Wednesday, July 8, 2026

"రండి… మన హక్కులను కాపాడుకుందాం!”_

*“రండి… మన హక్కులను కాపాడుకుందాం!”*

*చేప పిల్లల పంపిణీ, కాంట్రాక్టుల పేరుతో జరుగుతున్న అవినీతిపై ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జూలై 18న మత్స్య శాఖ హెడ్ ఆఫీస్ ముట్టడి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 08:

తెలంగాణ రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీ, చేప పిల్లల కాంట్రాక్టుల పేరుతో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దోపిడీకి నిరసనగా ముదిరాజ్ చైతన్య వేదిక – తెలంగాణ ఆధ్వర్యంలో “హలో ముదిరాజ్ – ఛలో మత్స్య శాఖ ముట్టడి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమం 2026 జూలై 18వ తేదీ (శనివారం) ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్‌లోని మత్స్య శాఖ హెడ్ ఆఫీస్ వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు.రాష్ట్రంలోని సంప్రదాయ మత్స్యకారుల హక్కులను కాలరాస్తూ, చేప పిల్లల పంపిణీ, కాంట్రాక్టుల ప్రక్రియలో అవినీతి, మధ్యవర్తుల పెత్తనం, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే విధానాలను నిలిపివేసి, పారదర్శకంగా చేప పిల్లల పంపిణీ చేపట్టాలని కోరారు.ఈ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్రంలోని ముదిరాజ్, గంగపుత్ర, బెస్త, వడబలిజ, అగ్నికుల క్షత్రియ తదితర సంప్రదాయ మత్స్యకార సంఘాల నాయకులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ముదిరాజ్ చైతన్య వేదిక పిలుపునిచ్చింది.
*కార్యక్రమం వివరాలు:*
* కార్యక్రమం: హలో ముదిరాజ్ – ఛలో మత్స్య శాఖ ముట్టడి
* తేదీ: 18-07-2026 (శనివారం)
* సమయం: ఉదయం 11:00 గంటలకు
* వేదిక: మత్స్య శాఖ హెడ్ ఆఫీస్, హైదరాబాద్
* ఆయోజకులు: ముదిరాజ్ చైతన్య వేదిక – తెలంగాణ
*సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9963240519*

కేబీఆర్ జాతీయ పార్క్ పరిరక్షణ కోసం సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తలేరు ?_

*కేబీఆర్ జాతీయ పార్క్ పరిరక్షణ కోసం సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తలేరు ?*

*ఇది తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది*

*ఇది హృదయ విదారకం - సేవ్ కేబీఆర్ సంస్థ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 08:

హైదరాబాద్ వాసులు పర్యావరణ ప్రేమికులు సంతోషపడ్డారు కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ ఉన్న చెట్లను సుప్రీం కోర్టు(మే 18, 2026 నాటి స్టే ఆర్డర్) రక్షించిందని అని.కానీ ప్రస్తుతం అక్కడి పరిస్థితులు గమనిస్తే ఆలా లేవు. రేవంత్ రెడ్డి పాలన చట్టబద్ధమైన పాలన  ఇస్తుంది అని మేము నమ్మాము అని సేవ్ కేబీఆర్ సంస్థ సభ్యులు అన్నారు. కానీ, ఇప్పుడు నిద్రలేవగానే అవే చెట్ల చుట్టూ ఎక్స్‌కవేటర్లు తవ్వుతుండటాన్ని చూస్తున్నాము.చెట్టు అంటే కేవలం దాని కాండం మాత్రమే కాదు. దాని వేర్లు, దాని కింద ఉన్న నేల, మరియు చుట్టుపక్కల ఉన్న పర్యావరణ వ్యవస్థ దానిని సజీవంగా ఉంచుతాయి. చెట్టును అలాగే వదిలేసి, వీటికి ఆటంకం కలిగిస్తే, సుప్రీం కోర్టు ఆదేశాన్ని నిజంగా గౌరవిస్తున్నారా—లేక కేవలం ఒక సాంకేతిక అంశంగా పరిగణిస్తున్నారా?.
జస్టిస్‌లు బి.వి. నాగారత్న మరియు ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ద్వారా, కేబీఆర్ జాతీయ పార్క్ చుట్టూ ఉన్న 25–35 మీటర్ల పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్లను నరకవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ, హైదరాబాద్ వాసులు ఈ రోజు చూస్తున్న దృశ్యాలు, ఆ రక్షణను దాని నిజమైన స్ఫూర్తితో గౌరవిస్తున్నారా లేదా అనే దానిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఇది ఇకపై ఒక ప్రజా అభివృద్ధి ప్రాజెక్టులా అనిపించడం లేదు. పర్యావరణ ఆందోళనలు, ప్రజా వ్యతిరేకత, మరియు న్యాయపరమైన జోక్యం ఉన్నప్పటికీ, హెచ్-సిటీ ఫ్లైఓవర్లను ఎలాగైనా పూర్తి చేయాలనే ఒక దురుద్దేశపూరిత ప్రయత్నంలా ఇది అనిపిస్తోంది.
గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమీషనర్, జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్, తెలంగాణ సీఎంఓ, ఎంఓ ఈఎఫ్‌సీసీ,రాహుల్‌గాంధీ, ఐఎన్‌సీ ఇండియా మరియు సంబంధిత అధికారులందరికీ మా విజ్ఞప్తి: దయచేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అక్షర రూపంలోనూ, స్ఫూర్తి రూపంలోనూ గౌరవించేలా చూడండి.హైదరాబాద్ యొక్క చివరి గొప్ప పచ్చని ఊపిరితిత్తులకు రక్షణ అవసరం—కాంక్రీటు కింద నెమ్మదిగా మరణించడం కాదు.

నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది - ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్_

*నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది - ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 08:

కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి అని ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు,  ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
*నిరంజన్ అంత్యక్రియలకు హాజరైన జనసేన నాయకులు, కార్యకర్తలు*
జనసేన అధ్యక్షులు,ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అబిమాని నిరంజన్ అంత్యక్రియలు వరంగల్ జిల్లా, హన్మకొండలో బుధవారం జరిగాయి. జనసేన నాయకులు, కార్యకర్తలు నిరంజన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్ళూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, వరంగల్ కోఅర్డినేటర్ ఎం. దామోదర్ రెడ్డి ఫొన్ ద్వారా నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నాయకులు గడ్డం రాకేష్, మేరుగు శివకోటియాదవ్, గాదే పృద్వి, బర్ల శివ నిరంజన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్థానిక నాయకులు కందికొండ రామ్ చరణ్, ఎలబోయిన డేవిడ్, అజ్మీర రాజేందర్, అనుదీప్, సురేష్, అభిలాష్, దయాకర్, అంజి, శివాజీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, July 7, 2026

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి _

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి

సింగ‌రేణిని గ‌త ప‌దేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా అదే బాట‌లో న‌డుస్తోంది_

*సింగ‌రేణిని గ‌త ప‌దేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా అదే బాట‌లో న‌డుస్తోంది*

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 52 వేల కోట్ల రూపాయల బకాయిలు*

*1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయం*

*కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ని కలిసిన  తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రతినిధుల బృందం* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 06:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 52 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండటం మరియు 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమవడంతో పాటు వేల కోట్ల బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్ల కార్మికుల‌కు క‌నీస వ‌స‌తులు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు అని సింగ‌రేణిని గ‌త ప‌దేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా అదే బాట‌లో న‌డుస్తోంది అని సింగరేణి సంస్థ సంస్థను ఆర్ధిక నష్టాలు తీర్చడానికి తాడిచర్ల కోల్ బ్లాక్- II ను సింగరేణి సంస్థకు కేటాయించాలని బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర కేంద్ర బొగ్గుల గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈరోజు మంత్రి జి.కిషన్ రెడ్డి ని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి వాసుదేవ్, శ్రీధర్ రెడ్డి, 6 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, MLA గా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఉన్నారు.

పరిపాలనలో మరింత పారదర్శకత కోసం వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు_

*పరిపాలనలో మరింత పారదర్శకత కోసం వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 07:

రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ దిశగా సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసి అవసరమైన మేరకు చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి గారు #MCRHRD లోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా #DigitalGovernance అమలు చేయాలని సూచించారు.ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు అందించేలా వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని స్పష్టంగా చెప్పారు. వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలన్నారు.రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, ఇందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు.ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్‌తో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 1 నుంచి గరిష్టంగా 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయాలని తెలిపారు.
ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగినప్పటికీ సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసేందుకు వీలుగా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించి ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ఆదేశించారు.హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని సూచించారు. నిరంతరం మానీటరింగ్ చేసేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.ఈ సమావేశంలో ఎంపీ వెంనరేందర్ రెడ్డి , సలహాదారు కె. రామకృష్ణారావు,తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్ జాజు , MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హెచ్‌ఆర్‌డీ వైస్ చైర్మన్ శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.