Praja Sankalpam Group Media
Monday, July 6, 2026
బెంగుళూరులో రెండు సంవత్సరాల చిన్న పాపపై జరిగిన అమానుష ఘటన ప్రతి తల్లి తండ్రిని కలవర పెడుతోంది_
*రెండు సంవత్సరాల పాప ఏడస్తుంది అని వాషింగ్ మెషిన్ లో కూర్చో బెట్టిన డే కేర్ సెంటర్ సిబ్బంది*
*ఈమధ్య సోషియల్ మీడియాలో ఒక విడియో వైరల్ అవుతుంది*
*బెంగుళూరులో రెండు సంవత్సరాల చిన్న పాపపై జరిగిన అమానుష ఘటన ప్రతి తల్లి తండ్రిని కలవర పెడుతోంది*
*అనురాధ రావు అధ్యక్షురాలు - బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 04:
ఉరుకు పరుగుల ప్రపంచంలో తల్లి తండ్రి ఇద్దరు పని చేస్తేనే పిల్లలకు అన్ని సమకూర్చగలరు.పిల్లలను తప్పనిసరిగా డే కేర్ సెంటర్స్ ల్లో వదలి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, 2 సంవత్సరాల పాప ఏడస్తుంది అని వాషింగ్ మెషిన్ లో కూర్చో బెట్టారు, టాయిలెట్ జెట్ తో నీటికి నోట్లో స్ప్రే చేయడం, బాత్ రూం లో బంధించడం చేశారు. 5 గురు ఆయాలను అదుపులోకి తీసుకున్నారు వారి పై జేజేయాక్ట్ సెక్షన్ 351 క్రిమినల్,నేరపూరిత బెదిరింపు BNS ప్రకారం కేసులు నమోదు చేశారు.మన తెలుగు రాష్ట్రాలోని ఓ ఉన్న డే కేర్ సెంటర్లపై ప్రభుత్వం నిఘాఉంచుతోందా?
ఉద్యోగులు తమ పిల్లలను డే కేర్ సెంటర్స్, ప్లే స్కూల్స్ కు పంపిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్నాయా?
నగరం లో 500 ప్లే స్కూల్స్ గుర్తింపు లేకుండా నడుస్తున్నాయని ఈ మధ్య వార్తలొచ్చాయి. వీటిపై పై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఏదైనా సంఘటన జరిగేవరకు చూసి చూడనట్టు ఉంటుందా? గతంలో అనేక సంఘటనలు జరిగాయి, రెండు సంవత్సరాల పాప చపాతీ తింటుంటే గోంతులో అడ్డం పడి, పాప ఊపిరి ఆడక చనిపోయింది, ఆయా నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగింది.జీడిమెట్లలో 4 సంవత్సరాల పాప పై ఆయా అమానుషంగా దాడి చేసి, కొట్టి రోడ్డు పై వదిలేసింది,పాప ఏడుస్తూ ఉంది అని. 2025 డిసెంబర్ లో జరిగిన ఘటన ఇది.
మల్కాజిగిరి ఏరియాలో 3సంవత్సరాల బాబు ఆడుతూ తెరిచి ఉన్న సంపులో పడి చనిపోయాడు.సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగింది.
రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుడు బాబు అల్లరి చేస్తున్నాడు అని నోటికి ప్లాస్టర్ వేసి, పెన్ తో కంటి దగ్గర గుచ్చాడు,ఈ సంఘటన Aug 2025లో జరిగింది.ఇలా చెప్పుకుంటు పోతే బోలెడు సంఘటనలు ఉన్నాయి.
