Friday, September 4, 2026

అంబర్పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు_

*అంబర్పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 04:

అంబర్ పేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశీలి. ముదిరాజ్ సంఘపు స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకుడు, సీనియర్ జర్నలిస్ట్  సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అంబర్ పేట స్విమ్మింగ్ పూల్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలలో పెద్ద సంఖ్యలో ముదిరాజ్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డిసిపి జోగుల నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కొర్వి  కృష్ణ స్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా అడిషనల్ డిసిపి నర్సయ్య మాట్లాడుతూ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 1893, ఆగష్టు 25 న కృష్ణాష్టమి రోజు జాల్నాలోని ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు అని ఎంతో కష్టపడి చదువుకొని చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్, ఆ తరువాత నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు అని రచయితగా, సాహితీవేత్తగానే కాకుండా పాత్రికేయుడిగా కూడా ఆయన సేవలందించారు అని సామాజిక రుగ్మతలపై అనేక పుస్తకాలు వ్రాశాడు అని గుర్తుచేశారు.ఈ సందర్భంగా  ముదిరాజ్ సంఘం నాయకురాలు మాట్లాడుతూ అంబర్ పేటలో మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అంబర్ పేట శ్రీ రమణ చౌరస్తా, చే నంబర్, ఎమ్మార్వో ఆఫీస్, అలీ కేఫ్ చౌరస్తాలలో ఏదైనీ ప్రాంతంలో కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.

"మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి"_

*ప్రచురణార్థం :*

*"మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి"*

*హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ పరంజ్యోతి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 03:

హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ పరంజ్యోతి గారు ఈరోజు హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిందాబాద్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఈ పరంజ్యోతి మాట్లాడుతూ... రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని, పర్యావరణ పర్యావరణాన్ని కాపాడాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని, హెచ్ఎండిఏ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నదని అన్నారు.
హైదరాబాద్ జిందాబాద్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF) ప్రధాన కార్యదర్శి  కె.వీరయ్య మాట్లాడుతూ... ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు  చెరువులు కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే  ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో  వైభవంగా  నిర్వహించుకొనే  “వినాయక చవితి” పండుగ  సందర్భంగా  అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను  ప్రతిష్టించాలని అన్నారు.  నగరంలో ఇప్పటికే పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, మరింతగా పెరగకుండా  ఉండటానికి అందరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. గౌరవ హైకోర్టు “ పర్యావరణానికి హాని చెయ్యని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని, విగ్రహాల ఎత్తు ఐదు అడుగులు మించకుండా చూడాలని” సూచించిందని అన్నారు. భక్తుల విశ్వాసాలను, సమాజ భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని గౌరవ హైకోర్టు ఇచ్చిన సూచనలను అందరం పాటిద్దాం అని అన్నారు.వినాయక  విగ్రహాలలో అత్యధికం ప్లాస్టర్ ఆఫ్  పారిస్‌తో అనేక రకాల రసాయనిక రంగులతో తయారవుతున్నాయని, ఈ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లోను, నగరంలోని వివిధ చెరువులలో నిమజ్జనం చెయ్యటం జరుగుచున్నదని చెప్పారు. పర్యావరణ వేత్తల లెక్కల ప్రకారం నిమజ్జనం సమయంలో ఒక్క రోజులోనే హుస్సేన్ సాగర్‌లో  8,000 నుండి 9,000 టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ , పాదరసం, సీసం, నిహాల్, టర్పెంటైన్, రెడ్ ఆక్సైడ్, సిలికాన్ వంటి అనేక విష రసాయనాలు ఉంటున్నాయని కె. వీరయ్య అన్నారు. ఈ విష రసాయనాలు  హుస్సేన్‌సాగర్ మరియు చెరువులలో  కలవటం వలన కాలుష్య సాగరాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
*“మానవ సేవే మాధవ సేవ”*, మానవ సమాజ మనుగడకే ముప్ప్పుగా పరిణమిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరముందని అన్నారు. నగరంలోని కొన్ని చెరువుల చుట్టు ప్రక్కల కాలనీలలోని డ్రైనేజి పైప్ లైన్లు ఆయా చెరువులలో కలిపేస్తున్నారని, ఫలితంగా చెరువులన్నీ కాలుష్య భరితమై దుర్గంధంతో దోమల కేంద్రాలుగా తయారయ్యాయని అన్నారు. వీటికి తోడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయరైన విగ్రహాల నిమజ్జనం ఫలితంగా కాలుష్యం మరింత పెరిగి  పరిసర కాలనీల ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తున్నాయాని చెప్పారు. వీటి కారణంగా  క్యాన్సర్, చర్మవ్యాధులకు గురికావలసి వస్తున్నదని అన్నారు.గత 10 సంవత్సరాల నుండి *“హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం”( హైదరాబాద్ జిందాబాద్)*  ఆధ్వర్యంలో  హెచఎండిఏ సహకారంతో  గ్రేటర్‌లోని 45 కాలనీలలో, అపార్ట్‌మెంట్‌లలో  మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నామని,పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను భక్తితో అందరం పూజిద్దాం అని అన్నారు.ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం *రామంతాపూర్ లో "శ్రీనిధి మహిళా ఫౌండేషన్" ఫౌండర్ చైర్మన్ బాపట్ల పుష్పలత మరియు ఫౌండేషన్ సభ్యులు, "ప్రజాసంకల్పం" ఫౌండర్ బాపట్ల కృష్ణమోహన్*  గత 10 సంవత్సరాలనుండి హైదరాబాద్ సిటిజెన్స్ ఫోరం (హైదరాబాద్ జిందాబాద్)  ఆధ్వర్యంలో హెచఎండిఏ సహకారంతో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణపతుల ఉచిత పంపిణి చేస్తున్నారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హెచ్ఎండిఏ సూపరిండెంట్ ఇంజనీర్  అప్పారావు గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు ఎం.శ్రీనివాసరావు, మోహన్ నాయుడు, పి.శ్రీనివాసరావు, గోపాల్, మల్లం రమేష్, బాపట్ల కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.

'గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు_

*‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 03:

తెలంగాణలోని ములుగు జిల్లా, పాలంపేటలో గల ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీచేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్‌ఐ)  జారీ చేసిన 31.08.2026 నాటి ప్రకటన నెం.ఎస్‌.ఒ.4802(ఇ) ‘గెజిట్ ఆఫ్ ఇండియా’(ప్రత్యేక సంచిక) పార్ట్‌- IIలోని సెక్షన్‌ 3 ఉప సెక్షన్‌ (ii) కింద ప్రచురితమైంది. 
“ప్రాచీన కట్టడాలు-పురావస్తు ప్రదేశాలు-అవశేషాల చట్టం- 1958” (1958నాటి 24వ చట్టం)లోని సెక్షన్ 4, ఉప-సెక్షన్ (3) కింద సంక్రమించిన అధికారాల మేరకు ‘ఏఎస్‌ఐ’ ఈ ప్రకటన జారీ చేసింది. ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో ఈ ‘గొల్లల గుడి’ ఉంటుంది. ఇది తూర్పు ముఖంగా గల మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన ‘త్రికూటాలయం’గా కనిపిస్తుంది.గుడి ప్రహరీ శిల్పాలంకృతమై, పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో, ‘సునిశిత రంధ్రాల వల’ పనితనంతో ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అలరారుతోంది.ళఈ ప్రధాన గుడికి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అలంకృతమై ఉంటాయి. వీటికి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తాయి.
ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగాన మండపం గుండా మధ్యలో గల ప్రధాన మందిరానికి మార్గం ఉంటుంది. దీనికి ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశలలో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉంటాయి. ఆలయ కుడ్యాలపై కనిపించే వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది.

