Monday, July 13, 2026

తెలంగాణలో 80 వేల మంది మైనారిటీ విద్యార్థుల కోసం ఏఐ(AI) విప్లవానికి శ్రీకారం చుట్టిన మంత్రి మహ్మద్ అజహరుద్దీన్_

*తెలంగాణలో 80 వేల మంది మైనారిటీ విద్యార్థుల కోసం ఏఐ(AI) విప్లవానికి శ్రీకారం చుట్టిన మంత్రి మహ్మద్ అజహరుద్దీన్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 11:

భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మైనారిటీ విద్యార్థులను సిద్ధం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది అని మైనారిటీల సంక్షేమం మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) పరిధిలోని 205 పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న దాదాపు 80 వేల మంది విద్యార్థుల కోసం ఏఐ(AI) రెడీనెస్ మరియు డిజిటల్ సేఫ్టీ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది అని చెప్పారు.MASK NextGen మరియు డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 80 వేల మంది మైనారిటీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏఐ(AI) సన్నద్ధత కార్యక్రమం ప్రారంభం చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని TMREIS, MASK NextGen మరియు డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (DCPL) సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేయడానికి డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను గ్లోబల్ ఇంప్లిమెంటేషన్ మరియు స్ట్రాటజిక్ పార్ట్నర్‌గా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమం ఆగస్టు 15, 2026 నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం మరియు విద్యార్థులకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా, సామాజిక బాధ్యతతో కూడిన భాగస్వామ్య విధానంలో పూర్తిగా ఉచితంగా అందించనున్నారు.మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థులు కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యాలు మరియు అవకాశాలను పొందేలా తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు."కృత్రిమ మేధస్సు భవిష్యత్తు. ఇది ప్రపంచాన్ని అపూర్వమైన వేగంతో మార్చుతోంది. ఈ సాంకేతిక విప్లవంలో మన విద్యార్థులు వెనుకబడకుండా ఉండేందుకు TMREIS విద్యాసంస్థల్లో ఏఐ AI విద్య మరియు డిజిటల్ సేఫ్టీ శిక్షణను ప్రవేశపెడుతున్నందుకు మేము గర్విస్తున్నాం అని అన్నారు."
"మేము MASK NextGen‌తో మూడు సంవత్సరాల భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల జ్ఞానం, డిజిటల్ అవగాహన, విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యం మరియు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడతాయని నాకు నమ్మకం ఉంది.ఏఐAI ఇప్పుడు శాశ్వత వాస్తవం. మన పిల్లలు ఈ రంగంలో నాయకులుగా ఎదగడానికి సిద్ధంగా ఉండాలి." మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ మహిళా సాధికారత మరియు యువతులకు సమాన అవకాశాల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు."మహిళా సాధికారతకు మరియు మహిళల ఉపాధి అవకాశాల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. మన బాలికలు అత్యుత్తమ విద్యను పొందాలి, సాంకేతిక పరిజ్ఞానంపై ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి మరియు తమ తమ రంగాల్లో నాయకులుగా ఎదగాలి. బాలికల విజయానికి మార్గాలను సృష్టించడం మా అత్యున్నత ప్రాధాన్యతల్లో ఒకటి."ఏఐ AI రెడీనెస్ మరియు డిజిటల్ సేఫ్టీ కార్యక్రమం ద్వారా విద్యార్థులు భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన కీలక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు, సాంకేతికతను బాధ్యతాయుతంగా మరియు సురక్షితంగా వినియోగించే విధానాలను కూడా నేర్చుకుంటారని మంత్రి తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించిన MASK NextGen వ్యవస్థాపకురాలు మరియు CEO శ్రీమతి అవ్ని త్రివేది, డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన శ్రీ జోసెఫ్ క్రిస్టోఫర్, TMREIS కార్యదర్శి శ్రీ బి. షఫియుల్లా మరియు TMREIS అధ్యక్షుడు శ్రీ ఫహీమ్ ఖురేషీ కృషిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు."విద్య మరియు సాంకేతికత ద్వారా మన పిల్లలను సాధికారులుగా తీర్చిదిద్దాలనే ఉమ్మడి దృక్పథంతో పనిచేసిన అన్ని భాగస్వాముల కృషి వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మరియు మన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది." ఈ పాఠ్యాంశాన్ని గేమిఫైడ్ మరియు స్వీయ-అభ్యాస డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించనున్నారు. ఇందులో కృత్రిమ మేధస్సు, డిజిటల్ భద్రత, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, విమర్శనాత్మక ఆలోచన మరియు ఆవిష్కరణలపై ఇంటరాక్టివ్ మాడ్యూల్స్ ఉంటాయి.ఈ కార్యక్రమం దేశంలో మైనారిటీ విద్యార్థుల కోసం చేపట్టబడుతున్న అతిపెద్ద AI విద్యా కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా, తెలంగాణను సాంకేతికత, ఆవిష్కరణలు మరియు సమగ్ర అభివృద్ధికి గ్లోబల్ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయాణంలో ఇది మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.

