Tuesday, August 25, 2026

_తెలంగాణ జైళల్లో దీర్ఘకాలంగానిర్భందంలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు, కార్యకర్తల కేసులను మానవతా దృక్పధంతో పునఃసమీక్షించి వారిని విడుదల చేయాలి_


*_తెలంగాణ జైళల్లో దీర్ఘకాలంగానిర్భందంలో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులు, కార్యకర్తల కేసులను మానవతా దృక్పధంతో పునఃసమీక్షించి వారిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సారుకు విజ్ఞప్తి చేసిన మానవహక్కుల వేదిక సంస్థ._*

*@TelanganaCMO @TelanganaDGP @MaheshBhagwat95 @dgprisonstg @IPRTelangana @DigitalMediaTG @HRF_Humanrights @BplplH*

https://x.com/Praja_Snklpm/status/2092152845495902384?t=bWa8FSsD8iNOTAz9vGNVjQ&s=08

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’_

*బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’ పోటీలు* 

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 24:

బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ఆధ్వర్యంలో ’యంగ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఛాలెంజ్‌ 2026 - సీజన్ 2’ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబుతో కలిసి ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్‌ ఫిల్మ్, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈ సారి కొత్తగా జానపద పాటలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలు (ఆర్టికల్స్) కు చోటు కల్పించామని తెలిపారు.గత ఏడాది నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభించిందని,  500కు పైగా లఘు చిత్రాలు, బతుకమ్మ పాటలు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం కూడా యువ ప్రతిభావంతులు పోటీలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టించడానికి, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయి. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు దోహదం చేస్తాయని ఈ పోటీలను నిర్వహిస్తున్నారు అని అన్నారు.లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్‌ 5 నిమిషాలకు మించకూడదు అని ఆయా వీడియోలు 4K రిజల్యూషన్ కలిగి ఉండాలి అని అన్నారు. ఆసక్తి కలిగిన వారు వాటిని 2026 సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్‌కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి అని అన్నారు. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది.ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. 2 లక్షలు, తృతీయ బహుమతి రూ. 1 లక్ష. మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ. 20 వేల చొప్పున అందించనున్నారు. ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేస్తారు.

నిబంధనలు ఉల్లంఘించే భవనాలపై కఠిన కూల్చివేత చర్యలు చేపట్టిన సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్_

*నిబంధనలు ఉల్లంఘించే భవనాలపై కఠిన కూల్చివేత చర్యలు చేపట్టిన సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్*

*నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై సీఎంసీ చర్యలను ముమ్మరం చేసింది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 25:

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఈరోజు  నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న 38 అనధికార భవనాలను గుర్తించాయి.
**వాటి వివరాలు* 
 *(1)*: 28 UC నోటీసులు జారీ
*(2)*:  1 భవనం స్వాధీనం
*(3)*:  9 భవనాలు కూల్చివేత
**ఈ కింది అక్రమ నిర్మాణాల మీద చర్యలకు దృష్టి సారించింది:**
*(1)*: 75 చదరపు గజాల లోపు ప్లాట్లు: 7 మీటర్లకు మించిన ఎత్తు ఉన్న నిర్మాణాలు.
*(2)*: 75 చదరపు గజాల పైబడిన ప్లాట్లు: ఎత్తుతో సంబంధం లేకుండా, భవన నిర్మాణ అనుమతి లేకుండా చేసిన నిర్మాణాలు.
పౌరుల ఫిర్యాదుల ద్వారా, అలాగే స్వచ్ఛంద క్షేత్ర తనిఖీల ద్వారా కేసులను గుర్తిస్తున్నారు. అమలు చర్యలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు.

నాచారం డివిజన్ లో 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి_

*నాచారం డివిజన్ లో 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 24:

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నాచారం 21 డివిజన్ రామ్ రెడ్డి నగర్ కాలనీలో 30 లక్షల రూపాయలు వ్యాయామంతో నూతన సిమెంటు  రోడ్డు నిర్మాణం మరియు అంగన్వాడి నూతన నిర్మాణాని16 లక్షల రూపాయలు గల స్థలాలకు  శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ శాంతి సాజన్ శేఖర్ మేడల మల్లికార్జున్ పోగుల వెంకటరమణారెడ్డి టేకపల్లి రామచందర్ దయా గౌడ్ కట్ట బుచ్చన్న బొడ్డు శివ అద్వైత దాసరి కరణ శ్రీధర్  జిమ్ లడ్డు శివ ఎండి ఖాదర్ యూసుఫ్ బాయ్ తదితర ముఖ్య అతిథులు పాల్గొన్నారు.

హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా బాపట్ల కృష్ణమోహన్ ముదిరాజ్ మరియు కో కన్వీనర్ గా గడ్డమీద శ్రీశైలం ముదిరాజ్_

*తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర కార్యవర్గ ముఖ్యుల సమావేశం*

*సికింద్రాబాద్ బోయగూడా   ముదిరాజ్ భవన్ లో తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఆత్మీయ సమ్మేళనం*

*హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా బాపట్ల కృష్ణమోహన్ ముదిరాజ్ మరియు కో కన్వీనర్ గా గడ్డమీద శ్రీశైలం ముదిరాజ్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 23:

తెలంగాణ ముదిరాజు జర్నలిస్టు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చింతల నీలకంఠం, బోయిని శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33  జిల్లాల అధ్యక్షులను  ఎన్నుకోవడం కొరకు ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి 10 జిల్లాల కన్వీనర్లను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లా కన్వీనర్లు గా ఉన్నటువంటి వారు ఉమ్మడి జిల్లాలో ఏ జిల్లా కొత్త జిల్లాలుగా ఏర్పడినావో ఆ జిల్లాలకు అధ్యక్షుల నియామకం జరిగే క్రమంలో వారి బాధ్యతను నిర్వహించడానికి ప్రస్తుతం కన్వీనర్లను నియమించడం జరిగింది.హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా బాపట్ల కృష్ణమోహన్ ముదిరాజ్ మరియు కో కన్వీనర్ గా గడ్డమీద శ్రీశైలం ముదిరాజ్ ను నియమించారు. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ కన్వీనర్ గా 
జి .నర్సింలు ముదిరాజ్,నారాయణపేట జిల్లా కన్వీనర్ గా నవీన్ ముదిరాజ్, సిద్దిపేట జిల్లా కన్వీనర్ గా 
పరమేశ్వర ముదిరాజ్ మరియు  కో కన్వీనర్ గా బరిగే నర్సింలు ముదిరాజ్,నిర్మల్ జిల్లా కన్వీనర్ గా హనుమాన్లు ముదిరాజ్,సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా ఏ. రాంబాబు మరియు కో కన్వీనర్ గా గోవర్ధన్ ముదిరాజ్,మెదక్ జిల్లా కన్వీనర్ గా వెంకటేశం ముదిరాజ్,కరీంనగర్ జిల్లా నేదురు సమ్మయ్య ముదిరాజ్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల్ సుమన్ ముదిరాజ్,నల్గొండ జిల్లా కన్వీనర్ గా సైదులు ముదిరాజ్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాల నుండి వచ్చినటువంటి ముదిరాజులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sunday, August 23, 2026

పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - తెలంగాణ ప్రభుత్వం_

*పాలిటెక్నిక్ కళాశాలలను అత్యుత్తమ ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నాము*

*పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - తెలంగాణ ప్రభుత్వం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 22:

పాలిటెక్నిక్ విద్యార్థులకు విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పాలిటెక్నిక్ విద్యలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో పాటు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాల విధానం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. శాఖ మార్పు వల్ల పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన సర్వీసు నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించింది.పాలిటెక్నిక్ కళాశాలలను అత్యుత్తమ ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేసేందుకు, అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం వాటిని శక్తి శాఖతో అనుసంధానం చేసినట్లు పేర్కొంది. ఆధునిక సౌకర్యాలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్ది, కోర్సులు పూర్తి చేసిన తర్వాత వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు, అత్యుత్తమ వేతనాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి_

*తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి*

*స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య ప్రత్యేక అవగాహన ఒప్పందం*

బాపట్ల కృష్ణమోహన్, ఆగస్టు 22:

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ అన్నివేళలా అన్ లైన్ ద్వారా అందించాలనే లక్ష్యంతో స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదిరింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఒప్పంద పత్రాలపై డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోనే అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ లెర్నింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నవీన్ నికోలస్,వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. డిజిటల్ కంటెంట్ ప్రసారాల విషయంలో ఎంఓయూ ఫలితంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు టి-సాట్ మధ్య కార్యక్రమాల ప్రసారాల విషయంలో స్పష్టత వస్తుందని భావించారు.తొమ్మిది, పదవ తరగతి పిల్లలకు సాయంత్రం వేళల్లో డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28 వేల పాఠశాలల్లో చదువున్న విద్యార్థుల తల్లిదండ్రులతో సీఎం రేవంత్ రెడ్డి ‘ముఖాముఖి’, ‘ మా జిల్లా మా పాఠశాల’ పేరుతో డీఈవోలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం, ఉపాధ్యాయుల కోసం ‘టి.ఎల్.ఎమ్’ మేళా వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఇక నుండి టి-సాట్ వేదికగా ప్రసారం చేసుకునేందుకు ఎంఓయూ ఉపయోగపడుతుందని నవీన్ నికోలస్,వేణుగోపాల్ రెడ్డి భావించారు.డిజిటల్ ప్రసారాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని టి-సాట్ ద్వారా నిర్వహించే విధంగా సమగ్ర శిక్ష, ఎస్.ఇ.ఆర్.టి తదితర విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంఓయూ కార్యక్రమంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ అడిషనల్ డైరెక్టర్ పీవీ శ్రీహరి, టి-సాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండీ సాధిక్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి, ప్రాజెక్ట్ జేడీలు, కో-ఆర్డినేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గ్లోబల్ స్థాయిలో ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ నిర్వహణ - సిఎస్ సంజయ్ జాజు_

*గ్లోబల్ స్థాయిలో ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ నిర్వహణ - సిఎస్ సంజయ్ జాజు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 22:

