Monday, January 31, 2022

వేల కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం..! మామూళ్ల మ‌త్తులో జీహెచ్ఎంసీ అధికారులు..!

వేల కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం..! మామూళ్ల మ‌త్తులో జీహెచ్ఎంసీ అధికారులు..!
 https://www.dishadaily.com/some-individuals-built-buildings-illegally-on-government-land#.YfjP6a6g6dl.whatsapp

----------------------------------------------------------------

నా పైనే వార్త రాస్తావా ?

తొక్కిస్తా అంటూ భూతు పురాణం మొదలు పెట్టిన ఆ తహసీల్దార్ ఎవరో మీరే చదవండి , 

వేల కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం..! మామూళ్ల మ‌త్తులో జీహెచ్ఎంసీ అధికారులు..! https://t.co/Eldw67w9qZ
------------------------------------------------------------------

రెవిన్యూ అధికారులు, @GHMCOnline అధికారులు అవినీతి వాళ్ళ వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురై అక్రమ నిర్మానాలు వెలుస్తున్నాయి.... దీని పై వార్తలు రాస్తే ఇలా బెదిరింపులు వస్తున్నాయి... మున్సిపల్, రెవిన్యూ అధికారులు అవినీతి మత్తు కారణంగా రానున్న రోజుల్లో గజం భూమి కూడా మిగలదు https://t.co/bRPR7UwPKD
-------------------------------------------------------------------

తెలంగాణ రెవిన్యూ సంఘాల ప్రతినిధులు ఇప్పుడు స్పందించండి....

మీ అధికారుల అక్రమాలకు బాధితులు అయిన వారు రెవిన్యూ అధికారుల మీద దాడులు చేస్తే వెంటనే స్పందించే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇప్పుడు స్పందించండి మీ విశ్వసనీయత తెలుస్తుంది.... Bplkm
https://t.co/ksG3Cp49IY https://t.co/sDNuXZCYkP

మెగా’ కరెప్షన్.. ఆకునూరి సంచలనం

మెగా’ కరెప్షన్.. ఆకునూరి సంచలనం

– రజిత్ కుమార్ తన నిజాయితీ నిరూపించు కోవాలి

– ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలి
– మేఘా సంస్థ విచారణ కమిటీని ప్రభావితం చేయొచ్చు
– మంత్రుల కాళ్లు మొక్కితే అధికారులకు ప్రమోషన్స్
– దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు
– విద్యా, ఆరోగ్యంపై కేటాయిస్తే దోచుకోలేరు..
-తొలివెలుగుతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ

ఐఏఎస్ అధికారి రజిత్ కుమార్తె పెళ్లి అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వివాహ ఖర్చులకు మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ డబ్బులు సమకూర్చిందనే వార్తలు విపక్షాలకు ఆయుధంగా మారింది. తాజాగా ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలివెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ అంశంపై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

రజిత్ కుమార్ తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆకనూరి అన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై ఇంత వరకూ స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోందని చెప్పారు. ఒక రిటైర్డ్ జడ్జీతో ప్రభుత్వం ఓ కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం విచారణకు ఆదేశించినా.. మేఘా కృష్ణారెడ్డి కమిటీని ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదని అనుమానించారు.

తెలంగాణలో రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు కలిసి నాకింత, నీకింత అంటూ అవినీతి సొమ్ము పంచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ తెలంగాణ ప్రజల కష్టాన్ని హవాలా రూపంలో దేశం నుంచి తరలించేస్తున్నారని అన్నారు. కుల ప్రాతిపదికన అధికారులకు పదోన్నతలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అవినీతి అధికారులను అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులకు కాళ్లు మొక్కితే ప్రమోషన్స్ వస్తాయనే అభిప్రాయం ఐఏఎస్ అధికారుల్లో ఏర్పడిందని ఆకునూరి మురళీ అన్నారు.

తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా.. ఇంత వరకు ఒక్క ఐఏఎస్ అధికారి కూడా సస్పెండ్ కాలేదంటే.. రాజకీయ నాయకులు, అధికారులు కమ్ముక్కై అవినీతి చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో పని చేస్తున్న ఓ ఐఏఎస్ అధికారికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ కూడా ఉందని ఇటీవల తనకు తెలిసిందని చెప్పారు. లక్షన్నర కోట్ల రెవెన్యూ ఉన్న తెలంగాణలో కొన్ని గ్రామాలకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడానికి కారణం పేట్రేగిపోతున్న అవినీతి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని ఆయన వివరించారు. దీనిలో రెండు లక్షల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకే కేటాయించారని అన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడితే.. పెద్ద అవినీతి చేసుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన అని ఆయన ఆరోపించారు. విద్యా, ఆరోగ్యం, మౌలికవసతుల కల్పనపై ఎక్కువ కేటాయింపులు పెడితే దోచుకోవడానికి అవకాశం ఉండదు కనుక లక్షల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని తొలివెలుగుతో ఆకునూరి మురళీ చెప్పారు.


“మెగా” రిగ్గింగ్.. ఖజానాకు డ్రిల్లింగ్! ఇటలీ కంపెనీ పేరుతో.. “కృష్ణ” మాయ!

డ్రగ్స్ దందా పాల్పడే వారిపై ఇక చెడుగుడే..... సైబరాబాద్ పోలీసుల స్టాంగ్ వార్నింగ్.....!

