Friday, September 11, 2026

మూసినది అభివృద్ధి పేరుతో వేలకోట్ల దోపిడీ_

https://www.facebook.com/share/p/19CxaEt42o/

*_మూసినది అభివృద్ధి పేరుతో వేలకోట్ల దోపిడీ... ప్రజాప్రయోజనాలకోసం కాదు ఈ అభివృద్ధి...మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలు జాగృతం కావాలి... అప్పుడు కాళేశ్వరం... ఇప్పుడు మూసినది...Bplkm✍️_*
https://www.instagram.com/p/DdJbLK1qob0/?stkn=dmw0MTI0ZXk0MXdx
                 *****
https://x.com/Praja_Snklpm/status/2098315570903212443?t=vRradfzDt0R2AjdWULDd-A&s=08

*#SaveMusiNadi not #beautification...#publicvoice*

*#hyderabad #pollution #publichealth*

*@TelanganaCMO*
*@Bhatti_Mallu*
*@TelanganaCS @asadowaisi @INC_Ponguleti @Ponnam_INC @KTRBRS @N_RamchanderRao @HRF_Humanrights @bandarvirala @CitizensForHyd @SaveNalas_Tanks @MusiProject @PIBHyderabad @IPRTelangana @Narhariyarabotu @SitaramDhulipa1 @BplplH*

మహిళలు సమాజానికి, భవిష్యత్ తరాలకు నిజమైన స్ఫూర్తి మరియు శక్తి ప్రదాతలు అని నిరూపించిన డా. దీపా బానోత్_

*కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పీహెచ్డీ సాధించిన దీపా బానోత్*

*మహిళలు సమాజానికి, భవిష్యత్ తరాలకు నిజమైన స్ఫూర్తి మరియు శక్తి ప్రదాతలు అని నిరూపించిన డా. దీపా బానోత్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 10:
 
కాప్రా ECILకూ చెందిన ఉస్మానియా యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పరిశోధక విద్యార్థిని శ్రీమతి డా. దీపా బానోత్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పీహెచ్‌డీ పట్టా సాధించారు. ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ పొందడం అభినందనీయం. డా.దీపా బానోత్ "తెలంగాణలో ఎంపిక చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగుల సంతృప్తిపై తులనాత్మక అధ్యయనం (తెలంగాణ రాష్ట్రంలోని ఎంపిక చేసిన పబ్లిక్ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఉద్యోగుల సంతృప్తిపై తులనాత్మక అధ్యయనం)" అనే అంశంపై పరిశోధన జరిగింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఉద్యోగుల సంతృప్తికి తగిన సూచనలను కూడా ప్రతిపాదించారు. ఈ పరిశోధనను డా. వి .సమున్నత గారి పర్యవేక్షణలో పూర్తి చేశారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీరాములు, డీన్ ప్రొఫెసర్ జహంగీర్, డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు సిబ్బంది డా. దీపా బానోత్‌ను అభినందించారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలను (పెద్ద కుమారుడు MBBS మరియు చిన్న కుమారుడు ఇంజనీరింగ్) చదువుతున్న సమయంలోనూ కుటుంబ భాద్యతలు చూసుకుంటూ పీహెచ్‌డీ సాధించడం ద్వారా దీపా బానోత్ తన సంకల్పం, పట్టుదల, కృషితో కుటుంబ బాధ్యతలు ఉన్నా ఉన్నత లక్ష్యాలను సాధించినట్లు నిరూపించారు. ఈ సందర్భంగా డా. దీపా బానోత్ తన విజయానికి సహకరించిన తన భర్త శ్రీ రవి తేజకు, కుటుంబ సభ్యులకు మరియు తన పరిశోధన పర్యవేక్షకురాలు డా.వి. సమున్నతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరిశోధన సమయంలో వారు అందించిన నిరంతర ప్రోత్సాహం, సహకారం తన పీహెచ్డీ ప్రయాణంలో కీలకమని ఆమె పేర్కొన్నారు.ఆమె సాధించిన ఈ విజయం కుటుంబ బాధ్యతలతో పాటు ఉన్నత విద్యను కొనసాగించాలని ఆకాంక్షించే మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి_


*శాసనసభ సమావేశాల తొలిరోజు చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను  శిక్షించాలి - సీఎం రేవంత్ రెడ్డి*

*ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:

శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపించి, క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను  శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించారు.శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్ గారిని ఉద్దేశించి దుర్భాషలాడిన ఉదంతం, దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన సంఘటనలపై యావత్ శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. సభాపతి గారిని అవమానపరుస్తూ, జరిగిన దురదృష్టకర సంఘటన విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అసెంబ్లీ  అండగా నిలిచింది. ఈ దురదృష్టకర సంఘటనల్లో మానసిక ధైర్యం కోల్పోవద్దని స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది.ఈ అంశాలపై బుధవారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చపై సభా నాయకుడు, ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ విషయంలో స్పీకర్ కు ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. సభాపతి మనసును గాయపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
“ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారు. శాసన సభాపతి తల్లి గారిని అవమానించారు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దేశంపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు, తీవ్రవాదులకు శాసనసభ ప్రాంగణంలో సభా అధ్యక్షుడిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకు ఏమాత్రం తేడా లేదన్నారు. ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా ఈ సంఘటనను అభివర్ణించారు.
“మన మాతృస్వామ్య సమాజం. స్త్రీని అపరకాళి, భద్రకాళి, భూమాత, భారతమాత, తెలంగాణ మాత అని పిలుస్తాం. ఏదైనా శక్తిని, గొప్పతనాన్ని ఆపాదించాలని, చర్చించాలని అనుకున్నప్పుడు తల్లితో పోలుస్తాం. మహిళతో పోలుస్తాం. మహిళను పూజించే మన సమాజం ఈ దేశాన్ని భారతమాత అని మహిళతో పోల్చుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లితో పోల్చుకుంటాం. అలాంటి ఈ తెలంగాణ నేల మీద ఒక తల్లిని అవమానించే విధంగా ప్రవర్తించడం దారుణం” అని ఆందోళన వ్యక్తం చేశారు.
సభాపతి కి జరిగిన అవమానం సమాజానికి జరిగినట్టే. దోషులను తెలంగాణ సమాజం ఉపేక్షించదు. రజాకార్లను దిగంతాలకు తరిమి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ సభాపతి గారి మనసుకు గాయం చేయాలన్న ఆలోచన బరితెగించి మాట్లాడారని అన్నారు. సభాపతి ని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని చెప్పారు.
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం భావించింది. విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ధరణిలో జరిగిన అక్రమాలు, 22 (ఎ) వంటి అంశాలే కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన చాలా అంశాలను చర్చించాలని భావించాం. ప్రజా సమస్యలపై చర్చ జరగకూడదని అడ్డుకున్నారు” అని ముఖ్యమంత్రి  అన్నారు.

ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విచారణకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ఆదేశాలు – చర్యల నివేదిక కోరుతూ మరోసారి రిమైండర్_


*ప్రెస్ నోట్*

*ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విచారణకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ఆదేశాలు – చర్యల నివేదిక కోరుతూ మరోసారి రిమైండర్*

*NCPCR File No.: TL-99828/NCPCR/2026-27/EDU*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:

మెద్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) విచారణకు ఆదేశించింది.సామాజిక కార్యకర్త మరియు Know Your Rights Society అధ్యక్షుడు ఎస్. ఉమేష్ కుమార్ 07.07.2026న NCPCRకు సమర్పించిన ఫిర్యాదులో, సంబంధిత నిబంధనల ప్రకారం పాఠశాలలో విద్యాహక్కు చట్టం, 2009లోని సెక్షన్ 12(1)(c) అమలు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాలు (DG) చెందిన పిల్లలకు 25 శాతం ప్రవేశాల నిబంధన అమలవుతోందా అనే అంశంపై విచారణ జరిపించాలని కోరారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), 24.08.2026న మెద్చల్–మల్కాజిగిరి జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ పంపి, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపి Action Taken Report (ATR) ను 7 రోజుల్లో కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది.అయితే, నిర్ణీత సమయంలో చర్యల నివేదిక అందకపోవడంతో NCPCR 09.09.2026న Reminder-1 జారీ చేసింది. ఈ రిమైండర్‌లో, గతంలో పంపిన లేఖను ప్రస్తావిస్తూ, ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు సంబంధించిన అంశంపై విచారణ జరిపి, 7 రోజుల్లో అవసరమైన నివేదికను సమర్పించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను మరోసారి ఆదేశించింది.NCPCR తన లేఖలో, బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాల అమలును పర్యవేక్షించడం తమ చట్టబద్ధ బాధ్యత అని స్పష్టం చేసింది. ముఖ్యంగా RTE Act, 2009, POCSO Act, 2012 మరియు Juvenile Justice Act, 2015 వంటి చట్టాల సమర్థవంతమైన అమలుపై కమిషన్ పర్యవేక్షణ బాధ్యత కలిగి ఉందని పేర్కొంది.
“పిల్లల విద్యాహక్కు అమలుపై పూర్తి స్థాయి విచారణ జరగాలి”. 
ఈ సందర్భంగా  ఎస్. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ:
“విద్యాహక్కు చట్టం ద్వారా పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు కల్పించిన హక్కులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వాస్తవంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. NCPCR స్వయంగా విచారణకు ఆదేశించి, ఇప్పుడు చర్యల నివేదిక సమర్పించకపోవడంతో రిమైండర్ జారీ చేయడం ఈ అంశం ప్రాధాన్యతను తెలియజేస్తోంది. జిల్లా యంత్రాంగం నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు మరియు కమిషన్‌కు స్పష్టంగా తెలియజేయాలి.”
అలాగే, పాఠశాలలలో RTE నిబంధనలు, EWS/DG పిల్లలకు అందాల్సిన ప్రవేశ హక్కులు మరియు ఇతర బాలల హక్కులు సమర్థవంతంగా అమలయ్యేలా సంబంధిత అధికారులు పర్యవేక్షణ పెంచాలని ఆయన కోరారు.

మరికల్ లో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం_


 
*మరికల్ లో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు , అందరూ చదవాలి అందరూ ఎదగాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.తర్వాత  అక్షరాస్యత గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సర్వమంగళ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలని ఎవరు కూడా చదువును మధ్యలో మానివేయ రాదని ఇంటిలో ఉన్న పెద్దలు ఎవరైనా చదువు రాని వాళ్ళు ఉంటే వారికి సంతకం చేయడానికి చదవడానికి నేర్పించాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. మంచిగా చదువుకుంటే జీవిత లక్ష్యం తో పాటు జీవనభృతి సంఘంలో గౌరవం దక్కుతుందని తెలియజేశారు .
విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ ,వెంకటయ్య, రామకృష్ణ ,మల్లయ్య, హన్మయ్య ,అంజిలయ్య, రాజశేఖర్ ,పాండురంగాచారి ,రత్నమాల ,శ్రీలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మహత్య పరిష్కారం కాదు,సమస్యలను కుటుంబ సభ్యులతో లేదా మిత్రులతో పంచుకోవాలి_

*ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం*

*ఆత్మహత్య పరిష్కారం కాదు,సమస్యలను కుటుంబ సభ్యులతో లేదా మిత్రులతో పంచుకోవాలి*

*తోటివారితో మాట్లాడటం, వారి భావాలను అర్థం చేసుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు - అనూరాధ రావు,బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:

సెప్టెంబర్ నెలను జాతీయ ఆత్మహత్యల నివారణ అవగాహన మాసం అంటారు. National suicide prevention month.సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని ప్రపంచం అంతట నిర్వహిస్తారు. world suicide prevention Day. 2014-2026 సంవత్సరాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్దేశించిన థీమ్ - ఆత్మహత్యలపై మన దృక్పథాన్ని మార్చడం - అంటే సంభాషణను ప్రారంభించండి - start the conversation.ఆత్మహత్యల నివారణకై  ఆత్మహత్యలపై అవగాహన పెంచడం, మానసిక ఆరోగ్యం గురించి కావలసిన సహయం అందు బాటులో ఉంది అని అవగాహన పెంపొందించడమే లక్ష్యం.2003 నుండి ఇది ప్రారంభం అయింది. ప్రారంభించడానికి కారణాలు : ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ పిల్లల ఆత్మహత్యల గురించి బాలల హక్కల సంఘం మాట్లాడుతుంది.

*నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటా ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లల్లో ఆత్మహత్యలు తీవ్రమైన సమస్యగా ఉంది.*

2024 డేటా ప్రకారం 11, 184 పిల్లల ఆత్మహత్యలు జరిగాయి.వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
*(1)*:  1077 మంది పిల్లలు పరిక్ష ఫేల్యుర్ వల్ల సుసైడ్ చేసుకున్నారు.

*(2)*: కుటుంబ సమస్యలతో 3,101 పిల్లలు సుసైడ్ చేసుకున్నారు.

*(3)*: ప్రేమ వ్యవహారాల వల్ల-1671.

*(4)*: అనారోగ్య కారణాల వల్ల 1347.

ఇంకా ఇతర కారణాలు - మానసిక బత్తిడి, బుల్లీయింగ్ సామజిక ఒత్తిడి మొదలైనవి. ఇవి అధికారక సంఖ్యలు మాత్రమే, వాస్తవంగా ఎక్కువ సంఖ్య ఉండవచ్చు అని అంటున్నారు.
కారణం కేసు నమోదు చేయడానికి ఇష్టపడని వారు, బయటకు చెప్పడానికి భయపడే వారు కొందరు ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ సమ్యస తీవ్రత ఎక్కువగానే ఉంది.విద్యార్థుల ఆత్మహత్మలు రైతుల ఆత్మహత్యల కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది ఒక పెచ్చరిక అని మానసిక నిపుణులు అంటున్నారు.విద్యార్థుల ఆత్మ హత్యలకు ప్రధాన కారణం, వారికి ఒత్తిడి పెరగడం - అటు తల్లి తండ్రల నుండి, ఇటు కాలేజి / స్కూళ్ల యాజమాన్యాల నుండి పిల్లలపై బత్తిడి తేవడం, రాంక్యుల గురించి, మార్కుల గురించి. దీన్ని తట్టుకోలేక పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు.
కుటుంబంలో గొడవలు, తల్లి తండ్రల మధ్య విబేధాలు ఉండడం వల్ల పిల్లలు తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక సుసైడ్స్ కు పాల్పడాతున్నారు.
పరీక్షల వత్తిడి - సరిగ్గా రాయక పోతే ఫెయిల్ అవడం, తక్కువ మార్కులు రావడం,ఇంట్లో చెప్పుకునే అవకాశం లేక బలైపోతున్నారు. ఇక NEET,JEE పరీక్షల్లో జరిగే అవకతవకల వల్ల పిల్లలు ప్రతి సంవత్సరం సుసైడ్స్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.స్నేహితులు మధ్య విభేదాలు, చిన్నవయస్సు ప్రేమ వ్యవరాలు బ్రేకప్ అవడం, భావోద్వేగాలకు లోను కావడం వల్ల కూడా సూసైడ్స్ అవుతున్నాయి.
ముఖ్యంగా మానసిక అనారోగ్య సమస్యలు, డిప్రెషన్, ఆందోళన. మానసిక ఒత్తిడి సమస్యలను గుర్తించలేక పోవడం.బుల్లీయింగ్ స్కూళ్లో లేదా ఆన్లైన్లో పిల్లలుబుల్లేయింగ్కు గురికావడం ఎక్కువగా మానసికి బత్తిడిని ఎవరు గుర్తించ లేక, ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
నివారణ చర్యలు తప్పని సరిగా ఆలోచించాల్సిన సమయం. 
అంటే ముఖ్యంగా తల్లితండ్రుల్లో మార్పు రావలి, పిల్లలకు సమయాన్ని ఇవ్వాలి,పూర్తిగా వారు చెబుతున్న సమస్య వినాలి,వారితో ఓపెన్గా మాట్లాడి,వారి సమస్యను అర్ధం చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
పిల్లలపై అధిక అంచనాలు పెట్టకండి, మొదటి ర్యాంకు రావాలి అనే బత్తిడి అటు పేరేంట్స్, ఇటు స్కూల్స్ పెట్టకూడదు. పిల్లలుస్వేచ్ఛగా చదువుకునేలా,సంతోషంగా పాఠశాలలకు వెళ్లేలా ఉండాలి. 
స్కూళ్లలో తరచుగా నిపుణులైన మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ ఎర్పాటు చేయాలి. పిల్లల్లో 
కొన్ని సంకేతాలు గమనించాలి.  పిల్లలు అకస్మాత్తుగా ఒంటరిగా ఉండడం, ఏదో కోల్పోయిన విధంగా ఉండడం,ఎవరితో మాట్లాడక పోవడం, నిరాశగా మాట్లాడడం, నిద్ర పోకపోవడం, స్నేహితులకు దూరంగా ఉండడం చేస్తారు.ఇది గుర్తిం చినట్లయితే పేరేంట్స్ కాని స్కూల్లో టీచర్లు కాని, హస్టల్స్లో ఉన్న పిల్లలు ఇతర రూంమ్మెట్స్ కాని ఈ మార్పులను గమనిస్తే,వారిని కాపాడుకోవచ్చు. వెంటనే వారిని మానసిక వైద్యుల వద్ద సంప్రదించాలి.
 వారు కౌన్సెలింగ్ ద్వారా పిల్లల్లో ఉన్న భయాలను తొలిగిస్తారు.వారిలో ఆత్మ విశ్వాసం పెంచడానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తారు.వారికి కావల్సింది నీవు ఒంటరి కాదు, నీకు మేం ఉన్నాం అనే భరోసా ఇవ్వడం. ప్రతి స్కూళ్లలో, కళాశాలల్లో తరచు కౌన్సిలింగ్, వర్క్ షాప్స్  నిర్వహించాలి.టెలి మానస్ 1416 / 18008914416
Kiran - 18005990019
ఈ నంబర్స్కు కాల్ చేసి మీ మానసిక సమస్య ఎదైనా మాట్లాడిన వారు మీకు గైడ్ చేస్తారు.ప్రతి విద్యార్థి జీవితం విలువైనది, కావల్సిన సహయం తీసుకోవడం తప్పుకాదు.
ఆత్మహత్యల నివారణకై,అవగాహన పెంపోందించడానికి విద్యార్థులకు అండగా పని చేద్దాం.

Wednesday, September 9, 2026

_గురువుగారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు సారు జయంతి యాదిలో ✊_

https://www.facebook.com/share/p/17asKr4qLN/

*_గురువుగారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు సారు జయంతి యాదిలో ✊_*

*"తెలంగాణ భాషా దినోత్సవం"🙏*
*#KalojiJayanthi #warangal #telangana*

*@PIBHyderabad @HiWarangal @Warangal @HRF_Humanrights @IPRTelangana @DigitalMediaTG*

https://www.instagram.com/p/DdEiCS3quqr/?stkn=NXg0aWlobWc0NnR3
               *****
https://x.com/Praja_Snklpm/status/2097700670468157507