Saturday, July 11, 2026

అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ 50వ వార్షికోత్సవ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షులు కు ఆహ్వానం_

*అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ 50వ వార్షికోత్సవ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షులు కు ఆహ్వానం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,జులై 10:
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉన్న ఇస్కాన్ దేవాలయం (శ్రీ శ్రీ రాధా మదన్‌మోహన్ మందిర్)50వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరుకావాలని టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు వారి సతీమణినికి ఆలయ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వేడుకల ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు.ఈ ఆహ్వాన కార్యక్రమంలో రమ్యరావు పాల్గొన్నారు.ఒక ప్రముఖమైన, ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రం ఈ టెంపుల్. ఇది నాంపల్లి స్టేషన్ రోడ్డులో, జి. పుల్లారెడ్డి స్వీట్స్‌కు సరిగ్గా ఎదురుగా ఉంది.1976లో స్థాపించబడి, శ్రీల ప్రభుపాదచే ప్రారంభించబడిన ఈ దేవాలయం శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. ఇది నిత్య భక్తి, భగవద్గీత బోధనలు మరియు ధ్యానానికి ఒక ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.

మంత్రి దామోదర్ రాజనర్సింహ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి_

*మంత్రి దామోదర్ రాజనర్సింహ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,జులై 10:

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సి. దామోదర్ రాజనర్సింహ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని పలు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానల ఏర్పాటు కోసం వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ దవాఖానల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్సలు, అవసరమైన మందులు సకాలంలో అందించడంతో పాటు ఆరోగ్య సేవలు మరింత చేరువ అవుతాయని ఎమ్మెల్యే వివరించారు.వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మరణించిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం _


హైదరాబాద్ ఆశాడ బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా-జమున తెహజీబ్‌కు ప్రతీక_

*హైదరాబాద్ ఆశాడ బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా-జమున తెహజీబ్‌కు ప్రతీక*

*గోల్కొండ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక*

*బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో అధికారులకు మంత్రి కొండా సురేఖ దిశా నిర్దేశం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 10:

పండుగల సందర్భాల్లో హిందూ, ముస్లిం సమాజాల పరస్పర సహకారం,వారు ప్రదర్శించే లౌకిక స్ఫూర్తి యావత్ దేశానికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నది.జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఆషాడ బోనాల ఉత్సవాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనయితీగా వస్తున్నది.భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని, నిండు మనసుతో ప్రభుత్వాన్ని దీవించి, సంతృప్తిగా ఇళ్లకు తిరిగి వెళ్లేలా అన్ని ప్రభుత్వ శాఖలు కలసికట్టుగా పని చేయాలి. దైవానికే అంకితమైన శివసత్తులకు బోనాల సమర్పణలో  అన్ని శాఖలు సహకరించాలి.గోల్కొండ కోటలో జరిగిన జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో అధికారులకు మంత్రి కొండా సురేఖ దిశా నిర్దేశం చేశారు.అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆషాడ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ గారు.హైదరాబాద్ లో ప్రతి ఏటా నిర్వహించే ఆశాడ బోనాల ఉత్సవాలు ఇక్కడి గంగా జమున తెహజీబ్ ప్రత్యేకతను చాటుతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాల నిర్వహణ, ముస్లిం పండుగల సందర్భాల్లో హిందూ, ముస్లిం సమాజాల పరస్పర సహకారం,  వారు ప్రదర్శించే లౌకిక స్ఫూర్తి యావత్ దేశానికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నదని మంత్రి అన్నారు.
ఈ రోజు హైదరాబాద్ లోని గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారి దేవస్థానంలో మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో  బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పై సంబంధిత అధికారులకు మంత్రి సురేఖ దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌,  దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ, జిహెచ్ఎంసి, ఐ అండ్ పి ఆర్ తదితర శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ గారు గోల్కొండ జగదాంబికా అమ్మవారి చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ,  జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఆషాడ బోనాల ఉత్సవాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనయితీగా వస్తున్నదని అన్నారు.  జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే గోల్కొండ బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.జూలై 16న లంగర్ హౌస్ కూడలి నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి బోనం సమర్పణ, తొట్టెలు రథం ఊరేగింపు, మెట్ల పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి జూలై 16, 19, 23, 26, 30, ఆగష్టు 2,6,9,13 తేదీల్లో నిర్వహించే ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్, పార్కింగ్, క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, అగ్నిమాపక, ప్రత్యేక బస్సులు తదితర ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని స్పష్టం చేశారు.
దేవాలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మొబైల్ టాయిలెట్లు, తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా 
గోల్కొండ కోట పరిధిలోని రహదారులు, మెట్లు, విద్యుత్ దీపాలు, హైమాస్ట్ లైట్లు, సూచిక బోర్డులు, షెడ్లు తదితర సౌకర్యాలు ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. అలాగే భక్తుల దర్శనం సాఫీగా సాగేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని ఆదేశించారు.బోనాల ఉత్సవాలు కొనసాగినన్ని రోజులు పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.  అనుమానితుల ఫొటోలతోకూడిన వాల్ పోస్టర్లను ప్రదర్శిస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. జిహెచ్ఎంసి కాలపరిమితిని నిర్దేశించుకుని పనులు సకాలంలో పూర్తి చేయాలని మంత్రి నిర్దేశించారు. విద్యుత్ శాఖ కరెంటు వైరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. చిన్న పిల్లలు, వృద్ధులు గర్భిణీలు బాలింతల విషయంలో అన్ని శాఖలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొండ సురేఖ ఆదేశించారు.దైవానికే అంకితమైన శివసత్తులకు బోనాల సమర్పణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సహకరించాలని మంత్రి సురేఖ ఆదేశించారు. భక్తులు సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని, నిండు మనసుతో ప్రభుత్వాన్ని దీవించి, సంతృప్తిగా ఇళ్లకు తిరిగి వెళ్లేలా అన్ని ప్రభుత్వ శాఖలు కలసికట్టుగా పని చేయాలని మంత్రి సురేఖ గారు ఆదేశించారు. గోల్కొండ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహోత్సవమని పేర్కొన్న మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విధాలా కట్టుబడి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా  అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆషాడ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్ ను మంత్రి కొండా సురేఖ గారు ఆవిష్కరించారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారి దేవస్థానానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ గారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి సురేఖ గారు ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జగదాంబికా అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా వర్షాలతో, పాడిపంటలతో పచ్చగా వుండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి కొండా సురేఖ అమ్మవారిని ప్రార్థించారు.