*డ్రగ్స్ దందా పాల్పడే వారిపై ఇక చెడుగుడే..... సైబరాబాద్ పోలీసుల స్టాంగ్ వార్నింగ్.....!*

తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా బయటపడుతున్న మాధకద్రవ్యాల ఘటనలపై పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్..ఇకపై రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినిపించకూడదంటూ పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఈక్రమంలో డ్రగ్స్ దందాను కూకటివేళ్లతో సహా ఏరిపారేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సహా హైదరాబాద్ జంటనగరాల్లో డ్రగ్స్ దందాపై తీసుకుంటున్న చర్యల గురించి సైబరాబాద్ *డీసీపీ (క్రైమ్స్) కలమేశ్వర్* వివరించారుఈసందర్భంగా డీసీపీ కలమేశ్వర్ సోమవారం ప్రత్యేకంగామాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘావుంచి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ కలమేశ్వర్ పేర్కొన్నారు. జంట నగరాల పరిధిలోని పబ్స్, రిసార్టులపై ప్రత్యేక నిఘా ఉంచారు పోలీసులు.
ముఖ్యంగా గ్రామాల్లో పంటపొలాల మాటున గంజాయి పండిస్తున్న వారిపై నిఘా ఉంచి.. గంజాయి మూలాల నిర్ములనకు అక్కడి పంచాయతీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు డీసీపీ కలమేశ్వర్ తెలిపారు. డ్రగ్స్ / గాంజాయి సరఫరా చేస్తున్న వారు, ఎవరెవరు ఉన్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? వంటి వివరాల ఆధారంగా ఆయా ప్రదేశానికి ప్రత్యేక బృందాలను పంపించి పూర్తి స్థాయిలో నిర్ములించే దిశగా చర్యలు తీసుకున్నట్టు డీసీపీ వివరించారు.
మాదక ద్రవ్యాలకు యువత బానిసలు కావడంపట్ల ఆందోళన వ్యక్తం చేసిన కలమేశ్వర్.. యువతకి ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలలు, విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. డ్రగ్స్ నియంత్రణపై సూచనలు చేశారు. ఇతర దేశాల నుండి సరఫరా అయ్యే డ్రగ్స్ పై నజర్ పెంచామన్న డీసీపీ కలమేశ్వర్.. డ్రగ్స్/గాంజాయి సరఫరాలపై ఎవరివద్దనైనా సమాచారం ఉంటే “డయల్ 100” ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com

Sunday, January 30, 2022

ఐఏఎస్ లు ఉంది ప్రజాసేవకా? నాయకులకు ఊడిగం చేయడానికా?

ఐఏఎస్ లు ఉంది ప్రజాసేవకా? నాయకులకు ఊడిగం చేయడానికా?

తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై ఉద్యమకారులు, మేధావుల్లో చర్చ జరుగుతోంది. ఉద్యోగులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు మొత్తం కుమ్మకై ప్రజల సొమ్ము దొచుకుంటున్నారని అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రజత్ కుమార్ కుమార్తె పెళ్లి బిల్లుల వ్యవహారమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి ఆస్తుల చిట్టా చుట్టూ అనేక సందేహాలను తెరపైకి తెస్తున్నారు.

తాజాగా బయటపడిన 70వేల కోట్ల మేఘా దోపిడీపై ఉద్యమకారులు మండిపడుతున్నారు. జూపల్లి రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి లాంటి బడా వ్యాపారులు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వారి అవినీతిపై ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. కోర్టులను కూడా మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు. ఆ మధ్య పంపకాల్లో ప్రభుత్వానికి మేఘా సంస్థకు అభిప్రాయ బేధాలు వచ్చాయేమో కానీ.. ఆ సంస్థపై ఈడీ, ఐటీ దాడులు జరిగాయని.. కాకపోతే లోపాయికారి ఒప్పందం తర్వాత వాటాలు పంచుకున్నారని చెబుతున్నారు.


ఈ అవినీతిపరులకు ప్రభుత్వ అధికారులు గ్రీన్ కార్పెట్ వేస్తున్నారని మండిపడుతున్నారు ఉద్యమకారులు. ఐఏఎస్ అధికారుల్లో 80శాతం మంది బ్రోకర్లులా తయారయ్యారని అంటున్నారు. రజత్ కుమార్ కూడా ఈ కోవకు చెందిన వారేనని ఆరోపిస్తున్నారు. అందుకే మేఘా సంస్థ ఆయన కుమార్తె పెళ్లి ఖర్చులకు బిల్లులు చెల్లించిందని అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా రజత్ కుమార్ టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించి 23 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు.
కింది స్థాయి ఉద్యోగులు 10 వేలు లంచం తీసుకున్నా పట్టుబడతారు కానీ.. ఐఏఎస్ లాంటి ఉన్నతస్థాయి అధికారులు వేల కోట్ల అవినీతి చేసినా, బడా వ్యాపారులు కోట్లు దోచేస్తున్నా దొరకకుండా సిస్టమ్ ని మేనేజ్ చేస్తున్నారని మండిపడుతున్నారు ఉద్యమకారులు. ప్రమోషన్ల కోసం అధికారులు రాజకీయ నాయకులకు, వ్యాపారులకు ఊడిగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఓ కలెక్టర్.. మహిళా రాజకీయ నాయకురాలి కాళ్ల దగ్గర కూర్చున్నాడని గుర్తు చేస్తున్నారు.

Saturday, January 29, 2022

సంజయ్ వ్యవహారంలో పోలీసుల చర్యలు సమర్థనీయమే..!

సంజయ్ వ్యవహారంలో పోలీసుల చర్యలు సమర్థనీయమే..!

జాగరణ దీక్ష చేసిన బండి సంజయ్ పై పోలీసులు వ్యవహరించిన తీరుని సీపీ సత్యనారాయణ సమర్థించుకున్నారు. సంజయ్ విషయంలో తాము చట్టబద్దంగా వ్యవహరించామని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం లోక్ సభ స్పీకర్ వరకు వెళ్లింది. ఫిబ్రవరి 3న లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు అందాయని సీపీ సత్యనారాయణ తెలిపారు.

బండి సంజయ్ విషయంతో తాము చట్టబద్ధంగానే వ్యవహరించామని ఆయన అన్నారు. తనతో పాటు కరీంనగర్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, సీఐ లక్ష్మీబాబు, జగిత్యాల డీసీపీలకు నోటీసులు అందాయని చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని.. కాకపోతే వారంతా కరోనా నిబంధనలు పాటిస్తున్నారని వివరించారు. కానీ.. బండి సంజయ్ కోవిడ్ నిబంధనలు అతిక్రమించారని.. దీంతో అతని పై చర్యలు తీసుకోవలసి వచ్చిందని అన్నారు.

