Saturday, August 8, 2026

మణికొండ జాగీర్ సర్వే నెం.42లోని ప్రభుత్వ భూమి (సుమారు 1,450 చ.గ.) ఆక్రమణ_

*రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సారు మణికొండ జాగీర్ గ్రామంలోని  ప్రభుత్వ భూములను పరిరక్షించండి*  

*సీతారాం ధూళిపాళ - వ్యవస్థాపక అధ్యక్షులు,ది సిటిజన్స్ కౌన్సిల్ (ఫర్ ఎ బెట్టర్ సొసైటీ)*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 08:

మణికొండ జాగీర్ సర్వే నెం.42లోని ప్రభుత్వ భూమి (సుమారు 1,450 చ.గ.) పరిరక్షణ, అక్రమ ఆక్రమణలు మరియు అనధికార నిర్మాణాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీతారాం ధూళిపాళ వ్యవస్థాపక అధ్యక్షులు
ది సిటిజన్స్ కౌన్సిల్ (ఫర్ ఎ బెట్టర్ సొసైటీ)రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా సీతారాం ధూళిపాళ మాట్లాడుతూ మణికొండ జాగీర్ గ్రామంలోని సర్వే నెం.42లో సుమారు 1,450 చదరపు గజాల ప్రభుత్వ భూమి పరిరక్షణకు మీ అత్యవసర జోక్యాన్ని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించాను అని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు, పై సర్వే నంబరులో ఒక ప్రైవేట్ బిల్డర్ భవన నిర్మాణ అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు లేదా ఇటీవలే అనుమతి పొందినట్లు తెలిసింది. ఈ విషయం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.సదరు 1,450 చదరపు గజాల భూమి రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూమిగా నమోదై ఉండటమే కాకుండా, జిల్లా కలెక్టర్, రంగారెడ్డి గారు ప్రకటించిన నిషేధిత ఆస్తుల (ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ) జాబితాలో కూడా ఉంది. అందువల్ల ఈ భూమిపై ఎటువంటి హక్కులు, లావాదేవీలు లేదా అభివృద్ధి కార్యకలాపాలు చట్టబద్ధతను పూర్తిగా పరిశీలించకుండా అనుమతించరాదు.అంతేకాకుండా, ఈ భూమి మిథిలా హోమ్స్ (పంచవటి కాలనీ) ఆమోదిత లేఅవుట్‌లో భాగం కాదని తెలిసింది. మరొక లేఅవుట్ డెవలపర్ ద్వారా ఈ భూమిని నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై రెవెన్యూ శాఖ సమగ్ర విచారణ జరపడం అత్యంత అవసరం.ఇంకా, ప్రభుత్వ భూమి గుర్తింపు బోర్డును ఆక్రమణదారులు తొలగించినట్లు సమాచారం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు గండిపేట తహసీల్దార్ (ఎంఆర్వో) తిరిగి ఏర్పాటు చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ భూమి గుర్తింపు బలహీనపడటమే కాకుండా మరిన్ని ఆక్రమణలకు అవకాశం ఏర్పడే ప్రమాదం ఉంది.అందువల్ల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు దయచేసి క్రింది చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను:
*రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డిఓ (RDO)* మరియు **గండిపేట తహసీల్దార్ (MRO)**ల ద్వారా సర్వే నెం.42పై సంయుక్త తనిఖీ నిర్వహించి, భూమి యాజమాన్యం, వర్గీకరణ, విస్తీర్ణం మరియు ప్రస్తుత స్థితిపై సమగ్ర నివేదిక సమర్పించేలా ఆదేశించాలి అని విజ్ఞప్తి చేశారు.
విచారణ పూర్తయ్యే వరకు ప్రభుత్వ భూమిని ఆక్రమణలు, అనధికార నిర్మాణాలు మరియు అక్రమ బదలాయింపుల నుంచి రక్షించే చర్యలు చేపట్టాలి అని అన్నారు.గండిపేట తహసీల్దార్‌ను ప్రభుత్వ భూమి గుర్తింపు బోర్డును వెంటనే పునఃస్థాపించి, ప్రభుత్వ భూమి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాలి అని అన్నారు.ప్రభుత్వ భూమి పరిరక్షణకు రెవెన్యూ చట్టాల ప్రకారం అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలి.ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి. వాటి పరిరక్షణ ప్రభుత్వ యంత్రాంగం యొక్క చట్టబద్ధమైన మరియు రాజ్యాంగబద్ధమైన బాధ్యత. సకాలంలో చర్యలు తీసుకోకపోతే విలువైన ప్రభుత్వ భూమి శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది.అందువల్ల ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి తగిన చర్యలు తీసవలసిందిగా  కలెక్టర్ గారికి వినమ్రంగా ప్రార్థిస్తున్నాను అని అన్నారు.అలాగే ఈ క్రింద ప్రభుత్వ శాఖల అధికారులు కు కూడా ఈ ప్రభుత్వ భూములను పరిరక్షించే బాధ్యత ఉంది అని అన్నారు.
*(1)*: రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO), రాజేంద్రనగర్ – అవసరమైన చర్యల కోసం.
*(2)*: తహసీల్దార్ (MRO), గండిపేట – ప్రభుత్వ భూమి రక్షణ, ప్రభుత్వ గుర్తింపు బోర్డు పునఃస్థాపన మరియు రెవెన్యూ చట్టాల ప్రకారం చర్యల కోసం.
కమిషనర్, HYDRAA – తమ పరిధిలోని చట్టాల ప్రకారం అవసరమైన చర్యల కోసం.
*(3)*: కమిషనర్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – సర్వే నెం.42కు సంబంధించిన ఏదైనా భవన నిర్మాణ అనుమతి విషయంలో చట్టబద్ధమైన భూ స్థితిని నిర్ధారించుకుని తమ అధికార పరిధిలో తగిన చర్యలు తీసుకోవడం కోసం.

