరువులు, నాలాల కబ్జాలను తొలగించడంలో భాగస్వామ్యమౌతున్నారు. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో ముందుంటున్నారు. మొత్తం 16 మంది ట్రాన్స్జెండర్లకు హైడ్రా అవకాశం కల్పించింది. ఇందులో ట్రాన్స్ ఉమెన్ 11 మంది ఉంటే.. ట్రాన్స్మెన్ ఐదుగురున్నారు.ఆక్రమణదారులు ఎంతటి వారైనా వెరవకుండా..విధులు నిర్వహించి ప్రజా ఆస్తులు కాపాడడంలో భాగస్వామ్యమౌతున్నారు. హైడ్రా (HYDRAA)లో మాకు దక్కిన ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదు.. మా జీవితాలకు కొత్త గుర్తింపు అని అంటున్నారు. హైడ్రా యూనీఫామ్ వేసుకోవడం గౌరవంగా భావిస్తున్నామని అంటున్నారు. "హైడ్రా ఈగల్ టీమ్" గా నామకరణం చేసి..విధుల్లో భాగస్వామ్యులను చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్రాన్స్జెండర్లు చెబుతున్నారు.హైడ్రాఈగల్ టీమ్గా సేవలు..కబ్జాదారులు ఎంతటి వారైనా.. హైడ్రా వెనుకడుగు వేయదు.హైడ్రా ఇచ్చిన ధైర్యంతో ఈగల్ టీమ్ పని చేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం,ఐలాపూర్లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడంలో ట్రాన్స్జెండర్లు చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల మాదాపూర్ లో ఈదులకుంట కాపాడడంలో చురుకైన పాత్రపోషించారు. ప్రజలకు నచ్చజెప్పడం, మహిళలతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పడం, అధికారులు–ప్రజల మధ్య సమన్వయం చేయడం వంటి పనుల్లో వారు ప్రత్యేక పాత్ర పోషించారు. వారిలో సహనం ఎక్కువ.భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణం ఉంది. అందుకే ఫీల్డ్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు అని హైడ్రా అధికారులు ప్రశంసిస్తున్నారు. హైడ్రాలో పనిచేస్తున్న చాలామంది ట్రాన్స్జెండర్లు ఇప్పుడు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. నెల జీతం వస్తోంది. సమాజంలో గౌరవం పెరిగింది. ముఖ్యంగా “మేము కూడా పనికి పనికొచ్చే వాళ్లమే” అన్న నమ్మకం వారిలో బలపడింది.
➡️మా జీవితాల్లో వెలుగులు:  
గాయత్రి -మా జీవితాల్లో డబ్బుకంటే గౌరవమే ముఖ్యమైంది.ఇప్పుడు హైడ్రా యూనిఫాం వేసుకుని బయటికి వెళ్తే గౌరవంగా ఉంది. అది మా జీవితంలో పెద్ద మార్పు. “అవకాశం ఇస్తే ట్రాన్స్జెండర్లు ఏ రంగంలోనైనా రాణిస్తారు.” హైడ్రాలో మా విధులు  అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. హైడ్రాలో అధికారులతో పాటు.. ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు. విధులు నిర్వర్తించడంలో సమానంగా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, హైడ్రా కమిషనర్కు ధన్యవాదాలు. 
➡️హైడ్రాతో ప్రత్యేక గుర్తింపు:  రుచిత -ప్రకృతిలో అందరూ భాగమే. ఆ ప్రకృతిని రక్షించడంలో మేము భాగస్వామ్యమయ్యాం. పార్కులు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. హైడ్రాలో పని చేయడంతో మాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. హైడ్రా అంటే ప్రజలకు ఎంతో విశ్వాసం.. ఆ సంస్థలో మేము భాగస్వామ్యం అవ్వడంచాలా సంతోషంగా ఉంది.
➡️బాధ్యతగా వ్యవహరిస్తున్నాం: తాన్షీరాయ్ - బిక్షాటన చేసుకుంటూ జీవితాలు వెల్లదీసేవాల్లం. ట్రాన్స్జెండర్లంటే ఇంతకుముందు ఎక్కడికి వెళ్లినా ఎగతాళి చేసేవారు.పని అడిగితే తిరస్కరించేవారు. కానీ ఇప్పుడు యూనిఫాం వేసుకుని విధులకు వెళ్లినప్పుడు అందరూ గౌరవంగా మాట్లాడుతున్నారు.