కాగా.. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ బండి సంజయ్‌ కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్ష చేశారు. ఆయన చేస్తున్న దీక్ష కరోనా వ్యాప్తికి కారణం అవుతోందని పోలీసులు భగ్నం చేశారు. ఆ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తరువాత పోలీసులు సంజయ్ ని ఆరెస్ట్ చేశారు.
అయితే.. ఈ వ్యవహారంపై బండి.. పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. సంజయ్‌ ఫిర్యాదును ప్రివిలేజ్‌ కమిటీకి స్పీకర్‌ ఓం బిర్లా పంపారు. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని ప్రివిలేజ్‌ కమిటీ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సూచించింది. దీంతో.. కరీంనగర్ పోలీసుల అధికారులకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

దీపావళి సామాను తయారు చేసే వారి జీవితం ఇంత దారుణమా…?

దీపావళి సామాను తయారు చేసే వారి జీవితం ఇంత దారుణమా…? శివకాశీలోనే క్రాకర్స్ ఎందుకు తయారు చేస్తారు…?

దీపావళి రోజు బాంబులు అదే క్రాకర్స్ కాల్చడం అనేది మనకు చాలా సరదాగా ఉంటుంది. డబ్బులు పోసి కొనుక్కుని అగ్గి పుల్ల గీయడం ఎంతో సరదాగా ఉంటుంది. ఒక్క దీపావళికే కాదు… రాజకీయ నాయకుల ర్యాలీలకు, విజయోత్సవ కార్యక్రమాలకు, పుట్టిన రోజు వేడుకలకు, నూతన ఏడాదికి ఇలా ఏదోక రూపంలో కాలుస్తూనే ఉంటారు.

కాలుష్యం పెరిగేది పెరుగుతుంది, గీసే అగ్గి పుల్లలు ఏదోక కారణంతో గీస్తూ ఉంటాం. సరే గాని శివకాశీలోనే ఆ సామాగ్రి ఎందుకు తయారు చేస్తారు అనేది చాలా మందికి క్లారిటీ లేదు కదా…? దానికి పెద్ద కారణమే ఉందండీ. ఆ కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం.


శివకాశీలోని విరుదునగర్, కోవిల్పట్టి ప్రాంతాల్లో అవి తయారు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ ప్రాంతంలో ఏ పంట పండినా సరే దాదాపుగా వర్షాధారమే. మన రాయలసీమ మాదిరిగా ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఎండిన పొలాలు మాత్రమే ఉంటాయి. ఇక అక్కడి ప్రజలకు వ్యవసాయం వలన ఏ విధమైన ఉపయోగం లేదు. ఇక అక్కడి ప్రాంతం కూడా టపాకాయలు తయారు చేయడానికి అనువుగా ఉంటుంది.

ఎండ ఎక్కువగా ఉండటంతో సామాగ్రిని ఎండబెట్టడం కూడా సులువు. వర్షాలు చాలా తక్కువగా పడుతూ ఉంటాయి. ఇక అక్కడి కంపెనీలలో పని చేసే వారికి ఎక్కువగా ఏదోక రోగాలు వస్తూనే ఉంటాయి. ఊపిరితిత్తుల వ్యాధి లేదా క్షయవ్యాధితో చాలా మంది ప్రజలు బాధపడుతూ ఉంటారు. పేదరికం కారణంగా చాలా మంది అక్కడ పని చేయడానికి వెళ్తారు.

మన దగ్గరకు ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తారు కదా…? ఆ విధంగా అన్నట్టు. ఏదైనా పొరపాటు జరిగితే అంతే సంగతులు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పుట్టి పెరిగితే అక్కడ పని చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఇక అక్కడ వాళ్ళను చూస్తే మనకు క్రాకర్స్ కాల్చే సంతోషంగా కూడా ఉండదు. అంత దుర్భరమైన జీవితాలు అనుభవిస్తారు.


Friday, January 28, 2022

Land buyers ‘misguided’ by officials seek justice

Land buyers ‘misguided’ by officials seek justice

Several middle-class and upper middle-class people, who had invested their lifetime savings in lands to meet the educational or marriage expenses of their children, or to have a secure retired life in their old age, are finding themselves in the lurch now.

M.G. Rao, A. Ravinder Reddy and some others purchased about 80 acres of land at Ameenpur (survey No. 343 in 2005/06). The land, allotted to some freedom fighters, was allegedly sold to these persons after they met former MLA T. Jayaprakash Reddy, a Registration Department official Veerender and a government employee M. Rajender though middlemen. Before proceeding to pay the amount, the buyers had checked the records with the Revenue officials and on June 25, 2005, the then Mandal Revenue Officer of Patancheru issued an endorsement letter.

“The following two freedom fighters: Bollu Bhahraiah and S. Devaiah, who were allotted government land in survey No. 343/1 situated at Ameenpur village of Patancheru mandal were granted pattas under GO Ms No. 1743 of Revenue Department dated 28-08-1958 and GO Ms. No 1110 of Revenue Department dated 26-06-1960. Hence the land allotted is alienable,” was the endorsement certificate issued by the MRO of Patancheru. On getting this certificate, they approached the concerned department at the Collectorate and made a second enquiry on whether these lands could be purchased. The buyers are claiming that the officials informed them there will no problem in purchasing the land.

“We paid about ₹ 40 crore to Mr. Jayaprakash Reddy, Mr. Veerender and Mr. Rajender and got the land registered. When we tried to start work on the land, they asked us to stop work stating that there were some problems that were need to be sorted out and assured us that they would address them. Finally, the revenue officials are stating that the land registration is not tenable in the court of law and we are no longer owners of the land. We had lost heavily, please do us justice,” asked Mr. Ravinder Reddy and Mr. Rao.

In a related development, one Veeresham of Shankarapally village in Ranga Reddy district has alleged that about 200 acres of land at Eedulanagulapally village was purchased by MLA T Jayaprakash Reddy and others. A sale deed was signed, but cheques issued by Mr Jayaprakash Reddy were not honoured and a case was pending at the court.

https://youtu.be/IjgXK1jT6Qs


ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది తెలంగాణ గౌరవనీయులైన @TelanganaCMO కేసీఆర్ సారు గారిని