అధికారులు అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆచరించి చూపించిన సీఎండీ_

*మల్కరంలో విద్యుత్ సిబ్బంది భద్రతను టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ స్వయంగా తనిఖీ చేశారు*

*అధికారులు అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆచరించి చూపించిన సీఎండీ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 03:

అధికారులు అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆచరించి చూపించడం అని ఈ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ మరియు ఐఏఎస్ అధికారి జితేష్ వి. పాటిల్, "బస్తీ బటా" కార్యక్రమంలో భాగంగా, క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది అనుసరిస్తున్న భద్రతా పద్ధతులను తనిఖీ చేయడానికి చేవెళ్ల సెక్షన్ పరిధిలోని మల్కరం గ్రామంలోని ఒక విద్యుత్ స్తంభాన్ని స్వయంగా ఎక్కారు.తనిఖీని కేవలం కార్యాలయ సమీక్షకు పరిమితం చేయకుండా, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి మరియు విద్యుత్ లైన్లు, స్తంభాలపై పనిచేసేటప్పుడు అనుసరిస్తున్న భద్రతా విధానాలను వ్యక్తిగతంగా అంచనా వేయడానికి జితేష్ వి. పాటిల్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి అడుగుపెట్టారు.ప్రతి క్షేత్రస్థాయి కార్యకలాపంలో భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఉండాలని నొక్కి చెబుతూ, ఆయన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), భద్రతా పరికరాలు, పని పద్ధతులు మరియు ముందుజాగ్రత్త చర్యల వినియోగాన్ని తనిఖీ చేశారు.ఉద్యోగుల భద్రత విషయంలో ఎటువంటి రాజీకి తావులేదని సీఎండీ గట్టిగా స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ నిర్దేశించిన భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని, మినహాయింపు లేకుండా పీపీఈ (PPE)ని ఉపయోగించాలని ఆయన ఆదేశించారు.ఆయన స్వయంగా రంగంలోకి దిగిన తీరు సిబ్బందికి ఒక బలమైన సందేశాన్ని పంపింది. ఉన్నతాధికారులు తమ ఉద్యోగులకు అండగా నిలుస్తారని, వారి సవాళ్లను అర్థం చేసుకుంటారని మరియు వారి ప్రాణాలకు, భద్రతకు అన్నింటికన్నా అధిక ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.క్షేత్రస్థాయి తనిఖీలో వ్యక్తిగతంగా పాల్గొనడం ద్వారా, శ్రీ జితేష్ వి. పాటిల్ లాంటి అధికారులు క్షేత్రస్థాయిలో ఉండటం, ఆదర్శంగా నిలవడం మరియు ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అని నిరూపించారు.

Monday, August 31, 2026

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్1వ తేదీ నాటికి విజయవంతంగా 1000 రోజుల మైలురాయిని చేరుకుంది_

*వెయ్యి రోజుల ప్రజాపాలన..*

*సంక్షేమం నుంచి ప్రపంచస్థాయి తెలంగాణ*

*ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్1వ తేదీ నాటికి విజయవంతంగా 1000 రోజుల మైలురాయిని చేరుకుంది.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 31:

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల మైలురాయిని చేరుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్నిర్మించడం, సంక్షేమాన్ని విస్తరించడం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, రైతులు–మహిళలు–యువతకు భరోసా కల్పించడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడం, భవిష్యత్తు తెలంగాణకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించడంలో ఈ వెయ్యి రోజుల పాలన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చుఏసింది.
**ఆర్థిక ప్రగతి – బలపడుతున్న తెలంగాణ*
2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరింది. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే దాదాపు 91 శాతం అధికం.సంక్షేమాన్ని కొనసాగిస్తూనే పెట్టుబడులు, ఉపాధి, మౌలిక సదుపాయాలు, సాంకేతిక      రంగాల విస్తరణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు.రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో సాధించిన సమష్టి ప్రగతి.
**రైతన్నకు అండ.. వ్యవసాయంలో తెలంగాణ నంబర్‌–1*.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ. 25 లక్షలకుపైగా      రైతు కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి.రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం. ఒకే విడతలో 9 రోజుల్లో      దాదాపు రూ.9 వేల కోట్ల జమ.సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతు      బీమాతో నిరంతర భరోసా.గడిచిన 32 నెలల కాలానికి      సంబంధించిన లెక్కల ప్రకారం వ్యవసాయం, రైతు సంక్షేమానికి      దాదాపు రూ.1.68 లక్షల కోట్ల వ్యయం.వరి సాగు, ఉత్పత్తిలో పంజాబ్‌ను      అధిగమించి దేశంలో నంబర్‌–1గా తెలంగాణ. గత యాసంగిలో 81.12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి కొత్త రికార్డు.కృష్ణా, గోదావరి జలాల్లో      తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం రాజీలేని పోరాటం.యూరియా కొరత వంటి క్లిష్ట పరిస్థితులను అర్థం      చేసుకుని ప్రభుత్వానికి సహకరించిన రైతన్నలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
**మహిళా సాధికారతలో కొత్త అధ్యాయం*
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత      ప్రయాణం. 335 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు; మహిళలకు దాదాపు రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం      ఆదా.గృహజ్యోతి కింద 53 లక్షలకుపైగా      కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.రాష్ట్రంలోని 4.54 లక్షల మహిళా      సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60,487 కోట్ల      రుణాలు. రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ.
పాఠశాల యూనిఫాంలు, చీరల తయారీ      నుంచి పెట్రోలు బంకులు, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వరకు      మహిళా సంఘాలకు కొత్త వ్యాపార అవకాశాలు.కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న      లక్ష్యంతో మహిళలను తెలంగాణ ఆర్థిక ప్రగతిలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దే      దిశగా ప్రభుత్వం.
**ఆహార భద్రత – ప్రతి పేద కుటుంబానికి భరోసా*
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 15 లక్షలకుపైగా కొత్త రేషన్‌ కార్డుల జారీ.దాదాపు 3.38 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రత.
రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం      పంపిణీతో దేశానికి కొత్త నమూనాగా తెలంగాణ.
ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ.
**సామాజిక భద్రతను మరింత విస్తరిస్తూ కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు.*
మొత్తం 43 లక్షలకుపైగా      వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు,      ఇతర అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు.
**ఇందిరమ్మ ఇండ్లు – పేదవాడి సొంతింటి కలకు భరోసా*
తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ      ఇండ్ల నిర్మాణం. అర్హమైన ప్రతి కుటుంబానికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం.గిరిజనులు, చెంచులు, అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం.
**హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల      టవర్ల నిర్మాణానికి భారీ ప్రణాళిక.*

**సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు*
రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి,      రాజకీయ, కుల సర్వే నిర్వహించి కులాల వారీ      సామాజిక స్థితిగతుల వెల్లడి.సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించి, ఎస్సీ      వర్గీకరణ అమలు చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ.బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే      బిల్లులకు శాసనసభ ఆమోదం.
12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల      సవరణతో దాదాపు కోటి 11 లక్షల మంది కార్మికులకు      ప్రయోజనం.
గిగ్‌ కార్మికులకు చట్టబద్ధ గుర్తింపు, సంక్షేమ బోర్డు, సామాజిక భద్రత కల్పించే      ప్రత్యేక చట్టం.
**విద్యలో సంస్కరణలు.. ప్రభుత్వ బడులకు కొత్త రూపం*
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్‌      గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి పురోగతి.ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌      రెసిడెన్షియల్‌ స్కూల్‌. 105 స్కూళ్ల మంజూరు.ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు; తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లతో ప్రభుత్వ విద్యకు కొత్త రూపం.ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 22 లక్షలకుపైగా విద్యార్థులకు అల్పాహారం, పాలు,      పోషకాహారం. రూ.720 కోట్ల కేటాయింపు.సంక్షేమ హాస్టళ్లలో డైట్‌ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్‌ ఛార్జీలు 212 శాతం పెంపు.
**మెగా డీఎస్సీ ద్వారా 10,006 మంది ఉపాధ్యాయుల నియామకం.*
దాదాపు 11 లక్షల మంది      విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌.      ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్ల      కేటాయింపు.
**యువతకు ఉద్యోగాలు – నైపుణ్యాలకు కొత్త వేదిక*
ప్రజా ప్రభుత్వ తొలి వెయ్యి రోజుల్లో 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. గ్రూప్‌–1 నుంచి డీఎస్సీ వరకు కీలక నియామకాల పూర్తి.టీజీపీఎస్సీ ద్వారా మరో 456 పోస్టులు, పోలీసు నియామక బోర్డు ద్వారా 7,437      పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీలో 1,190 మంది శిక్షణ పూర్తి చేయగా 838 మందికి ప్రముఖ      సంస్థల్లో ఉద్యోగాలు.65 ప్రభుత్వ ఐటీఐలు, 57 పాలిటెక్నిక్‌ కాలేజీలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా      తీర్చిదిద్దడం.యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌      స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌      డిస్ట్రిక్ట్‌తో క్రీడా రంగానికి కొత్త దిశ.
**వైద్య రంగంలో భారీ విస్తరణ – సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు అండ*
రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌లో మూడు టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు.తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు; మరో 17 కాలేజీల నిర్మాణం.
నిమ్స్‌లో 2,000 కిడ్నీ మార్పిడి      శస్త్రచికిత్సల మైలురాయి.
2023 డిసెంబర్‌ 7     నుంచి 2026 ఆగస్టు 12 వరకు      ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5,18,186 మందికి రూ.2,526.12 కోట్ల సాయం.
సీఎంఆర్‌ఎఫ్‌ వైద్య రీయింబర్స్‌మెంట్‌ ద్వారా 4,78,789 మంది పేద రోగులకు రూ.1,635.34 కోట్లు;      39,712 మందికి రూ.798.41 కోట్ల ఎల్‌ఓసీలు.
**ఆహార కల్తీపై ఉక్కుపాదం – కొత్తగా టీజీ సేఫ్‌ ఆహార కల్తీపై తనిఖీలు,శాంపిల్‌ పరీక్షలు, కఠిన చర్యలు.*
ఆహార కల్తీ, డ్రగ్స్‌ ముప్పును      సమగ్రంగా ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్‌ సంస్థ ఏర్పాటు.
ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్‌ నియంత్రణను ఒకే వ్యవస్థ కిందకు తీసుకువచ్చి లీగల్‌, ల్యాబొరేటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలతో      బలోపేతం.
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై విస్తృత దాడులు, కఠిన చట్టపరమైన చర్యలు.
**డ్రగ్స్‌పై రాజీలేని పోరాటం – విద్యాసంస్థలకూ బాధ్యత*
డ్రగ్స్‌పై ఈగల్‌ వ్యవస్థ ద్వారా ప్రత్యేక పోరాటం.      సైబర్‌ నేరాలు, మహిళలు, పిల్లల      భద్రతకు ప్రత్యేక పోలీసింగ్‌.
పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో యాంటీ డ్రగ్‌ అండ్‌ సేఫ్టీ కమిటీలు తప్పనిసరి      చేసే దిశగా చర్యలు.ప్రతి విద్యాసంస్థలో క్యాంపస్‌ కోఆర్డినేటర్లు, స్పాటర్ల ఏర్పాటు; విద్యార్థుల్లో అనుమానాస్పద      ప్రవర్తనా మార్పులను గుర్తించి విద్యాశాఖ, పోలీసులకు      సమాచారం.
విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేసే      విద్యాసంస్థలపై గుర్తింపు సస్పెన్షన్‌ వరకు చర్యలు.
**ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు ప్రత్యేక వ్యవస్థ*
పట్టణాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ, హైవేలు–ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాలను తగ్గించేందుకు కొత్తగా టీజీ      ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరో.పట్టణ ట్రాఫిక్‌ నిర్వహణ, హైవే పెట్రోలింగ్‌, ప్రమాదాల నివారణకు అవసరమైన      నిధులు, ఆధునిక సదుపాయాలతో ప్రత్యేక వ్యవస్థ.ప్రజలకు సాఫీగా, సురక్షితంగా      ప్రయాణం అందించడం ప్రధాన లక్ష్యం.
**ప్రజల వద్దకే పాలన – మండల స్థాయికి ప్రజావాణి*
రాష్ట్ర, జిల్లా, డివిజన్‌ స్థాయి ప్రజావాణి విజయవంతమైన నేపథ్యంలో ప్రజల సమస్యలను వారి      మండలంలోనే పరిష్కరించేలా అన్ని ఎంపీడీవో కార్యాలయాలకు మండల ప్రజావాణి      విస్తరణ.ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులంతా ఒకేచోట      అందుబాటులో ఉండి అర్జీల పరిష్కారం. చిన్న సమస్యల కోసం ప్రజలు జిల్లా, రాష్ట్ర స్థాయికి వెళ్లాల్సిన అవసరం తగ్గింపు.త్వరలో ఆన్‌లైన్‌ ప్రజావాణి పోర్టల్‌.      రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఆన్‌లైన్‌లో అర్జీల నమోదు. అర్జీల పరిష్కార పురోగతిపై ప్రత్యేక డాష్‌బోర్డు.   ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిరంతర      పర్యవేక్షణ.99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో 12,758      గ్రామసభలు, 3,175 వార్డుసభల నిర్వహణ.