*_ఎస్సీ ఎస్టీ కేసుల కొట్టివేత_*

*_ఎస్సీ ఎస్టీ కేసుల కొట్టివేత_*
# స్వాగతించిన అనంచిన్ని వెంకటేశ్వరరావు 
# అడ్వకేట్ సంగెం సుధీర్ కుమార్ కు ప్రత్యేక అభినందనలు 
# హైకోర్టు అడ్వకేట్ యల్లంకి పుల్లారావుకు కృతజ్ఞతలు 
# ప్రముఖ పాత్రికేయులు రవిప్రకాష్ కు ధన్యవాదాలు 

(ఆదిలాబాద్ న్యాయస్థానం నుంచి న్యాయవాద విద్యార్థి శ్రీ విష్ణు శివ పరమాత్మ)

ఆరు సంవత్సరాల క్రితం నాటి నియంత ప్రభుత్వంపై పోరాడుతున్న ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, ఈ దశాబ్ది ఉత్తమ పాత్రికేయ అవార్డు గ్రహీత అనంచిన్ని వెంకటేశ్వరరావుపై సంకసర్ల సువర్ణ అనే మహిళ పెట్టిన రెండు కేసులను ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు కొట్టివేసింది. 

అసలేం జరిగింది.?:
గత ప్రభుత్వంలోని ఒక బ్యాచ్ తో కుమ్మక్కైన కొందరు అనంచిన్ని వెంకటేశ్వరరావుపై కేసులు పెట్టడంలో తహతహలాడారు. అందుకోసం ఒక మహిళను ఎన్నుకున్నారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అప్పటికే ఎలాంటి ఆధారాలు లేకుండా రెండు కేసులు పెట్టిన సంకసర్ల సువర్ణచేత సుమారు 50 రోజుల క్రితం వాట్సాప్ లో కులం పేరుతో తిట్టినట్లు కట్టు కథ అల్లారు. అందుకు తోడుగా ఓ ఏడుపు వీడియో కూడా విడదల చేసింది.

రెండో కేసు: ఈ కేసుకు ముందు ఖమ్మంలో వాకింగ్ చేస్తున్న అనంచిన్ని వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఒక్కసారిగా కంగుతిన్న గత ప్రభుత్వం అదే రోజు విడుదల చేసింది.

ఇదీ కుట్ర:
కిడ్నాప్ అనంతరం 4 రోజుల తర్వాత మైలార్ దేవులపల్లిలో పోలీసులు స్వీ మోటో కేసు నమోదు చేయగా.. ఇక్కడ కూడా సంకసర్ల సువర్ణ రంగ ప్రవేశం చేసి అదే రోజు రాత్రి 2వ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సుమారు 40 రోజులు అనంతరం 'నెట్ కాల్' బాగోతానికి తెర లేపింది. అనంచిన్ని వెంకటేశ్వరరావు సెల్ ఫోన్ నెంబర్ కు అసలు నెట్ కాల్ సౌకర్యం లేకపోవడం గమనార్హం.

కోటి రూపాయల కథ - కోర్టులో మరో విధంగా..:

సంకసర్ల సువర్ణ గత ఆరేళ్ళుగా "కోటి రూపాయలు ఇస్తానంటే నేను లొంగలేదని" బొంకుతూ వచ్చింది. తీరా కోర్టులో వాంగ్మూలం ఇస్తూ... 'కోటి రూపాయలకు పరువునష్టం నోటీసు' అంటూ చెప్పడం జరిగింది. 

చెల్లితో అక్రమ సంబంధం:
బావమరిది భార్యతో అనంచిన్ని వెంకటేశ్వరరావుకు లింకు పెడుతూ అవాకులు చవాకులు పేలింది. బిడ్డ ఇక్కడ కూడా అడ్డంగా దొరికింది. 

