*30-32 మంది మానవ మృగాలు 13సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం.*
*అమ్మాయి వాంగ్మూలం వింటుంటే వళ్ళు జలదరించింది*
*2012 లో జరిగిన నిర్భయ ఘటన ఇంకా కళ్ళ ముందే ఉంది, ఇది మరో నిర్భయ కేసు*
*అనూరాధ రావు అధ్యక్షురాలు - బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 13:
రాజస్థాన్లోని శ్రీనగర్ జిల్లాలో
జూన్ 18, 2026 న ఇంటికి వెళ్లాలని ఆటో ఎక్కిన 13 సంవత్సరాల బాలిక, , హోటల్ జాయ్ ఇన్ ఈ బాలికను డ్రైవర్ నేను తీసుకెళ్లి, హోటల్ యజమాని మయాంక్ సైన్కు 50 వేలకు అమ్మేశాడు.అక్కడ నుంచి వివిధ హోటళ్లలో 30-32 మంది మానవ మృగాలు ఆ అమ్మాయిపై అత్యాచారం. చేశారు ఐదు రోజులు. ఆ పాపను చేతులు కట్టి, మద్యం తాగించి నరకం చూపించారు. బాలిక అరుపులు,బాధ, దుఃఖం ఎవరికి వినపడలేదు, కరగలేదు. పైశాచికత్వం ప్రదర్శించారు.జూన్ 22న పోలిసులు హోటల్ రైడ్ చేసినపుడు ఈ పాపను అపస్మారక స్థితిలో రక్షించి, హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం, కొన్సిలింగ్ చేస్తున్నారు.ఆ పాపకు జరిగిన గాయం మాయని గాయం. 2012 లో జరిగిన నిర్భయ ఘటన ఇంకా కళ్ళ ముందే ఉంది, ఇది మరో నిర్భయ కేసు. P0CSO కేసు నమోక్ష అయ్యింది, కొంతమంది మృగాలను పట్టుకున్నారు,ఆ అమ్మాయి వాంగ్మూలం వింటుంటే వళ్ళు జలదరించింది.
అయితే ఇది ఒక్క కేసు కాదు ఆ లేక్కలు చూసే భయం వేస్తుంది.NCRB నివేదిక ప్రకారం భారత దేశంలో ప్రతి సం|| 1లక్ష పైగా P0CSO కేసులు నమోదు అవుతున్నాయి. రోజుకు సగటున 100 - - 120 మంది బాలికలపై లైంగిక దాడులు ఆవుతున్నాయి.రాజస్థాన్ పిల్లల పై జరిగే లైఃగిక దాడుల్లో మొదటి రాష్ట్రాల్లో ఉంది.
రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సామూహిక అత్యాచారాలు మరియ ట్రాఫికింగ్ క్రైం గురించి నివేదికల ప్రకారం, ఎక్కువగా ఈ సమస్య ఉన్న దేశాలు - భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికా, బ్రెసిల్, మెక్సికో, యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉంది. కొన్ని దేశాల్లో ఈ క్రైం రేట్ అతి తక్కువగా ఉంది కారణం ఆ దేశాలు పిల్లల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు -కఠిన నిబంధనల,బలమైన చట్టలు, కఠిన శిక్షలు, నిరంతరం పోలీసింగ్, త్వరితగతిన న్యాయం దొరకడం, నిరంతరం సి సి టివీల పర్యవేక్షణ, చిన్న తరగతుల్లో సెక్సు ఎడ్యుకేషన్ ఇవ్వడం, సమాజం మంచి అవగాహనతో ఉండడం.ఆ దేశాలు- ఐస్లాండ్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, స్విట్జర్లాడ్జ్,ఉత్తర యూరప్ దేశాలు.ఈ దేశాల్లో జీరో క్రైం అని చెప్పుకోవచ్చు.సమస్యలు పునరావృతం కాకుండా,ఈ క్రైమ్స్ అధికం కావడానికి కారణాలు ఆలోచిద్దాం,ఇంత కౄరంగా ఎందుకు ప్రవర్తిస్తారు అని చూస్తే ,కారణం - *1.మానసిక రుగ్మతలు*. దాంట్లో రకరకాలు ఉన్నాయి.
*పెడోఫిలియా*-అంటే చిన్నపిల్లలతో లైంగిక సంపర్కం చేయాలి అని ఆలోచిస్తారు, ఇది ఒక మానసిక వ్యాధి.
ఎంపతీలోపం - అంటే ఎదుటి వ్యక్తి లేదా ఇతరులు బాధలో ఉన్నప్పుడు లేదా సమస్యలను చెప్పుకుంటున్నప్పుడు ఎలాంటి భావోద్వేగ స్పందన చూపకపోవడం,నాకేం సంబంధం అనే భావన ఉన్న వ్యక్తులు.
*పవర్ ఫిలింగ్* - ఇది ఒక మానసిక వ్యాధి. బలహీనులైన బాలికలపై, మహిళల పై హింస చేసి తాను బలవంతుడి అని అనుకోవడ.
*2.సామాజిక కారణాలు* - బాలికలను / మహిళలను వస్తువులుగా చూడడం, కేవలం వారు శారీరక సుఖాన్ని ఇచ్చే వస్తువులుగా చూడడం.పోర్నోగ్రఫీ, హార్డ్ కోర్ కంటేంట్ ఎక్కువగా చూస్తారు, ఆ విధంగా నిజ జీవితంలో ప్రవర్తించాలి అని దాడులకు పాల్పడ్డారు.
*3. అసాంఘిక కార్యకలాపాలకు బానిసలు* - డ్రగ్స్కు బానిసలు, మద్యానికి బానిసలు,మత్తు పదార్థాలకు బానిసలుగా మారి, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారు.
*4.సిస్టం ఫెయిల్యూర్* - శిక్షల గురించి భయం లేక పోవడం, న్యాయం ఆలస్యం, చాలా లొసుగులు ఉండడం,పోలిసింగ్ బలహీనత, హోటల్స్ పై ట్రాన్స్ పోర్ట్ పై నియంత్రణ, నిఘా లేకపోవడం.
*5.నా కెందుకు అని మౌనం వహించే సమాజం*.
*6.రక్షణ వ్యవస్థ బలహీనం, బాలల రక్షణ వ్యవస్థ పూర్తిగా బలహీనం.*
ప్రస్తుతం మనం పరిష్కార మార్గాలు చూడాల్సిన సమయం: ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, కఠిన శిక్షలు / మరణశిక్ష /జీవిత ఖైదు లాంటివి త్వరగా అమలు చేయాలి దానికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎక్కువగా ఏర్పాటు చేయాలి.సమాజం మౌనం వీడాలి,గానం విప్పాలి, బాధితులకు అండగా ఉండాలి. చిన్న తరగతుల్లోనే / పాఠశాల స్థాయి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పిల్లల్లో కాన్సిడెన్స్ పెంపొందించాలి. పాఠశాలల్లో ఆత్మరక్షణ కోసం కొన్ని మెళకువలు నెర్పించాలి కరాటే లాంటివి.
రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. నిరంతరం CCTV పర్యవేక్షణ ఉండాలి, ట్రాన్స్ పోర్టు కోసం ఉపయోగించే ఆటోలు, బస్సులు, కార్ల పై నిరంతరం నిఘా ఉండాలి.చిన్నారుల కోసం మన గళం విప్పాలి.ఈ పాపకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేయాలి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ ఆలోచనలు చెప్పండి ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల కంట్రోల్ చేయవచ్చు.