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*తెలంగాణ గౌరవనీయులైన @TelanganaCMO కేసీఆర్ సారు గారు వార్త కథనం(దిశ మీడియా)ప్రకారం మీరు మీ నాయకులను మొదట చట్టప్రకారం అరెస్టు చేయండి అప్పుడు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్ముతారు లేకపోతే మీరు చెప్పేటివన్నీ డైలాగులు అనుకుంటారు. గతంలో అకున్ సభర్వాల్ సారు డ్రగ్స్ మీద ఇచ్చిన నివేదికను సోషల్ మీడియా కు ఇవ్వండి మీ విశ్వశనీయత తెలుస్తుంది. ఏది ఏమైనా యువత భవిష్యత్ నాశనం చేస్తున్న ఈ డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్ళతో పెకిలించాలంటే సమాజం మొత్తం సహకరించాలి. సమాజమా మీ మౌనం మీ కుటుంబంలో కానీ మీ బంధువుల కుటుంబంలోని యువత భవిష్యత్ నాశనానికి కారణం అవుతారు బాగా ఆలోచించండి 🙏.... Bplkm*

*Copy to Group link Media*
*Note : ఉడుతా పంజాబ్ లా ఉడుతా తెలంగాణ సినిమా తీయొచ్చు* 29/01/2022

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/

https://twitter.com/Praja_Snklpm/status/1487286011222982661?t=oqJxEwiuqWZNSpsOegPBHw&s=08

హైదరా‘బాదుడే’భారీగా పెరగనున్న మార్కెట్‌ విలువలుస్థలాల ధరల్లో 35% నుంచి 45%

హైదరా‘బాదుడే’

భారీగా పెరగనున్న మార్కెట్‌ విలువలు

స్థలాల ధరల్లో 35% నుంచి 45%

నేటి సాయంత్రంలోగా జిల్లా కమిటీల ఆమోదం

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి

Courtesy by : ఈనాడు - హైదరాబాద్‌ ట్విట్టర్ 

Telangana News: హైదరా‘బాదుడే’

రాజధాని హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల మార్కెట్‌ విలువలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ శుక్రవారం తుది ప్రతిపాదనలను రూపొందించింది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు అత్యధిక రాబడిని అందించే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో భూములు విలువలు, అపార్ట్‌మెంట్‌ల ధరలు భారీగా పెరిగాయి. కొత్త మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గత ఏడాది జులై 22న మార్కెట్‌ విలువలను సవరించగా తాజాగా మరోసారి పెంచారు. శుక్రవారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి  జిల్లా రిజిస్ట్రార్‌లతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి ప్రత్యేకంగా సమావేశమై పెరిగిన మార్కెట్‌ విలువలపై తుది పరిశీలన చేసి ఖరారు చేశారు.

కొత్త మార్కెట్‌ విలువులను కమిటీలు శనివారం సాయంత్రంలోపు ఆమోదించేలా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

600 గ్రామాలపై ప్రత్యేక దృష్టి

పట్టణీకరణ, జాతీయ రహదారులకు ఇరువైపులా, మౌలిక వసతులు బాగా పెరిగిన ప్రాంతాల్లో మార్కెట్‌ విలువల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ జోరుతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న 600కు పైగా గ్రామాలను గుర్తించి అక్కడ మార్కెట్‌ విలువల పెంపును ప్రత్యేకంగా పరిగణించారు. 

* రంగారెడ్డి జిల్లా పరిధిలో చదరపు గజం ధర గరిష్ఠంగా రూ.45,500 నుంచి రూ.61,500కు పెరిగింది. రియల్‌ ఎస్టేట్‌కు కీలకంగా ఉండే ప్రాంతాల్లో పెరుగుదల భారీగా ఉంది. హైదరాబాద్‌ చుట్టు పక్కల ఖాళీ స్థలాల ధరల్లో కనీస పెరుగుదల 35 శాతం ఉండగా క్రయ విక్రయాలు భారీగా జరిగే ప్రాంతాల్లో 40 శాతం... అత్యధిక కొనుగోలు, అమ్మకాలు జరిగే చోట ఇది 45 శాతం కూడా ఉంది. 

* ఎకరం రూ.5 కోట్ల విలువ కలిగిన వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ 50 శాతం పెరగ్గా, రూ.5- 10 కోట్ల మధ్య ఉన్న వాటి ధరలు 20 శాతం హెచ్చినట్లు తెలిసింది.



Telangana News: హైదరా‘బాదుడే’

తహసీల్దార్​ మాయాజాలం.. బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు.. ఆ తర్వాత

ERTIFICATE IN WANAPARTHY DISTRICT

    తహసీల్దార్​ మాయాజాలం.. బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు.. ఆ తర్వాత

    Courtesy by : ఈtv భారత్ మీడియా ట్విట్టర్ 

    Thumbnail image

    ప్రజలు కట్టే పన్నులను జీతాలుగా తీసుకుంటూ వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే.. అన్యాయం చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలకు లోబడి.. డబ్బుకు ఆశపడి వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. ఫలితంగా అసలైన లబ్ధిదారులను బతికుండగానే రికార్డుల్లో చంపేస్తూ వారి భూమిని ఇతరుల పేరు మీదకు పట్టా చేస్తున్నారు. వృత్తి ధర్మాన్ని మరిచి కాసులకు కక్కుర్తి పడి సామాన్యుల ఉసురుపోసుకుంటున్నారు. ఒకే జిల్లాలో ఒకరే తహసీల్దారు.. ఇద్దరు రైతులు బతికుండగానే వారు చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన ఘటనే అందుకు దృష్టాంతం.

    బతికి ఉన్న ఓ రైతు మరణించినట్లుగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అతని పేరు మీద ఉన్న 16 గుంటల పొలాన్ని ఓ వ్యక్తికి అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్​ కాగితాలు మార్చేశాడు ఓ తహసీల్దారు. కంగు తిన్న బాధితుడు ఆరేళ్లుగా న్యాయం పోరాటం చేస్తున్నారు. మరో కేసులో అదే తహసీల్దారు.. మరో రైతును రికార్డుల్లో చంపేసి ఏకంగా 12 ఎకరాల 30 గుంటల భూమిని పట్టా మార్పిడి చేశాడు. న్యాయం పోరాటం చేస్తున్న ఆ రైతు ఇటీవల మరణించారు. వనపర్తి జిల్లాలో ప్రస్తుత మిడ్జిల్​ తహసీల్దార్ శ్రీనివాసులు.. రెండు చోట్ల విధులు నిర్వర్తించగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన విషయాలివి. అధికారులతో మొరపెట్టుకున్నా ఫలితం లేదని తెలుసుకున్న రైతు, మరో రైతు కుమారుడు.. హైదరాబాద్​లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు.