బాక్స్:

కోర్టు తీర్పులను స్వాగతించిన అనంచిన్ని వెంకటేశ్వరరావు

ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను తాను స్వాగతిస్తునట్లు అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా కోర్టు వద్ద తనను కలసిన విలేఖరులకు చెప్పారు. ఇక ఇతర కేసుల విషయంలో తన న్యాయవాదులందరూ వేగంగా న్యాయపరమైన పనులు చెపట్టాలని అంతే కాకుండా ఇక నుంచి చిన్న అసంబద్దంగా ఎవరు మాట్లాడినా వెంటనే ఆధారాలతో న్యాయస్థానంలో కేసులు వేయాలని ఆయన కోరారు. 'నాటి ప్రభుత్వానికి ఇది చెప్పు దెబ్బ' అని, ఇక నుంచి అనంచిన్ని బ్రాడ్ కాస్టింగ్, అనంచిన్ని ఫౌండేషన్ లతో కార్యక్రమాలను చేపడతానని, అలాగే పలు ఆర్థిక కార్యక్రమాలను స్వంత ఖర్చులతో చేపడతానని, తనపై పెట్టిన కేసుల వాళ్ళ సంగతి తమ న్యాయవాదులు చూసుకుంటారని ఈ సందర్భంగా చెప్పారు.

బాక్స్:
కృతజ్ఞతలు 

తనకు గత ఆరేళ్లుగా న్యాయపరంగా సేవలందించిన అడ్వకేట్ సంగెం సుధీర్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ యల్లంకి పుల్లారావు, సీనియర్ పాత్రికేయులు , అఖిల భారత జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు కే.కోటేశ్వర్ రావుకు అనంచిన్ని వెంకటేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బాక్స్:
ప్రముఖ పాత్రికేయులు రవిప్రకాష్ కు ధన్యవాదాలు

టివి9 వ్యవస్థాపకులు, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, ఆర్టీవి బాధ్యులు రవిప్రకాష్ కు అనంచిన్ని వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన కష్టకాలంలో దేవుడు ఇచ్చిన సోదరుడిలా వెన్నంటి ఉన్నారని, ఆర్థికంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారని, ఆ ఋణం తీర్చుకోలేనిదని ఈ సందర్భంగా అనంచిన్ని వెంకటేశ్వరరావు చెప్పారు.

బాక్స్:
ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ హైదరాబాద్ లలో బాణాసంచాలతో అనంచిన్ని వెంకటేశ్వరరావు అభిమానులు, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

బాక్స్:

తనపై కేసులు పెట్టిన వారి వెనుక ఉన్న వెధవలు, సంఘ నాయకుల గురించి స్పష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా చెప్పారు.

*_SC/ST Cases Dismissed_*



*_SC/ST Cases Dismissed_*

_Anamchinni Venkateswara Rao Welcomes the Judgments_

_Special Congratulations to Advocate Sangem Sudheer Kumar_

_Gratitude to High Court Advocate Yallanki Pulla Rao_

_Thanks to Senior Journalist Ravi Prakash_

_(From Adilabad Court – Law Student Sri Vishnu Shiva Paramatma)_

*_Two SC/ST cases filed six years ago against noted investigative journalist and recipient of the “Best Journalist of the Decade” award, Anamchinni Venkateswara Rao, by a woman named Sankasarla Suvarna, have been dismissed by the Adilabad District SC/ST Court._*

*_What Actually Happened?_"
Several individuals allegedly associated with a faction of the previous government were eager to implicate Anamchinni Venkateswara Rao in criminal cases. For this purpose, they allegedly chose a woman. About 50 days after two earlier cases had already been filed without substantial evidence, a new story was allegedly fabricated claiming that Venkateswara Rao had abused her in the name of caste through WhatsApp messages. A video showing her crying was also circulated in support of the allegations.

*_The Second Case_*
Prior to the registration of this case, Anamchinni Venkateswara Rao was allegedly abducted while on a morning walk in Khammam and taken to Hyderabad. The then government, reportedly taken aback by the developments, released him on the same day.

