Praja Sankalpam Group Media
Wednesday, June 24, 2026
_పిల్లల చదువు వ్యాపారం కాకూడదు, పారదర్శకత ఉండాలి_
*పిల్లల చదువు వ్యాపారం కాకూడదు, పారదర్శకత ఉండాలి*
*తల్లి తండ్రలపై అదనపు ఆర్థిక భారమే*
*ఈ అంశంపై విచారణ జరగాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్*
*అనురాధ రావు అధ్యక్షులు - బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 23:
పిల్లల చదువు పేరుతో తల్లితండ్రల జేబు ఖాళీ చేస్తున్నాయి విద్యాసంస్థలు. బత్తిడి చేసి బయట 20 రూ|| దొరికే నోటు పుస్తకం - 40రూ॥లకు అమ్ముతున్నారు వీళ్లు. ఇది చాలా తీవ్రమైన విషయం.ఇటీవల సోషల్ మిడియాలో కొన్ని విడియోలు వైరలు అవుతున్నాయి, ప్రైవేటు స్కూల్స్, కాలేజేలకి సంబంధించినవి. వీటిలో భారిగా స్టేషనరీ నిలవలు, యూనిఫాం, బ్యాగులు, సాక్స్ కనిపిస్తున్నాయి. ఈ సంస్థలు అన్నీ కూడా బాగా పేరు పొందినవే. (Narayana school kothapet, Sloka International school, Sri Triveni school, Pulla Reddy Memorial school, Dilshuknagar Public school, Srichaitanya) etc...ఒకవేళ పేరెంట్ బయట కొంటే ప్రధానోపద్యాయులే పేరెంట్స్ పై తిరగబడిన సంఘటనలు కూడా చూస్తున్నం.మీరు ఇక్కడే కొనాలి అని, అన్నింటిపై వీరి సంస్థ బ్రాండ్ ప్రింట్ చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇది తల్లి తండ్రలపై అదనపు ఆర్థిక భారమే కదా.
విద్యారంగం సేవారంగంలో ఉండాలి, కాని పూర్తి వ్యాపర రంగంగా మార్చేశారు.అధికారుల కళ్ళు మూతలు పడ్డాయా? వీళ్ల దృష్టిలో లేదు అని అనుకోవడం తప్పు, సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటే ఏ ఒక్క అధికారికి తెలియదు అని అనుకోకుండా ఉండలేం.పూర్తిగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది .ఈ వైరల్ విడియోల ఆరోపణలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి, మన ముఖ్యమంత్రి గారు, అధికారాలు స్పందించాలని, వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూన్నది బాలల హక్కుల సంఘం.రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.
బలవంతపు స్టేషనరీ అమ్మకాలు జరుగుతున్న విషయంపై విచారణ చేయాలి.మార్కెట్ ధరలకంటే అధిక ధరలతో విక్రయిస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలి.తల్లి తండ్రులు ఎంపిక చేసుకునే హక్కును రక్షించాలి.పిల్లల చదువు వ్యాపారం కాకూడదు, పారదర్శకత ఉండాలి. ఈ అంశంపై విచారణ జరగాలి అని బాలల హక్కుల సంఘం డిమాండ్
*తెలంగాణ మేధావులతో దిగిన ఈ ఫోటో పట్ల చాలా మందికి ఆసక్తి ఉంది - పవన్ కళ్యాణ్*
*తెలంగాణ మేధావులతో దిగిన ఈ ఫోటో పట్ల చాలా మందికి ఆసక్తి ఉంది - పవన్ కళ్యాణ్*
*ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేసిన ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 23:
తెలంగాణ ఉద్యమం మరియు 'సామాజిక తెలంగాణ' భావన చుట్టూ సాగిన లోతైన చర్చలతో కూడిన ఆ రోజులను ఈ ఫోటో గుర్తుచేస్తుంది అని ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.బహుజన భావజాలం, సామాజిక న్యాయం మరియు అణగారిన వర్గాల రాజకీయ సాధికారత వంటి అంశాలు మా చర్చల్లో ప్రధానంగా ఉండే రోజులు అవి. తెలంగాణ మేధావులతో పాటు బహుజన ఉద్యమకారులు అగస్టీన్ గారు, విప్లవ గాయకులు గద్దర్ గారు మరియు ఇతరులతో కలిసి, మేము తరచుగా తెలంగాణ భవిష్యత్తు, రాజకీయ అధికారం యొక్క న్యాయమైన పంపిణీ ఆవశ్యకత మరియు 'సామాజిక తెలంగాణ' అనే విస్తృత లక్ష్యం గురించి లోతుగా చర్చించేవాళ్ళం. నా తండ్రి శ్రీ కొణిదాల వెంకట్ రావు గారు మరణించిన తర్వాత, అగస్టీన్ గారు మరియు గద్దర్ గారు మా ఇంటికి వచ్చినప్పటి (పీఆర్పీ పార్టీ ఏర్పాటుకు ముందు నాటి) దృశ్యం ఇది. రాజకీయాలకు అతీతంగా, సామాజిక మార్పు, సమానత్వం మరియు సామాజిక న్యాయం రాజకీయ అధికారంగా మారాలనే ఆకాంక్షతో కూడిన చర్చలు జరిగిన ఆ కాలానికి సంబంధించిన ఒక మధురమైన జ్ఞాపకం ఇది.
*డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు*
*డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 23:
జ్వలంత జాతీయవాద చింతకుడు, గొప్ప విద్యావేత్త, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, మన మార్గదర్శకులు పూజ్య డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా, నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు.ఈ సందర్బంగా రామచందర్ రావు మాట్లాడుతూ “ఒక దేశం, ఒక జెండా, ఒక రాజ్యాంగం” అనే దృఢ సంకల్పంతో, మాతృభూమి భారతదేశ ఐక్యత మరియు సమగ్రత కోసం డా. ముఖర్జీ గారు తన ప్రాణాలను అర్పించారు అని అన్నారు. ఆయన జీవిత త్యాగం, ధైర్యం, తపస్సు మరియు అచంచల దేశభక్తి చిరస్మరణీయ గాథగా నిలిచింది.జాతీయ ఐక్యత, సాంస్కృతిక వైభవం మరియు దేశ సంక్షేమం పట్ల ఆయన చూపిన నిబద్ధత ప్రతి భారతీయుడికి నిరంతరం స్ఫూర్తినిస్తుంది అని అన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ లక్ష్యం వైపు మనం ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంలో, ఆయన ఆదర్శాలు ప్రతి అడుగులోనూ మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి అని అన్నారు.భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే త్యాగం, పోరాటం చేసిన ఈ మహనీయ జాతీయ నాయకుడికి పునఃపునః వందనాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్లు శ్రీ సీహెచ్. విద్యాసాగర్ రావు గారు, శ్రీ బండారు దత్తాత్రేయ గారు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Friday, June 19, 2026
హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్ - నిద్దురమత్తులో తెలంగాణ విద్యాశాఖ
*మీ పిల్లలను ఏ స్కూల్లో చేర్పిస్తున్నారో ఒక్కసారి చెక్ చేయండి.*
*అది ప్రభుత్వ గుర్తింపు పొందినదా? లేదా ?*
*తెలంగాణ విద్యా శాఖ కీలక పెచ్చరికలను జారీ చేసింది.*
*అనురాధ రావు అధ్యక్షురాలు - బాలలహక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 19:
హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు,గుర్తింపు లేకుండా పుట్ట గొడుగుల్లా ప్లే స్కూళ్లు, Primary, High school వెలిసాయి. అవి చిన్న చిన్న భవనాల్లో బహుళ అంతస్తుల్లో కనీస వసతులు లేకుండా తగినంత ఆటస్థలం, ఫైర్ సేఫ్టీ లేని పాఠశాలలు 500 పైగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్నాయి.మన విద్యాశాఖ మంత్రి, అధికారుల దృష్టికి వచ్చినా, గాఢ నిద్రలో ఉన్నారు,
వారికి ఏమీ పట్టదు.యధేచ్చగా స్కూళ్లు తమ వ్యాపారాలు చేస్తున్నాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన విధంగా ఉంది.తీసుకున్న జీతానికి న్యాయం చేయండి,పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి.విద్యాశాఖ అధికారులు మీ కుర్చిలనుండి దిగి పాఠశాలల తనిఖీలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం విన్నపం.ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్ల వివరాలను జిల్లాల వారిగా, మండలాల వారిగా అధికారిక పోర్టల్లో అందుబాటులో పొందుపరిచారు. Website:
www.schooledu.telangana,gov.in
మన ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి, చేసేది వేరే. ఆ శాఖ ముఖ్య మంత్రి గారి దగ్గర వుంది. అధిక ఫిజులకు అడ్డుకట్ట వేస్తా అంటున్నారు కానీ దోపిడి చేస్తున్న ఉన్నారు స్కూల్ యాజమాన్యాలకు అడ్డుకట్ట వేయడం లేదు.తల్లిదండ్రులకు విజ్ఞప్తి,ఫీజులు కట్టే ముందు ఒక్క విషయం చెక్ చేయకపోతే మీపిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు.ఒక వేళ గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే ...
* విద్యా ప్రమాణాలు సరిగా ఉండవు
* భద్రతా నిబంధనలు పాటించరు, మీ పిల్లల భద్రత మీదే.
* అర్హత లేని సిబ్బందితో భోధన
* భవిషత్తులో సర్టిఫికెట్లకు సమస్య అవుతుంది.
స్కూల్ రికగ్నిషన్ తప్పనిసరిగా చెక్ చేయండి అధికారిక వెబ్ సైటులో ఆ స్కూల్ పేరు ఉందో లేదో చూడండి.అఫిలియేషన్ వివరాలు తీసుకోండి CBSE, ICSE of State Board ఏదైనా సరే, దానికి సంబంధించిన వివరాలు.స్కూల్ ను స్వయంగా సందర్శంచండి, ప్రకటనలు చూసి మోసపోకండి. తరగతి గదులు, భద్రత,మరుగుదొడ్లు,తాగునీటి సౌకర్యం,ఆట స్థలం, ఫైర్ సేఫ్టీ, ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఎలా ఉంది, ఒక వేళ బస్సు అయితే, ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉందా? బస్సు లో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్, అన్ని అనుమతి పత్రాల గురించి అడగండి.చెల్లించిన డబ్బుకు రసీదులు అన్ని బద్ర పరుచుకోవాలి.అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలి, విద్యాబోధన ఏవిదంగా ఉంది అని. తెలుసుకోవాలి.అన్ని గుర్తింపు పత్రాలు చూడాలి.
పిల్లల విద్య పెట్టుబడి కాదు, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి.స్కూల్ లో చేర్చుకునే సమయం లో పిల్లలకు ఐడి క్రియేట్ చేస్తారు అదే"పెన్"
నెంబర్,11 డిజిట్స్ తో క్రియెట్ చేస్తారు, దీని వల్ల పిల్లల చదువులు ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు ట్రాక్ చేయడానికి, బోర్డు ఎగ్జామ్స్ కు ఉపయెగ పడుతుంది. ఇది క్రియేట్ అయ్యాక 'అపార్' ఐడి క్రియేట్ చేస్తారు,
ఇది ఒక యూనిక్ ఐడి.12 డిజిట్స్ తో ఉంటుంది. ఈ ఐడి లో పిల్లల మార్కులు, వారి అకాడమిక్ రికార్డ్స్, సర్టిఫికెట్స్ అన్ని ఒక డిజి లాకర్ లో డిజిటల్ గా భద్రపరుస్తారు. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్/ అడ్మిషన్ కోసం సులభం అవుతుంది.
One Nation,One student ID అని నేషనల్ ఎజుకెషన్ పాలసీ 2020 ప్రకారం 2023/25 విద్యా సంవత్సరం నుండి ఇది ప్రారంభం అయింది.
Wednesday, June 17, 2026
_జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది_
*పాత్రికేయ కుటుంబాలకు అండగా తెలంగాణ మీడియా అకాడమీ*
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 21 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.
తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకం కింద మొత్తం 21 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేయబడింది. ఇందులో 17 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు మరియు 4 మంది అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏర్పడిన ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి పథకం కింద మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1,00,000 ఏకమొత్తo ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.3,000 పెన్షన్, అలాగే కుటుంబంలోని గరిష్టంగా ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 159 మందికి యిలాంటి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు.
అనంతరం సభలో పాల్గొన్న వారందరూ తమ మధ్య నేడు లేని పాత్రికేయులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన జర్నలిస్టుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, జర్నలిస్టులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు. *Bplkm✍️*
Friday, June 12, 2026
మానవత్వం,సహాయం అందించడం లో ఎప్పుడు ముందుడే "క్రైమ్ రిపోర్టర్" విజయ్ కుమార్_
*మానవత్వం పరిమళించే - CPR చేసి మహిళ ప్రాణాలు కాపాడిన "క్రైమ్ రిపోర్టర్"*
*మానవత్వం,సహాయం అందించడం లో ఎప్పుడు ముందుడే "క్రైమ్ రిపోర్టర్" విజయ్ కుమార్*
*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 11:
మౌలాలి రైల్వే స్టేషన్ లో జనవరి 5,2026 న జరిగింది ఈ సంఘటన.ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వస్తున్న మహిళ మౌలాలి లో స్టేషన్ కు చేరుకున్న తరువాత ట్రైన్ లో నుండి దిగుతూ కాలు జారీ ట్రైన్ కింద పడిపోయింది.అందరు చూస్తున్నారు కానీ ఆపదలో ఉన్న ఆ మహిళ వద్దకు వెళ్లి సహాయం చేద్దాం అనే వారు కరువయ్యారు. ఇదే ట్రైన్ లో ఖమ్మం నుంచి వస్తున్న సురేష్ ఈ సంఘటన చూసి తన మిత్రుడు అయిన *క్రైమ్ రిపోర్టర్ విజయ్ కుమార్* కు ఫోన్ చేయగా "యాదృచ్ఛికం" గా మౌలాలి పరిసర ప్రాంతంలో ఉన్న విజయ్ కుమార్ వెంటనే మౌలాలి రైల్వేస్టేషన్ కు వెళ్లి ట్రైన్ కింద పడిపోయిన మహిళను పైకి లాగి మహిళకు CPR(కార్డియోపల్మోనరీ రిససిటేషన్ - Cardiopulmonary Resuscitation) చేసి ఆ మహిళను అంబులెన్సు లో తీసుకెళ్లి ప్రాణం కాపాడిన రామంతాపూర్ కి చెందిన హైదరాబాద్ క్రైమ్ రిపోర్టర్ విజయ్ కుమార్.ఎవరైనా గుండెపోటుతో పడిపోయినా లేదా శ్వాస ఆడక స్పృహ కోల్పోయినా, వెంటనే సీపీఆర్ చేయడం వల్ల మెదడుకు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కొనసాగుతుంది. ఇది వారి ప్రాణాలను కాపాడే అవకాశం.ప్రతి ఒక్కరు CPR శిక్షణ (Training), ప్రథమ చికిత్స (First-aid) గురించి అవగాహన చేసుకుంటే ఇలాంటి సమయంలో ప్రాణాలను కాపాడవచ్చు.ఈ సమాజంలో ఎవరికి ఏమైతే నాకు ఏంటి అనుకునే ఈ వ్యవస్థలో మహిళను కాపాడిన సీనియర్ క్రైమ్ రిపోర్టర్ కి అభినందనలు.
Subscribe to:
Posts (Atom)