**భూ పరిపాలన – ఉద్యోగులకు భరోసా – డిజిటల్‌ గవర్నెన్స్‌*
భూ భారతి చట్టం, భూధార్‌,      ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు. 3.76 లక్షల      కొత్త పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ జారీ.ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందించేలా ఆర్థిక      క్రమశిక్షణ.కొన్నేళ్లుగా పేరుకుపోయిన రిటైర్డ్‌ ఉద్యోగుల      బకాయిల్లో వంద రోజుల్లో రూ.600 కోట్ల చెల్లింపు.
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య      భద్రతకు ఎంప్లాయీ హెల్త్‌ స్కీమ్‌.
ప్రభుత్వ ఆదాయం పెంచడం నుంచి సంక్షేమ పథకాలను      చివరి లబ్ధిదారుడికి చేర్చడం వరకు కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేక అభినందనలు.36 సచివాలయ శాఖల్లో 100 శాతం ఈ-ఆఫీస్‌.
దేశంలో తొలి పూర్తిస్థాయి డిజిటల్‌ కేబినెట్‌.      వాట్సాప్‌లో 581కిపైగా ప్రభుత్వ సేవలు.
**ఆదాయ లీకేజీలకు చెక్‌ – ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు*
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టకుండా      విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖల్లో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌      విభాగాల ఏర్పాటు.
పౌరసరఫరాలు, మైన్స్‌ అండ్‌      మినరల్స్‌, జీఎస్టీ తదితర రంగాల్లో ఆదాయ నష్టాలు,      ఎగవేతలను గుర్తించి అరికట్టే ప్రత్యేక చర్యలు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచి అదే వనరులను ప్రజా      సంక్షేమం, అభివృద్ధికి వినియోగించాలన్న ప్రభుత్వ లక్ష్యం.
**ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు*
హైదరాబాద్‌ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్డు.
రాష్ట్రవ్యాప్తంగా 6,092     కిలోమీటర్ల హ్యామ్‌ రోడ్ల ప్రణాళిక.హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణ. మామునూరు విమానాశ్రయం, ఆదిలాబాద్‌ ఎయిర్‌ఫీల్డ్‌ అభివృద్ధి.
మూసీ పునరుజ్జీవనంలో 55 కిలోమీటర్ల సమగ్ర అభివృద్ధి; 39 కొత్త      ఎస్టీపీలు.
గోదావరి నుంచి 2.5 టీఎంసీల      స్వచ్ఛమైన నీటిని మూసీకి తరలించే ప్రణాళిక.
**పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ*
బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌లో కీలక      రంగాల్లో తెలంగాణ టాప్‌ అచీవర్‌.
టీజీ-ఐపాస్‌ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు.తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు.టీజీఐఐసీ భూముల్లో రూ.92,281 కోట్ల పెట్టుబడులు; 78 వేలకుపైగా ఉద్యోగ      అవకాశాలకు మార్గం.నెక్స్ట్‌-జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీతో రూ.73,360 కోట్ల పెట్టుబడులు, 3.5 లక్షల ఉద్యోగ అవకాశాల      లక్ష్యం.తెలంగాణపై విశ్వాసంతో పెట్టుబడులు పెడుతున్న దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కృతజ్ఞతలు.
**ఐటీ – ఏఐ – గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లలో దూసుకెళ్తున్న తెలంగాణ*
2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97      లక్షల కోట్లు. 12.14 లక్షల ప్రత్యక్ష ఐటీ      ఉద్యోగాలు.హైదరాబాద్‌లో 355కిపైగా గ్లోబల్‌      కెపాబిలిటీ సెంటర్లు. 2026లోనే మరో 40 కొత్త కేంద్రాలు హైదరాబాద్‌ను ఎంచుకోవడం.
డేటా సెంటర్లు, క్లౌడ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో దేశంలో అత్యంత వేగంగా      ఎదుగుతున్న గమ్యస్థానాల్లో తెలంగాణ.అమెజాన్‌ నుంచి తెలంగాణకు అదనంగా 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి.దేశంలో తొలి స్టేట్‌ ఏఐ డేటా ఎక్స్చేంజ్‌–టీజీడెక్స్‌      ఏర్పాటు.
**పర్యాటకం – తెలంగాణ సంస్కృతికి కొత్త గుర్తింపు*
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సమగ్ర టూరిజం      పాలసీ–2025.ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల      పెట్టుబడుల లక్ష్యం పెట్టుకోగా తొలి ఏడాదిలోనే రూ.23,174 కోట్ల పెట్టుబడులు.యువ టూరిజం క్లబ్‌ల ఏర్పాటులో తెలంగాణ దేశంలో      నంబర్‌–1.
*‘జయ జయహే తెలంగాణ’ గీతానికి అధికారిక      గౌరవం. తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ.*
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి సముచిత గౌరవం      కల్పించేందుకు ప్రత్యేక కమిటీ.
**తెలంగాణ రైజింగ్‌–2047.. వెయ్యి రోజుల తర్వాత మరింత పెద్ద లక్ష్యం*
వెయ్యి రోజుల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి వేసిన పునాదులపై      భవిష్యత్తు తెలంగాణ నిర్మాణం.2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్‌      డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌      డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యం.క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ అభివృద్ధి వలయాలతో హైదరాబాద్‌ నుంచి గ్రామీణ తెలంగాణ వరకు      సమగ్ర అభివృద్ధి.భారత్‌ ఫ్యూచర్‌ సిటీని దేశంలో తొలి నెట్‌-జీరో      స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళిక.ఏఐ సిటీ, డేటా సెంటర్లు,      రీజనల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రెండో దశ,      మూసీ పునరుజ్జీవనం, యంగ్‌ ఇండియా      స్కిల్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీతో      భవిష్యత్తు తెలంగాణకు బలమైన పునాదులు.

