Thursday, August 26, 2021

తీన్మార్ మల్లన్న నీ వేదింపులకు గురి చేస్తున్న తెలంగాణ పోలీసులకు జాతీయ బీసీ కమిషన్ నోటీసులు .

హైదరాబాద్ : 26/08/2021

*Q న్యూస్ మల్లన్న పై జరుగుతున్న వరుస దాడులపై సీరియస్ గా ఉన్న జాతీయ బీసీ కమిషన్..* 

*ప్రజల పక్షాన గొంతు విప్పుతున్న వ్యక్తిని హతమార్చాలని చూస్తున్నారా అంటూ  సీరియస్..* 
 
*ఒక జర్నలిస్టును ఇంత దారుణంగా హింసించడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్న..* 
 
*ఈ నెల 29 ఉదయం 11 గంటలకు డీజీపీ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ లను వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశం..*

 *ఇది ఇలాగే కొనసాగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సూచన..* 

ఇక వివరాల్లోకి వెళితే.. 

ఈ నెల 10వ తేదీన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ జాతీయ బీసీ కమిషన్ ను సంప్రదించిన విషయం అందరికీ తెలిసిందే.. 

ఇందులో భాగంగా తీన్మార్ మల్లన్న పై జరుగుతున్న వరుస దాడులు, క్యూ న్యూస్ కార్యాలయానికి సంబంధించిన కంప్యూటర్లను పగలగొట్టి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లిన పోలీసులపై చర్యలలో భాగంగా ఆగ్రహంతో ఉన్న కమిషన్ ఈ నెల 29న వ్యక్తిగతంగా డీజీపీ తెలంగాణ, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ లను కచ్చితంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

No comments:

Post a Comment