    తమకు న్యాయం చేయాలంటూ కమిషన్‌కు బాధితుల విజ్ఞప్తి

    "నేను బతికుండగానే చనిపోయినట్లు తహసీల్దార్​ శ్రీనివాసులు రికార్డులు సృష్టించారు. రాజకీయ నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతోంది. పోలీసు వ్యవస్థ కూడా సహకరించడం లేదు. నాకున్న 16 గుంటల భూమిని ఇతరులకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్​ చేశారు." - కుక్కన్న, బాధిత రైతు

    మరో కేసులో తహసీల్దార్​ శ్రీనివాసులుపై మరో వ్యక్తి ఫిర్యాదు చేశాడు. 2019లో వనపర్తి జిల్లా విపునగండ్ల తహసీల్దార్​గా పని చేసిన శ్రీనివాసులు.. తన తండ్రి శివన్న గౌడ్​ బతికుండగానే మరణించినట్లు రికార్డులు సృష్టించి.. తమ 12 ఎకరాల 30 గుంటల భూమిని పట్టా మార్పిడి చేశారని బాధితుడు శ్రీనివాస్ గౌడ్... కమిషన్​కు తెలిపాడు. అధికార పార్టీకి చెందిన స్థానిక మంత్రి అనుచరులకు తమ భూమిని వారి పేర్లపై రికార్డుల్లో ఎక్కించారని పేర్కొన్నాడు. ఈ విషయంపై హైకోర్టులో స్టే ఆర్డర్ తీసుకొచ్చినా తహసీల్దార్​.. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పట్టా మార్పిడి చేశారని ఫిర్యాదులో వివరించాడు. న్యాయ పోరాటం చేస్తున్న తన తండ్రి శివన్న గౌడ్ ఇటీవల మరణించారని... డబ్బులకు అమ్ముడుబోయి తమ భూమిని ఇతరులకు ధారాదత్తం చేసిన తహసీల్దార్​ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని ఆయన కమిషన్​ను కోరాడు.

    "గతంలో మా తండ్రి శివన్న గౌడ్​ చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించి ఆయన పేరు మీదున్న 12 ఎకరాల 30 గుంటల భూమిని ఓ సామాజిక వర్గానికి చెందిన వారి పేరు మీద పట్టా చేశారు. దీనిపై మేము హై కోర్టు నుంచి స్టే ఆర్డర్​ కూడా తీసుకొచ్చాం. అయినా తహసీల్దార్​ శ్రీనివాసులు వాటిని బేఖాతరు చేశారు. మా తండ్రి ఇటీవల చనిపోయారు. మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాం." - శ్రీనివాస్​ గౌడ్​, బాధిత రైతు

డ్రగ్స్ వాడకంపై పోరాటాన్ని సామాజిక ఉద్యమంగా మలచాలి అప్పుడే డ్రగ్స్ అరికట్టడం జరుగుతుంది... సీఎం కేసీఆర్

Courtesy by : @TelanganaCMO Twitter 

పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు వినూత్నరీతిలో ఆలోచించి ప్రతి ఒక్కరి సహకారంతో దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకంపై పోరాటాన్ని సామాజిక ఉద్యమంగా మలచిననాడే తెలంగాణ నుంచి ఈ సమస్యను సమూలంగా నిర్మూలించడం సాధ్యమవుతుందని సీఎం శ్రీ కేసీఆర్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ అధికారుల సదస్సు’ జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని సీఎం అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు.

ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని, 1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు.

ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను, వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా, తేజోవంతంగా పనిచేయాలన్నారు.

అద్భుత పనితీరు కనబరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు ఆక్సెలరేటెడ్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం స్పష్టం చేశారు.

డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్తులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

డ్రగ్స్ సమాజానికి పట్టిన పీడ... సామజిక బాధ్యతతోనే సాధ్యం...సీఎం కేసీఆర్

Courtesy by : link Media ప్రజల పక్షం 

దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలని, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన దూసుకుపోతున్నదని సీఎం అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం తెలిపారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం అన్నారు.

1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని  అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు  కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు రివార్డులు ఆక్సెలరేషన్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందనీ సీఎం స్పష్టం చేశారు.

డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ‘రాష్ట్ర పోలీసు మరియు ఎక్సైజ్ అధికారుల సదస్సు’ జరిగింది.

ఈ సదస్సులో రాష్ట్ర మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ చామకూర మల్లారెడ్డి, ఎంపీలు శ్రీ బీబీ పాటిల్, శ్రీమతి కవితా నాయక్, ఎమ్మెల్యేలు శ్రీ బాల్క సుమన్, శ్రీ రెడ్యానాయక్, శ్రీ రవీంద్ర కుమార్ నాయక్, శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీ రాజేందర్ రెడ్డి, శ్రీ సుంకే రవిశంకర్, శ్రీ కృష్ణ మోహన్ రెడ్డి, శ్రీ గాదరి కిశోర్ కుమార్, శ్రీ సాయన్న, శ్రీమతి రేఖా నాయక్, శ్రీ అబ్రహం, శ్రీ హన్మంతు షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ శ్రీ అనురాగ్ శర్మ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సి.వి. ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేశ్ భగవత్, సీఎంఓ అధికారులు శ్రీ నర్సింగ రావు, శ్రీ భూపాల్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ రవి గుప్తా, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్లు, డీసీలు, పోలీస్ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, ఎస్పీలు, కమిషనర్లు, డీసీలు తదితరులు పాల్గొన్నారు.

70 వేల కోట్ల “మెగా” గుట్టు ఏంటి?

70 వేల కోట్ల “మెగా” గుట్టు ఏంటి?