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను  విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. 
డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. దేశంలోని వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లకు ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని, ఆయా దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను కూడా సమ్మిట్‌కు ఆహ్వానించాలని సీఎస్ సూచించారు. 
అదేవిధంగా, దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, శాస్త్ర–సాంకేతిక, వైద్య, విద్య, మౌలిక వసతులు తదితర రంగాల ప్రముఖులను సమ్మిట్‌లో పాల్గొనేలా ముందుగానే ఆహ్వానాలు పంపాలని ఆదేశించారు. 
సమ్మిట్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రతి కమిటీకి స్పష్టమైన బాధ్యతలను అప్పగించి సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
తెలంగాణలోని వివిధ రంగాల సామర్థ్యాన్ని, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా వివిధ రంగాలకు సంబంధించిన ఎక్స్ పో (Expos)లను ఏర్పాటు చేయాలని, వాటిలో ప్రముఖ కంపెనీలు, సంస్థలు భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు.అలాగే, తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు మార్గదర్శకత్వం అందించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులతో కూడిన సలహా మండలి (Advisory Council)ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 
సమ్మిట్‌ను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించి, తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మరింతగా ప్రతిష్టించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. 
ఈ సమావేశంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డి, నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Saturday, August 22, 2026

అమీన్పూర్‌లో ప్రభుత్వ / సీలింగ్ భూములపై రీ-లేఅవుట్లు, నిర్మాణాలు, భారీ స్థాయి విక్రయాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి: అడ్వకేట్ వి. రవికృష్ణ_

*PRESS NOTE*

*అమీన్పూర్‌లో ప్రభుత్వ / సీలింగ్ భూములపై రీ-లేఅవుట్లు, నిర్మాణాలు, భారీ స్థాయి విక్రయాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి: అడ్వకేట్ వి. రవికృష్ణ*

*1035, 1036, 1042, 1043, 1044 సర్వే నంబర్లపై జిల్లా కలెక్టర్‌కు అత్యవసర ప్రజా ప్రయోజన ఫిర్యాదు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,ఆగస్టు 21:

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని సర్వే నంబర్లు 1035, 1036, 1042, 1043, 1044 మరియు సంబంధిత భూములపై భూముల అసలు స్వభావం, ప్రభుత్వ/సీలింగ్ భూముల స్థితి, పాత లేఅవుట్లు, రీ-లేఅవుట్లు, నిర్మాణాలు, రిజిస్ట్రేషన్లు మరియు కోట్ల రూపాయల విలువైన విక్రయ కార్యకలాపాలపై సమగ్ర రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్, మున్సిపల్ మరియు పోలీస్ దర్యాప్తు చేపట్టాలని అడ్వకేట్ వి. రవికృష్ణ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులను కోరారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీఓ, అమీన్పూర్ తహసీల్దార్, సర్వే & ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ, అమీన్పూర్ మున్సిపాలిటీ/HMDA మరియు సైబరాబాద్ పోలీస్ అధికారులకు సమగ్ర ప్రతినిధిత్వం సమర్పించారు. 
**2014 హైకోర్టు కామన్ ఆర్డర్ కీలకం**
2014 ఫిబ్రవరి 21న గౌరవ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కామన్ ఆర్డర్‌లో అమీన్పూర్ తదితర ప్రాంతాల్లోని భూములకు సంబంధించి ప్రైవేట్ పట్టా భూములు, ప్రభుత్వ భూములు, వివిధ రకాల అసైన్డ్ భూములు ఉన్నట్లు చారిత్రక రికార్డుల ఆధారంగా ప్రస్తావించబడిందని రవికృష్ణ తెలిపారు. ప్రతి భూమి యొక్క ప్రస్తుత హక్కు, వర్గీకరణ మరియు బదలాయింపు సామర్థ్యాన్ని అసలు రెవెన్యూ, సర్వే, అసైన్మెంట్, సీలింగ్, ఇనాం/ORC మరియు మ్యూటేషన్ రికార్డుల ఆధారంగా ప్రత్యేకంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. 
**1035, 1036 సర్వే నంబర్లలో 1999 ORCపై పూర్తి రికార్డు పరిశీలన అవసరం**
సర్వే నంబర్లు 1035, 1036లోని భూమికి సంబంధించి 1999లో RDO, సంగారెడ్డి జారీ చేసినట్లు పేర్కొంటున్న Form-III Final Patta Certificate / ORC పత్రం తమ వద్ద ఉందని, దాని అసలు Inam/ORC ఫైల్‌ను అధికారులు పరిశీలించాలని రవికృష్ణ కోరారు.ఆ ORC చట్టబద్ధతపై ముందుగానే తుది నిర్ణయం తీసుకోకుండా, అసలు దరఖాస్తు, నోటీసులు, విచారణ రికార్డులు, ఇనాం వర్గీకరణ, సీలింగ్ రికార్డులు, మ్యూటేషన్, ప్రీమియం, దరఖాస్తుదారుడి అర్హత మరియు ORC జారీకి ఆధారమైన పూర్తి రికార్డులను పరిశీలించాలని ఆయన కోరారు. 
**1042, 1043, 1044పై సీలింగ్ భూముల అంశం**
1042, 1043, 1044 సర్వే నంబర్లకు సంబంధించిన అందుబాటులో ఉన్న రెవెన్యూ/ఎన్‌క్రోచ్‌మెంట్ పత్రాలు కొన్ని భాగాలను Ceiling Landsగా పేర్కొంటూ, వాటిపై ఆక్రమణ/నిర్మాణాలను ప్రస్తావిస్తున్నాయని ప్రతినిధిత్వంలో పేర్కొన్నారు.
అందువల్ల ఈ సర్వే నంబర్లకు సంబంధించి అసలు ప్రభుత్వ రికార్డులను పిలిపించి భూమి వర్గీకరణ, విస్తీర్ణం, ప్రభుత్వంలో వెస్టింగ్, ప్రస్తుత స్వాధీనం, నిర్మాణాలు, లేఅవుట్లు, తదుపరి రిజిస్ట్రేషన్లు మరియు బిల్డింగ్ అనుమతులు అన్నింటినీ సర్వే నంబర్ వారీగా పరిశీలించాలని కోరారు. 
**రీ-లేఅవుట్లు, G+1 ఇళ్లు – రూ.1.50 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు విక్రయాలపై దర్యాప్తు**
ప్రస్తుతం సంబంధిత భూముల్లో కొన్ని ప్రాంతాల్లో తాజా/రీ-లేఅవుట్ కార్యకలాపాలు, G+1 ఇళ్ల నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం ఉందని, ఒక్కో ఇంటిని సుమారు రూ.1.50 కోటి నుంచి రూ.2.00 కోట్లకు మార్కెట్ చేస్తున్నట్లు లేదా విక్రయానికి ఉంచుతున్నట్లు ప్రతినిధిత్వంలో పేర్కొన్నారు.ఈ సమాచారాన్ని అధికారులు స్వతంత్రంగా భౌతిక పరిశీలన, మున్సిపల్ రికార్డులు, రిజిస్ట్రేషన్ రికార్డులు మరియు ఇతర ఆధారాల ద్వారా ధృవీకరించాలని కోరారు.వందల కోట్ల ఆర్థిక లావాదేవీల కోణంలో దర్యాప్తు చేయాలి.ఇలాంటి కార్యకలాపాలు అనేక ప్లాట్లు, ఇళ్లు మరియు వివిధ లావాదేవీలకు సంబంధించినవిగా తేలితే, మొత్తం వ్యవహారంలో భారీ స్థాయి ఆర్థిక లావాదేవీలు మరియు అనేక మంది కొనుగోలుదారులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని రవికృష్ణ పేర్కొన్నారు.
అందువల్ల మొత్తం భూమి విస్తీర్ణం, సృష్టించిన ప్లాట్లు, నిర్మించిన ఇళ్లు, విక్రయాలు, పొందిన మొత్తాలు, బిల్డర్లు, ఫైనాన్షియర్లు, మధ్యవర్తులు మరియు తుది లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. 
**ప్రభావశీల వ్యక్తుల పాత్రపై స్వతంత్ర దర్యాప్తు**
తనకు అందిన సమాచార ప్రకారం మాజీ స్థానిక మున్సిపల్ చైర్మన్ కుమారుడు మరియు కొంతమంది బిల్డర్లు/డెవలపర్లు ఈ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండవచ్చని సమాచారం ఉందని రవికృష్ణ తెలిపారు.
అయితే ఎవరి ప్రమేయాన్నీ నిర్ధారిత వాస్తవంగా తాను ప్రకటించడం లేదని, రిజిస్ట్రేషన్, రెవెన్యూ మరియు ఆర్థిక రికార్డుల ఆధారంగా స్వతంత్ర దర్యాప్తు ద్వారా మాత్రమే వాస్తవాలను నిర్ధారించాలని ఆయన స్పష్టం చేశారు. 
**సైబరాబాద్ పోలీస్ మరియు ఎకనామిక్ ఆఫెన్సెస్ విచారణకు విజ్ఞప్తి**
అనేక వ్యక్తులు, వరుస ఆస్తి లావాదేవీలు, రీ-లేఅవుట్లు, నిర్మాణాలు మరియు భారీ ఆర్థిక లావాదేవీల అంశం ఉన్నందున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సమన్వయంతో క్రిమినల్ దర్యాప్తు జరపాలని కోరారు.అవసరమైతే, చట్టపరంగా సముచితమైన సందర్భంలో Economic Offences Wing లేదా ఇతర ప్రత్యేక దర్యాప్తు విభాగానికి ఆర్థిక అంశాలను అప్పగించి బ్యాంకు లావాదేవీలు, విక్రయ సొమ్ము, బిల్డర్లు/కాంట్రాక్టర్లకు చెల్లింపులు, మధ్యవర్తులు, ఫైనాన్సింగ్ మరియు తుది లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. BNS సెక్షన్ 111 వర్తిస్తుందా అనే అంశాన్ని పరిశీలించాలి.బహుళ వ్యక్తులు, నిరంతర కార్యకలాపాలు, రీ-లేఅవుట్లు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలు దర్యాప్తులో నిర్ధారణ అయితే, BNS Section 111 – Organised Crime చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయా అనే అంశాన్ని సంబంధిత పోలీస్ అధికారులు సాక్ష్యాల ఆధారంగా పరిశీలించాలని కోరారు. 
**అమాయక కొనుగోలుదారులను రక్షించాలి**
ప్రస్తుతం ఇలాంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న అమాయక ప్రజలు భారీ మొత్తాలను చెల్లించి తరువాత హక్కు, సర్వే గుర్తింపు లేదా ప్రభుత్వ భూమి వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని రవికృష్ణ హెచ్చరించారు.
అందువల్ల భూముల అసలు స్థితి నిర్ధారించే వరకు అనధికారిక రీ-లేఅవుట్లు, నిర్మాణాలు మరియు కొత్త థర్డ్-పార్టీ హక్కుల సృష్టిని చట్టపరమైన అధికారాల పరిధిలో నిరోధించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 
*“ప్రభుత్వ భూమి రక్షణ – ప్రజల డబ్బు రక్షణ రెండూ అత్యవసరం”**
సర్వే నంబర్ల వారీగా జాయింట్ ఫిజికల్ సర్వే, అసలు రెవెన్యూ రికార్డుల పరిశీలన, రిజిస్ట్రేషన్ లావాదేవీల పూర్తి ట్రేసింగ్, TS-bPASS/మున్సిపల్ అనుమతుల ధృవీకరణ, ఆర్థిక లావాదేవీల దర్యాప్తు మరియు బాధ్యుల గుర్తింపుతో సమగ్ర చర్యలు తీసుకోవాలని రవికృష్ణ కోరారు.ఈ అంశాన్ని URGENT PUBLIC-INTEREST MATTERగా పరిగణించి, చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ మరియు అన్ని సంబంధిత అధికారులను కోరారు.

స్థానిక అవసరాలను అర్థం చేసుకోవడం పరిష్కారం చేయడం - సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్_

*'ప్రతిరోజూ ఒక వార్డు' - ఈరోజు కైత్లాపూర్ వార్డు*

*స్థానిక అవసరాలను అర్థం చేసుకోవడం పరిష్కారం చేయడం - సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 21:

'ప్రతిరోజూ ఒక వార్డు' కార్యక్రమంలో భాగంగా, కైత్లాపూర్ వార్డులోని ఆంజనేయ నగర్ పార్కులో, సీఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు సంబంధిత శాఖల అధిపతులతో కలిసి కాలనీ ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులు మరియు నివాసితులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రోడ్ల విస్తరణ మరియు భూసేకరణ, కైత్లాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ట్రాఫిక్ రద్దీ, రోడ్డు అనుసంధానం, యూజీడీ ఓవర్‌ఫ్లో, వీధి దీపాలు, పారిశుధ్యం మరియు అమలు సమస్యలతో సహా పలు కీలక పౌర మరియు అభివృద్ధి సమస్యలపై దృష్టి సారించారు.
పవర్ నగర్‌లో మహిళా పార్కు ఏర్పాటు చేయాలనే ఆవశ్యకతను ఆర్‌డబ్ల్యూఏలు లేవనెత్తారు. అలాగే, గుర్తించిన ప్రాంతాలలో స్క్రాప్ దుకాణాలు మరియు ప్రైవేట్ బస్సుల పార్కింగ్‌పై తమ ఆందోళనలను తెలియజేశారు.కమిషనర్, లేవనెత్తిన సమస్యలను సమీక్షించి, వార్డులో అనుసంధానం, ట్రాఫిక్ నిర్వహణ మరియు ప్రాథమిక పౌర సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని మరియు పెండింగ్‌లో ఉన్న పనులను పర్యవేక్షించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

సాంకేతి విద్యను పరిరక్షణన చేసేందుకు ABVP ఆధ్వర్యంలో రామంతపూర్ లో నాలుగవ రోజు ఉద్యమం ఉదృతం , రాష్ట్ర ముఖ్య మంత్రి దిష్టి బొమ్మ దహనం_

*సాంకేతి విద్యను పరిరక్షణన చేసేందుకు ABVP ఆధ్వర్యంలో రామంతపూర్ లో నాలుగవ రోజు ఉద్యమం ఉదృతం , రాష్ట్ర ముఖ్య మంత్రి దిష్టి బొమ్మ దహనం* 
 
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 20:

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP ఆధ్వర్యంలో సాంకేతిక విద్యను పరిరక్షణ చేపట్టాలని ,అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన G.O NO.97 లో అనేక విషయాలలో ప్రభుత్వం EECET ద్వారా లాటరల్ ఎంట్రీ పై పూర్తిగా స్పష్టతను ఇవ్వాలని ,అదేవిధంగా పాలిటెక్నిక్ మరియు ITI విద్యలను కేవలం ఒక సర్టిఫికెట్ కోర్సులుగా మార్చే కుట్రను ఆపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేస్తూ నిరసన తెలపడం జరిగింది. తెలంగాణలో అనేక మారుమూల ప్రాంతాలనుండి పేద విద్యార్థులు తమ ఉన్నత విద్యను అభ్యసించడానికి పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి తొందరగా తమ తల్లితండ్రులకు ఆసరాగా నిలవాలని కోరుకుంటుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎందరో పేద విద్యార్థులు తొందరగా ఉపాధి పొందే ఈ పాలిటెక్నిక్ విద్యను ఈరోజు ప్రభుత్వం కేవలం ఒక సర్టిఫికెట్ కోర్సుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గాఢ నిద్రలో నుండి మేల్కొని ఈ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించి పేద మధ్య తరగతి విద్యార్థులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఎబివిపి డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఎబివిపి తెలంగాణ రాష్ట సంయుక్త కార్యదర్శి శ్యామ్ కిరణ్, ఎబివిపి ఉప్పల్ జిల్లా కన్వీనర్ బుర్ర అఖిల్,గ్రేటర్ హైదరాబాద్ సిటీ కిరణ్, సంజయ్,భాను, భవిత్,రోషన్,రవి తేజ మరియు నగర కార్యకర్తలు పాల్గొన్నారు...

మెడిపల్లిలో కల్తీ మసాలాల తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపుదాడి_

*ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు కఠినం - కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై ఉక్కుపాదం*

*మెడిపల్లిలో కల్తీ మసాలాల తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపుదాడి*

*వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి - పోలీస్ కమిషనర్ బి. సుమతి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 20:

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, ఆహార పదార్థాలను కల్తీ చేసి అక్రమ లాభాలకు పాల్పడే వారిపై చర్యలు అత్యంత కఠినంగా ఉంటాయని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి హెచ్చరించారు. ఆహారం మనిషి జీవనాధారమని, అలాంటి ఆహారంలోనే కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, సరఫరాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమంగా సంపాదించాలనుకునే వారిపై చట్టం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు.పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎస్‌ఓటీ మల్కాజిగిరి, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాలు గురువారం మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌పై మెరుపుదాడి నిర్వహించాయి.విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన ఈ తనిఖీల్లో పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలాలను నిర్ణీత ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.వంటింట్లో రుచికి, ఆరోగ్యానికి ఆధారంగా ఉపయోగించే మసాలా దినుసులనే కల్తీ వ్యాపారానికి సాధనంగా మార్చిన తీరు తనిఖీల్లో వెలుగుచూసింది. ముఖ్యంగా కారం పొడిలో 30 శాతం రంపపు పొడి (సా డస్ట్) కలిపినట్లు గుర్తించడంతో అధికారులు విస్తుపోయారు.
అంతేకాకుండా అసలు బ్రాండ్‌ను పోలిన నకిలీ ప్యాకింగ్, లేబుళ్లను ఉపయోగించి వినియోగదారులకు నాణ్యమైన బ్రాండెడ్ ఉత్పత్తులుగా నమ్మించే ప్రయత్నం జరిగినట్లు గుర్తించారు.నాసిరకం ఆహార పదార్థాలకు ఆకర్షణీయమైన ప్యాకింగ్ ముసుగు తొడిగి మార్కెట్‌లోకి పంపుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ బి. సుమతి మాట్లాడుతూ, వినియోగదారుడి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కల్తీ ఆహార పదార్థాలను మార్కెట్‌లోకి పంపడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
ప్యాకెట్ అందంగా ఉందనో, దానిపై ప్రముఖ బ్రాండ్‌ను పోలిన పేరు ఉందనో ప్రజలు సహజంగా నమ్ముతారని, ఆ నమ్మకాన్నే అక్రమార్కులు తమ లాభాల కోసం వాడుకోవడం ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. ఇటువంటి అక్రమ వ్యాపారాలపై సమాచారం సేకరించి, వాటి మూలాలను గుర్తించి, బాధ్యులపై వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
దాడిలో భారీ మొత్తంలో మసాలా పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2,300 కిలోల పసుపు పొడి, 3,350 కిలోల కారం పొడి, 5,140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలాను సీజ్ చేశారు. మొత్తంగా 10,890 కిలోలు, అంటే 10.89 టన్నుల మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకోగా, వాటి అంచనా విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తయారీ, ప్యాకింగ్‌కు ఉపయోగిస్తున్న ముడి పదార్థాలు, ప్రాసెస్ చేసిన పొడులు, ప్యాకింగ్ సామగ్రి, యంత్రాలను కూడా బృందాలు పరిశీలించాయి.ఈ వ్యవహారంలో సత్యనారాయణ, రుద్రశేఖర్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకును మెడిపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఆహార భద్రత, కల్తీ, మిస్‌బ్రాండింగ్‌తో పాటు ఆహార పదార్థాల అక్రమ తయారీ, విక్రయాలకు సంబంధించి వర్తించే చట్ట నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.కల్తీ ఆహారం కంటికి కనిపించని ప్రమాదమని, అందువల్ల వినియోగదారుల అప్రమత్తత కూడా అత్యంత కీలకమని పోలీస్ కమిషనర్ బి. సుమతి పేర్కొన్నారు. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా తదితర ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు కేవలం ప్యాకెట్ రూపాన్ని లేదా బ్రాండ్ పేరును మాత్రమే చూసి కొనుగోలు చేయవద్దని సూచించారు.
బ్రాండ్ పేరు, తయారీ తేదీ, గడువు లేదా బెస్ట్ బిఫోర్ తేదీ, బ్యాచ్ నంబర్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరాలు తదితర తప్పనిసరి సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని కోరారు. ప్యాకింగ్ సరిగా లేకపోయినా, లేబులింగ్‌పై అనుమానం వచ్చినా, నాణ్యత విషయంలో సందేహం కలిగినా అలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, ప్యాకింగ్ లేదా అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని బి. సుమతి కోరారు.ఒక వినియోగదారుడి అప్రమత్తత అనేక కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడగలదని పేర్కొన్నారు. కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై 8712662111 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఉప్పల్ జోన్ డీసీపీ కె. సురేష్ కుమార్, ఎస్‌ఓటీ డీసీపీ కె. మనోహర్, మెడిపల్లి ఏసీపీ బి. మోహన్ కుమార్, ఎస్‌ఓటీ మల్కాజిగిరి, ఎస్‌ఓటీ ఉప్పల్ జోన్, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ప్రజలకు చేరే ఆహారం స్వచ్ఛంగా, సురక్షితంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని, ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఏ అక్రమ వ్యాపారాన్నీ ఉపేక్షించే ప్రసక్తే లేదని, కల్తీకి పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని పోలీస్ కమిషనర్ బి. సుమతి మరోసారి హెచ్చరించారు.

సామాన్యుడిలా బైక్‌పై వచ్చి.. కేబీఆర్ వన్ వే ట్రాఫిక్‌ను పరిశీలించిన నగర సీపీ సజ్జనర్_

*సామాన్యుడిలా బైక్‌పై వచ్చి.. కేబీఆర్ వన్ వే ట్రాఫిక్‌ను పరిశీలించిన నగర సీపీ సజ్జనర్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 20:

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో కొత్తగా అమల్లోకి తెచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఉదయం 10 గంటలకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సాధారణ పౌరుడిలా సివిల్ దుస్తుల్లో బైక్‌పై ప్రయాణిస్తూ క్షేత్రస్థాయి ట్రాఫిక్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్డు నంబర్ 45 వరకు రెండు సార్లు బైక్‌పై తిరుగుతూ ట్రాఫిక్ ను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం వేళల్లో కూడా మరోసారి ట్రాఫిక్ సరళిని పర్యవేక్షించారు. అగ్రసేన్‌ చౌరస్తా, ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు తదితర కూడళ్ల వద్ద విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని అన్నారు. బుధవారం నుంచి వన్‌వే విధానాన్ని అమలులోకి తెచ్చామని, మొదటి రోజు లేన్ల మార్పిడి విషయంలో వాహనదారులు కాస్త అయోమయానికి గురైనప్పటికీ, గురువారం నాటికి రాకపోకలు పూర్తిగా సాఫీగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జంక్షన్లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది సిబ్బందిని కూడా మోహరించినట్లు వివరించారు.
జీహెచ్‌ఎంసీ, నిర్మాణ ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటూ హెచ్-సిటీ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పనులు పూర్తయ్యేంత వరకు నగరవాసులు సహకరించాలని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Thursday, August 20, 2026

అధికారులు మూసివేసినా.. మళ్లీ ఎలా తెరిచారు?_

అనుమతులు లేకుండా విద్యారణ్య స్కూల్ నిర్వహణపై ఆరోపణలు

మూసివేసినా.. మళ్లీ ఎలా తెరిచారు?

అనుమతులు ఎక్కడ? అధికారుల చర్యలు ఏమిటి?

హైదరాబాద్(ప్రశ్న న్యూస్): 

అంబర్ పేట డివిజన్ పటేల్‌నగర్‌లోని విద్యారణ్య స్కూల్‌లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో జూలై 6న పాఠశాలను మూసివేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.

అయితే రెండు రోజులు మూసివేసి.. మళ్లీ యథావిధిగా తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు? ప్రస్తుతం పాఠశాలకు ఏ తరగతుల వరకు అనుమతులు ఉన్నాయి? అనుమతులు లేకపోతే తిరిగి పాఠశాల నిర్వహణకు ఎవరు అనుమతించారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదే పేరుతో వివేక్‌నగర్–రామంతపూర్‌లో మరో పాఠశాల కొనసాగుతుండటం, పటేల్‌నగర్ పాఠశాల విద్యార్థులను అక్కడి నుంచి 10వ తరగతి పరీక్షలకు పంపుతున్నారనే ఆరోపణలపై కూడా స్పష్టత ఇవ్వాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. హైదరాబాద్ జిల్లాలోని అనుమతి లేని పాఠశాల విద్యార్థులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఎలా రాస్తున్నారు? అనే అంశంపైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై హిమాయత్‌నగర్ డిప్యూటీ ఎంఈఓ శ్యామల్ రాజుకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారులు ఆరోపించారు. దీంతో 13-08-2026న హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంలో అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? పాఠశాలకు ఉన్న అనుమతులు, ప్రస్తుతం నిర్వహిస్తున్న తరగతులకు ఉన్న గుర్తింపులు, విద్యార్థుల పరీక్షల నిర్వహణకు సంబంధించిన అనుమతులు అన్నింటినీ విద్యాశాఖ తక్షణమే బహిర్గతం చేయాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.

అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, గతంలో పాఠశాలను మూసివేసిన తర్వాత తిరిగి నిర్వహణకు దారితీసిన పరిస్థితులపైనా సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.

ఇది కేవలం ఒక పాఠశాల వ్యవహారం కాదు.. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా హక్కులు, భద్రతకు సంబంధించిన ప్రశ్న. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. తప్పైతే వాస్తవాలను విద్యాశాఖ స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలి.

Wednesday, August 19, 2026

గచ్చిబౌలి పోలీసులు మరియు సైబరాబాద్ SOT బృందాలు ముగ్గురు MDMA విక్రేతలను (peddlers)అరెస్ట్ చేశారు_

*భారీ మొత్తంలో ఎండీఎంఏ (MDMA) మత్తుమందు పలువురు పెడ్లర్లను అరెస్ట్*

*గచ్చిబౌలి పోలీసులు మరియు సైబరాబాద్ SOT బృందాలు ముగ్గురు MDMA విక్రేతలను (peddlers)అరెస్ట్ చేశారు*

*అదుపులోకి తీసుకుని, రూ. 16.4 లక్షల విలువైన 95.41 గ్రాముల MDMA డ్రగ్ మరియు 50 గ్రాముల OG కుష్ (OG Kush) ను స్వాధీనం చేసుకున్నారు.*

బాపట్ల కృష్ణమోహన్, ఆగస్టు 19:

ఖచ్చితమైన సమాచారం మేరకు, గచ్చిబౌలి పోలీసులు మరియు సైబరాబాద్ SOT బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించి, ముగ్గురు డ్రగ్ విక్రేతలు మరియు 16 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నాయి. వీరి వద్ద నుండి రూ. 16.49 లక్షల విలువైన 95.41 గ్రాముల MDMA డ్రగ్ మరియు 50 గ్రాముల OG కుష్‌ను స్వాధీనం చేసుకున్నాయి.*కేసు వివరాలు:* గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో NDPS చట్టంలోని సెక్షన్లు 27(B), 8C, 22(C) కింద కేసు (నం. 1431/2026) నమోదు చేయబడింది.
**స్వాధీనం చేసుకున్న వస్తువులు:**
*(1)*: MDMA – 95.41 గ్రాములు (విలువ రూ. 11,40,920/-)
*(2)*: OG కుష్ – 50 గ్రాములు (విలువ రూ. 5,00,000/-)
స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ: రూ. 16,40,920/-
*(3)*: రెండు సెల్ ఫోన్లు
**నిందితుల వివరాలు:**

*(1)*: Md రజల్ అబ్దుల్ గఫూర్, వయసు 26 ఏళ్లు, వృత్తి: వ్యాపారం, నివాసం: బెగూర్, బెంగళూరు (కర్ణాటక), స్వస్థలం: త్రిసూర్ (కేరళ).
*(2)*: నవీన KD, వయసు 22 ఏళ్లు, వృత్తి: వ్యాపారం, నివాసం: బెగూర్, బెంగళూరు (కర్ణాటక), స్వస్థలం: త్రిసూర్ (కేరళ). 3)కొరిపెల్ల యశ్వంత్ సాయి షణ్ముఖ్, వయస్సు: 26 సంవత్సరాలు, Occ: నిరుద్యోగ R/o మూసాపేట్, కూకట్‌పల్లి, హైదరాబాద్. N/o తూర్పు గోదావరి, A.P రాష్ట్రం.
**కేసు వాస్తవాలు:** 
11.08.2026న, వట్టినాగులపల్లిలోని కిండోమ్ పబ్ రోడ్డు సమీపంలో MDMA పెడ్లర్ కొరిపెల్ల యశ్వంత్ సాయి షణ్ముఖ్‌తో పాటు 16 మంది వినియోగదారులను అరెస్టు చేశారు, విచారణలో యశ్వంత్ ఎండీ రజల్ అబ్దుల్ గఫూర్ R/o కేరళ మరియు నవీన KD R/o బెంగుళూరుకు చెందిన నిందితుల వ్యక్తి నుండి MDMA కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.18.08.2026న, కేరళలోని త్రిసూర్‌లో Md Razal Abdul Gafoorను అరెస్టు చేశారు. విచారణలో, తాను Sam (నైజీరియన్) నుండి సేకరించిన 44.41 గ్రాముల MDMAని Koripella Yashwanth Sai Shanmukhకు ఇచ్చినట్లు అతను వెల్లడించాడు. అదే రోజున కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, బేగూర్ వద్ద Navina KDని అరెస్టు చేశారు; బేగూర్‌లోని ఆమె నివాసంలో జరిపిన సోదాలో 51 గ్రాముల MDMA మరియు 50 గ్రాముల OG Kush లభించాయి. విచారణలో, స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను కేరళకు చెందిన తన స్నేహితుడు Aneshwar నుండి సేకరించినట్లు Navina KD తెలిపింది.ఈ అరెస్టులు CH. శ్రీనివాస్ (DCP, శేరిలింగంపల్లి జోన్), శోభన్ కుమార్ (DCP, SOT సైబరాబాద్), T. గోవర్ధన్ (Addl. DCP-I, SOT సైబరాబాద్), ఉదయ్ రెడ్డి (Addl. Dy. Commissioner of Police, శేరిలింగంపల్లి జోన్),  G. వెంకట రమణ గౌడ్ (ACP, నార్సింగి డివిజన్), SOT సైబరాబాద్ బృందాలు, అలాగే గచ్చిబౌలి PS SHO, DI మరియు గచ్చిబౌలి పోలీస్ సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగాయి.
**సూచన**
డ్రగ్స్ లేదా గంజాయి సరఫరాదారులకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే, 'Dial 100' ద్వారా లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 8712663061 ద్వారా పోలీసులకు తెలియజేయాలని పౌరులను కోరుతున్నాము. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, డ్రగ్స్ లేదా గంజాయికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నాము. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

మాభూమి మాకు దక్కింది ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు -22 ఏ దరఖాస్తుదారులు_

*22/ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం*

*ప్రతి కేసును వేగంగా పరిష్కరించాలి*

*ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి పొంగులేటి*

*అధికారులకు టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం*

*మాభూమి మాకు దక్కింది ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు -22 ఏ దరఖాస్తుదారులు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 19:

 22/ఎ  నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22/ఎ జాబితాలో భూమి ఉందనే ఒక్క కారణంతోనే రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని, ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి జాప్యం లేకుండా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి 22/ఎ అంశంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్లు సబ్‌ రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు.అనంతరం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.22/ఎ జాబితాలో భూమి ఉందనే కారణంతో మాత్రమే రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం లేదా తిరస్కరించడం చేయవద్దని ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించాల‌ని ఆదేశించారు. సంబంధిత భూమి 22/ఎ నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది? అందుకు సంబంధించిన రికార్డులు ఏమి చెబుతున్నాయి? ప్రస్తుతం భూమి వాస్తవ పరిస్థితి ఏమిటి? హక్కుదారుడి వద్ద ఉన్న పత్రాలు ఏమిటి? గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలు ఏమిటి? వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని వాటికి రిజిస్ట్రేషన్ ఎందుకు సాధ్యం కాదో దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, నిబంధనల ప్రకారం ముందుగా చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
22/ఎభూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను కూడా పరిరక్షిస్తూ, ప్రతి కేసును చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
*“నా భూమి నాకు దక్కింది.. -ప్రభుత్వానికి కృతజ్ఞతలు”*
 22/ఎ సమస్యను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్న ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్షంగా లబ్ధి పొందిన పోచారం గ్రామానికి చెందిన రాకేష్ తన అనుభవాన్ని వెల్లడించారు.“నేను 2022లో పోచారం గ్రామంలో వంద గజాల స్థలం కొనుగోలు చేశాను. ఇటీవల ఆ స్థలాన్ని విక్రయించేందుకు నార్లపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాను. మొదట డాక్యుమెంట్ రైటర్‌ను సంప్రదించగా, మీ భూమి22/ఎ లో ఉందని చెప్పారు. దీంతో కొంత ఆందోళనకు గురయ్యాను. అయితే మూడు, నాలుగు రోజుల క్రితం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి మీ భూమికి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ఈ రోజు నేను ఆ స్థలాన్ని కొనుగోలుదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేశాను. నా భూమి నాకు దక్కేలా సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు” అని తెలిపారు.“ క్లియరెన్స్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం”.నార‌ప‌ల్లి సబ్‌ రిజిస్ట్రార్ సునీల్ మాట్లాడుతూ.. పోచారం గ్రామంలోని సర్వే నంబర్ 50ను ఏపీ హౌసింగ్ బోర్డు భూమిగా పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్‌లో22/ఎ జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని తెలిపారు. ఇటీవల కలెక్టర్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. వెంటనే గతంలో రిజిస్ట్రేషన్ కోసం మమ్మల్ని సంప్రదించిన వారికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నాం. వారు కార్యాలయానికి వచ్చిన వెంటనే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం” అని సబ్‌ రిజిస్ట్రార్ సునీల్ తెలిపారు.మా సొసైటీలోని 300 ప్లాట్ల‌కు పూర్తి విముక్తి క‌లిగింది- చ‌క్ర‌పాణి (కొనుగోలుదారు).కూక‌ట్‌పల్లి అడ్డ‌గుట్ట సొసైటీలోని నెంబ‌ర్ 80సిలోగ‌ల 250 గ‌జాల స్ద‌లాన్ని నెల‌రోజుల క్రితం కొనుగోలు చేశాను. అయితే రిజిస్ట్రేషన్ కోసం కూక‌ట్‌ప‌ల్లి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే ఆభూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉంద‌ని రిజిస్ట్రేష‌న్ చేయ‌లేదు. తాజాగా ప్ర‌భుత్వ చ‌ర్య‌ల కార‌ణంగా నిన్న‌నే నాకు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యం నుంచి ఫోన్ వ‌చ్చింది. ఈ రోజు వెళ్ల‌గా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేశారు. అంతేగాక మా సొసైటీలోని 300 ప్లాట్ల‌ను నిషేధిత జాబితా నుంచి తొల‌గించిన‌ట్లు అధికారులు చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు- అని చ‌క్ర‌పాణి అనే కొనుగోలుదారు తెలిపారు. ప్ర‌భుత్వ స‌కాల చ‌ర్య‌ల వ‌ల్ల రిజిస్ట్రేష‌న్ పూర్త‌యింది- రాజేంద్ర‌ప్ర‌సాద్‌.బాలా న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య ప‌రిధిలోని మూసాపేట్‌లో గ‌ల రెయిన్‌బో విస్టాలో ఉన్న‌ప్లాట్ నెంబ‌ర్ 804 ను విక్ర‌యించేందుకు కొద్దికాలం క్రితం య‌జ‌మాని వెంక‌ట విజ‌య్‌కుమార్ ప్ర‌య‌త్నించారు. అయితే 22ఎ నిషేధిత జాబితాలో ఉన్నందున రిజిస్ట్రేష‌న్ జ‌ర‌గ‌లేదు. వెంక‌ట విజ‌య్‌కుమార్ ఆస్ట్రేలియా వెళ్లిపోతూ త‌న మామ రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఈనెల 12న స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యం నుంచి స‌మాచారం రావ‌డంతో ఈరోజు రాజేంద్ర‌ప్ర‌సాద్ వెళ్లి రిజిస్ట్రేషన్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాజేంద్ర ప్ర‌సాద్ ఏమ‌న్నారంటే...
మా అల్లుడు సేల్ చేద్దామనుకున్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం వస్తే... 22ఎ కింద గవర్నమెంట్ నిషేధం విధించింద‌ని  చెప్పినందున  ఆ రోజు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ త‌ర్వాత నా అల్లుడు నా పేరు మీద స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. అది ఇంకా చాలా కాలమే పడుతుందేమో అనుకున్నాం గానీ... అదృష్టవశాత్తూ ప్ర‌భుత్వం స‌కాలంలో చ‌ర్య‌లు తీసుకున్నందున  వెంట‌నే  ఒక  వారం రోజుల్లోనే ఇది క్లియర్ అయ్యి... అనుకూలంగా తేలింది. ఈ రోజు రిజిస్ట్రేషన్ కోసం వచ్చాం, రిజిస్ట్రేషన్ కూడా మాకు సంతృప్తి కరంగా పూర్తిగా  అవుతుంది. ప్ర‌భుత్వానికి చాలా కృతజ్ఞతలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేష‌న్ పూర్తి - శ్రీ‌నివాస్.బాలా న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య ప‌రిధిలోని మూసాపేట్‌లో గ‌ల వైష్ణ‌వి ఎస్టేట్ ప్ర‌తినిధి శ్రీ‌నివాస్ మూసాపేట స‌ర్వే నెంబ‌ర్ 108లోగ‌ల భూమిని విక్రయించేందుకు రాగా 22ఎ నిషేధిత జాబితాలో ఉంద‌ని రిజిస్ట్రేష‌న్ శాఖ అధికారులు తిర‌స్క‌రించారు. తాజాగా ప్ర‌భుత్వ చ‌ర్య‌లు కార‌ణంగా ఈరోజు శ్రీ‌నివాస్ త‌న భూమికి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌నివాస్ మాట్లాడుతూ..
మాకు 2005 లో సీలింగ్ పర్మిషన్ వచ్చింది. మేము రిజిస్ట్రేషన్ కి అప్పటినుంచి  ప్ర‌య‌త్నం  చేస్తున్నాము. . తాజాగా రెండు వారాల క్రితం   మూసాపేట్ బాలానగర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కి వెళ్తే 22ఎ లో పెట్టామని చెప్పారు. మేము కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యాము. ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ అది క్లియర్ చేశారు. దాంతో ఈ రోజు  ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాము. ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ అయింది. థాంక్యూ వెరీ మచ్.ప‌లు స‌ర్వే నెంబ‌ర్ల‌లో నిషేధం తొల‌గింపు - ఎస్‌.ఆర్‌.వో
బాలాన‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌య ప‌రిధిలో గ‌ల స‌ర్వే నెంబ‌ర్లు 101/1, 101/2, 102, 108, 109, 112, 81 లో ఉన్న సుమారు 3000 చ‌ద‌ర‌పు మీట‌ర్ల  స్ద‌లంపై ఉన్న 22ఎ నిషేధం తొలగిపోయింది. ఈ స‌ర్వే నెంబ‌ర్ల‌లో ఉన్న భూమికి సంబంధించి రిజిస్ట్రేష‌న్లు జ‌రుపుకోవ‌చ్చున‌ని బాలా న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ స్ప‌ష్టం చేశారు. 
అధికారుల ఆదేశాల‌తో వెంట‌నే రిజిస్ట్రేష‌న్.మేము ఏజీ కాలనీ, గుండ్ల పొచంప‌ల్లిలోని .గౌరీశంకర్ వద్ద మేము ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది.మేము జూలై ఆరు నాడు ఇక్కడ రిజిస్ట్రేషన్ కి రాగా 22ఎ నిషేధిత జాబితా పేరిట‌ రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.
అప్పటినుంచి మేము కలెక్టర్ ఆఫీస్ కి, అక్కడ ఇక్కడ తిరుగుతుంటే... ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి, క్లియర్ చేయమని సబ్-రిజిస్ట్రార్ గారికి చెప్పారు. ఆ వెంట‌నే స‌బ్ రిజిస్ట్రార్ మేడమ్ గారు మాకు ఫోన్ చేసి, రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసి  మాకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది అని ఒక ద‌ర‌ఖాస్తుదారు తెలిపారు.

కరీంనగర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ_

పత్రికా ప్రకటన
*గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి*

*కరీంనగర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 19:

గోమాతను జాతీయ మాతగా గుర్తించాలని కోరుతూ.. ప్రజల్లో దేశభక్తిని, గోసంరక్షణపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గోసమేత తిరంగా ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు.​నగరంలోని చారిత్రక తెలంగాణ చౌక్ వేదికగా సాగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఆయన గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీని అట్టహాసంగా ప్రారంభించారు. తెలంగాణ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ తిరంగా ర్యాలీ బస్టాండ్ వరకు సాగి, తిరిగి తెలంగాణ చౌక్ వద్ద ముగిసింది. సుమారు 600 మంది విద్యార్థులు, యువతీ యువకులు, గోమాత ట్రస్ట్ సభ్యులు, నాయకులు ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో భాగస్వామ్యులయ్యారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని, గోమాత జాతీయ మాతగా గుర్తింపు పొందాలని నినాదాలు చేస్తూ సాగిన ఈ ర్యాలీ నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంది.​ఈ కార్యక్రమంలో నమో మిషన్ వందే గోమాత వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య మద్విరాజ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కో-ఫౌండర్ లు జూపెల్లి ధీరజ్, వేణు, దీపక్, అదిశేషు, నవీన్, మాజీ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గోమాత ట్రస్ట్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

బలూచ్ భూభాగం నుండి అన్ని బలగాలను వెంటనే ఉపసంహరించుకోండి_

*పాకిస్తాన్‌కు బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం హెచ్చరిక*

*బలూచ్ భూభాగం నుండి అన్ని బలగాలను వెంటనే ఉపసంహరించుకోండి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 19:

బలూచిస్తాన్‌ను విడిచిపెట్టాలని బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యం మరోసారి పాకిస్తానీ బలగాలన్నింటినీ గుర్తుచేస్తోంది. ఎందుకంటే, ఒక స్వతంత్ర దేశంగా, పాకిస్తాన్ యొక్క బాహ్య మరియు దురాక్రమణ శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బలూచిస్తాన్‌కు అన్ని చట్టపరమైన మరియు నైతిక సమర్థనలు ఉన్నాయి.పాకిస్తానీ సైన్యం బలూచిస్తాన్‌లో చట్టవిరుద్ధంగా మోహరించి, తుపాకీతో బెదిరించి దాని వనరులను, ఖనిజాలను దోచుకుంటోంది. అదే సమయంలో, బలూచిస్తాన్ పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు, వ్యాపారాలకు, గౌరవానికి మరియు శాంతికి నిరంతరం ముప్పు కలిగిస్తోంది. అంతర్జాతీయ సమాజంలో అమలులో ఉన్న చట్టాలను తమ సొంత గడ్డపై వర్తింపజేస్తూ, బలూచిస్తాన్ పాకిస్తానీ సైన్యాన్ని ఒక దురాక్రమణదారుగా మరియు బలూచిస్తాన్ వలస చట్టాలను ఉల్లంఘించిన వారిగా పరిగణిస్తుంది. అందువల్ల, పాకిస్తానీ బలగాల ఉనికి అంతా చట్టవిరుద్ధమని ప్రకటిస్తోంది.బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్న తర్వాత, దానిని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించి, బలూచిస్తాన్ రక్షణ, భద్రత, ఖనిజాల పరిరక్షణ, సరిహద్దు భద్రత, భూ, సముద్ర మరియు గగనతల భద్రతను ఉల్లంఘిస్తున్న పాకిస్తానీ బలగాలను పంజాబ్‌కు తిరిగి పంపించడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని బలూచిస్తాన్ కోరుతోంది.బలూచిస్తాన్‌లో నివసిస్తూ, సైన్యం, ఎఫ్‌సి, పోలీసు మరియు ఇతర సంస్థలలో, అలాగే పాకిస్తాన్ వాయు మరియు నావికా దళాలలో పనిచేస్తున్న బలూచ్-యేతర పాకిస్తానీలకు బలూచిస్తాన్ రిపబ్లిక్ ఆదేశాలు జారీ చేస్తోంది. వారు బలూచిస్తాన్‌కు చెందిన అన్ని ఆయుధాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకులు, భారీ ఫిరంగులు, నౌకాదళ నౌకలు మరియు సైనిక సామగ్రిని బలూచిస్తాన్‌లోని బలూచ్ బలగాలకు అప్పగించి, ఒట్టి చేతులతో పంజాబ్‌కు తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే, పైన పేర్కొన్న సామగ్రి అంతా బలూచిస్తాన్ డబ్బుతోనే కొనుగోలు చేయబడింది. సరిగ్గా 1947లో బ్రిటన్, భారతదేశాన్ని విడిచిపెట్టినప్పుడు, అన్ని సైనిక ఆయుధాలు మరియు యుద్ధ సామగ్రిని భారతదేశానికి అప్పగించి, ఒట్టి చేతులతో బ్రిటన్‌కు తిరిగి వెళ్ళినట్లే; 1971లో బంగ్లాదేశ్‌లో యుద్ధంలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ అక్కడి నౌకాదళ, వాయు, భూతల దళాలను మరియు యుద్ధ సామగ్రిని బంగ్లాదేశ్ దళాలకు అప్పగించినట్లే; సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలగేటప్పుడు తన ఆయుధాలను మరియు సైనిక సామగ్రిని అక్కడే వదిలిపెట్టినట్లే; మరియు 2025లో యునైటెడ్ స్టేట్స్ మరియు నాటో తమ ఉపసంహరణ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను మరియు యుద్ధ సామగ్రిని వదిలిపెట్టినట్లే; అదే విధంగా పాకిస్తాన్ ఆక్రమణ దళాలు ఇప్పుడు బలూచిస్తాన్ నుండి తమ ఉపసంహరణ తేదీని మరియు గడువును స్పష్టంగా ప్రకటించాలి, మరియు బలూచిస్తాన్ విడిచి వెళ్లేటప్పుడు వారిని ఒక్క తూటా కూడా తగలనివ్వరు.
బలూచిస్తాన్ గణతంత్ర రాజ్యంలో భూ యుద్ధంలో తాము ఇప్పటికే ఓడిపోయామని పాకిస్తాన్‌కు కూడా బాగా తెలుసు. అందువల్ల, 1971లో మూడు మిలియన్ల బెంగాలీల ఊచకోత తర్వాత వారు లొంగిపోయి తప్పించుకోవడానికి మార్గం వెతికినట్లే, అదేవిధంగా బలూచిస్తాన్‌లో లక్షలాది మంది ప్రజల ఊచకోత తర్వాత పాకిస్తాన్‌కు తప్పించుకునే మార్గం దొరకదు. బలూచిస్తాన్ ప్రజలు తమ ప్రతీకారాన్ని మరచిపోలేదు; అందువల్ల అమాయక బలూచ్ పౌరులపై మరిన్ని ఊచకోతలు జరపడం కంటే, బలూచిస్తాన్ నుండి తన బలగాలను ఉపసంహరించుకోవడమే పాకిస్తాన్‌కు మంచిది. ఎందుకంటే, బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ చేస్తున్నది ఒక వ్యర్థమైన యుద్ధం, దాని అంతం పాకిస్తాన్ ఓటమే. పాకిస్తాన్‌లో ఒక్క వివేకి అయినా ఉంటే, అతను రాబోయే ప్రమాదాన్ని గ్రహించాలి: బలూచిస్తాన్ ఇప్పుడు ఒక స్వతంత్ర దేశం, మరియు ఈ దేశాన్ని గుర్తించడంలోనే పాకిస్తాన్ భద్రత ఉంది.

Tuesday, August 18, 2026

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణి లో పౌరసమాజం నుంచి 43 వినతిపత్రాలు_

*సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ప్రజావాణి లో పౌరసమాజం నుంచి 43 వినతిపత్రాలు*

*టౌన్ ప్లానింగ్ విభాగంలో అత్యధికంగా 28 వినతిపత్రాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 17:

పౌరసమాజం తమ సమస్యలను నేరుగా కార్పొరేషన్‌కు తెలియజేసేందుకు వీలుగా సోమవారం సైబరాబాద్ మున్సిపల్ అధికారులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఇందులో మొత్తం 43 వినతిపత్రాలు పౌరసమాజం నుంచి అందాయి అని అన్నారు.
*(1)*: ఇంజనీరింగ్ – 10
*(2)*:ఎంటమాలజీ (కీటక శాస్త్రం) – 1
*(3)*: పారిశుధ్యం – 1
*(4)*: టౌన్ ప్లానింగ్ (పట్టణ ప్రణాళిక) – 28
*(5)*:అర్బన్ బయోడైవర్సిటీ (పట్టణ జీవవైవిధ్యం) – 3
ప్రతి సమస్యను ఒక ప్రత్యేకమైన గ్రీవెన్స్ ఐడి మరియు ట్రాకింగ్ లింక్‌తో నమోదు చేయడం జరుగుతుంది అని అధికారులు అన్నారు.దీనివల్ల పౌరులు తమ వినతిపత్రం యొక్క స్థితిని తెలుసుకోగలుగుతారు.సంబంధిత శాఖలను ఈ సమస్యలను పరిశీలించి, సకాలంలో పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, అరుదైన రాయి పేరిట మోసం — ఆరుగురిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్_

*నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, అరుదైన రాయి పేరిట మోసం — ఆరుగురిని అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 17:

నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, మహిమలు ఉన్నాయంటూ ప్రచారం చేసిన ఒక రాయిని అధిక ధరలకు విక్రయించి అమాయకులను మోసం చేసేందుకు యత్నిస్తున్న ఆరుగురి ముఠాను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ మరియు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఉమ్మడిగా దాడి చేసి పట్టుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. శనివారం (15-08-2026) రోజున కాటేదాన్‌లోని లక్ష్మిగూడ ప్రాంతంలో కొనుగోలుదారుల కోసం వేచి చూస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి నిర్వహించారు.
**కేసు పూర్వాపరాలు:**
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం — మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన పి. నరసింహ, వడత్య కుమార్, ప్రవీణ్ సింగ్, మంగళి బసవ నరేష్ మరియు వేములవాడకు చెందిన సిద్ధాంతి చల్లా రవి ఒక ముఠాగా ఏర్పడ్డారు.2024లో పి. నరసింహ అనే వ్యక్తి వేములవాడకు చెందిన చల్లా రవి, కొండపల్లి భిక్షపతి వద్ద నుంచి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని రూ. 10,00,000లకు కొనుగోలు చేసి మోసపోయాడు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని వడత్య కుమార్‌కు అందజేశాడు. దాంతో తామంతా ఒక గుంపుగా ఏర్పడి, ఆ నకిలీ విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మబలికి అమాయకులకు భారీ ధరలకు విక్రయించాలని ప్లాన్ చేశారు.
ఇదే సమయంలో కేతావత్ రాజు తన వద్ద ఒక అరుదైన గులాబీ రంగు రాయి ఉందని, దాన్ని కూడా అధిక ధరకు విక్రయించవచ్చని భావించి ముఠాలో చేరాడు. శనివారం కాటేదాన్, లక్ష్మిగూడ సమీపంలో ఈ నకిలీ విగ్రహం మరియు రాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
**అరెస్ట్ అయిన నిందితులు:**
*(1)*: కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప (38): కార్ డ్రైవర్, చౌదూర్ (గ్రామం), నవాబ్‌పేట, మహబూబ్‌నగర్ జిల్లా.
*(2)*: వడత్య కుమార్ (34): కార్ డ్రైవర్, లక్ష్మిగూడ, కాటేదాన్, హైదరాబాద్.
*(3)*: ప్రవీణ్ సింగ్ (34): డ్రైవర్, మధుబన్ కాలనీ, కాటేదాన్, హైదరాబాద్.
*(4)*: మంగళి బసవ నరేష్ (38): కార్మికుడు, లక్ష్మిగూడ, కాటేదాన్, హైదరాబాద్.
*(5)*: పి. నరసింహ (45): కార్ డ్రైవర్, లక్ష్మిగూడ, కాటేదాన్ (స్వస్థలం: లోయపల్లి, మంచాల్, రంగారెడ్డి జిల్లా).
*(6)*: చల్లా రవి (38): జోతిష్యుడు, చీర్లవంచ, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా.
**స్వాధీనం చేసుకున్న సొత్తు:**

*(1)*: ఒక నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం
*(2)*: ఒక గులాబీ రంగు రాయి (Pink Colour Stone)
*(3)*: ఎర్టిగా (Ertiga) వాహనం (TS 04 B 0549)
*(4)*: ఐదు మొబైల్ ఫోన్లు
*(5)*: మూడు రసాయన ద్రావణాల బాటిళ్లు (Unknown Liquid Bottles)
*(6)*: రెండు ఎరుపు రంగు తువాళ్లు.
జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఛెత్రి యాదేందర్, సబ్-ఇన్‌స్పెక్టర్ జి. సందీప్ రెడ్డి బృందం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులతో కలిసి ఈ అపరేషన్ నిర్వహించారు. నిందితులను స్వాధీనం చేసుకున్న సొత్తుతో సహా తదుపరి విచారణ నిమిత్తం మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO)కు అప్పగించారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ప్రతి పౌరుడికి ఎంతో గర్వకారణం_

*జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం — సమానత్వం, భాగస్వామ్యానికి ప్రతీక*

*సీతారాం ధూళిపాళ అధ్యక్షులు - పంచవటి కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మణికొండ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 16:

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ప్రతి పౌరుడికి ఎంతో గర్వకారణం. అది దేశం పట్ల గౌరవం, బాధ్యత, దేశభక్తి, సమాజంలో తన భాగస్వామ్యాన్ని చాటుకునే ఒక ప్రత్యేకమైన అనుభూతి.
సాధారణంగా మన దేశంలో ఇప్పటికీ వలస పాలనా కాలం నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, సంస్థ అధిపతి లేదా ప్రముఖ వ్యక్తి, VIP చేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే పద్ధతి ఉంది. ప్రముఖులను గౌరవించడంలో తప్పులేదు. అయితే ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం సమానత్వం, భాగస్వామ్యం, ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడం.పంచవటి కాలనీ RWA దీనికి భిన్నమైన, ప్రజాస్వామ్య స్ఫూర్తితో కూడిన సంప్రదాయాన్ని గత 6–7 సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. కాలనీలోని సీనియర్ సిటిజన్లకు వరుసగా ఒక్కొక్కరికి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పిస్తున్నాం.ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు. అధిపత్యాన్ని చూపించడం కాకుండా సమానత్వాన్ని గౌరవించే, ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఒక గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయం.సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్న RWAలు మరియు పౌర సమాజ సంస్థలు (Civil Society Organisations) ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే ముఖ్యమైన అట్టడుగు స్థాయి సంస్థలు. ఇవి భారత రాజ్యాంగంలోని 74వ సవరణ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజల భాగస్వామ్యాన్ని, స్థానిక స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించగలవు.సమాజ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలంటే, కేవలం పదవిలో ఉన్నవారికి లేదా VIPలకు మాత్రమే కాకుండా ప్రతి పౌరుడికి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే, బాధ్యత తీసుకునే, గౌరవం పొందే అవకాశం కల్పించాలి.ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రాతినిధ్యం కాదు — ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం కూడా.ప్రతి సీనియర్ సిటిజన్, ప్రతి నివాసి, ప్రతి సభ్యుడికి సమాజ సేవలో పాల్గొనే అవకాశం కల్పిద్దాం. తద్వారా మన సమాజంలో సమానత్వం, గౌరవం, బాధ్యత మరియు భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం.
సమాన భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది.
భాగస్వామ్యం బాధ్యతను పెంచుతుంది.
బాధ్యతాయుతమైన ప్రజలు బలమైన సమాజాన్ని నిర్మిస్తారు.
పంచవటి కాలనీ RWA కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం — అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య విలువలను ఆచరణలో చూపిస్తున్న ఒక చిన్న కానీ గొప్ప ఉదాహరణ.

తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం - సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు_

*హైదరాబాదు నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం* 

*తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం - సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు.*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 16:

హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్రభారతి మెయిన్ హాల్లో కల్చరల్ ఫెస్టివల్ 2026 వైభవంగా జరిగింది. 16 రకాల కళా రూపాలను సుమారు 170 మంది కళాకారులు ప్రదర్శించారు.ఈ కల్చరల్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరైన సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ప్రజలలో చైతన్యాన్ని కల్పించేలా కళారూపాలను ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అందులో హైదరాబాద్ జిందాబాద్ లాంటి సంస్థలను కూడా భాగస్వాములను చేస్తామని అన్నారు. హైదరాబాద్ జిందాబాద్ లాంటి పౌర సంస్థలు మెడికల్ ఉచిత మెడికల్ క్యాంపులు, పర్యావరణ పరిరక్షణ మొదలగు అంశాలపై కృషి చేస్తూ ప్రజలకు తమ వంతు సహకారాన్ని, సేవలను అందిస్తున్నందుకు అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కళాభివృద్ధికి చేస్తున్న కృషిని సోదాహరణంగా వివరించారు.
ఈ కల్చరల్ ఫెస్టివల్ లో "ది ట్రైల్ ఆఫ్ భగత్ సింగ్" డ్రామా మరియు ప్రగతి నగర్ విద్యార్థులు ప్రదర్శించిన "సే నోటు డ్రగ్స్" "ఆర్గాన్ డొనేషన్ లపై స్కిట్" లు సందేశాత్మకంగా, ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఓం డాన్స్ అకాడమీ, అంబేద్కర్ కాలేజీ కళాబృందాలు వేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకర్షించాయి. కురుగంటి కళాక్షేత్రం సాంప్రదాయ భరతనాట్యం ప్రఖ్యాత కళాకారులు గురు స్వామి పేరడీ, రవుఫుద్దీన్ స్టాండప్ కామెడీ, శివ ప్రసాద్ మిమిక్రీ, రామడుగు వసంత్ మైమ్ షో, మౌనిక పపెట్ షో ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తానల్ మలయాళీ సేవాసమితి కేరళ సాంప్రదాయ తిరువతిర నృత్యం ప్రేక్షకులను ఆకర్షించింది.ఈ సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో సుమారు 100 హైస్కూల్స్ లలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్, పాటల పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజినల్ ఉపాధ్యక్షులు మురళీకృష్ణ , పర్యావరణవేత్త  డాక్టర్ జయ సూర్య,  హ్యాపీ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజశేఖర్,  ప్రముఖ టీవీ నటులు మలక్పేట శైలజ గారు హాజరై బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్ష కార్యదర్శులు ఎం. శ్రీనివాసరావు, కె.వీరయ్య ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, పి.నాగేశ్వరరావు,  మోహన్ నాయుడు , సంగీత, శ్రీవల్లి, మాధవి సుకుమార్, రాజమౌళి, నాగేష్, శంకర్ లు కార్యక్రమ నిర్వహణకు నాయకత్వం వహించారు.

Sunday, August 16, 2026

గోదావరి పుష్కరాల పై కేబినేట్ సబ్ కమిటి ఏర్పాటు_

*గోదావరి పుష్కరాలను ఘనంగా  నిర్వహించాలి*

*గోదావరి పుష్కరాల పై కేబినేట్ సబ్ కమిటి ఏర్పాటు*

*క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌, మంత్రి  డి. శ్రీధర్‌బాబు అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 14:

26 జూన్ 2027 నుంచి 7 జూలై 2027 వరకు గోదావరి నది తీరం పుష్కర శోభతో విరాజిల్లేలా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని గోదావరి పుష్కరాల పై ఏర్పాటు చేసిన కేబినేట్ సబ్ కమిటి సంకల్పించింది.పుష్కరాల సందర్భంగా గోదావరి తీరం వెంబడి ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేసి, దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.ఈ దిశగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌, మంత్రి  డి. శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం అధికారులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.26 జూన్ 2027 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో కేబినేట్ సబ్ కమిటి ఛైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని మంత్రుల బృందం కూలంకషంగా చర్చించింది.  దేవాదాయ శాఖ, ఆర్ అండ్ బి, నీటిపారుదల, పోలీస్, టూరిజం, టిజిఎన్పిడిసిఎల్, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్టమెంట్, గ్రామీణ నీటిపారుదల తదితర శాఖలు చేపడుతున్న పనుల వివరాలను మంత్రుల బృందం ఆరా తీసింది. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, శాఖల వారీగా కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులు మంత్రులకు వివరించారు. 
పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, రవాణా, విద్యుత్‌, వైద్య, భద్రత తదితర సదుపాయాల కల్పనపై మంత్రులు ప్రత్యేకంగా శాఖల వారీగా చర్చించారు. పుష్కరాల ప్రారంభానికి ముందే అన్ని పనులను నాణ్యతతో, సమన్వయంతో పూర్తి చేసి భక్తులకు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి నదీ తీరాన వున్న నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పుష్కర ఘాట్లుగా తీర్చిదిద్దనున్న మొత్తం 67 కేంద్రాలను 3 అంచెల్లో అభివృద్ధి చేయనున్నట్లు కమిటి కన్వీనర్, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ మంత్రుల బృందానికి వివరించారు. గోదావరి పుష్కరాల సమగ్ర ఏర్పాట్ల కోసం రూ. 1000 కోట్లతో వివిధ శాఖల పరిధిలో  పనులు జరుగుతున్నట్లు  వివరించారు.ఈ సందర్భంగా కేబినేట్ సబ్ కమిటి ఛైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల పనుల పురోగతిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. వీలుకాని పక్షంలో వర్చువల్ మీటింగ్ ల ద్వారా పనులను సమీక్షించాలని సూచించారు. గోదావరి పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డిగారు ప్రతిష్టాత్మక కార్యక్రమంగా భావిస్తున్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.  
పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పనుల పురోగతిని ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు డ్యాష్‌బోర్డు ద్వారా సమీక్షించేందుకు వీలుగా, శాఖల వారీగా చేపడుతున్న పనులు, పురోగతి తదితర వివరాలు అందుబాటులో ఉండేలా డ్యాష్‌బోర్డును రూపొందించాలని అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు. గోదావరి పుష్కరాల నిమిత్తం స్పెషల్ ఫండ్స్ కావాలని పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వినతుల వస్తున్నందున ఈ విషయమై ముఖ్యమంత్రిగారితో చర్చిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి తీర ప్రాంతం సుదీర్ఘంగా వున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గోదావరి పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించాలని సూచించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు ఎంచుకున్న ప్రాంతాల్లో ఆయా క్షేత్రాల మహాత్మ్యాన్ని, చారిత్రక–ఆధ్యాత్మిక విశిష్టతను తెలియజేసేలా స్వాగత ద్వారాలు, ప్రత్యేక అలంకరణలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆయా క్షేత్రాల విశిష్టతను పరిచయం చేసేలా సమాచార బోర్డులు, దృశ్యరూప ప్రదర్శనలు ఏర్పాటు చేసి, గోదావరి పుష్కరాల వైభవం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు పనులు పునరావృతం కాకుండా సమన్వయంతో చేయాలని సూచించారు.భక్తులకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స అందించడానికి వైద్యారోగ్య శాఖతో పాటు ముందుకు వచ్చే ప్రైవేట్ హాస్పిటళ్ళ సహకారం తీసుకోవాలని మంత్రి వైద్యారోగ్య శాఖకు సూచించారు. అనంతరం భక్తులు పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు నిర్వహించడంతో పాటు కొబ్బరికాయలు కొట్టడం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులు గోదావరి జలాల్లో కలవకుండా భక్తులకు అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని, జలాల్లో కలిసిన ప్లాస్టిక్ వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ సూచించారు.గోదావరి పుష్కరాలకు లక్షలాదిగా యాత్రికులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. విఐపి, వివిఐపిలకు ప్రత్యేకంగా బారికేడ్స్ , స్నానఘట్టాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన తోపులాట అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ శాఖ అధికారులు మంత్రులకు వివరించారు. ఐ అండ్ పిఆర్ తరఫున ప్రచార కార్యక్రమాలను గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందు నుంచే ప్రారంభించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డికి సూచించారు.గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే గోదావరి నదీ తీరంలోని భద్రాచలం, ధర్మపురి వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పుష్కర ఏర్పాట్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్  రావు అధికారులను ఆదేశించారు. పుష్కరాల సమయంలో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక బస్ షెల్టర్లు, ప్రయాణికుల వెయింటింగ్ ఏర్పాట్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలను  తీర్చిదిద్దాలని, శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్లు లేని ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టేషన్లు, ప్రయాణికుల హోల్డింగ్ ఏరియాలు, పార్కింగ్ సదుపాయాలు  తదితర ఏర్పాట్లను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టిసి అధికారులకు నిర్దేశించారు. గోదావరి పుష్కరాలను ప్రతిబింబించేలా బస్ స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను ముందుగానే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఘాట్లు, గ్రామాల పరిసరాల్లో పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, పుష్కరాల కాలం పూర్తయ్యే వరకు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు అవసరమైన సిబ్బంది, వనరులను అందుబాటులో ఉంచాలని అన్నారు. పుష్కరాల ఏర్పాట్లలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర కేబినేట్ తీర్మానాలు _

*తెలంగాణ రాష్ట్ర కేబినేట్ తీర్మానాలు*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 14:

రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుంటే.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. కొత్తగా కుటుంబీకుల పేర్లను కూడా నమోదు చేసింది. 62 లక్షల మందికి కొత్తగా లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో ఈరోజుకు మొత్తం 3 కోట్ల 42 లక్షల మంది రేషన్ లబ్ధిదారులున్నారు. వీరికి స్మార్ట్ కార్డుల జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.గత ఏడాది నిర్వహించినట్లే.. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించాలని ప్రాధమికంగా తేదీలను నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి,  వివేక్ వెంకటస్వామి అధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు  ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ఆవిష్కరించినట్లే.. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తో సదస్సు నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఆవిష్కరించనుంది. ప్రధానంగా మన రాష్ట్రంలో డిఫెన్స్, ఏరో స్పేస్, ఫార్మా రంగాల్లో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈసారి సదస్సు జరుగుతుంది. వివిధ రంగాల్లో ఇప్పటికే తెలంగాణ స్టార్టప్ లు, పరిశ్రమలు సాధించిన విజయాలు.. వివిధ రంగాల కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఎగ్జిబిషన్, స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
వానాకాలం పంట‌కు సంబంధించి ఏడు ర‌కాల స‌న్న ధాన్యం సాగును ప్రోత్సహించి, ఆ ఏడు ర‌కాల సాగును పెంచడానికి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని కేబినేట్ నిర్ణయించింది.  రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదిక‌ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ ఏడు ర‌కాల స‌న్నాల‌కే రూ.500 బోన‌స్‌ చెల్లించాల‌ని కేబినేట్ తీర్మానించింది.యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్ధతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబ‌ట్టుకున్న నేప‌థ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.2389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి.. ఈ వేలం (e-Auction) ద్వారా ధాన్యం అమ్మాలని కేబినేట్ నిర్ణయించింది.రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి తీసుకురావ‌డానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు సాంకేతిక విద్యా శాఖ ప‌రిధిలో ఉన్నాయి. వీటిని తెలంగాణ ఎడ్యుకేష‌న్ యాక్ట్ నుంచి తొల‌గించి  యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న వీటన్నింటినీ ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేసేందుకు క్యాబినెట్ తీర్మానించింది.ఆదిలాబాద్‌, నిర్మల్, ముధోల్‌, బోథ్‌, సిర్పూర్‌, గజ్వేల్, దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో తొలివిడ‌త‌గా 113 నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూల్ కాంప్లెక్స్లో నిర్మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు కొత్తగా ఆమోదించిన 7 స్కూళ్లతో కలిపి ఇప్పటివరకు 86 యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ కాంప్లెక్స్ లకు అనుమతులు మంజూరయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ వీలైనంత తొందరగా స్థల సేకరణ చేసి, నిర్మాణాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన చోట వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి.. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలున్నాయి. వీటిని ఈవీ (విద్యుత్తు వాహనాలుగా) మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం (తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్) అమలుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద  అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1 లక్ష 50 వేలు సబ్సిడీ అందిస్తారు.  ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నారు.హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన HILT పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు కేబినెట్ నిర్ణయం. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోత‌ల ఫేజ్‌-II పనుల కోసం రూ. 2,100 కోట్ల అంచనా వ్యయానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.  దీంతో దాదాపు ల‌క్ష ఎక‌రాల‌కు సాగు నీరు, ఆ ప్రాంతంలో తాగు నీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు ఈ ఎత్తిపోత‌ల నుంచి అందుతుంది. 
గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామ‌ర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీల‌కు పెంచటంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.