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి_

*తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి*

*దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమావేశం*

*₹50,870 కోట్ల అంచనా వ్యయంతో, 2,023 కి.మీ మేర విస్తరించి ఉన్న 17 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు (DPRలు)*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 31:

రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించేందుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం నాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్ మరియు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలు, భూసేకరణ, వివిధ శాఖల నుండి అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులు మరియు ప్రాజెక్టుల సకాలంలో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన సహకారం వంటి అంశాలపై చర్చించారు.తెలంగాణ ఆర్థిక, పారిశ్రామిక మరియు ప్రాంతీయ అభివృద్ధికి రైల్వే అనుసంధానం అత్యంత కీలకమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను మరియు జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ₹50,870 కోట్ల అంచనా వ్యయంతో, 2,023 కి.మీ మేర విస్తరించి ఉన్న 17 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ DPRలను రైల్వే బోర్డుకు సమర్పించినట్లు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు.
**పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి*
రైల్వే అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం, అప్రోచ్ రోడ్లు, రోడ్ల విస్తరణ, రైల్వే లైన్ల డబ్లింగ్, చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రజా రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడం వంటి సుమారు 21 సమస్యలను ఈ సమావేశంలో సమీక్షించారు.పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తగిన పరిష్కారాలను గుర్తించేందుకు, దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సంయుక్త తనిఖీలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఫ్యూచర్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాంతాలలో రైల్వే లైన్ల విస్తరణకు తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే ప్రాజెక్టుల అమలును సులభతరం చేయడానికి పురపాలక పరిపాలన, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్ (HMWSSB), రెవెన్యూ, ఇంధన, రోడ్లు & భవనాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కూడా ఆయన సూచించారు.ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరంతర సమన్వయం పాటించాలని ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అవసరమైన సహకారం, మద్దతు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
**పిఎమ్ PM గతి శక్తి కింద నిధుల సమీకరణ*
భారత ప్రభుత్వ 'పిఎమ్ గతి శక్తి' (PM Gati Shakti) పథకం కింద నిధులను పొందేందుకు సమగ్రమైన 'వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికల'ను (DPRs) సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అలాగే, నగరం యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని MMTS విస్తరణ, హైదరాబాద్ చుట్టూ ఉన్న ORR మరియు RRR ప్రాంతాలలో రైల్వే టెర్మినళ్ల ఏర్పాటు, మరియు బుల్లెట్ ట్రైన్ కారిడార్లతో సహా భవిష్యత్తు రైల్వే అనుసంధానానికి అవసరమైన భూసేకరణ కోసం సమగ్ర DPRలను రూపొందించాలని ఆయన సూచించారు.రాష్ట్ర భవిష్యత్తు వృద్ధి మరియు అభివృద్ధికి అత్యవసరమైన రైల్వే మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.ఈ సమావేశంలో GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, TGIIC MD శశాంక, RTC MD నాగిరెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, మేడ్చల్-మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సిటీ పోలీస్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, నిర్మల్, జనగాం మరియు వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, అలాగే దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సేవలను గుర్తుచేసుకుంటూ ఘనంగా సన్మానం చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, IPS_