– మెఘా ఇంజనీరింగ్ కు బిగుస్తున్న ఉచ్చు
– ఐటి దాడుల్లో బోగస్ ఇన్వాయిస్ లు
– పెద్ద ఎత్తున దొంగ లెక్కలు
– తెర పైకి 12 వేల కోట్ల జీఎస్టీ ఎగవేత కేసు
– నగదు లావాదేవీల్లో 70 వేల కోట్లు ?
– గోల్ మాల్ గుట్టు రట్టు చేయనున్న తొలివెలుగు

సరిగ్గా ఏడాదిన్నర క్రితం..ఏకంగా 2000 కోట్ల రూపాయల వరకూ నగదు స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ అధికారులు లీకులు ఇచ్చారు.ఆ తరువాత 2 రోజుల్లోనే లెక్కలు క్లోజ్ అయ్యాయి.అందుకు బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.తర్వాత ఈ కేసు ఏమైందో ఎవరికి తెలియదు.ఇప్పుడు మరోసారి మేఘా ఇంజనీరింగ్,ఐఏఎస్ కూతురి పెళ్లి బిల్లుల చెల్లింపు విషయం వెలుగులోకి వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులు అయినా.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల్లో భారీగా లాభాలు ఉండే చిన్న చితక పనులు ఐనా..మేఘనే చేస్తుంది. ఏదైనా సరే మేఘా తెలంగాణ ప్రభుత్వం జేబు కంపెనీ అని అందరికి తెలిసిందే.

కంపెనీ వద్దనుకుంటే తప్పా తెలంగాణలో అన్నిపనులు మెగా కనుసన్నులోనే జరుగుతున్నాయి.దీనివెనుక 70వేల కోట్ల నల్లధనం దాగి ఉందని సమాచారం.ఒక్క షెల్ కంపెనీ తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె పెళ్ళికి 50 లక్షల పైనే ఖర్చు పెట్టిందంటే..మళ్ళీ ప్రభుత్వం రావడానికి టీఆర్ఎస్ కి ఎంత ఫండ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఓ వృద్ధురాలి ఇంటి పై ఆమెకు తెలియకుండానే కంపెనీ ఏర్పాటు చేసి దందా చేస్తున్నారు. అంటే..ఇంకా ఇలాంటి సూటు కేస్ కంపెనీల వ్యవహారం బయటపడాల్సిన అవసరం ఉంది.దీనికి సంబంధించి తొలివెలుగు క్రైమ్ బ్యూరో త్వరలోనే ఇన్వెస్టిగేషన్ కథనాలు రాయబోతోంది. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన హోటల్ లో జరిగిన విందు,వైభోగాల ఖర్చు కోసం ఏకంగా షెల్ కంపెనీలను ఉపయోగించింది మేఘా. అయితే దీనిపై మేఘాతోపాటు రజత్ కుమార్ లు కూడా ఖండనలు ఇచ్చారు.



మేఘా కంపెనీ వివరణ ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు.అదేంటి అంటే కంపెనీ ఉద్యోగులు చేసిన లావాదేవీలతో తమకేమీ సంబంధం అనీ, అయితే ఉద్యోగులు ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లి ఖర్చుకు ఏకంగా 20 నుంచి 25 లక్షలు ఖర్చు పెడతారా? పెడితే గిడితే మేఘాలో ఓ ఉన్నతాధికారికి ఖర్చుపెట్టి ఏమైనా ప్రమోషన్..లేదా వేతనాల ప్రయోజనం పొందుదామనుకుంటాడు.కానీ ప్రభుత్వంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి సొంత నిధులు అంత మొత్తంలో ఎలా ఖర్చు పెడతారు?అసలు ఆ అవసరం ఏ ఉద్యోగికి అయినా ఏమి ఉంటుంది. మెగా ఇంజనీరింగ్ వివరణ అసలు నమ్మశక్యంగా ఉందా?అంటే దొరికిన తర్వాత ఉద్యోగుల పేరు చెప్పి తప్పించుకుంటున్నారనే విషయం స్పష్టం అవుతోంది.అంతే కాదు..ఉద్యోగుల వ్యక్తిగత విషయాలు కంపెనీకి ఏమి సంబంధం అంటూ ప్రశ్నలు వేస్తోంది.

ఇదిలా ఉంటే రజత్ కుమార్ కూడా ఖండిస్తూ బిల్లులు అన్నీ తానే చెల్లించానని చెబుతున్నారు.ఆయన చెప్పిందే నిజం అయితే ఈ మొత్తం బిల్లుల వ్యవహారం తన ఐటి వార్షిక రిటర్న్స్ లో చూపిస్తారా?ఓ ఐఏఎస్ అధికారి హోటల్ గదులు,ఫైవ్ స్టార్ ఆతిధ్యం కోసం ఖరీదైన ప్రాంతం బుకింగ్ కోసం అధికారికంగా 25 లక్షల ఖర్చు పెట్టడం జరిగే పనేనా?అయితే ఇది ఒక్కటే వెలుగులోకి వచ్చింది. ఇలా వెలుగులోకి రాకుండా జరిగే వ్యవహారాలు ఎన్నో. ఐఏఎస్ అధికారుల కుటుంబ సభ్యుల పెళ్లిళ్ళే కాదు బీహార్ తోపాటు ఇతర రాష్ట్రాల్లో ఐఏఎస్ లు కట్టుకునే ఇళ్లు కూడా బడా బడా నిర్మాణ కంపెనీలే కట్టించిపెడుతున్నాయి. వీటికి కూడా షెల్ కంపెనీలను వాడటమో లేక ఇతర మార్గాల్లోనే పనులు కానిచ్చేస్తున్నారు. అంతే కాదు ఐఏఎస్ లు కోరుకునే అన్ని విలాసాలను కూడా పలు కంపెనీలు సమకూరుస్తున్నాయి. ఈ విషయం కాంట్రాక్ట్ సర్కిల్స్ తోపాటు ఐఏఎస్ వర్గాలు అందరికీ తెలిసినవే.తొలివెలుగు ఫినిక్స్ లాంటి కార్పొరేట్ కంపెనీల బాగోతాన్ని, బినామిలా వ్యవహారం బట్టబయలు చేసింది. అలాగే తొలి వెలుగు మెగా పై కూడా పరిశోధనాత్మక కధనాలను ప్రజల ముందు అతి త్వరలో ఉంచనుంది.



Thursday, January 27, 2022

Exclusive: Top Telangana bureaucrat’s daughter’s wedding gala sponsored by mystery company?


Courtesy by : TNM INVESTIGATION THURSDAY, JANUARY 27, 2022 - 13:05

An investigation by TNM has revealed that executives of a company that is implementing mega infrastructure projects in Telangana, busied themselves with the planning of an IAS officer’s daughter’s wedding.