ప్రభుత్వం ఏం చేయాలి,పేరేంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
*తల్లితండ్రులు* - మీరు తప్పని సరిగా పిల్లలను ప్లే స్కూల్స్ కు పంపాలని అనుకుంటే,ముందు అది ప్రభుత్వ గుర్తింపు ఉందా అని చూడండి. అక్కడ వారు నడిపే సెంటర్లల్లో పని చేస్తున్న సిబ్బంది, శిక్షణ పొందిన వాళ్ళా? కాదా చెక్ చేసుకోండి.సిబ్బందిని తీసుకునేపుడు పోలిస్ వెరిఫికేషన్ చేయించారా లేదా?వారు పిల్లలను ఏవిధంగా చూస్తున్నారు గమనించాలి. నిజంగా వీరు పిల్లలను ప్రేమగా చూసుకుంటున్నారా? ప్యాషన్ తో నడిపిస్తున్నారా? లేక డబ్బుల కోసమేనా? ప్యాషన్ తో నడిపే వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, పిల్లలను ప్రేమతో చూస్తారు.సీసీటీవీ లింక్ మీ ఫోన్స్ లో వచ్చే విధంగా చూసుకోండి. అక్కడ ఏ జరిగినా మీకు తక్షణమేు తెలుస్తుంది. సీసీటీవీ పని చేయడం లేదు, లింక్ ఇవ్వం అంటే ఖచ్చితంగా వీళ్లు పిల్లలను సరిగా చూడరు అని అర్ధం. కొన్ని సెంటర్లలో పిల్లలకు దగ్గు మందు ఇచ్చి పడుకో బెడతున్నారు అనే విషయం సోషియల్ మిడియాలో నడుస్తోంది. మీ పిల్లలను ఇంటికి తీసుకు రాగానే చెక్ చేసుకోవాలి, వంటిపై గాయం కాని గుర్తులు కానీ ఉన్నాయ అని చూడాలి. పిల్లల ప్రవర్తనలో మార్పు ఎమైనా ఉందా గమనించండి. పిల్లలతో మాట్లాడండి ప్రతి రోజు, పిల్లలను ప్రేమగా అడగండి ఎలా ఉంది? ఎం చేశావు ఈ రోజు అని.ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి డే కేర్ సెంటర్ , ప్లే స్కూల్స్, తనిఖీలు నిర్వహించాలి, అనుమతి లేని వాటిని సీజ్ చేయాలి. సీసీటీవీ పర్యవేక్షణ తప్పని సరి, అక్కడ పని చేసే సిబ్బందికి పోలీస్ వెరిఫికేషను తప్పనిసరిగా ఉండాలి. శిక్షణ పొందిన సబ్బందిని తీసుకున్నారా? లేదా చెక్ చేయాలి. అనుమతులు జారి చేసేటపుడు డే కేర్ / ప్లే స్కూల్ లో సంపులు మూసి ఉన్నాయా లేదా చూడాలి. ఆడుకునే సమయం లో పిల్లలు సంపులో పడే ప్రమాదం ఉంది. ఆడుకోవడానికి ఆటస్థలం ఉందా లేదా చూడాలి.
*ఒక నిర్లక్ష్యం - చిన్నారి జీవితాన్ని మార్చేస్తుంది*.
ప్రతి చిన్నారి హక్కు సురక్షితమైన బాల్యాన్ని పొందడం. పిల్లలు భద్రత విషయంలో రాజీ పడకూడదు.చిన్నారుల హక్కులను కాపాడటం, వారికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడం మన అందరి బాధ్యత.
జర్నలిస్టులను బెదిరించి నీ అంతు చూస్తానని బెదిరించిన కాంట్రాక్టర్_
*అవినీతి అక్రమాలను ప్రశ్నించే జర్నలిస్టులకు బెదిరింపులు*
*బెదిరింపులకు పాల్పడిన కాచిగూడ కమేల కాంట్రాక్టర్ బషీర్ హుస్సేన్ పై ఫిర్యాదు*
*కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంబర్పేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి సద్దాం హుస్సేన్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 04:
జర్నలిస్ట్ వృత్తికి ఆటంకం కలిగించిన కాచిగూడ కమేల కాంట్రాక్టర్ బషీర్ హుస్సేన్ పై ఫిర్యాదు చేసిన అంబర్పేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి సద్దాం హుస్సేన్ , ప్రవీణ్ ముదిరాజ్.కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ రాజశేఖర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్ హెచ్ ఓ రాజశేఖర్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు సద్దాం చెప్పారు. ఈ సందర్భంగా సద్దాం మాట్లాడుతూ ఉదయం కమేల సమస్యలపై కమేళాకు సంబంధించిన వ్యాపారులు జర్నలిస్టులను పిలిచి తమ గోడును వినిపించారు. అదే సమయంలో కమెల కాంట్రాక్టర్ బషీర్ హుస్సేన్ నువ్వు ఎవరు వీడియోలు ఎందుకు తీస్తున్నావ్ అంటూ అడ్డుకున్నాడు అనంతరం నువ్వు ఎవరైతే నాకేంటి ఇక్కడ వీడియోలు ఫోటోలు తీయొద్దు అంటూ తీస్తే నీ అంతు చూస్తానని బెదిరించాడని తెలిపారు. అనంతరం వాట్సప్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి నీ దగ్గర ఉన్న వీడియోలన్నీ డిలీట్ చెయ్ అంటూ బెదిరింపులకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. డిలీట్ చెయ్యనియెడల నీ సంగతి చూస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదుదారుడు సద్దాం తెలిపారు.
“పండుగ సాయన్న సేవా పురస్కారాలు – 2026”
*ప్రజా వీరుడు – తెలంగాణ బందూక్ పండుగ సాయన్న జయంతి (ఆగస్టు 08) సందర్భంగా*
*“పండుగ సాయన్న సేవా పురస్కారాలు – 2026”*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 04:
ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజా వీరుడు – తెలంగాణ బందూక్ పండుగ సాయన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, ఆయన జయంతి (ఆగస్టు 08) సందర్భంగా పండుగ సాయన్న సేవా ట్రస్టు ఆధ్వర్యంలో “పండుగ సాయన్న సేవా పురస్కారాలు – 2026” ప్రదానం చేయనున్నట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సేవ, విద్య, వైద్యం, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక రంగం, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న సేవామూర్తులను గుర్తించి, వారి సేవలను గౌరవించడం ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సేవా సంస్థలు, ఉపాధ్యాయులు, వైద్యులు, కళాకారులు, క్రీడాకారులు, పర్యావరణ కార్యకర్తలు మరియు ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
*“సేవే లక్ష్యం… సమాజమే ధ్యేయం…”* అనే నినాదంతో, పండుగ సాయన్న ఆశయాలను భావితరాలకు చేర్చడం, సేవా భావాన్ని ప్రోత్సహించడం, సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి సత్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ట్రస్టు వెల్లడించింది.