6 కోట్ల మంది బలూచ్ ప్రజలు తమను తాము ఒక స్వతంత్ర, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు._

*6 కోట్ల మంది బలూచ్ ప్రజలు తమను తాము ఒక స్వతంత్ర, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు.*

*బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం, జాతీయ ఐక్యతతో ఆగస్టు 11న 'బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం'గా ప్రపంచవ్యాప్త వేడుకలను జరుపుకోనున్నట్లు ప్రకటించింది.*

*పాకిస్థాన్ వంటి విపత్తు నుండి ఈ ప్రాంతాన్ని విముక్తం చేయాలని అంతర్జాతీయ సమాజానికి బలూచిస్థాన్ గణతంత్ర రాజ్యం విజ్ఞప్తి చేస్తోంది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే (అంతర్జాతీయ వార్తలు), ఆగస్టు 08:

బలూచిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరుతూ బలూచ్‌ సంస్థలు, తిరుగుబాటుదారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారాలు తీవ్రం చేశారు. బలూచ్ ప్రజలు తమ ఇళ్లు, నివాస ప్రాంతాలు, మార్కెట్లు, దుకాణాలు, విద్యాసంస్థలు మరియు ఇతర ప్రదేశాలలో స్వతంత్ర బలూచిస్తాన్ జాతీయ జెండాను ఆగస్టు 11 వ తేదీన ఎగురవేయాలి అని అన్నారు.అలాగే ఈ చారిత్రాత్మక దినం యొక్క ప్రాముఖ్యతను భావి తరాలకు తెలియజేస్తాము అన్నారు.ఉపఖండ విభజన ఈ ప్రాంతం మొత్తాన్ని నిరంతర సంఘర్షణలు, అశాంతి, ఉగ్రవాదం, ఆర్థిక అస్థిరత మరియు రాజకీయ సంక్షోభాలకు గురిచేసిందన్నది బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం యొక్క దృఢమైన వైఖరి. పాకిస్తాన్ వంటి కృత్రిమ మరియు ఉగ్రవాద దేశాన్ని ఈ ప్రాంతంపై రుద్దినప్పటి నుండి, ఇక్కడి వివిధ జాతులు శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి మరియు స్థిరత్వానికి దూరమయ్యాయి అని అన్నారు.
పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద విధానాలు కేవలం ఈ ప్రాంతానికే పరిమితం కాలేదు, వాటి ప్రభావాలు ప్రపంచ స్థాయికి చేరాయి. పాకిస్తాన్ నుండి ఉద్భవించిన ఉగ్రవాద ముప్పు పాశ్చాత్య దేశాలను ప్రభావితం చేయగా, మధ్యప్రాచ్యం కూడా నిరంతర అస్థిరతతో బాధపడింది. పాకిస్తాన్ కృత్రిమ ఏర్పాటు జరిగిన వెంటనే కాశ్మీర్‌పై దాడితో ఇది మొదలైంది.ఆ తర్వాత 1948 మార్చి 27న బలూచిస్తాన్‌పై సైనిక దాడి జరిగింది. అప్పటి ఖాన్ ఆఫ్ కలాత్, మీర్ అహ్మద్ యార్ ఖాన్, బలవంతంగా విలీన ఒప్పందంపై సంతకం చేసేలా ఒత్తిడికి గురయ్యారు మరియు ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు.అదే క్రమంలో, 1971లో తూర్పు పాకిస్తాన్‌లో లక్షలాది మంది బెంగాలీల ఊచకోత అనే విషాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత, జోర్డాన్‌లో పాలస్తీనియన్లపై జరిగిన చర్యలలో, అప్పటి పాకిస్తాన్ సైనిక జనరల్ జియా-ఉల్-హక్ డబ్బు కోసం పాలస్తీనియన్లను చంపించారు. 1980లలో ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన 'జిహాద్' సమయంలో, పాకిస్తాన్ తన అణు ఆయుధాల తయారీని పూర్తి చేయడానికి అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే 1998లో, బలూచ్ ప్రజల అనుమతి లేకుండా బలూచిస్తాన్‌లోని చగై జిల్లాలో ఆరు అణు పరీక్షలు నిర్వహించింది; వీటి దుష్ప్రభావాల వల్ల ప్రజలు నేటికీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత, 9/11 అనంతర కాలంలో, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం పేరుతో పాకిస్తాన్ అమెరికా నుండి 40 బిలియన్ డాలర్ల సహాయం పొందింది. కానీ తెరవెనుక, అది అమెరికా మరియు నాటో (NATO)కు వ్యతిరేకంగా ఒక నకిలీ జిహాద్‌కు నిధులు సమకూర్చింది, దీనివల్ల ఈ ప్రాంతం మొత్తం నిరంతర యుద్ధం, అస్థిరత మరియు రక్తపాతం గుప్పిట్లో చిక్కుకుపోయింది. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ తన ప్రస్తుత స్వరూపంలో కొనసాగుతున్నంత కాలం సుస్థిర శాంతి, అభివృద్ధి మరియు శ్రేయస్సులను సాధించడం సాధ్యం కాదని బలూచిస్థాన్ గణతంత్ర రాజ్యం భావిస్తోంది. అందువల్ల, బలూచిస్థాన్ స్వాతంత్ర్యాన్ని గుర్తించాలని మరియు పాకిస్థాన్ వంటి విపత్తు నుండి ఈ ప్రాంతాన్ని విముక్తం చేయాలని అంతర్జాతీయ సమాజానికి బలూచిస్థాన్ గణతంత్ర రాజ్యం విజ్ఞప్తి చేస్తోంది.
బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం మరియు అక్కడి 6 కోట్ల మంది బలూచ్ ప్రజలు తమను తాము ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశంగా భావిస్తారు. మా వాదన ప్రకారం, ఉపఖండం నుండి బ్రిటిష్ పాలన ఉపసంహరణ జరుగుతున్న సమయంలోనే, అంటే 1947 ఆగస్టు 11న బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించబడింది. ఈ ప్రకటనకు సంబంధించిన వార్త అప్పట్లో 'న్యూయార్క్ టైమ్స్'తో సహా అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైంది మరియు 'ఆల్ ఇండియా రేడియో'లో కూడా ప్రసారమైంది. ఈ చారిత్రక ప్రాతిపదికన, బలూచ్ జాతి ప్రతి ఏటా ఆగస్టు 11న తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది మరియు భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో దీనిని కొనసాగిస్తుంది.

అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!_

*అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!*

*వి.సి. సజ్జనార్ ఐపిఎస్ - డిజి మరియు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 08:

"ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇది. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వేదికలుగా ఆగస్టు 1వ తారీకు 50శాతం స్పెషల్ డిస్కౌంట్ "1st August Special - 50% OFF", "రెంట్ బాయ్‌ఫ్రెండ్ - యువర్ పర్సనల్ కంపానియన్" అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట ప్రచారం చేస్తున్నారు.ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు ప్రదర్శిస్తూ.. ఒక గంట కాఫీ మీటింగ్‌కు రూపాయలు 499, సినిమా డేట్‌కు రూపాయలు 1,249, షాపింగ్‌కు తోడుగా రావడానికి రూపాయలు 1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు రూపాయలు 1,999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి రూపాయలు 4,499 అంటూ కేటుగాళ్లు ఒక పెద్ద ధరల పట్టికనే మీ ముందుకు తెచ్చారు. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు.
ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలుపెడతారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి, ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారు.ఆన్‌లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంది.ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టిసారించింది. వీటికి బాధ్యులైన వారిపై వేగవంతంగా దర్యాప్తు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? బయటకు వెళ్లినప్పుడు ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ నిఘా పెట్టాలి. స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు కేటుగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది.కేటుగాళ్లు ఇచ్చే ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోకండి. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ గానీ, కలవడం కానీ చేయవద్దు, ముందస్తుగా రూపాయి కూడా చెల్లించవద్దు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేయండి లేదా "సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్" cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.

