Thursday, July 2, 2026

_భూ అక్రమణదారులకు అండ... సామాన్య రైతులకు చుక్కలు చూపుతున్నారనే ఆరోపణలు_

*శాలి గౌరారం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందా?*

*భూ అక్రమణదారులకు అండ... సామాన్య రైతులకు చుక్కలు చూపుతున్నారనే ఆరోపణలు*

*లంచం ఇస్తేనే ఫైల్ కదులుతుందా?... జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలకూ విలువ లేదా?*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 02:

నల్లగొండ జిల్లా శాలి గౌరారం తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం అవినీతి, అక్రమాలు, లంచాల ఆరోపణలకు కేంద్రబిందువుగా మారిందని మండల వ్యాప్తంగా ప్రజలు, రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ కార్యాలయం కొందరు భూ అక్రమణదారులకు రక్షణ కవచంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో ప్రభుత్వ భూములు భూ ఆక్రమణ దారుల చేతుల్లో ఉన్నా వారివద్ద ముడుపులు తీసుకొని చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారు.గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బదిలీపై వెళ్లిన ఎమ్మార్వో అనంతరం.. తహసీల్దార్ కార్యాలయంలో.. ఓ ముఖ్య అధికారి భూ వివాదాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ, నిజమైన రైతుల కంటే అక్రమ పట్టాదారులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.మండలంలోని అనేక గ్రామాల్లో వాస్తవంగా భూమిని సాగు చేస్తున్న రైతుల పేర్లు రికార్డుల్లో లేకపోగా, భూమి కబ్జాలో లేని కొందరి పేర్లపై పట్టాలు కొనసాగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తున్నారని వారు చెబుతున్నారు.
*"లంచం ఇస్తేనే పని... లేకపోతే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే"* అనే పరిస్థితి నెలకొన్నదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ పట్టాలు కలిగిన వారి వద్ద భారీ మొత్తంలో లంచాలు తీసుకుని, నిజమైన భూ హక్కుదారుల వద్ద పదిగుంటల భూమి కి పదిలక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు, సూచనలను సైతం పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఎమ్మార్వోపై కూడా ప్రభావం చూపుతూ, కార్యాలయంలో తాను చెప్పిందే తుది నిర్ణయంగా అమలు అవుతోందనే వాదనలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.ఈ పరిస్థితులతో మండల వ్యాప్తంగా రైతులు, బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఫిర్యాదు చేసినా స్పందన లేక న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*మండల ప్రజల డిమాండ్లు:*
- శాలి గౌరారం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న అవినీతి వ్యవహారాలపై జిల్లా స్థాయి ప్రత్యేక విచారణ చేపట్టాలి.
- మండలంలోని అన్ని గ్రామాల భూ రికార్డులు, పట్టాలపై సమగ్ర పరిశీలన నిర్వహించాలి.
- అక్రమ పట్టాలు, భూ అక్రమాలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
- నిజమైన భూమి హక్కుదారులకు వెంటనే న్యాయం చేయాలి.
- రెవెన్యూ కార్యాలయంలో పారదర్శక పరిపాలనను అమలు చేసి రైతుల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి.

శాలి గౌరారం రెవెన్యూ కార్యాలయంపై వస్తున్న ఈ ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి స్వతంత్ర విచారణకు ఆదేశించి, వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

_నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు_

*కుళ్లిన చేపలు, రొయ్యల అక్రమ నిల్వ: నలుగురు నిందితుల అరెస్ట్*

*నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు*

*అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం, కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్ సిటీ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 02:

కుళ్లిన చేపలు, రొయ్యల అక్రమ నిల్వ: నలుగురు నిందితుల అరెస్ట్. మంగళహాట్ పరిధిలో టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసుల సంయుక్త దాడులు రూ. 90 వేల విలువైన నిల్వలు, సోడియం బైకార్బోనేట్ పౌడర్ స్వాధీనం. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తూ, కుళ్లిన చేపలు మరియు రొయ్యలను రసాయనాలతో నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఒక ముఠాను కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ గోల్కొండ బృందం, మంగళహాట్ పోలీసులతో కలిసి మంగళవారం రట్టు చేసింది. మంగళహాట్ పరిధిలోని మాచిపురా బైఠక్ వద్ద గల "తార ఫిషరీస్" దుకాణంపై నిర్వహించిన ఈ ఆకస్మిక దాడుల్లో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో అరెస్టయిన నిందితులను శంకర్ సింగ్ (24, దుకాణ యజమాని), మాన్ సింగ్ (32, మార్కెటింగ్ సహాయకుడు), గులాబ్ సింగ్ (36, కార్మికుడు), రోహిత్ సింగ్ (31, దుకాణాన్ని అద్దెకు ఇచ్చిన వ్యక్తి)గా గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ. 90,000 విలువైన 100 కిలోల పాడైపోయిన రొయ్యలు, 162 కిలోల వివిధ రకాల చేపలు (సాల్మన్, మారుల్), 6 బస్తాల ఉప్పు మరియు 10 కిలోల సోడియం బైకార్బోనేట్ పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేసు వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు శంకర్ సింగ్ బేగంబజార్ మార్కెట్ నుండి తక్కువ ధరకే చేపలు, రొయ్యలను కొనుగోలు చేసేవాడు. జనావాసాల మధ్య ఉన్న తన దుకాణంలో ఏమాత్రం పరిశుభ్రత లేకుండా, కుళ్లిపోకుండా ఉండేందుకు మరియు దుర్వాసన రాకుండా నిరోధించడానికి సోడియం పౌడర్‌ను ఉపయోగించేవాడు. వీటిని ప్లాస్టిక్ టబ్బులు, డీప్ ఫ్రీజర్లలో నిల్వ ఉంచి, తాజా చేపలుగా భ్రమింపజేస్తూ శుభకార్యాలకు, ఈవెంట్లకు మరియు హోటళ్లకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి లాభాలు గడిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అధికారులు హెచ్చరించారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ సంయుక్త దాడి నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.ఈ ఆపరేషన్ హైదరాబాద్ సిటీ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో, గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్. వెంకటేష్, మంగళహాట్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర, సబ్-ఇన్‌స్పెక్టర్లు కె. వెంకటరమణ, ఎన్. నవీన్, ఆంజనేయులు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది.

_బాలకార్మికులు లేని సమాజం కోసం మనవంతు కృషి చేద్దాం_

*ఆపరేషన్ ముస్కాన్*

*బాలకార్మికులు లేని సమాజం కోసం మనవంతు కృషి చేద్దాం*

*అనురాధ రావు అధ్యక్షురాలు - బాలల హక్కుల సంఘం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 02:

July 1st నుండి 31 వరకు దేశ వ్యాప్తంగా Operation Muskan నిర్వహిస్తారు.ఇది ప్రత్యేక లక్ష్యంతో నిర్వహించే కార్యక్రమం, తప్పిపోయిన పిల్లలను గుర్తించడం,వీరిని రక్షించి వారి కుటుంబాలకు చేర్చడం, బాలల అక్రమరవాణా, బాల కార్మికులుగా మగ్గుతున్న చిన్నారులను, బిచ్చగాళ్ల ముఠాల్లో చిక్కుకున్న చిన్నారులను,వీధి బాలలను, భిక్షాటనం చేస్తున్న చిన్నారులను రెస్క్యూ చేయడం అని అనురాధ రావు - బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అన్నారు.NCRB నివేదికల ప్రకారం భారత దేశం లో ప్రతి సంవత్సరం పదివేల పిల్లలు కనిపించకుండా పోతున్నారు, కొందరు దొరికినా, కొంతమంది పిల్లలు కనిపించడం లేదు. ప్రతి చిన్నారి వెనుక ఆ కుటుంబం ఆందోళన, బాధ, భయం ఉంటాయి. ఈ చిన్నారుల భవిష్యత్తు అంధకారం. తప్పిపోయిన చిన్నారులు - బాల కార్మికులుగా, అక్రమ రవాణా ముఠాల చేతుల్లో కొందరు, కొందరు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో,వీధుల్లో భిక్షాటనం చేస్తూ, కొందరు చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో జివీస్తుంటారు. ఇది కేవలం ఒక పోలీస్ డ్రైవ్ కాదు, పిల్లల భద్రత కోసం దేశవ్యాప్తంగా జరిగే రక్షణ కార్యక్రమం. రక్షించిన చిన్నారులను child welfare committee ద్వారా పునరావాసం కల్పిస్తారు.
2025 సంవత్సరం ఆపరేషన్ ముస్కాన్లో 7678 చిన్నారులను రెస్క్యూ చేశారు.ఎక్కువగా రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో,ఇటుక బట్టీల వద్ద, మెకానిక్ షాపుల్లో, నిర్మాణ సంస్థ వద్ద, టీ స్టాల్స్ మరియు రిలిజియస్ ప్లేసులో రెస్క్యూ చేశారు.6718 మంది చిన్నారులు బాలకార్మికులు,357 మంది చిన్నారులు వీధి బాలలు,42 మంది చిన్నారులు భిక్షాటనం చేస్తూన్న వారు.తెలంగాణకు చెందిన చిన్నారులు 3891, ఇతర 12 రాష్ట్రాలకు చెందిన పిల్లలు,నెపాల్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు.
1713 ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు,1718 మంది ఎంప్లాయర్స్/ట్రాఫికర్స్ పై కేసులు నమోదు చేశారు.మరి ఈ సంవత్సరం ఎంత మంది చిన్నారులు ఉన్నారో?
*తల్లితండ్రలకు సూచనలు ఇస్తున్నది బాలల హక్కుల సంఘం.*
1) పిల్లలకు మీ పోన్ నంబర్ గుర్తుండేలా నేర్పించండి.
2) పిల్లలను వంటరిగా వదలి పెట్టకండి.
3) జన సమూహ ప్రాంతాల్లో పిల్లలను ఒంటరిగా వదలకండి.
4 ) ఆరు బయట ఆడుతున్నారని, మీ పనుల్లో నిమగ్నం కావద్దు. వారిపై మీ దృష్టి ఉంచాలి.
5) పిల్లలు కనిపించక పోతే మీ సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి, 24 గం॥ లు వేచి చూడాల్సిన పని లేదు, 
అప్రమత్తంగా ఉండాలి.
6) child line అందు బాటులో ఉంటుంది,ఎక్కడైన పిల్లలు బిక్షాటన చేస్తున్న, బాల కార్మికులుగా కనిపించిన వెంటనే 1098 కాల్ చేయండి లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో చెప్పండి.
7) రెగ్యులర్ తనీఖీలు నిర్వహిస్తే సమస్య చాల వరకు తగ్గుతుంది . ఎక్కువగా పిల్లలు ఎక్కడ పని చేస్తుంటారో,ఆ స్థావరాలు, ఆ సంస్థ వివరాలు ప్రభుత్వం వద్ద ఉంటాయి,అంటే ఇటుక బట్టీలు, కావచ్చు, construction కంపెనీలు, గాజుల ఫ్యాక్టరీలు, ఇతర ప్యాక్టరీలు. వీటిపై రెగ్యులర్గా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి, ట్రాఫికింగ్ ముఠాలను అదుపులోకి తీసుకోవాలి, బల్క్ బుకింగ్ చేస్తూన్న రైల్వే స్టేషన్లో,బస్ స్టేషన్లో సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలి. బాల కార్మికులను ఇతర రాష్ట్రాల నుండి తీసుకురావడానికి ఎక్కువగా రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తారు. చెక్ పొస్ట్ల వద్ద తనిఖీలు నిర్వహించాలి.చిన్నారులను కాపాడడం సమాజం లో ఉన్న అందరి బాధ్యత. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఇంకా ముమ్మరం చేయాలి. ఇదొక మొక్కుబడి కార్యక్రమం కాకుండ బాలకార్మికులు లేని సమాజం కోసం మనవంతు కృషి చేద్దాం.

_తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB)కి ఒక వినయపూర్వక విజ్ఞప్తి_

*తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB)కి ఒక వినయపూర్వక విజ్ఞప్తి*

*వి. రవికృష్ణ - సామాజిక కార్యకర్త, న్యాయవాది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 02:

ఇటీవల తెలంగాణ ACB వరుసగా ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) కేసులు నమోదు చేస్తూ, భారీ మొత్తంలో నగదు, బంగారం, వజ్రాలు, భూములు, ఫ్లాట్లు, వాహనాలు తదితర ఆస్తులను గుర్తిస్తోంది. శామీర్‌పేట్ తహసీల్దార్ కేసుతో పాటు తాజాగా మరికొన్ని DA కేసులపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.అయితే, ఆస్తులు బయటపడ్డాయనే దానితోనే దర్యాప్తు ముగియకూడదు.
*ప్రధానంగా ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనాలి:*