ఆర్టిఐ లైబ్రరీ డాట్ ఇన్ RTILibrary.in వారి వినూత్న బహుమతులు అందుకోండి_

*ఆర్టిఐ లైబ్రరీ డాట్ ఇన్ RTILibrary.in వారి వినూత్న బహుమతులు అందుకోండి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 09:

ఈ నెల (జూలై) నుండి *ఆర్టిఐ లైబ్రరీ డాట్ ఇన్*(RTILibrary.in) వెబ్‌సైట్‌కు సమాచారాన్ని అందించే సభ్యులు, వారు ప్రచురించిన సమాచారానికి వచ్చిన వీక్షణల (Views) ఆధారంగా 60,000 రూపాయలు నుండి 1,00,000 వరకు బహుమతులు పొందే అవకాశం కల్పించారు నిర్వాహకులు.
*ఎలా పాల్గొనాలి?*
• ఆర్టిఐ లైబ్రరీ డాట్ ఇన్ RTILibrary.in  వెబ్‌సైట్‌ను సందర్శించి ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశాలను గుర్తించండి.
• ఆ అంశాలకు సంబంధించిన సమాచారం, పత్రాలు మరియు రికార్డులను సేకరించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి.
• నెలవారీ వీక్షణల ఆధారిత బహుమతులతో పాటు, ఆ నెలలో అత్యధిక సంఖ్యలో నాణ్యమైన RTI దరఖాస్తులు మరియు సమాచారాన్ని అప్‌లోడ్ చేసిన సభ్యులకు ప్రత్యేక బహుమతులు కూడా అందజేయబడతాయి.
• మీ సమాచారం ఎక్కువ మంది వీక్షించి, ప్రజల్లో ఎక్కువ ఆదరణ పొందిన కొద్దీ మరింత పెద్ద మొత్తంలో నెలవారీ బహుమతులు పొందే అవకాశం ఉంటుంది.
పారదర్శకత కోసం వెబ్‌సైట్ ఆదాయ (Revenue) వివరాలు మరియు బహుమతుల పంపిణీ వివరాలను ఈ వాట్సాప్ గ్రూపులో ఎప్పటికప్పుడు పంచుకుంటాము.ఈ బహుమతులను డా. జయప్రకాశ్ నారాయణ్ (జేపీ), ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, RTI ఉద్యమకారులు, జర్నలిస్టులు, పదవీ విరమణ చేసిన అధికారులు మరియు సమాజంలోని ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అందజేయడానికి ప్రయత్నం జరుగుతోంది అని నిర్వాహకులు తెలిపారు.మీరు RTI గురించి ఏ విషయంపై ఫైల్ చేయాలనుకుంటున్నారో వివరించండి. మేము దానిని సరైన అధికార సంస్థ, విభాగం మరియు విషయానికి స్వయంచాలకంగా వర్గీకరిస్తాము అని తెలిపారు.*RTILibrary.in *ఆర్టిఐ లైబ్రరీ డాట్ ఇన్*  ద్వారా విలువైన ప్రజా సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి, పారదర్శకత, జవాబుదారీతనం మరియు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడానికి మనందరం కలిసి పనిచేద్దాం అని అన్నారు.
*గమనిక*: ఈ వెబ్‌సైట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది మరియు అనేక కొత్త సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మీకు ఏదైనా సమస్య ఎదురైతే, దయచేసి admin@rtiarchive.in కు తెలియజేయవచ్చు అని అన్నారు.

తాడిచెర్ల కోల్ బ్లాక్ -2 ను సింగరేణి సంస్థకు కేటాయించిన కేంద్రం_

*తాడిచెర్ల కోల్ బ్లాక్ -2 ను సింగరేణి సంస్థకు కేటాయించిన కేంద్రం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 09:

తాడిచెర్ల కోల్ బ్లాక్-II ను ఎలాంటి బిడ్డింగ్ లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈరోజు శంషాబాద్ విమానాశ్రయంలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు జెపి నడ్డా కు మరియు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి ఘనస్వాగతం పలికి  సింగరేణి కి తడిచేర్ల-2 కోల్ బ్లాక్ కేటాయించి నందుకు కిషన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన బీజేపీ  రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు దుర్గం అశోక్, కందుల సంధ్యారాణి, సునీల్ రెడ్డి,  ముకేశ్ గౌడ్, అందుగుల శ్రీనివాస్, పూనమ్ చంద్ తదితరులు.