సమాచార భవన్ ఎఫ్డిసి (FDC) కార్యాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు_

*సమాచార భవన్ ఎఫ్డిసి (FDC) కార్యాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 08:

సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్‌లోని సమాచార భవన్ (FDC కాంప్లెక్స్) కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉత్సవ ఊరేగింపు, బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ ముకుంద్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఉత్సవ ఊరేగింపులో డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, సాంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సంచాలకులు ఎల్.ఎల్.ఆర్. కిషోర్ బాబు, అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్లు డి. శ్రీనివాస్, కె. వెంకటరమణ, సి.ఐ.ఈ. రాధాకిషన్, డిప్యూటీ డైరెక్టర్లు సి. రాజారెడ్డి, ఆర్.ఐ.ఈ. జయ రామ్మూర్తి, సహాయ సంచాలకులు సత్యనారాయణ రెడ్డి, బిమల్ దేవ్, డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ నర్సింహా గౌడ్, అకౌంట్స్ ఆఫీసర్లు పద్మ, టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షుడు యేలూరి శ్రీనివాసరావు, టీఎన్‌జీవోస్ నాయకులు అనిల్, జితేందర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Friday, August 7, 2026

"పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువు కోవాలా? లేక వారి ప్రాథమిక హక్కుల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేయాలా?"_

*పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువు కోవాలా? లేక వారి ప్రాథమిక హక్కుల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేయాలా?*

*అనూరాధ రావు - అధ్యక్షురాలు బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 07:

ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య, భద్రత, మౌలిక సదుపాయాలు అందించడం ప్రభుత్వ బాధ్యత.
కానీ ఎక్కడ చూసినా పిల్లలు సమస్యలతో సతమతమవుతున్నారు అని అనూరాధ రావు (అధ్యక్షురాలు బాలల హక్కుల సంఘం) అన్నారు.తాగునీరు లేక, క్లాస్ రూం పై పెచ్చులు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితుల్లో కొన్ని పాఠశాలలు, శుభ్రమైన నీటి వసతి గల టాయ్ లెట్స్ లేని పాఠశాలలు,కొన్ని పాఠశాలల్లో అసలు టాయ్ లెట్స్ లేవు అని అన్నారు.మన తెలంగాణా రాష్ట్రంలో టాయ్ లెట్స్ లేని పాఠశాలలు 1161, టాయ్ లెట్స్ ఉన్నా పని చేయనివి 2272  దాంతో అమ్మాయిల డ్రాపౌవుట్స్.
ఇక గురుకుల పాఠశాలల్లో పిల్లలు తరుచూ ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు.
విద్యా సంవత్సరాలు మారుతున్నాయి కానీ పిల్లల పరిస్థితి మారడం లేదు.
విసుగేత్తిన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు, మాకు కనీస వసతులు కల్పించాలి అని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు, దాంతో రోడ్డెక్కారు. వెంటనే అధికారులు స్పందించి పనులు చేస్తాం అని హామీ ఇచ్చారు.మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి,2025 లో గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనలు ఉన్నాయి.2025 ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయిన సంఘటనలు 886....48 విద్యార్థులు చనిపోయారు.కారణం ఆహార నాణ్యత లేకపోవడం, అపరిశుభ్రమైన వంట గది/ స్థలం, ఆహార నిల్వ ప్రదేశం అపరిశుభ్రంగా ఉండటం, ఈగలు దోమల వాలిన ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలు డయోరియా బారిన పడడం.సరియైన నిఘా లేకపోవడం వల్ల సంఘటనలు పునరావృతం అవుతున్నాయి.
విద్యా సంవత్సరం ప్రారంభం అయి నెల రోజులు అవుతుంది కానీ రోజు పిల్లల ఫుడ్ పాయిజనింగ్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయితున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ గురుకుల పాఠశాల విద్యార్థులు కడుపు నోప్పి, వాంతులతో అచ్చంపేట ఆసుపత్రిలో చికిత్స పొందారు జులై 9న.కామారెడ్డి, బెల్లంపల్లి, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందారు. ఈ వార్తలు రోజు మనం వార్తా పత్రికలలో చూస్తున్నాం, అధికారులకు సమాచారం ఉన్నా ఏం చర్యలు తీసుకోవడం లేదు.పిల్లలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు అని అంటే, వారి పరిస్థితిని అర్థం చేసుకోలేని విద్యావ్యవస్థ, ప్రభుత్వం. మనకు మన ముఖ్యమంత్రి గారే మన విద్యాశాఖ మంత్రి. ఎన్నో హామీలు వేదికల పై ఇస్తున్నారు, నాకు వారు ఓటు బ్యాంకు కాదు, అందరికి విద్య అందేలా చూడడం నా బాధ్యత అని చెపుతున్నారు.కానీ పిల్లల సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.ముఖ్యంగా గురుకులాల్లో చదువుకునేది పేద వెనుక బడిన కుటుంబాల పిల్లలు.వారికి నాణ్యమైన విద్య, మంచి భోజనం,వసతి సౌకర్యాలు ఉండేలా ఈ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. కానీ సమస్యలు అనేకం.వారు ధర్నాలు చేసినా, హాస్పిటల్ పాలు అయిన పట్టించుకునే అధికారులు ఎక్కడ? పిల్లల ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది. మంచి పోషకాహారంతో భొజనం నాణ్యమైన విద్యను పొందడం వారి హక్కు.ఈ పరిస్థితులకు కారణం అయిన అధికారుల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి, వారికి కనీస సౌకర్యాలు వసతులు ఉండేలా చూసుకోవాలి, అంటే మంచి నీరు,పోషకాహరం, శుభ్రమైన నీటి వసతి గల టాయ్ లెట్స్, నాణ్యమైన విద్య అందేలా చూడడం ప్రభుత్వ బాధ్యత.అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు ఆకస్మిక తనిఖీలు ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్వహించాలి, అక్కడ విద్యార్థులతో వారి సమస్యలు చర్చించి, పరిష్కారించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్.

