Thursday, June 25, 2026

_బెదిరించి డబ్బు వసూలు, నకిలీ పత్రాల సృష్టి మరియు భూ ఆక్రమణ కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్_

*బెదిరించి డబ్బు వసూలు, నకిలీ పత్రాల సృష్టి మరియు భూ ఆక్రమణ కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 24:

హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా క్రమబద్ధంగా బెదిరించి డబ్బు వసూలు చేయడం, నకిలీ పత్రాలను సృష్టించడం, నేరపూరిత కుట్ర మరియు భూ ఆక్రమణలకు పాల్పడుతున్న నేరస్తుడిని చాదర్‌ఘాట్ పోలీసులు విజయవంతంగా అరెస్టు చేశారు.నిందితుడు మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్, వ్యాపారవేత్త, బండ్లగూడ (హైదరాబాద్) నివాసి. హైదరాబాద్‌లోని న్యూ మలక్‌పేటకు చెందిన శ్రీ మహమ్మద్ నజముద్దీన్ షాకిర్ ఒక ఫిర్యాదు చేశారు. GHMC అనుమతితో తన కుటుంబానికి చెందిన పూర్వీకుల స్థలంలో నిర్మాణం మొదలైన తర్వాత, మహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ నకిలీ 'హిబానామా' (బహుమతి దస్తావేజు) పత్రాలు మరియు నకిలీ స్టాంప్ పేపర్లను ఉపయోగించి ఆ ఆస్తిపై తప్పుడు యాజమాన్య హక్కులను ప్రకటించాడని ఆయన ఆరోపించారు.ఈ వివాద సమయంలో, ఖుద్దూస్ తరపున వ్యవహరించిన సహ-నిందితుడు రాజా (A-2), ఫిర్యాదుదారుని రూ. 10 లక్షలు డిమాండ్ చేయడంతో పాటు, తప్పుడు క్రిమినల్ కేసులతో బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత, ఇద్దరు నిందితులు కలిసి ఫిర్యాదుదారుని భయపెట్టారు మరియు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే హత్య కేసుల్లో ఇరికిస్తామని బెదిరించినట్లు తెలిసింది.ఆస్తులపై తప్పుడు యాజమాన్య హక్కులను ప్రకటించడానికి, అలాగే న్యాయపరమైన చిక్కులు మరియు తప్పుడు క్రిమినల్ కేసుల పేరుతో బెదిరించి డబ్బు వసూలు చేయడానికి నిందితుడు తరచుగా నకిలీ 'హిబానామా' పత్రాలను ఉపయోగించేవాడు. విచారణలో, అతను పలువురు బాధితుల నుండి సుమారు రూ. 40 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. బెంగళూరుకు పారిపోయిన నిందితుడిని ప్రత్యేక పోలీసు బృందం గుర్తించి అరెస్టు చేసింది; తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

_రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా_

*ఐటీ కారిడార్‌లో 5 ఎక‌రాల భూమికి హైడ్రా ఫెన్సింగ్‌*

*రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 24:

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. స‌ర్వే నంబ‌రు 42లో మెట‌ల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు వెళ్లే మార్గంలో అత్యంత విలువైన భూమిని కాజేయాల‌ని కొంత‌మంది ప్ర‌య‌త్నించారు. అక్క‌డ రెండు తాత్కాలిక షెడ్డులు వేసి ఒక గ‌దిని కూడా నిర్మించారు.5 ఎక‌రాల చుట్టూ రేకుల షీట్ల‌తో ప్ర‌హ‌రీ కూడా నిర్మించే క్ర‌మంలో హైడ్రాకు రెవెన్యూ శాఖ నుంచి ఫిర్యాదు అందింది. ఎన్నో ఏళ్లుగా ఈ భూమి త‌న‌దిగా చెబుతూ ఎవ‌రినీ అటువైపు రానీయ‌కుండా అడ్డుకుంటున్న ప‌రిస్థితుల్లో శేరిలింగంప‌ల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞ‌ప్తి మేర‌కు హైడ్రా రంగంలోకి దిగింది. రెండు తాత్కాలిక షెడ్డుల‌తో పాటు.. నిర్మించిన గ‌దితో పాటు ఫెన్సింగ్‌ను హైడ్రా తొల‌గించింది. 
మొత్తం ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన త‌ర్వాత 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ దాదాపు రూ. వెయ్యికోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

_"ఊరు బడి మూతపడితే... అది కేవలం ఒక పాఠశాల మూతపడినట్టే కాదు, ఊరి భవిష్యత్తుకే తాళం వేసినట్టే"_

*నల్లగొండ జిల్లా ఊటుకూరు గ్రామానికి చెందిన వై. పురుషోత్తం రెడ్డి చేసిన పని గ్రామానికి ఆదర్శంగా నిలిచింది*

*ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు కుమారులను ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అభినందనీయం*

*ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలను కాపాడేందుకు సమాజం ముందుకు రావాలి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 24:

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కొరతతో మూతపడే పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగించే అంశమని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుండటం గ్రామ ప్రజలను ఆలోచింపజేస్తోంది.
ప్రభుత్వ విద్యను కాపాడాలని వేదికలపై మాట్లాడేవారు చాలా మంది ఉన్నప్పటికీ, ఆ మాటలను ఆచరణలో చూపించే వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఊటుకూరు గ్రామానికి చెందిన వై. పురుషోత్తం రెడ్డి చేసిన పని గ్రామానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ప్రజాసేవకు, తాను నమ్మిన రాజకీయాలకు కార్యాచరణే ప్రాణమని విశ్వసించే వై. పురుషోత్తం రెడ్డి, "ముందుగా మనం మారితేనే సమాజం మారుతుంది" అనే ఆలోచనతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు కుమారులను ఊటుకూరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం విశేషమని పేర్కొంటున్నారు.ఇటీవల పాఠశాల పరిస్థితులను పరిశీలించిన సందర్భంగా, గత విద్యా సంవత్సరంలో మొత్తం 23 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 10 మంది పై తరగతులకు వెళ్లిపోయిన తర్వాత కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే మిగిలినట్లు తెలిసింది. ఈ విద్యా సంవత్సరంలో వై. పురుషోత్తం రెడ్డి గారి ఇద్దరు కుమారులు, మరో బీసీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి చేరడంతో ప్రస్తుతం మొత్తం 16 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో ఉన్నారు.అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఒకే గదిలో బోధన కొనసాగుతోంది. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోవడం ఆందోళనకరంగా మారింది.ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఊటుకూరు ప్రభుత్వ పాఠశాల మూతపడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాల మూతపడటం అంటే కేవలం ఒక భవనం మూతపడటం కాదని, పేద పిల్లల విద్యా అవకాశాలు, గ్రామ భవిష్యత్తు, సామాజిక సమానత్వం దెబ్బతినడమేనని వారు పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రజలు, మేధావులు, యువత, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరుతున్నారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరచడం, ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించడం, గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయడం ద్వారా మాత్రమే ఊరి బడిని కాపాడగలమని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అనేది కేవలం విద్యాశాఖ బాధ్యత మాత్రమే కాదని, అది సమాజం మొత్తం బాధ్యత అని సామాజిక వర్గాలు పేర్కొంటున్నాయి. వై. పురుషోత్తం రెడ్డి చూపించిన ఆచరణను ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందుకు వస్తే ఊటుకూరు ప్రభుత్వ పాఠశాల మాత్రమే కాదు, గ్రామీణ ప్రభుత్వ విద్య కూడా బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

*సందేశం*

"ఊరు బడి మూతపడితే... అది కేవలం ఒక పాఠశాల మూతపడినట్టే కాదు, ఊరి భవిష్యత్తుకే తాళం వేసినట్టే."

"ఊరు బడి కోసం మాటలు కాదు... పిల్లల అడ్మిషన్‌లే నిజమైన మద్దతు."

Wednesday, June 24, 2026

హైదరాబాద్ మెట్రో దారి ఎటువైపు?

_పిల్లల చదువు వ్యాపారం కాకూడదు, పారదర్శకత ఉండాలి_

*పిల్లల చదువు వ్యాపారం కాకూడదు, పారదర్శకత ఉండాలి*

*తల్లి తండ్రలపై అదనపు ఆర్థిక భారమే*

*ఈ అంశంపై విచారణ జరగాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్*

*అనురాధ రావు అధ్యక్షులు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 23:

పిల్లల చదువు పేరుతో తల్లితండ్రల జేబు ఖాళీ చేస్తున్నాయి విద్యాసంస్థలు. బత్తిడి చేసి బయట 20 రూ|| దొరికే నోటు పుస్తకం - 40రూ॥లకు అమ్ముతున్నారు వీళ్లు. ఇది చాలా తీవ్రమైన విషయం.ఇటీవల సోషల్ మిడియాలో కొన్ని విడియోలు వైరలు అవుతున్నాయి, ప్రైవేటు స్కూల్స్, కాలేజేలకి సంబంధించినవి. వీటిలో భారిగా స్టేషనరీ నిలవలు, యూనిఫాం, బ్యాగులు, సాక్స్ కనిపిస్తున్నాయి. ఈ సంస్థలు అన్నీ కూడా బాగా పేరు పొందినవే. (Narayana school kothapet, Sloka International school, Sri Triveni school, Pulla Reddy Memorial school, Dilshuknagar Public school, Srichaitanya) etc...ఒకవేళ పేరెంట్ బయట కొంటే ప్రధానోపద్యాయులే పేరెంట్స్ పై తిరగబడిన సంఘటనలు కూడా చూస్తున్నం.మీరు ఇక్కడే కొనాలి అని, అన్నింటిపై వీరి సంస్థ బ్రాండ్ ప్రింట్ చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇది తల్లి తండ్రలపై అదనపు ఆర్థిక భారమే కదా.
విద్యారంగం సేవారంగంలో ఉండాలి, కాని పూర్తి వ్యాపర రంగంగా మార్చేశారు.అధికారుల కళ్ళు మూతలు పడ్డాయా? వీళ్ల దృష్టిలో లేదు అని అనుకోవడం తప్పు, సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటే ఏ ఒక్క అధికారికి తెలియదు అని అనుకోకుండా ఉండలేం.పూర్తిగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది .ఈ వైరల్ విడియోల ఆరోపణలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి, మన ముఖ్యమంత్రి గారు, అధికారాలు స్పందించాలని, వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూన్నది బాలల హక్కుల సంఘం.రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.
బలవంతపు స్టేషనరీ అమ్మకాలు జరుగుతున్న విషయంపై విచారణ చేయాలి.మార్కెట్ ధరలకంటే అధిక ధరలతో విక్రయిస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలి.తల్లి తండ్రులు ఎంపిక చేసుకునే హక్కును రక్షించాలి.పిల్లల చదువు వ్యాపారం కాకూడదు, పారదర్శకత ఉండాలి. ఈ అంశంపై విచారణ జరగాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్

*తెలంగాణ మేధావులతో దిగిన ఈ ఫోటో పట్ల చాలా మందికి ఆసక్తి ఉంది - పవన్ కళ్యాణ్*


*తెలంగాణ మేధావులతో దిగిన ఈ ఫోటో పట్ల చాలా మందికి ఆసక్తి ఉంది - పవన్ కళ్యాణ్*

*ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేసిన ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 23:

తెలంగాణ ఉద్యమం మరియు 'సామాజిక తెలంగాణ' భావన చుట్టూ సాగిన లోతైన చర్చలతో కూడిన ఆ రోజులను ఈ ఫోటో గుర్తుచేస్తుంది అని ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.బహుజన భావజాలం, సామాజిక న్యాయం మరియు అణగారిన వర్గాల రాజకీయ సాధికారత వంటి అంశాలు మా చర్చల్లో ప్రధానంగా ఉండే రోజులు అవి. తెలంగాణ మేధావులతో పాటు బహుజన ఉద్యమకారులు అగస్టీన్ గారు, విప్లవ గాయకులు గద్దర్ గారు మరియు ఇతరులతో కలిసి, మేము తరచుగా తెలంగాణ భవిష్యత్తు, రాజకీయ అధికారం యొక్క న్యాయమైన పంపిణీ ఆవశ్యకత మరియు 'సామాజిక తెలంగాణ' అనే విస్తృత లక్ష్యం గురించి లోతుగా చర్చించేవాళ్ళం. నా తండ్రి శ్రీ కొణిదాల వెంకట్ రావు గారు మరణించిన తర్వాత, అగస్టీన్ గారు మరియు గద్దర్ గారు మా ఇంటికి వచ్చినప్పటి (పీఆర్పీ పార్టీ ఏర్పాటుకు ముందు నాటి) దృశ్యం ఇది. రాజకీయాలకు అతీతంగా, సామాజిక మార్పు, సమానత్వం మరియు సామాజిక న్యాయం రాజకీయ అధికారంగా మారాలనే ఆకాంక్షతో కూడిన చర్చలు జరిగిన ఆ కాలానికి సంబంధించిన ఒక మధురమైన జ్ఞాపకం ఇది.

*డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు*

*డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 23:

జ్వలంత జాతీయవాద చింతకుడు, గొప్ప విద్యావేత్త, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, మన మార్గదర్శకులు పూజ్య డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా, నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు.ఈ సందర్బంగా రామచందర్ రావు మాట్లాడుతూ “ఒక దేశం, ఒక జెండా, ఒక రాజ్యాంగం” అనే దృఢ సంకల్పంతో, మాతృభూమి భారతదేశ ఐక్యత మరియు సమగ్రత కోసం డా. ముఖర్జీ గారు తన ప్రాణాలను అర్పించారు అని అన్నారు. ఆయన జీవిత త్యాగం, ధైర్యం, తపస్సు మరియు అచంచల దేశభక్తి చిరస్మరణీయ గాథగా నిలిచింది.జాతీయ ఐక్యత, సాంస్కృతిక వైభవం మరియు దేశ సంక్షేమం పట్ల ఆయన చూపిన నిబద్ధత ప్రతి భారతీయుడికి నిరంతరం స్ఫూర్తినిస్తుంది అని అన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ లక్ష్యం వైపు మనం ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంలో, ఆయన ఆదర్శాలు ప్రతి అడుగులోనూ మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అని అన్నారు.భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే త్యాగం, పోరాటం చేసిన ఈ మహనీయ జాతీయ నాయకుడికి పునఃపునః వందనాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు శ్రీ సీహెచ్. విద్యాసాగర్ రావు గారు, శ్రీ బండారు దత్తాత్రేయ గారు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.