అర్హులైన వ్యక్తుల వివరాలను లేదా నామినేషన్లను పంపించాలని కోరుతూ, ఆసక్తి గల వారు క్రింది నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
*సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:*
📞 9963240519
📞 +91 80081 29303
📞 +91 85002 58662
*పండుగ సాయన్న సేవా ట్రస్టు*
“సేవను గౌరవిద్దాం… సేవామూర్తులను సత్కరిద్దాం… పండుగ సాయన్న ఆశయాలను భావితరాలకు అందిద్దాం.”
Saturday, July 4, 2026
_ఆదివాసీ, గిరిజన, మారుమూల, వెనుకబడిన జీపీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి_
*కేంద్ర నిధుల కేటాయింపులో పన్నుల వసూళ్లే పనితీరుకు కొలమానం కాకూడదు - మంత్రి సీతక్*
*ఆదివాసీ, గిరిజన, మారుమూల, వెనుకబడిన జీపీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి*
*స్థానిక అవసరాల కోసం అన్టైడ్ గ్రాంట్లను కొనసాగించాలి*
*16వ ఆర్థిక సంఘం జాతీయ వర్క్షాప్లో తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 03:
16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన పనితీరు ఆధారిత గ్రాంట్లు, ఓన్ సోర్స్ రెవిన్యూ వంటి నిబంధనల్లో ఆదివాసి, గిరిజన, షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క కోరారు. గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే అంచనా వేయకుండా, ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల సిఫార్సులపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో మంత్రి సీతక్క తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను వివరించారు. స్పెషల్ సీఎస్ దానకిషోర్ తో పాటు ఇతర రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ...జీపీలకు పనితీరు ఆధారిత గ్రాంట్లను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని, అయితే ఆదాయ సామర్థ్యం తక్కువగా ఉన్న ఆదివాసీ, గిరిజన, మారుమూల ప్రాంతాల గ్రామ పంచాయతీలపై అదనపు పన్నుల భారం మోపే విధంగా నిబంధనలు ఉండకూడదన్నారు. అభివృద్ధిని ప్రజల ఆర్థిక స్థితితో ముడిపెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అనేక గ్రామ పంచాయతీల జనాభా చాలా తక్కువగా ఉండటంతో వాటి సొంత ఆదాయ వనరులు కూడా పరిమితంగానే ఉంటాయని తెలిపారు. అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని, ఆదివాసీ, గిరిజన, షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండల స్థాయి స్థానిక సంస్థలకు కూడా పనితీరు గ్రాంట్ల అర్హతలో వెసులుబాటు కల్పించాలని కోరారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల కారణంగా ఎన్నికలు జరగని 62 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులు నిలిపివేయడం వల్ల అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల వల్ల ఎన్నికలు ఆలస్యమైన ప్రత్యేక పరిస్థితుల్లో నిధులు కొనసాగించేలా నిబంధనలు ఉండాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి గ్రామ అవసరం భిన్నంగా ఉంటుందని, అందువల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయాలు తీసుకునేలా అన్టైడ్ బేసిక్ గ్రాంట్లను తగిన స్థాయిలో కొనసాగించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. డిజిటల్ గవర్నెన్స్, ఈ-గ్రామ్ స్వరాజ్, పీఎఫ్ఎంఎస్ వంటి వ్యవస్థలను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని... వాటి అమలుకు అవసరమైన శిక్షణ, సిబ్బంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ, సాంకేతిక మౌలిక వసతులను మారుమూల గ్రామాల్లో కేంద్రం బలోపేతం చేయాలని కోరారు.
షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో ప్రజా సేవలను అందచేసేందుకు అధిక వ్యయం అవుతున్నందున నిధుల కేటాయింపులో అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని కోరారు. బలమైన గ్రామ పంచాయతీలు, బలమైన రాష్ట్రాలు కలిసి బలమైన భారత నిర్మాణానికి పునాది వేస్తాయని మంత్రి సీతక్క అన్నారు. బలమైన గ్రామ పంచాయతీలు, బలమైన రాష్ట్రాలు కలిసి బలమైన భారత నిర్మాణానికి పునాది వేస్తాయని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలంటే రాష్ట్రాలకు తగిన ఆర్థిక సామర్థ్యం ఉండాలని, సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను బలోపేతం చేస్తూనే పంచాయతీలను మరింత శక్తివంతం చేసే విధంగా 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉండాలని మంత్రి సీతక్క సూచించారు.
Subscribe to:
Posts (Atom)