Sunday, August 29, 2021

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు మ‌ద్ద‌తుగా మౌన‌దీక్ష‌ 30/08/2021

హైదరాబాద్ : 29/08/2021

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు మ‌ద్ద‌తుగా మౌన‌దీక్ష‌

తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 


జ‌ర్న‌లిస్టు, క్యూ న్యూస్ నిర్వాహ‌కుడు తీన్మార్ మల్లన్న అరెస్టుకు నిరసనగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీజేఎస్ఎస్) మౌన‌దీక్ష‌కు పిలుపునిచ్చింది. పార్టీలు, సంఘాల‌కు అతీతంగా తరలి రావాలని కోరింది. టిజేఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటీ రామకృష్ణ ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. సోమవారం ఉదయం 11 గంటలకు గన్ పార్క్‌లోని అమ‌ర‌వీరుల‌ స్థూపం వద్ద ఈ మౌనదీక్ష ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు వారు తెలిపారు.

కేసీఆర్ ప్ర‌భుత్వంలో త‌ర‌చూ మీడియా, జర్నలిస్టులపై దాడులు జ‌రుగుతుండ‌టంపై టీజేఎస్ఎస్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ దాడులను ఖండించే ప్రతి జర్నలిస్టు, ప్రతి ప్రజాస్వామిక‌వాది స్వచ్ఛందగా తరలి రావాలని పిలుపునిచ్చింది. తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు తప్పకుండా భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరింది. మల్లన్నకు అండగా నిలుస్తున్నట్లే.. తెలంగాణలో ఏ జర్నలిస్టుకు అన్యాయం జరిగినా.. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

No comments:

Post a Comment