1. ఈ అక్రమ సంపదకు మూలం ఏమిటి?
2. లంచాలు ఇచ్చిన వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు ఎవరు?
3. ప్రభుత్వ అనుమతులు, భూ వ్యవహారాలు లేదా ఇతర అధికారిక నిర్ణయాల ద్వారా ఎవరు అక్రమ లాభాలు పొందారు?
4. బినామీ పేర్లలో ఆస్తులు కొనుగోలు చేశారా? అయితే ఆ బినామీలు ఎవరు?

లంచం తీసుకున్న అధికారిపై మాత్రమే చర్యలు తీసుకుంటే అవినీతి వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడదు. లంచం ఇచ్చినవారు, అక్రమ డబ్బు సమకూర్చినవారు, బినామీలు, సహకరించిన వారిని కూడా చట్టం ముందు నిలబెట్టినప్పుడే అవినీతికి అడ్డుకట్ట పడుతుంది.అందువల్ల ప్రతి DA కేసులో "Follow the Money Trail" సూత్రాన్ని అనుసరిస్తూ అక్రమ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి నుంచి వచ్చిందో, ఎవరెవరు లబ్ధి పొందారో సమగ్రంగా దర్యాప్తు చేసి, అందరిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ACBను వినయపూర్వకంగా కోరుతున్నాను.
అవినీతి నిర్మూలన అంటే కేవలం అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కాదు... ఆ అక్రమ సంపద వెనుక ఉన్న మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను బయటపెట్టడం.

రోహింగ్యాలకు అక్రమంగా సదుపాయాలు కల్పిస్తుంది ఎవరు ??

జర్నలిస్టులను వేదిస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి DPRO_

_నల్లగొండ జిల్లా కలెక్టర్, కట్టంగూర్ తహసీల్దార్ లపై హై కోర్ట్ లో పిటిషన్ దాకలు చేసిన RTI &Human rights activist ఉబ్బని రాజు_

*నల్లగొండ జిల్లా కలెక్టర్, కట్టంగూర్ తహసీల్దార్ లపై హై కోర్ట్ లో పిటిషన్ దాకలు చేసిన RTI &Human rights activist ఉబ్బని రాజు* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 01:

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలo బోల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని SLBC కాల్వ నుండి పెరిందేవి గూడెం నర్సన్న చెరువు వరకు సర్వే నంబర్ 317,318&280 లో ఉన్న దాదాపు 110 ఎకరాల అటవీ భూమి & బంచర భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో JCB పెద్ద పెద్ద యంత్రాలతో అక్రమంగా మైనింగ్ మాఫియా చేసి మట్టిని తరలించారని RTI &Human rights activist ఉబ్బని రాజు తెలిపారు.ఈ సందర్బంగా రాజు మాట్లాడుతు మట్టిని అక్రమంగా తరలించి పర్యావరణానికి & మూగ జంతువులకు హాని తలపెట్టిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని నల్లగొండ జిల్లా కలెక్టర్ గారికి కట్టంగూర్ మండల తహసీల్దార్ గారికి పిర్యాదు చేసి 6 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు, అందుకే ఈ రోజు నల్లగొండ కలెక్టర్ మరియు కట్టంగూర్ తహసీల్దార్ గారిపై తెలంగాణ హై కోర్ట్ లో పిటిషన్ దాకలు చేసినట్టు తెలిపారు, ముఖ్యంగా పశువులకు & మూగ జంతువులకు పక్షులకు ఆవాసం లేకుండా పోయిందని అన్నారు, తక్షణమే హై కోర్ట్ జ్యూడిషల్ రిజిస్టార్ గారు స్పందించి అక్రమ మైనింగ్ మాఫియా పై పూర్తి విచారణ జరిపించి , ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు, నా పిర్యాదును పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన కలెక్టర్ మరియు తహసీల్దార్ గార్లను మందలించి వాళ్లకు ఉన్న విధులు & భాద్యతల గురించి తెలియపరచాలని  నిర్లక్ష్యపు విధులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.