"రైతు పొలాన్ని దున్నింది ట్రాక్టర్ కాదు... వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దున్నేసిన అన్యాయం!"_

*రైతు పంటను కాపాడాల్సిన వ్యవస్థే కబ్జాదారులకు అండగా నిలిస్తే రైతు ఎక్కడికి వెళ్లాలి?*

*"రైతు పొలాన్ని దున్నింది ట్రాక్టర్ కాదు... వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దున్నేసిన అన్యాయం!"*

*"ఖాకీ న్యాయానికి ప్రతీకగా నిలవాలి... కబ్జా రాజకీయాలకు కాపలాదారుగా కాదు!"*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 07:

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో చట్టాన్ని అమలు చేయాల్సిన అధికార వ్యవస్థపై ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు చెమటోడ్చి సాగు చేసిన పత్తి పంటను రాత్రివేళ దున్నివేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పౌరసమాజం.చిన్న చిన్న వివాదాలను అడ్డం పెట్టుకుని అక్రమ పట్టాలు పొందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగిన అధికారులు, వారికే అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ పట్టాల వ్యవహారంపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ సంబంధిత వ్యక్తి అయిన కప్పల శ్రీనివాస్ పై కేసు నమోదు చేయకుండా వ్యవహరించడమే కాకుండా, అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందనే సందేహాలు ప్రజల్లో బలపడుతున్నాయి.
ఈ వ్యవహారంలో శాలిగౌరారం ఎస్సై సైదులు పాత్రపై కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. రైతు కుటుంబానికి అన్యాయం జరిగిందనే ఆరోపణలతో పాటు, అధికార దుర్వినియోగం జరిగిందా? అక్రమ పట్టాలు పొందిన వ్యక్తులతో కుమ్మక్కు జరిగిందా? అనే అంశాలపై స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అలాగే రైతు కుటుంబాన్ని బెదిరించే కుట్ర జరిగిందనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వాటిపైనా సమగ్ర దర్యాప్తు జరగాలి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార బలంతో కబ్జాదారులకు రక్షణగా మారితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. చట్టం ధనవంతులకు ఒకలా, పేద రైతులకు మరోలా ఉండకూడదు. ఖాకీ యూనిఫాం న్యాయానికి ప్రతీక కావాలి తప్ప, భూ కబ్జాదారులకు కవచంగా మారకూడదు.ఈ ఘటనపై జిల్లా ఎస్పీ, ఉన్నత పోలీసు అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని స్వతంత్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలి. రైతుకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి న్యాయం చేయడంతో పాటు, తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు నిలబెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నిర్వహించిన దేశవ్యాప్త ప్రగతి సమీక్షా సమావేశంలో సైబర్ నేరాల నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్1_

