Saturday, September 12, 2026

కుల ఆధారిత దూషణలు, మహిళా పోలీసు సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తనపై తెలంగాణ డీజీపీకి సమగ్ర నివేదికలు సమర్పించాలని TGHRC ఆదేశం_

*ప్రెస్ రిలీజ్*

*తెలంగాణ మానవ హక్కుల కమిషన్*

*కుల ఆధారిత దూషణలు, మహిళా పోలీసు సిబ్బంది పట్ల అనుచిత ప్రవర్తనపై తెలంగాణ డీజీపీకి సమగ్ర నివేదికలు సమర్పించాలని TGHRC ఆదేశం*

బాపట్ల కృష్ణమోహన్, సెప్టెంబర్ 11:

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) గౌరవ చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో, 07.09.2026న జరిగినట్లు ఆరోపించబడిన రెండు సంఘటనలకు సంబంధించి దాఖలైన ఫిర్యాదులపై ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.
S.R. No.3678 of 2026లో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లి సుధాకర్ మరియు ఇతరులు చేసిన ఫిర్యాదులో, BRS MLC తాటా మధుసూదన్, దళిత సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను మీడియా సమక్షంలో అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. అలాగే, దళితులు మాజీ ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావుకు చెందిన ఎర్రవెల్లి, సిద్ధిపేట జిల్లా ఫామ్‌హౌస్‌ ఎదుట నిరసన నిర్వహించిన సమయంలో, BRS నాయకురాలిగా పేర్కొన్న శ్రీమతి పావని గౌడ్ మరియు ఇతరులు పసుపు నీరు, పాలు చల్లి ప్రాంతాన్ని “శుద్ధి” చేసినట్లు, దళిత నిరసనకారులను అవమానకర పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు.
S.R. No.3680 of 2026లో శ్రీమతి ఇందిరా శోభన్ చేసిన ఫిర్యాదులో, తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో కొంతమంది BRS ఎమ్మెల్యేలు నల్ల టీ-షర్టులు తొలగించి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది సమక్షంలో అర్ధనగ్నంగా నిలబడినట్లు ఆరోపించారు. ఈ ప్రవర్తన మహిళా పోలీసు సిబ్బందికి ఇబ్బంది, మానసిక వేదన, అవమానాన్ని కలిగించడంతో పాటు వారి గౌరవం, భద్రతపై ప్రభావం చూపిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనపై విచారణ జరిపి, CCTV మరియు ఇతర వీడియో దృశ్యాలను పరిశీలించి, బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరారు.
రికార్డులో ఉన్న అంశాలను పరిశీలించిన అనంతరం, రెండు కేసుల్లోనూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ నుంచి నివేదికలు కోరుతూ గౌరవనీయ చైర్‌పర్సన్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి నివేదిక కోసం రెండు కేసులను 09.10.2026కు వాయిదా వేశారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరికల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులు_

*పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరికల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 11:

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల పరిధిలోని మరికల్  గ్రామ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలు వివిధ ఆకారాలలో చూడముచ్చటగా తయారు చేశారు.మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు సర్వమంగళ బహుమతులు అందజేశారు.సీనియర్స్ లో మొదటి బహుమతి వైష్ణవి రెండో బహుమతి నితిన్ జూనియర్స్ లో మొదటి బహుమతి నరేష్ రెండో బహుమతి కార్తీక్ అందుకొన్నారు. గ్రామంలో మన ఇండ్లలో మట్టి వినాయకులను ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ వెంకటయ్య మల్లయ్య శివప్రసాద్ అంజిలయ్య రాజశేఖర్ హన్మయ్య శశిధర్ పాండురంగాచారి శ్రీలక్ష్మి రమాదేవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 17 న పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు_

*ఈనెల 17 న పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 11:

ఈనెల 17 వతేదీన నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే  తెలంగాణా ప్రజా పాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు  చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లపై గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్,  ముఖ్య కార్యదర్శులు  నవీన్ మిట్టల్, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హైదాబాద్ సి.పీ సజ్జనార్, ఆర్టీసీ ఎండి నాగి రెడ్డి, సమాచార శాఖ స్పెషల్  కమిషనర్ ముకుంద రెడ్డి తదితర సీనియర్ అధికారులు హాజయ్యారు.ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ప్రజా పాలనా దినోత్సవాన్ని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17 న ఉదయం అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్ కు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపంవద్ద,  పబ్లిక్ గార్డెన్ లో సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రధాన భవనాలకు , చారిత్రక కట్టడాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణ కు గానూ ఈనెల 15 న  పూర్తి డ్రెస్ రిహార్సల్స్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రజాపాలన దినోత్సవానికి వేయి మంది స్వయం సహాయక మహిళలతో పాటు  రెండు వేల మంది  హాజరవుతారని పేర్కొన్నారు.

