*అటకెక్కిన ఆటలు - చిన్నారుల భవిష్యత్తు ఇబ్బందుల్లో - అనూరాధ రావు అధ్యక్షురాలు బాలల హక్కుల సంఘం*
*భారత దేశంలో దాదాపు 23% పైగా ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు*
*ప్రైవేటు పాఠశాలల పరిస్థితి చూస్తే 50%*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 15:
ఒకప్పుడు ప్రతి వీధిలో, ప్రతి పాఠశాలల్లోని మైదానంలో కబడ్డీ, ఖోఖో, దాగుడు మూతలు, తోక్కుడుబిళ్ల, క్రికెట్ లాంటివి ఆడుతుండె వారు.. రాను రాను ఈ విషయం కథలుగా చెప్పుకోవాల్సిన దుస్థితితో ఉన్నాం...
నేడు మైదానాలు ఖాళీగా ఉన్నాయి, పిల్లల చేతిలో బంతి, బ్యాటు ఏవి లేవు, వీరి చేతుల్లో మొబైల్ మాత్రమే ఉంది. మార్కులకు ఇచ్చే ప్రాధాన్యం ఆటలకు లేదు,ఆటల సమయం అంటే వృధా అనే ఫీలింగ్ ఉన్నారు అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాలలు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం - 5-17 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. కాని నేటి పిల్లలు ఉదయం నుండి సాయంత్రం వరకు క్లాసులు, ట్యూషన్లు, హోం వర్కులు, కాస్త సమయం దొరిగితే మొబైల్లో బాగా బిజిగా గడిపేస్తున్నారు. ఫలితం పిల్లల్లో ఊబకాయం, కంటి సమస్యలు, బత్తికి గురికావడం,మానసిక సమస్యలు,ఏకాగ్రత లోపం, చదువుపై శ్రద్ద తగ్గడం,మధుమేహ ప్రమాదం పొంచి ఉంది అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆటలు కేవలం వినోదం కోసం కాదు. ఆటలు క్రమ శిక్షణను నేర్పిస్తాయి. జట్టుగా ఆడడం వల్ల స్నేహం మరియు ఏ సమస్య అయిన సమిస్టిగా ఎదుర్కోవచ్చు అని నేర్పుతుంది. ఓటమిని అంగీకరించి, మళ్లీ గెలుపు కోసం ప్రయత్నం చేయడం నేర్పుతాయి.
మన దేశం అత్యంత అధిక జనాభ కలిగిన దేశం కాని ప్రపంచ దేశాల వేదికలపై భారతదేశ పతాకం ఎగరాలంటే కచ్చితంగా పిల్లలకు క్రీడలు అవసరం.2024 ఒలింపిక్స్ లో మనదేశానికి 6 పతకాలు వచ్చాయి, 1 రజతం, 5 కాంస్యం సాధించాయి. అంటే ఎంత వెనుకబడి ఉన్నామో అర్ధం అవుతుంది.భారత దేశంలో దాదాపు 23% పైగా పాఠశాలలకు ఆట స్థలాలు లేవు,అవి ప్రభుత్వ పాఠశాలలు.ఇంక ప్రైవేటు పాఠశాలల పరిస్థితి చూస్తే 50% .చిన్న అపార్ట్మేంట్లలో,ఇరుకైన భవనాల్లో పాఠశాలలు నడుస్తున్నాయి.అనుమతులు తీసుకునే సమయంలో తప్పుడు సమాచారంతో సంప్రదించడం,అధికారుల పర్యవేక్షణ లేకపోవడం. కోర్టు ఆదేశాలు ఉన్న, ఆ ఆదేశాలను అమలు చేయకపోవడం.
ఇక తెలంగాణలో ఆట స్థలం లేని ప్రభుత్వ పాఠశాలలు 7967 ఉన్నాయి. 2273 పాఠశాలల్లో కరెంటు కనెక్షన్ కూడ లేదు అని రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.ఇకనైన ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలకు ఆట స్థలం ఉండేవింధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. విద్య తో పాటు సమాన ప్రాధాన్యత క్రీడలకు ఇవ్వాలి. స్పోర్ట్స్ స్కూల్స్ ప్రతి జిల్లాలో ఏర్పాటుచేయాలి, టైం టెబుల్ లో కచ్చితంగా ప్రతి రోజు ఆటల కోసం ఒక గంట సమయం కేటాయించాలి.
కోర్టు ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పాఠశాలల అనుమతులు జారి చేసే సమయంలో అధికారులు తనిఖీలు నిర్వహించి, ఆటస్థలం ఉంటేనే ఇవ్వాలి.
మీ పిల్లలను పాఠశాలలో చేర్పించే సమయంలో ఆట స్థలం ఉంటేనే జాయిన్ చేయండి.
పిల్లల ఆరోగ్యమే మహభాగ్యం.
భారత దేశ పతాకం ప్రపంచ దేశాల వేదికల పై ఎగరాలంటే క్రీడాకారుల అవసరం ఎంతో ఉంది.