*సైబర్ నేరాల నిర్మూలనలో భారతదేశంలో తెలంగాణ అగ్రస్థానం*

*పీఎంఓ ప్రగతి సమీక్షలో నెం. 1 స్థానం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 07:

ఆగస్టు 6, 2026న ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నిర్వహించిన దేశవ్యాప్త ప్రగతి సమీక్షా సమావేశంలో సైబర్ నేరాల నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) కింద, సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, డిజిటల్ పాలన, ప్రజల్లో అవగాహన, సామర్థ్య పెంపు వంటి తొమ్మిది కీలక అంశాలలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును ఈ సమీక్ష అంచనా వేసింది.
*కీలక సైబర్ క్రైమ్ కార్యక్రమాలలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.* కింది అంశాలలో రాష్ట్రం కనబరిచిన అత్యుత్తమ పనితీరు ఆధారంగా దానికి అగ్ర ర్యాంకు లభించింది:
*(1)*: రాష్ట్ర సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం (ఎస్4సి) ఏర్పాటు.
*(2)*: ఇ-జీరో ఎఫ్ఐఆర్ అమలు.
*(3)*: ఫిర్యాదుల పరిష్కార మాడ్యూల్, జిఆర్ఎమ్ (GRM) సమర్థవంతమైన పనితీరు.
*(4)*: సైబర్ మోస బాధితులకు డబ్బు వాపసు అందించడానికి మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ ఎమ్ఆర్ఎమ్ (MRM)ను సమర్థవంతంగా ఉపయోగించడం.
*(5)*: చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ కంటెంట్‌ను తొలగించడానికి సహ్యోగ్ పోర్టల్ వాడకం.
*(6)*: సమన్వయ పోర్టల్‌ను విస్తృతంగా వినియోగించడం.
*(7)*: సైబర్ క్రైమ్ హాట్‌స్పాట్‌లను గుర్తించడం మరియు పర్యవేక్షించడం
సైట్రెయిన్ మరియు సైబర్ కమాండ్ ద్వారా చట్ట అమలు. అధికారుల సామర్థ్య నిర్మాణం
*(8)*: ప్రజలలో అవగాహన కోసం సమాచార, విద్యా మరియు ప్రసార (ఐఈసీ ) కార్యక్రమాలు.
తెలంగాణ నాయకత్వాన్ని పీఎంఓ అభినందించింది
సమీక్ష సందర్భంగా, రాష్ట్ర సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం (ఎస్4సి )ను ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిచినందుకు తెలంగాణ ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. ఈ-జీరో ఎఫ్‌ఐఆర్‌ను విజయవంతంగా అమలు చేసినందుకు, మరియు సమన్వయ పోర్టల్, సహయోగ్ పోర్టల్, జీఆర్ఎం, ఎంఆర్ఎం వంటి ప్రధాన ఐ4సీ (ఐ4సి) ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంతంగా వినియోగించుకున్నందుకు.
ఈ గుర్తింపు, సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో తెలంగాణ అనుసరిస్తున్న సాంకేతికత ఆధారిత పోలీసింగ్ నమూనాని, పటిష్టమైన సంస్థాగత వ్యవస్థను, పౌర కేంద్రీకృత విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
పౌర కేంద్రీకృత సైబర్ భద్రతా చర్యలు.ప్రజా సేవలను మరింత బలోపేతం చేసేందుకు, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం (జీఆర్ఎం) మరియు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ (ఎంఆర్ఎం)లకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో పౌరులకు సహాయపడటానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) 8712665600 అనే ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది.అవగాహనను, అందుబాటును మెరుగుపరచడానికి, జీఆర్ఎం మరియు ఎంఆర్ఎం సేవలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో పౌరులకు మార్గనిర్దేశం చేస్తూ, టీజీసీఎస్బీ తన అధికారిక సోషల్ మీడియా వేదికలపై వివరణాత్మక సూచనల వీడియోలను కూడా విడుదల చేసింది.తెలంగాణ జాతీయ స్థాయిలో నెం. 1 ర్యాంకు సాధించడం, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో, సైబర్ మోసాల నుండి పౌరులను రక్షించడంలో మరియు సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పడంలో రాష్ట్రానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతోంది.