Friday, June 12, 2026

మానవత్వం,సహాయం అందించడం లో ఎప్పుడు ముందుడే "క్రైమ్ రిపోర్టర్" విజయ్ కుమార్_

*మానవత్వం పరిమళించే - CPR చేసి మహిళ ప్రాణాలు కాపాడిన "క్రైమ్ రిపోర్టర్"*

*మానవత్వం,సహాయం అందించడం లో ఎప్పుడు ముందుడే "క్రైమ్ రిపోర్టర్" విజయ్ కుమార్*

*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త*
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

మౌలాలి రైల్వే స్టేషన్ లో జనవరి 5,2026 న జరిగింది ఈ సంఘటన.ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వస్తున్న మహిళ మౌలాలి లో స్టేషన్ కు చేరుకున్న తరువాత ట్రైన్ లో నుండి దిగుతూ కాలు జారీ ట్రైన్ కింద పడిపోయింది.అందరు చూస్తున్నారు కానీ ఆపదలో ఉన్న ఆ మహిళ వద్దకు వెళ్లి సహాయం చేద్దాం అనే వారు కరువయ్యారు. ఇదే ట్రైన్ లో ఖమ్మం నుంచి వస్తున్న సురేష్ ఈ సంఘటన చూసి తన మిత్రుడు అయిన *క్రైమ్ రిపోర్టర్ విజయ్ కుమార్* కు ఫోన్ చేయగా  "యాదృచ్ఛికం" గా మౌలాలి పరిసర ప్రాంతంలో ఉన్న విజయ్ కుమార్ వెంటనే మౌలాలి రైల్వేస్టేషన్ కు వెళ్లి ట్రైన్ కింద పడిపోయిన మహిళను పైకి లాగి మహిళకు CPR(కార్డియోపల్మోనరీ రిససిటేషన్ - Cardiopulmonary Resuscitation) చేసి ఆ మహిళను అంబులెన్సు లో తీసుకెళ్లి ప్రాణం కాపాడిన రామంతాపూర్ కి చెందిన హైదరాబాద్ క్రైమ్ రిపోర్టర్ విజయ్ కుమార్.ఎవరైనా గుండెపోటుతో పడిపోయినా లేదా శ్వాస ఆడక స్పృహ కోల్పోయినా, వెంటనే సీపీఆర్ చేయడం వల్ల మెదడుకు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కొనసాగుతుంది. ఇది వారి ప్రాణాలను కాపాడే అవకాశం.ప్రతి ఒక్కరు CPR శిక్షణ (Training), ప్రథమ చికిత్స (First-aid) గురించి అవగాహన చేసుకుంటే ఇలాంటి సమయంలో ప్రాణాలను కాపాడవచ్చు.ఈ సమాజంలో ఎవరికి ఏమైతే నాకు ఏంటి అనుకునే ఈ వ్యవస్థలో మహిళను కాపాడిన సీనియర్ క్రైమ్ రిపోర్టర్ కి అభినందనలు.

బాలకార్మిక వ్యవస్థను రూపు మాపాలి - అనురాధ రావు బాలల హక్కుల సంఘం_

*జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం...*

*బాల కార్మికం కాదు - బాల్యాన్ని హత్య చేయడం*

*బాలకార్మిక వ్యవస్థను రూపు మాపాలి - అనురాధ రావు బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

పాలు కావలని అడిగే చేతులు - పనిముట్లను,ఇటుకలను మోస్తున్నాయి, ఇది బాల కార్మికం కాదు - బాల్యాన్ని హత్య చేయడం. *International labour Organization* 2003 లో బాలకార్మిక వ్యవస్థను రూపు మాపడానికీ, దీని గురించి అవగాహనకల్పించడం, కావల్సిన చర్యలు తీసుకోవడానికి ఈ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది.138 మిలియన్ పిల్లలు అంటే 13.8 కోట్ల చిన్నారులు బాల కార్మికులుగా మగ్గుతున్నారు. దీంట్లో 54 మిలియన్ / 5.4 కోట్ల మంది చిన్నారులు హానికరమైన పనుల్లో బలైతున్నారు.ఒక చిన్నారి రాత్రి 12 గంటల వరకు పని చేసి, ఉదయం పుస్తకాల సంచితో స్కూల్ కు వెళ్ళితే, ఆ బ్యాగు బరువు పుస్తకాలది కాదు, తన బాల్యానిది.చాలా వరకు చిన్న పిల్లలు పాలకోసం లేస్తారు కాని, ఈ చిన్నారులు పనికోసం లేస్తున్నారు. వీరిచేతుల్లో పుస్తకాలకు బదులుగా స్తుత్తి, పార, ఇటుకలు మోస్తూ, హోటల్స్లో టీ కప్పులు కడుగుతూ, ప్లేట్లు తీస్తు కనిపిస్తారు, ఇండ్లల్లో పనులు చేస్తూ ఉంటారు.కారణం పేదరికం, అనాధలుగా మరడం, ప్రజల్లో అవగాహన లేకపోవడం, ట్రాఫికింగ్ కు గురి కావడం.ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి, ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టం గా కనబడుతోంది.మన దేశంలో ప్రతి ఆరునెలలకు ఒక రిస్క్యు ఆపరేషన్ జరుగుతుంది, జులై నెలలో ఆపరేషన్ ముస్కాన్, జనవరిలో ఆపరేషన్ స్మైల్. దీంట్లో తప్పిపోయిన చిన్నారులను, బాలకార్మికులను రెస్క్యూ చేసి వారి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు.కాని సంవత్సరాలు మారుతున్నాయి,
బాలకార్మిక వ్యవస్థలో మార్పు లేదు. ఆపరేషన్ ముస్కాన్లో దొరుకుతున్నారు, ఆపరేషన్ స్మైల్లో దొరుకుతున్నారు. అది
ఒక మొక్కుబడి కార్యక్రమం అని అనుకోవచ్చు. కారణం ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుంతుంది.మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎక్కువ బాలకార్మికులు ఉన్నారు, వారు ఇతర రాష్ట్రాలకు కూడా ముఠాలు తీసుకుని వెళుతాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ మరియు మహారాష్ట్ర.ప్రతి చిన్నారి స్కులుకు వెళ్లాలి, బాల కార్మిక వ్యవస్థ నుండి విముక్తి కల్పించాలి.బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యాజమాన్యాన్ని, వారి ఫ్యాక్టరీలను/ సంస్థలను ఇటుక బట్టీలు, నిర్మాణ సంస్థలు, హోటల్స్, గాజుల ఫ్యాక్టరీలు, ముఖ్యంగా బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీలు ఏవైనా సరే సీజ్ చేసి కఠినంగా శిక్షలు,భారి జరిమాన విధించాలి.ప్రతిఒక్కరు తమ బాధ్యతగా ప్రతిజ్ఞ చేయాలి ,నా చుట్టూ ఉన్న పిల్లలను పని చేయకుండా స్కూల్ కు పంపుతాను అనే ప్రతిజ్ఞ చేద్దాం. ఆటపాటలతో వారి బాల్యాన్ని కాపాడటానికి మన వంతు కృషి చేద్దాం. బాల్యాన్ని చిదిమి వేయకుండా బడికి వెళ్లే విధంగా చుద్దాం - వారికి చేయుత నిద్దాం.

GHMC అంబర్పేట్ సర్కిల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు_

*GHMC అంబర్పేట్ సర్కిల్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు*

*అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోని GHMC కమీషనర్, సికింద్రాబాద్ జోనల్ కమీషనర్,అంబర్పేట్ డిప్యుటీ కమీషనర్*

*అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను GHMC అధికారులు గౌరవిస్తలేరు - బాపట్ల కృష్ణమోహన్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:

అంబర్పేట్ బాపు నగర్ అంబికా సారీస్ పక్కన నిర్మిస్తున్న నిర్మాణం అక్రమమా? సక్రమమా? అంబర్పేట్ సర్కిల్ డిప్యుటీ కమీషనర్ సమాధానం చెప్పాలి.ఐదు ఫ్లోర్లు పెంట్ హౌస్ కూడా వేశారు.అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.ఐదు ఫ్లోర్లు & పెంట్ హౌస్ వేసే దాకా GHMC అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు ? TGBPASS / బిల్డ్ నౌ లో అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ అంతస్తులు నిర్మించడం. సెట్‌బ్యాంక్ ఉల్లంఘనలు అంటే స్థలాన్ని వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేస్తున్నారు. కమర్షియల్ మార్పులు అంటే నివాస భవనాలను వాణిజ్య సముదాయాలుగా మారుస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తుంటే తక్షణమే ఆ నిర్మాణంను ఆపితే యజమానికి నష్టం జరుగదు. లేకపోతే అట్టి అక్రమ నిర్మాణంను అడ్డుపెట్టుకొని అవినీతి GHMC అధికారులతో కుమ్మక్కై కొందరు ప్రజాప్రతినిధులు / రాజకీయ నాయకులు / మీడియా ప్రతినిధులు అక్రమ నిర్మాణ యజమాని వద్ద అక్రమంగా డబ్బులు తీసుకుంటుండ్రు అని నిత్యం ఫిర్యాదులు.వీళందరు కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆధాయానికి గండి కొడుతున్నారు.ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి, వ్యవస్థలకు తీరని నష్టం.మున్సిపల్ చట్టాలను, TGBPASS నిబంధనలు ఉల్లంగించి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు అని గతంలో కూడా "మీడియా టుడే" లో వార్త కథనాలు వచ్చాయి. అధికారులు చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. కానీ ఈరోజు వరకు ఎలాంటి చర్యలు లేవు అంటే అవినీతి కి పాల్పడుతున్న అంబర్పేట్ జిహెచ్ఎంసి అధికారులు అని క్లియర్ గా అర్ధం అవుతుంది. నిబంధనలను ఉల్లంఘించిన వాటిపై GHMC కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి భవనాలను సీజ్ చేస్తున్నాం అన్నారు కానీ ఆలా జరగడం లేదు.సీజ్ చేసిన భవనాలు పూర్తి కూడా అయి గృహప్రవేశం అయిన సందర్భాలు ఎన్నో.
రాజకీయ రక్షణ, ఉన్నతాధికారుల అండదండలు ఉండటం వల్లనే అవినీతి అధికారులు వందల కోట్ల అక్రమాస్తులను కూడబెట్టగలుగుతున్నారు.తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు అని అర్ధం అవుతుంది.ఇలాంటి అక్రమ నిర్మాణాల గురించి నిత్యం ప్రభుత్వ అధికారిక మాద్యమాలు అయిన ట్విట్టర్ / ఇంస్టాగ్రామ్ / ఫేస్ బుక్ ద్వారా సీఎం కమ్ పురపాలక శాఖ మంత్రివర్యులు రేవంత్ రెడ్డికి,తెలంగాణ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ముఖ్య కార్యదర్శికి,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (MA&UD & HMDA) జయేష్ రంజన్,IAS కు,జిహెచ్ఎంసి కమీషనర్ కు,సైబరాబాద్ కమిషనర్ కు, మల్కాజిగిరి కమీషనర్ కు, అన్ని జోనల్ కమిషనర్లకు కు, డిప్యుటీ కమీషనర్లకు వందల ఫిర్యాదులు.GHMC ట్విట్టర్ ఆన్లైన్ లో ఎన్నిసార్లు 
ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటాం అని సమాధానం వస్తుంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు ? అక్రమ నిర్మాణాల విషయంలో తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలను గౌరవించరు ఎందుకు ?అక్రమ నిర్మాణాల ముందు అవి ‘నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలు’ అని తెలిసే విధంగా బోర్డులు పెట్టాలని హైకోర్టు గతంలో అభిప్రాయం వ్యక్తం చేసింది. అయినా అధికారులు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?.ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ అక్రమ నిర్మాణాల పై మౌనం వహిస్తే ఎట్లా ? అంబర్పేట్ సర్కిల్ లో చాలా అక్రమ నిర్మాణాల ఫిర్యాదులు ఉన్నాయి వీటిపై పూర్తిగా విచారణ జరిపించాలి... బాపట్ల కృష్ణమోహన్.

Thursday, June 11, 2026

బ్రతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించి భూమి కాజేయాలన్న కుట్ర బట్టబయలు..!

*బ్రతికి ఉన్న మహిళను చనిపోయినట్టుగా చూపించి భూమి కాజేయాలన్న కుట్ర బట్టబయలు..!*

*ప్రజావాణిలో ఫిర్యాదు – విచారణకు ఆర్డీఓ ఆదేశాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 10:

నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండలం ఇటుకులపాడు గ్రామానికి చెందిన గందం జ్యోతి భర్త అశోక్ తనకు పూర్వీకుల ఆస్తిలో రావలసిన మూడు ఎకరాల 10 గుంటల భూమిని అక్రమంగా కాజేయడానికి జరిగిన భారీ కుట్రపై న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు వివరాల ప్రకారం, తాను బ్రతికి ఉండగానే చనిపోయినట్టుగా తప్పుడు పత్రాలు, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి, తన అన్న అయిన బొడ్డు విజయ్ (తండ్రి వీరమల్లు) కొందరు అధికారులతో కుమ్మక్కై అక్రమ పట్టా పొందినట్లు ఆరోపించారు. తనకు చట్టబద్ధంగా రావలసిన వాటా భూమిని దోచుకునేందుకు ఈ కుట్ర జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు గందం జ్యోతి ప్రజావాణి ఫిర్యాదు నంబర్: PV-B 172/2026, తేదీ: 04-06-2026 ద్వారా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన నల్లగొండ జిల్లా ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి గారు విచారణ జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శాలి గౌరారం తహసీల్దార్ (ఎంఆర్వో)కు ఆదేశాలు జారీ చేశారు.*ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి..*:ఒక మహిళ బ్రతికి ఉండగానే ఆమెను ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్టుగా చూపించేంత ధైర్యం ఎవరిచ్చారు? తప్పుడు ధ్రువపత్రాలు ఎలా జారీ అయ్యాయి? అక్రమ పట్టా పొందడానికి ఎవరు సహకరించారు? ప్రభుత్వ భూముల రికార్డులను తమ ఇష్టానుసారం మార్చుకునే మాఫియాలకు అధికార యంత్రాంగంలో అండదండలు ఉన్నాయా? ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై, వాటికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గందం జ్యోతికి చట్టబద్ధంగా రావలసిన భూమిని అప్పగించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

హైదరాబాద్ ఉప్పుగూడలోని విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ పై ఫిర్యాదు – నర్సరీ విద్యార్థిని పట్ల దుర్వ్యవహారం మరియు నిర్లక్ష్య వైఖరి గురించి.

*హైదరాబాద్ ఉప్పుగూడలోని విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ పై ఫిర్యాదు – నర్సరీ విద్యార్థిని పట్ల దుర్వ్యవహారం మరియు నిర్లక్ష్య వైఖరి గురించి.*

*హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులకు తల్లితండ్రుల ఫిర్యాదు*

*మీడియా టుడే ను ఆశ్రయించిన పేరెంట్స్*

*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 10:

మా కుమార్తె జె. శ్రీనికా (నర్సరీ) ఉప్పుగూడ హనుమాన్ నగర్ లో ఉన్న విగ్నాన్ మోడల్ హైస్కూల్‌ లో నర్సరీ చదువుతోంది. ఆమెకు సంబంధించిన ఒక తీవ్రమైన అంశాన్ని బాధ్యత గల తల్లితండ్రులుగా మేము జె.శ్రీ సాయి హరికిరణ్ (తండ్రి),
జె. రవళిక (తల్లి)హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తేది 20-04-2026 న తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.20-04-2026 తేదీన మా కుమార్తె రిపోర్ట్ కార్డ్ తీసుకోవడానికి తల్లి జె. రవళిక పాఠశాల వెళ్లినప్పుడు, స్కూల్ అడ్మిన్ సిబ్బంది (శ్రీమతి స్వప్న) రిపోర్ట్ కార్డ్ అందజేసి, ఎటువంటి సరైన కారణం లేదా వివరణ ఇవ్వకుండా మా కుమార్తెను పాఠశాల నుండి తీసుకెళ్లాలని సూచించారు. ఈ విధమైన ప్రవర్తన పూర్తిగా అనుచితమైనది మరియు ఆమోదయోగ్యం కానిది.
అంతేకాకుండా, గతంలో ఒక ఉపాధ్యాయురాలు మా కుమార్తెపై శారీరకంగా దాడి చేసిన సంఘటనను కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఆమె ముఖంపై ఉపాధ్యాయురాలి వేళ్ల గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ఈ విషయంపై మేము పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించినప్పుడు, వారు బాధ్యతారాహిత్యంగా స్పందించి మా ఆందోళనలను సరైన విధంగా పరిష్కరించలేదు.ఇంకా, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవర్తన కూడా అత్యంత అవృత్తిపరమైనది మరియు అవమానకరమైనది. ఆమె అహంకారపూరితమైన మరియు అనుచితమైన భాషను ఉపయోగిస్తూ, “మీరు ఎవరికి కావాలంటే వారికి ఫిర్యాదు చేసుకోండి, నాకు ఎలాంటి సమస్య లేదు” అని సిబ్బంది, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో వ్యాఖ్యానించారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి నుండి ఇటువంటి ప్రవర్తన చాలా ఆందోళనకరమైనది.ఇలాంటి వాతావరణం చిన్నపిల్లల భద్రతకు మరియు మానసిక వికాసానికి హానికరంగా ఉంటుంది.అందువల్ల హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణించి, పాఠశాల యాజమాన్యం మరియు సంబంధిత సిబ్బంది దుర్వ్యవహారంపై తగిన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, విద్యార్థుల భద్రత, గౌరవం మరియు సంక్షేమాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.తేది 13-05-2026 నాడు  RTIA పిటిషన్ హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు... స్పందన కోసం తల్లితండ్రులు వేచి చూస్తున్నాము అని అన్నారు.

Monday, June 8, 2026

_NEET - యూజీ 2026పరీక్ష పేపర్ లీక్ - లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేసింది_

*NEET - యూజీ 2026పరీక్ష పేపర్ లీక్ - లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేసింది*

*ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది*

*CBSE 2026 On Screen Marking - OSM విధానంలో లోపాలు*

*అనురాధ రావు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 8:

ప్రపంచ సమయాన్ని మార్చే ముందు భూమధ్య రేఖ ఎక్కడ ఉందో మన  కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి తెలుసా? April నెల 2026 ఉజ్జయినిలో జరిగిన అంతర్జాతీయ "Master of Time సదస్సు" లో ధర్మేంద్ర ప్రదాన్ గారు మాట్లాడుతూ, ప్రపంచం ఇప్పుడు ఉపయోగిస్తున్న Greenwich Mean Time (GMT)
స్థానంలో మహకాల్ స్టాండర్డ్ టైం పరిగణలోకి  తీసుకోవాలని సూచించిన మహా మేధావి మన కేంద్ర విద్యాశాఖ మంత్రి .ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఎంటంటే,ఉజ్జయినిలో ఈ భుమధ్య రేఖ మరియు కర్కాటక రేఖ  కలుస్తాయని చెప్పారు.అంటే ఎంత మేధావో మన మంత్రి గారు, అవి సమాంతర రేఖలు, భౌగోళికంగా కలిసే అవకాశం లేదు అనే విషయం తెలియదా? అందుకే విద్యాశాఖ మంత్రి అయ్యారు.ప్రపంచ సమయ ప్రమాణాన్ని మార్చడం అనేది అంతంతీయ స్థాయి విషయం అని కూడ తెలియని మేధావి చేతిలో విద్యావ్యవస్థ ఉంది.ఒక దేశ ప్రధాని కాని,మంత్రి కాని ఈ టైం మార్చగలరా? May 3వ తేదిన NEET UG 2026 పరీక్ష నిర్వహించారు,22 లక్షలకు పైగా విద్యార్థులు రాశారు.
ప్రతి సంవత్సరం లాగే పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ కావడం,పరీక్ష రద్దు చేయడం జరిగింది.సంవత్సరాలు మారుతున్నాయి కాని పేపర్ లీకేజీ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ప్రభుత్వం.
పరీక్ష రద్దు,మళ్లి పరీక్ష నిర్వహణ అనే స్థాయికి ఎదిగాం.ఒక పేపర్ లీక్ అంటే లక్షాలాది విద్యార్థులను,వారి కుటుంబాలను అతలాకుతలం చేయడం.ఎన్ని కుటుంబాలు ఆవేదనకు గురైతాయి? తల్లిదండ్రులు తమ కలలను పిల్లల పై పెట్టుకుంటారు. ఆ కలలు బుడిదైతే బాధ్యత ఎవరిది?.NEET కోసం ఆరవ తరగతి నుండే కోచింగ్ ప్రారంభం అవుతుంది.దానికోసం అధిక ఫీజులు వసూలు చేస్తాయి పాఠశాలలు.ఇంటర్ లో సెపరేట్ కోచింగ్.ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలిసిన విషయమే. ఒక సాధారణ కుటుంబం మళ్లి మళ్లి ఇలా ఖర్చు చేయాలి అంటే ఆ కుటుంబం వీధిన పడ్డట్టు.అటు మానసికంగా, ఇటు ఆర్థికంగా దెబ్బ తింటున్న కుటుంబాలు ఎన్నో.ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇక ఈ సమస్య ఉండగానే CBSE 2026 On Screen Marking - OSM విధానంలో లోపాలు బయట పడ్డాయి. వేల సంఖ్యలో విద్యార్థులు మార్కింగ్ లోపాల పై ఫిర్యాదులు చేశారు.ఒకరి ఆన్సర్ షీట్ వేరే వాళ్ళకు, ఒకరికి ఖాలీ షీట్, ఒక ప్రశ్న కు వేరే ఆన్సర్ అలా రకాల రకాలుగా వచ్చాయి. 
ఇక దరఖాస్తుల పేరిట 100 రూపాయలు, వెరిఫికేషన్కు వంద, ప్రశ్నలు చూడాలి అంటే ప్రతి ప్రశ్నకు 25 రూపాయలు ఇలా దోచుకోవడం. అవకతవకలపై విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్నారు - వ్యత్యాసాలు ఉన్నాయి అని కాజువల్ అన్నారు.కాని ఏం చేశారు ఆ తప్పు చేసిన వారిని ?  
2019 లో గ్లోబరీనా చేసిన నిర్వాకానికి 25 మంది విద్యార్థులు బలి అయ్యారు. ఇలాంటి
అదే గ్లోబరీనా కంపెనీకే (పేరు మార్చుకున్నా) ఈ On Screen Marking పనిని అప్పగించారు.
ఇట్లా జరిగితే వేరే ఏదేశ ప్రజలైనా నిలదిసే వారు, కాని మన దేశంలో నాకెందుకు అని అనుకోవడం.
ఇదే తమ పిల్లలకు జరిగితే ఊరుకుంటారా? మనకున్న చట్టాలను గౌరవిస్తే ఇన్ని దారుణాలు జరిగేవా? ఇంత మంది విద్యార్థులు చనిపోతే కనీసం బాధ్యత లేని ప్రభుత్వం.
మన ప్రధానమంత్రి కి చదువు గురించి పట్టదు, పిల్లలు ఆశగా మన్ కి బాత్ ప్రోగ్రాం చూస్తే/వింటే ఒక్క మాట కూడ ఈ సమస్యలపై స్పందించలేదు.ఎప్పుడైతే విద్యావ్యవస్థ పై నమ్మకం కోల్పోతామో,భవిష్యత్తు పై నమ్మకం కోల్పోతాం.ఇలాంటి వారు వారి పదవులకు రాజీనామ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్.6వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు జరిగిన అన్యాయం గురించి నిరసన ప్రదర్శన జరిగింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆ ప్రదర్శన లో బాలల హక్కుల సంఘం తరఫున తమ డిమాండ్ తెలిపింది.సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లల సమస్యల పట్ల మన గొంతు విప్పుదాం. మళ్లి ఇవి పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిదే,కాని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా ఉంది, న్యాయ వ్యవస్థను పటిష్ట చట్టపరమైన చర్య తీసుకోవాలి అని విన్నపం.

మృగశిర కార్తె శుభ సందర్భంగా అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

*మృగశిర కార్తె శుభ సందర్భంగా అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 8:

వానాకాలం వ్యవసాయానికి శ్రీకారం చుట్టే మృగశిర కార్తె ప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో అన్నదాతలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయం పండుగగా, తొలకరి పలకరింపు రైతులు, రైతు కూలీల ఇళ్లల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు. వాతావరణ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలను పరిగణలోకి తీసుకుని రైతులు పంటలకు సిద్ధం కావాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల్లో వేగంగా వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందస్తు అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రైతాంగాన్ని కోరారు.కొన్ని పరిమితమైన పంటల సాగుపైన దృష్టి సారించడం వల్ల పప్పుధాన్యాలు, వేరుశనగ, పెసలు, మినుములు, నువ్వులు వంటి పంటలను దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.ఇలాంటి సమస్యలను అధిగమించడంతో పాటు వరుసగా ఒకే పంటను సాగు చేయడం వల్ల నేల సారం తగ్గి తెగుళ్ల సమస్యలు కూడా పెరుగుతున్నాయని, వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంట మార్పిడి వల్ల నేల సారం పెరగడమే కాకుండా దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలని సూచించారు.ఈ మృగశిర కార్తె అన్నదాతలకు శుభారంభం కావాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పుష్కలమైన పంటలు పండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.