*_The Alleged Conspiracy_*

Four days after the alleged abduction, the police at Mylardevpally registered a suo motu case. Subsequently, Sankasarla Suvarna entered the scene and filed a second SC/ST case on the very same night.

Approximately forty days later, a new allegation involving a “net call” was introduced. It is noteworthy that Anamchinni Venkateswara Rao’s mobile number allegedly did not have any net-calling facility.

*_The One-Crore Rupee Story – A Different Version in Court_*

For the past six years, Sankasarla Suvarna had allegedly claimed that she had been offered one crore rupees and refused to yield. However, while giving testimony before the court, she reportedly stated that the issue related to a legal notice seeking damages of one crore rupees for defamation.

*_Allegations of an Illicit Relationship_*
She allegedly made statements linking Anamchinni Venkateswara Rao with the wife of his brother-in-law. According to supporters of Venkateswara Rao, these allegations were also exposed during the proceedings.
---

Box Item

*_Anamchinni Venkateswara Rao Welcomes the Court Judgments_*

Speaking to media representatives who met him outside the court, Anamchinni Venkateswara Rao stated that he welcomed the judgments delivered by the Adilabad District SC/ST Court.

He said that his legal team would expedite proceedings in the remaining cases and that, henceforth, any person making irresponsible or defamatory statements against him would face legal action supported by evidence.

Describing the judgment as a “strong reply to the previous government,” he announced plans to undertake various initiatives through Anamchinni Broadcasting and the Anamchinni Foundation. He also stated that he intends to launch several welfare and economic programs at his own expense. Regarding those responsible for the cases filed against him, he said his legal team would handle the matter appropriately.
---

Box Item

*_Gratitude_*
Anamchinni Venkateswara Rao expressed his sincere gratitude to Advocate Sangem Sudheer Kumar, High Court Advocate Yallanki Pulla Rao, senior journalist and President of the All India Journalists Association K. Koteswara Rao, all of whom provided him with legal and moral support over the past six years.
---
Box Item

*_Special Thanks to Senior Journalist Ravi Prakash_*

Anamchinni Venkateswara Rao extended special thanks to Ravi Prakash, founder of TV9, senior journalist, and head of RTV.

He stated that Ravi Prakash stood by him during difficult times like a brother sent by God and had spent several lakhs of rupees to support him financially. Venkateswara Rao remarked that such a debt of gratitude could never be fully repaid.
---
Box Item
*_Celebrations Across Telangana_*
Supporters of Anamchinni Venkateswara Rao and members of the Telangana State Welfare Association reportedly celebrated the court verdicts with fireworks and gatherings in Khammam, Warangal, Karimnagar, Nalgonda, and Hyderabad.
---
Box Item

Anamchinni Venkateswara Rao stated that he possesses clear evidence regarding certain individuals and organizational leaders who allegedly operated behind the scenes in filing cases against him. He indicated that these matters would be addressed through appropriate legal channels.

Thursday, May 28, 2026

ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్ - సీఎం రేవంత్ రెడ్డి

*ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్ - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే,మే 28:

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా,ఏ పథకం కింద,ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు.తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు.సమగ్ర సంక్షేమ కార్డ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని  ముఖ్యమంత్రి అన్నారు.ఈ డేటాను అన్ని కోణాల్లో  ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు.నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం  సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు,ఐటీ శాఖ ఆధ్వర్యంలో  సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సీఎం సూచించారు.టెక్నాలజీపై పట్టున్న,చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు.ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి,ఫీజు రీయింబర్స్‌మెంట్,కార్మిక శాఖ, విద్యా శాఖ,ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకువస్తున్న  బీమా పథకాల వివరాలు ఉండాలని చెప్పారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చేలా ఆలోచించాలన్నారు. ఇటీవల ప్రభుత్వం  నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డ్‌కు అనుసంధానించాలన్నారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు.ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని సీఎం సూచించారు ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డ్ తో  లింక్ చేయాలని చెప్పారు.కేరళ నుంచి  గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ షూటర్ ఇషా సింగ్ కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

*హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ షూటర్ ఇషా సింగ్ కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 28:

ISSF ప్రపంచ కప్-2026 షూటింగ్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి చారిత్రాత్మక విజయం సాధించిన ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మ్యూనిచ్‌లో జరుగుతున్న ISSF వరల్డ్ కప్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 43 హిట్స్ సాధించి అద్భుతమైన స్కోర్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ఇషా, సాధించిన విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్ తన అంకితభావం, క్రమశిక్షణ మరియు పట్టుదలతో లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రశంసించారు.ఆమె అద్భుతమైన ప్రదర్శన భారత క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని, భారత క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనమని అన్నారు.ఇషా సింగ్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆమె దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

Friday, May 22, 2026

తెలంగాణలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉందా ?

*కడపర్తి గ్రామ మహిళ ఆవేదన – నకిరేకల్ సి.ఐ పై కక్షపూరిత చర్యల ఆరోపణలు*

*తెలంగాణలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉందా ?*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 22:

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన బెల్లి బద్రమ్మ,భర్త సాయమల్లు కుటుంబ సభ్యులు తమపై నకిరేకల్ సి.ఐ హరిబాబు గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర డి.జి.పి, నల్గొండ ఎస్.పీ, డి.ఎస్.పీ అధికారులకు ఫిర్యాదు చేశారు.బద్రమ్మ తెలిపిన వివరాల ప్రకారం,తమ పట్టా భూమిలో ఇప్పటికే మూడు పీట్ల దారి ఇచ్చినప్పటికీ,మరింత దారి ఇవ్వాలని బెల్లి వెంకన్న మరియు వారి కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చి వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ వివాదంలో ప్రత్యర్థులతో కుమ్మక్కైన నకిరేకల్ సి.ఐ హరిబాబు తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు నెంబర్ 121/2026 నమోదు చేయించారని ఆరోపించారు. అలాగే తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోగా, ఫిర్యాదు రసీదు కూడా ఇవ్వలేదని తెలిపారు.ఈ విషయమై 15-04-2026న రిజిస్టర్ పోస్టు ద్వారా నల్గొండ జిల్లా ఎస్.పీ గారికి ఫిర్యాదు చేసినందుకు కక్ష పెట్టుకొని,తనను ఒక మహిళనని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకా తన భర్త సాయమల్లును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, “మీపై ఫిర్యాదు వచ్చింది” అంటూ ఒక రోజు మొత్తం స్టేషన్‌లో కూర్చోబెట్టి, ఫోన్ స్వాధీనం చేసుకొని మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే తొలగించి, తాము ఇచ్చిన ఫిర్యాదుపై చట్టపరమైన కేసు నమోదు చేయాలని,విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన నకిరేకల్ సి.ఐ హరిబాబు మీద శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని బెల్లి బద్రమ్మ ప్రభుత్వాన్ని కోరారు.

నిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపిన - సీఎం రేవంత్ రెడ్డి

*నిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపిన - సీఎం రేవంత్ రెడ్డి*

*2 వేల కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసిన నిమ్స్ వైద్య బృందం* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, మే 22:

కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (#NIMS) యూరాలజీ విభాగం, 2 వేల కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. కిడ్నీ మార్పిడులలో దక్షిణ భారత దేశంలో నిమ్స్​ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లలో గుజరాత్‌లోని ఐకేడీఆర్‌సీ మొదటి స్థానంలో, లూధియానా క్రిస్టియన్ మెడికల్ కాలేజీ రెండో స్థానంలో ఉండగా, నిమ్స్ మూడో స్థానంలో ఉంది.ఈ అరుదైన మైలురాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.ఈ 2 వేల మందిలో 1,900 మంది అంటే 95 శాతం మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవడం విశేషం.2023 జనవరి నుంచి గడిచిన మూడు సంవత్సరాల నాలుగు నెలల్లోనే 500 కిడ్నీ మార్పిడులు చేసి రికార్డు సృష్టించింది.