Sunday, June 7, 2026

_సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన_

*పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి*

*సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా దుర్ఘటన*
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ రాజు మృతి.కానిస్టేబుల్ రాజు  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఎస్పీ.డాక్టర్.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ IPS.నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉల్పారా గ్రామానికి చెందిన మద్దమల్ల.రాజు 2014 బ్యాచ్ ఏ ఆర్ కానిస్టేబుల్ గా ఎంపికై నాగర్ కర్నూల్ ఆర్మూడ్ రిజర్వులో విధులు నిర్వర్తిస్తున్నాడు.గత రెండు రోజులుగా సీఎం బందోబస్తు నిమిత్తం సోమశిల లో విధులు నిర్వర్తిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం బందోబస్తు విధులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా  మామిళ్ళపల్లి గ్రామం సమీపంలో  పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించడం జరిగింది.ఈ సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు మృతదేహాన్ని నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ  గారు స్పందిస్తూ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్లి  ఏఆర్ కానిస్టేబుల్ రాజు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించినారు.వారి యొక్క కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పడం జరిగింది.అలాగే రేపు వారి యొక్క స్వగ్రామమైన ఉల్పర గ్రామం వంగూరు మండలం నందు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.

_సోషల్ మీడియా లో పోస్ట్లు చేసేటప్పుడు ఆలోచించండి_

*సోషల్ మీడియా లో పోస్ట్లు చేసేటప్పుడు ఆలోచించండి*

*సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే జైలుకు - తెలంగాణ పోలీస్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో గౌరవ సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తి పై  కేసు (395/2026) నమోదు చేసి జైలుకు పంపించిన తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియాలో మితిమీరినవ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగితజ్ఞానం మర్చిపోవద్దు. అలా చేస్తే చట్టం పని చట్టం చేస్తుంది.

_రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు_

*న్యాయం కోసం ఎదురుచూసి కన్నుమూసిన వృద్ధురాలు*

*రాజ్యాంగం ఇంకా బతికే ఉందా? - చెన్‌బసమ్మ కుటుంబ సభ్యులు*

*మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "వృద్ధ మహిళ న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జూన్ 6:

వికారాబాద్ జిల్లా, తాండూర్ పట్టణంకు చెందిన చెన్‌బసమ్మ మరణం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమా?. అనారోగ్యంతో బాధపడుతూ, తనకు సంబంధించిన ఆస్తి మరియు న్యాయ సమస్య పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి చివరకు పక్షవాతంతో మంచానికి పరిమితమైన 75 ఏళ్ల వృద్ధురాలు శ్రీమతి చెన్‌బసమ్మ గారు చివరకు 29-05-2026న కన్నుమూశారు.మార్చ్ 17,2026 నాడు "మీడియా టుడే" లో "75 ఏళ్ల వృద్దురాలు పక్షవాతంతో మంచాన పడ్డా సంవత్సరాలనుండి న్యాయ పోరాటం" వార్త కథనం కూడా వచ్చింది. అయినా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వ అధికారిక మాధ్యామాల ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం CMOHYD,వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు, స్థానిక చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశవేశ్వరరెడ్డి కి, తాండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు మనోహర్ రెడ్డి కి,తాండూర్ మున్సిపల్ చైర్మన్ కు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇదేనా ప్రజాపాలన - ప్రగతి పాలన అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్న ఏమిటంటే — తన జీవితకాలంలో న్యాయం కోసం ఎదురు చూసిన ఒక వృద్ధురాలికి న్యాయం చేయలేకపోతే, రాజ్యాంగం కల్పించిన హక్కులు సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి?
ప్రభుత్వ కార్యాలయాలు,జిల్లా కలెక్టర్ కార్యాలయం,రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ప్రజావాణి, ఉన్నతాధికారులు, ఇంకా అనేక వేదికల ద్వారా సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిష్కారం దొరకకపోవడం బాధాకరం.అనేక ఫిర్యాదులు, పత్రాలు, వినతులు, ఆధారాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, చెన్‌బసమ్మ గారు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి సంవత్సరం మహిళా హక్కుల గురించి గొప్పగా మాట్లాడే సమాజం, ఒక వృద్ధ మహిళ న్యాయం కోసం ఎదురుచూస్తూ కన్నుమూసినప్పుడు ఎక్కడ ఉంది? ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలు ఈ పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?
"న్యాయం ఆలస్యమైతే అది కూడా అన్యాయమే" అనే సూత్రాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.చెన్‌బసమ్మ గారు ఇక లేరు.కానీ ఆమె అడిగిన ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి.
పేదలకు న్యాయం పొందే హక్కు ఉందా?వృద్ధుల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత కాదా?రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పుస్తకాలకే పరిమితమా?అధికారులు స్పందించకపోతే సామాన్యుడు ఎవరిని ఆశ్రయించాలి? కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ఏమిటంటే, చెన్‌బసమ్మ గారు జీవించి ఉండగా పరిష్కారం కాలేకపోయిన ఈ సమస్యను ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి.అదే "ఆమె ఆత్మకు నిజమైన శాంతి కలిగించే మార్గమని" వారు కోరుతున్నారు.
— కుటుంబ సభ్యులు