*సైబరాబాద్‌లో ఐదుగురు పోలీస్ అధికారుల పదవీ విరమణ*

*సేవలను గుర్తుచేసుకుంటూ ఘనంగా సన్మానం చేసిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, IPS.*

బాపట్ల కృష్ణమోహన్, ఆగస్టు 31:

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీస్ అధికారులకు వీడ్కోలు కార్యక్రమం సోమవారం సైబరాబాద్ సీపీ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.పదవీ విరమణ పొందుతున్న SI ఎం. రవీందర్ రెడ్డి (కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్), SI పి. విజయ్ భాస్కర్ రెడ్డి (SB సైబరాబాద్), RSI ఫరీద్ ఖాన్ (సైబరాబాద్ CAR హెడ్‌క్వార్టర్స్), ASI టి. కేశవులు (అత్తాపూర్), HG ఏబీ శర్మ (బాలానగర్ ట్రాఫిక్)లను పోలీస్ శాఖ ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన అధికారులు పదవీ విరమణ పొందడం ఒక కొత్త జీవిత అధ్యాయానికి నాంది అని అన్నారు. విధి నిర్వహణలో అధికారులు అందించిన సేవలు, అనుభవం పోలీస్ శాఖకు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు తమ విధులను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో వారి సహధర్మచారులు, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని సీపీ అన్నారు. కుటుంబ సభ్యుల మద్దతు లేకుండా పోలీసు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు.పదవీ విరమణ అనంతరం అధికారులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందంగా సమయం గడపాలని సీపీ సూచించారు. ఖాళీగా ఉండకుండా సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి తమ వంతు సేవ చేయాలని కోరారు. హైదరాబాద్ నగరం, సైబరాబాద్ ప్రాంతం అభివృద్ధిలో పోలీస్ శాఖ కూడా తన వంతు కీలక పాత్ర పోషించిందని, ఆ అభివృద్ధిలో భాగస్వాములైన పోలీస్ అధికారులు గర్వపడాలని సీపీ అన్నారు.
 పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి అందే రిటైర్మెంట్ ప్రయోజనాలు, డబ్బులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. పోలీస్ శాఖకు అవసరమైన సందర్భాల్లో పదవీ విరమణ పొందిన అధికారులు తమ అనుభవం, సూచనలతో శాఖకు సహకరించాలని సీపీ కోరారు. అనంతరం పదవీ విరమణ పొందిన అధికారులను సీపీ సన్మానించి, వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ శ్రీమతి అన్నపూర్ణ, ఎస్ బీ డీసీపీ సుధీంద్ర,  హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్  , హెడ్‌క్వార్టర్స్ అడిషనల్ డీసీపీ షమీర్తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.