సైబరాబాద్‌ పోలీస్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం_

*సైబరాబాద్‌ పోలీస్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం*

*నూతన సభ్యులకు సీపీ డా. రమేష్‌, IPS, అభినందనలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 11:

సైబరాబాద్‌ పోలీస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎస్సై శ్రీనివాస్‌ (హెచ్‌సీ–3046), ఉపాధ్యక్షుడిగా ఇన్‌స్పెక్టర్‌ శ్రీకర్‌బాబు (19435) ఎన్నికయ్యారు. ఎస్సై/ఏఎస్సై కేటగిరీలో ప్రియదర్శిని (3251), హెడ్‌ కానిస్టేబుల్‌ కేటగిరీలో కార్తిక్‌ శ్రీనివాస్‌ (3276), పోలీస్‌ కానిస్టేబుల్‌ కేటగిరీలో రాజేందర్‌ (5180) వైస్‌ ప్రెసిడెంట్లుగా ఎన్నికయ్యారు.వివిధ పదవులకు మొత్తం 29 మంది సభ్యులు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్‌ ద్వారా సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

Friday, September 11, 2026

మూసినది అభివృద్ధి పేరుతో వేలకోట్ల దోపిడీ_

https://www.facebook.com/share/p/19CxaEt42o/

*_మూసినది అభివృద్ధి పేరుతో వేలకోట్ల దోపిడీ... ప్రజాప్రయోజనాలకోసం కాదు ఈ అభివృద్ధి...మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలు జాగృతం కావాలి... అప్పుడు కాళేశ్వరం... ఇప్పుడు మూసినది...Bplkm✍️_*
https://www.instagram.com/p/DdJbLK1qob0/?stkn=dmw0MTI0ZXk0MXdx
                 *****
https://x.com/Praja_Snklpm/status/2098315570903212443?t=vRradfzDt0R2AjdWULDd-A&s=08

*#SaveMusiNadi not #beautification...#publicvoice*

*#hyderabad #pollution #publichealth*

*@TelanganaCMO*
*@Bhatti_Mallu*
*@TelanganaCS @asadowaisi @INC_Ponguleti @Ponnam_INC @KTRBRS @N_RamchanderRao @HRF_Humanrights @bandarvirala @CitizensForHyd @SaveNalas_Tanks @MusiProject @PIBHyderabad @IPRTelangana @Narhariyarabotu @SitaramDhulipa1 @BplplH*

మహిళలు సమాజానికి, భవిష్యత్ తరాలకు నిజమైన స్ఫూర్తి మరియు శక్తి ప్రదాతలు అని నిరూపించిన డా. దీపా బానోత్_

*కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పీహెచ్డీ సాధించిన దీపా బానోత్*

*మహిళలు సమాజానికి, భవిష్యత్ తరాలకు నిజమైన స్ఫూర్తి మరియు శక్తి ప్రదాతలు అని నిరూపించిన డా. దీపా బానోత్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 10:
 
కాప్రా ECILకూ చెందిన ఉస్మానియా యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పరిశోధక విద్యార్థిని శ్రీమతి డా. దీపా బానోత్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పీహెచ్‌డీ పట్టా సాధించారు. ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి డాక్టరేట్ పొందడం అభినందనీయం. డా.దీపా బానోత్ "తెలంగాణలో ఎంపిక చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగుల సంతృప్తిపై తులనాత్మక అధ్యయనం (తెలంగాణ రాష్ట్రంలోని ఎంపిక చేసిన పబ్లిక్ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఉద్యోగుల సంతృప్తిపై తులనాత్మక అధ్యయనం)" అనే అంశంపై పరిశోధన జరిగింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఉద్యోగుల సంతృప్తికి తగిన సూచనలను కూడా ప్రతిపాదించారు. ఈ పరిశోధనను డా. వి .సమున్నత గారి పర్యవేక్షణలో పూర్తి చేశారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీరాములు, డీన్ ప్రొఫెసర్ జహంగీర్, డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు సిబ్బంది డా. దీపా బానోత్‌ను అభినందించారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలను (పెద్ద కుమారుడు MBBS మరియు చిన్న కుమారుడు ఇంజనీరింగ్) చదువుతున్న సమయంలోనూ కుటుంబ భాద్యతలు చూసుకుంటూ పీహెచ్‌డీ సాధించడం ద్వారా దీపా బానోత్ తన సంకల్పం, పట్టుదల, కృషితో కుటుంబ బాధ్యతలు ఉన్నా ఉన్నత లక్ష్యాలను సాధించినట్లు నిరూపించారు. ఈ సందర్భంగా డా. దీపా బానోత్ తన విజయానికి సహకరించిన తన భర్త శ్రీ రవి తేజకు, కుటుంబ సభ్యులకు మరియు తన పరిశోధన పర్యవేక్షకురాలు డా.వి. సమున్నతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరిశోధన సమయంలో వారు అందించిన నిరంతర ప్రోత్సాహం, సహకారం తన పీహెచ్డీ ప్రయాణంలో కీలకమని ఆమె పేర్కొన్నారు.ఆమె సాధించిన ఈ విజయం కుటుంబ బాధ్యతలతో పాటు ఉన్నత విద్యను కొనసాగించాలని ఆకాంక్షించే మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి_


*శాసనసభ సమావేశాల తొలిరోజు చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను  శిక్షించాలి - సీఎం రేవంత్ రెడ్డి*

*ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:

శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపించి, క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను  శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించారు.శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్ గారిని ఉద్దేశించి దుర్భాషలాడిన ఉదంతం, దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన సంఘటనలపై యావత్ శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. సభాపతి గారిని అవమానపరుస్తూ, జరిగిన దురదృష్టకర సంఘటన విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అసెంబ్లీ  అండగా నిలిచింది. ఈ దురదృష్టకర సంఘటనల్లో మానసిక ధైర్యం కోల్పోవద్దని స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది.ఈ అంశాలపై బుధవారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చపై సభా నాయకుడు, ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ విషయంలో స్పీకర్ కు ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. సభాపతి మనసును గాయపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
“ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారు. శాసన సభాపతి తల్లి గారిని అవమానించారు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దేశంపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు, తీవ్రవాదులకు శాసనసభ ప్రాంగణంలో సభా అధ్యక్షుడిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకు ఏమాత్రం తేడా లేదన్నారు. ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా ఈ సంఘటనను అభివర్ణించారు.
“మన మాతృస్వామ్య సమాజం. స్త్రీని అపరకాళి, భద్రకాళి, భూమాత, భారతమాత, తెలంగాణ మాత అని పిలుస్తాం. ఏదైనా శక్తిని, గొప్పతనాన్ని ఆపాదించాలని, చర్చించాలని అనుకున్నప్పుడు తల్లితో పోలుస్తాం. మహిళతో పోలుస్తాం. మహిళను పూజించే మన సమాజం ఈ దేశాన్ని భారతమాత అని మహిళతో పోల్చుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లితో పోల్చుకుంటాం. అలాంటి ఈ తెలంగాణ నేల మీద ఒక తల్లిని అవమానించే విధంగా ప్రవర్తించడం దారుణం” అని ఆందోళన వ్యక్తం చేశారు.
సభాపతి కి జరిగిన అవమానం సమాజానికి జరిగినట్టే. దోషులను తెలంగాణ సమాజం ఉపేక్షించదు. రజాకార్లను దిగంతాలకు తరిమి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ సభాపతి గారి మనసుకు గాయం చేయాలన్న ఆలోచన బరితెగించి మాట్లాడారని అన్నారు. సభాపతి ని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని చెప్పారు.
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం భావించింది. విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ధరణిలో జరిగిన అక్రమాలు, 22 (ఎ) వంటి అంశాలే కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన చాలా అంశాలను చర్చించాలని భావించాం. ప్రజా సమస్యలపై చర్చ జరగకూడదని అడ్డుకున్నారు” అని ముఖ్యమంత్రి  అన్నారు.