Hundreds of guests, multiple parties in Hyderabad’s top hotels and a banquet at the luxurious Taj Falaknuma Palace. The recent wedding of Telangana Special Chief Secretary Rajat Kumar’s daughter, Anjali Kumar, was a five-day affair fit for royalty. Now, a detailed investigation by TNM has revealed that a significant part of the gala was billed to a mysterious company — BigWave Infra Private Limited.

The search for the address of the company led us to a house in Bahadurpura area of Hyderabad's old city where a confused looking elderly lady greeted us. She clearly knew nothing about a company registered at her address that was connected to this five-star wedding. In pursuit of the money trail, TNM also found documents showing executives of a Hyderabad-based government contractor — Megha Engineering and Infrastructure Limited (MEIL) — were intimately involved in the planning of the wedding that was spread over five days and multiple luxury venues between December 17 and 21, 2021.

MEIL is the company that is carrying out several works for Telangana’s ambitious Kaleshwaram Lift Irrigation Project. The cost of the project is currently pegged at a whopping Rs 1.15 lakh crore. It is touted to be the country’s most expensive irrigation project taken up by a state government. Reports also describe it as the world's largest lift irrigation project. MEIL is constructing massive power substations and transmission lines for the project.

What's more, Rajat Kumar heads the Irrigation and Command Area Development Department which monitors the Kaleshwaram project.

The documents exposing this unofficial relationship — between the contractors of the Kaleshwaram project and the nodal officer overseeing the works — raises serious questions of propriety.

Documents with TNM reveal that MEIL executives coordinated the contracts, bookings and payments for the wedding celebrations with the Taj Group, whose hotels Taj Krishna, Taj Deccan and Taj Falaknuma were used for the various wedding events and for the wedding guests to stay.

The company’s executives also coordinated the planning for the events using their company email IDs, and some a dummy email ID, created exclusively to coordinate the Special Chief Secretary’s daughter’s wedding.

The company executive however signed off on mails from the fake ID with his real name. While the dummy email ID was used initially, many of the communications in the latter stages were between MEIL executives using their company emails, and hotel staff.

What we know: How MEIL was “indirectly” involved

On July 31, 2021, a gmail account called ‘bookingshyderabad’ was used to email the hotel to make bookings for the banquet halls and rooms at the hotel in advance, so that the wedding dates are blocked. The email was signed off as 'Murali'. Subsequently, Murali K and another MEIL executive Prameelan T, coordinated the bookings, invoices and payments for the event

Email from Murali to the hotel group on July 31, 2021, for making bookings for the December 2021 wedding.

 

Murali and Prameelan from MEIL received the menus for Rajat Kumar's daughter's wedding

Murali from MEIL received the contract and invoice in the name of BigWave Infra Private Ltd for the event.

 

For December 17, Murali from MEIL booked the Al Fresco Lawn for lunch; the Luxury suite for high tea; and the Chambers Lawn for dinner. On December 18, breakfast and dinner were booked at the Garden room, while lunch was booked at the Al Fresco Lawn. Similarly other venues were booked in Taj Krishna for the meals on December 19, 20 and 21. These details were finalised on December 13.

MEIL’s initial contract with the hotels was for around Rs 50 lakh. Information accessed by TNM shows that the invoices were asked to be raised in the name of two companies — Interactive Data Systems; and BigWave Infra Private Limited, which we found was created in June 2021. The directors of Interactive Data Systems are also on the boards of various MEIL companies.

But when the time came to make payments, the company linked to MEIL backed off and an outstanding amount of Rs 23 lakh was billed to BigWave.

The preliminary talks for the bookings were conducted by Rajat Kumar himself, according to two sources who TNM spoke to. Later, the bureaucrat’s Officer on Special Duty (OSD), Prabhakar Rao coordinated all the arrangements along with two MEIL executives, they confirmed.

On December 20, a lavish dinner was hosted by Special Chief Secretary Rajat Kumar for his daughter, son-in-law and their guests at the Taj Falaknuma, a luxury palace hotel, for 70 guests, with the hotel charging Rs 16,520 per guest.

Taj Falaknuma’s 101-seater dining hall is one of its most exclusive venues, a place for the rich and famous to mingle. It’s where the government hosts important guests and dignitaries when they visit Hyderabad. Photos from this event were shared on social media by Rajat Kumar’s daughter and other family members. Guests from both sides of the family were part of this pricey party. The entire expense, of course, was billed to BigWave Infra Private Limited.

Invoice in the name of BigWave Infra Private Limited on December 15, for the dinner at Taj Falaknuma on December 20. This invoice was collected by MEIL.

 

Who runs BigWave?

A look into the Registrar of Companies (ROC) for the two companies who received invoices for Special Chief Secretary Rajat Kumar’s daughter’s wedding events, revealed that Interactive Data System was incorporated in June 2010. Sumalatha Puritipati, is the MD of the company while Venkata Subba Reddy Puritipati is the Director of the company and Krishna Veni Chintapalli is an additional director in the company. Both of them are also Directors of many other companies that belong to the Megha group of companies.

BigWave Infra Private Limited on the other hand is fairly new, and was incorporated in June 2021, just a few months before the wedding. The directors of the company are listed as Sandhya Agarwal and Anusha, and the company is registered for ‘building installation’ works.

TNM's search for BigWave Infra Pvt Ltd’s registered address took us to the narrow bylanes of Bahadurpura in Hyderabad's old city. The registered address was in a fully residential building. The door was opened by an elderly lady who appeared clueless. She turned out to be the mother of Sandhya Agarwal — one of the listed directors. The lady gave us Sandhya’s number and when TNM spoke to her, she sounded clearly unsettled by our questions. She said that the home address was the registered address for BigWave, but “the company is somewhere else.” In a few minutes, we received a call from Sandhya’s husband Srikanth. He sought to know why we had come searching for BigWave and when we presented the reason, he said, “Someone from BigWave will call you back.”

A few days later, Srikanth said he did not have anything to do with BigWave and that he was an employee of Interactive Data Systems. Sandhya did not respond to our query on how she was made the director of BigWave

What we don’t know: The final payment

Initially, the proforma mentioned around Rs 50 lakh as the total expense for the functions and room bookings. TNM is in possession of a document indicating that a payment of Rs 23 lakh was made to the hotel via one cheque by BigWave, an amount of around Rs 5 lakhs is still pending, however the Taj group refused to reveal any details about the wedding, and BigWave did not confirm the payment.

The groom’s father made payments for the rooms they had booked in two of Taj’s properties. Another part of the payment was made by Rajat Kumar, according to a source. Finer details of how much the final payment was and how it was split are pending.

Rajat Kumar and MEIL deny

When TNM reached out to Rajat Kumar to ask what he had to say about the trail of documents this reporter had accessed which indicate that BigWave paid Rs 23 Lakh for the bookings, Kumar denied it. “This is incorrect. I had not heard about this company called BigWave earlier.” When further asked why MEIL was in touch with the hotel to make the bookings and coordinate the events in relation to his daughter’s wedding, the IAS officer said, “MEIL did not make any of the bookings or coordinate anything, I personally made all the bookings.” 

TNM also reached out to MEIL for a reaction about why K Murali, an Associate Manager from MEIL was coordinating the bookings and arrangements. M Siva Prasad Reddy, General Manager (Public Relation) at MEIL said they would check the same and revert. He later visited The News Minute office in Bengaluru in the evening of January 24, but did not have a reaction to the story. He said the documents were fabricated and the company had nothing to do with the wedding. He went on to insist that Rajat Kumar is a "very senior and sincere" officer and said that MEIL is "in no position to fund him."

TNM also reached out to Shantala Jain, the Public Relations Director of the Taj Group for a reaction on the payment made by a private company for a bureaucrat’s daughter’s wedding. “No comment from our side on this. We don’t share any client information,” responded the PR Director.

Rajat Kumar was in news in 2019 too after social media was flooded with fake documents claiming Rajat Kumar had been gifted land by the TRS for his favours to the ruling-party in the elections, while he served as the Chief Electoral Officer. The bureaucrat had later clarified that the documents circulated were fake and a complaint was also filed with the Hyderabad Cyber Police against the smear campaign.

(TNM has documents to prove for all points mentioned in the story)


Exclusive: Top Telangana bureaucrat’s daughter’s wedding gala sponsored by mystery company? https://www.thenewsminute.com/article/exclusive-top-telangana-bureaucrat-s-rajat-kumar-meil-daughter-s-wedding-gala-sponsored-mystery-company

 

Show us some love! Support our journalism by becoming a TNM Member - http://bit.ly/south-first

Wednesday, January 26, 2022

ఏంటి సార్..! మర్యాదలు పాటించరా..!

ఏంటి సార్..! మర్యాదలు పాటించరా..!

తెలంగాణలో నియంతృత్వం..సీఎం కేసీఆర్ నియంత పోకడలు..ఇది తరచూ ప్రతిపక్షాలు చేసే ఆరోపణే. అంతేకాదు..ఇక్కడ నడిచేది కల్వకుంట్లవారి రాజ్యాంగమని రేవంత్ రెడ్డిలాంటి నేతలు సెటైర్లు వేయటం కూడా చూస్తుంటాం. మరి వినీవినీ అదే నిజమనుకున్నారో ఏమో..!వాళ్లన్నంత పనీ చేస్తున్నారు కేసీఆర్ అని..రాజకీయ విమర్శకులు అంటున్నారు. అందుకు నిదర్శనం గణతంత్ర దినోత్సవమని అంటున్నారు.


గణతంత్ర దినోత్సవం..దేశం అంతా ఘనంగా జరుపుకునే పండగ. కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి కారణం రాజభవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాకపోవడమే అని చెప్పుకోవచ్చు.అయితే.. సీఎం సహా టీఆర్ఎస్ మంత్రులు కూడా హాజరు కాక పోవడంతో పలువురిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకు హాజరు కాలేదు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.అయితే..ఆగస్టు 15న జరిగే స్వతంత్ర దిన వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతాయి. జనవరి 26 వేడుకలు గవర్నర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇది ఆనవాయితీగా వస్తోంది. దీనికి సీఎం కుడా తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం ఉంది. కానీ.. ఈ సారి వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

రాష్ట్ర సీఎంగా ఉన్న కేసీఆర్.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు వేడుకలకు హాజరు కాకపోవడం.. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థను, గణతంత్ర దినోత్సవాన్ని అవమానించడమే అవుతోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ పైనో, కేంద్రం పైనో కోపం ఉంటే అది రాజకీయంగా చూసుకోవాలి.. అంతే కానీ.. ఈ విధంగా చేయడం మంచిది కాదు అని అంటున్నారు. దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది.

ఈ వేడుకల్లో గవర్నర్ ప్రసంగం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలనే ప్రయత్నం కేసీఆర్ చేశారని,దానికి గవర్నర్ సహకరించలేదని..అందుకే కేసీఆర్, మంత్రులు వేడుకలకు హాజరు కాలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.గవర్నర్ ప్రసంగం వింటే అది నిజమే అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని చెప్పుకొస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.గవర్నర్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రానికి అందించిన సహకారాన్ని ప్రస్తావించారు.

కేంద్రంతో యుద్ధం చేస్తాం అని పదే పదే చెప్తున్నకేసీఆర్..తాజాగా రాజభవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరు కాకపోవడానికి కారణం.. వచ్చే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీని థ్రెట్ చేయాలని కేసీఆర్ వ్యూహం అయి ఉండొచ్చు అని చెప్పుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలను అడ్డం పెట్టుకొని తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాఫ్తు సంస్ధల ద్వారా విచారించి..  ఇబ్బంది పెట్టాలని భావిస్తున్న కేంద్రంపై వత్తిడి తెచ్చి.. తద్వారా బయట పడాలని కేసీఆర్ భావిస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైన కేసీఆర్, మంత్రులు వేడుకలకు హాజరు కాకపోవడం రాజకీయంగా దుమారాన్ని లేపుతోంది అని అంటున్నారు.

డ్రగ్స్‌ అనే మాట వినపడకుండా చేయాలి: సీఎం కేసీఆర్‌

*బ్రేకింగ్ న్యూస్....*

*ప్రజా సంకల్పం & link Media & వివిధ NGO's  డ్రగ్స్ మీద యుద్ధం చేస్తున్నాయి ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు స్పందించారు*

*డ్రగ్స్‌ అనే మాట వినపడకుండా చేయాలి: సీఎం కేసీఆర్‌*

హైదరాబాద్ : తెలంగాణలో డ్రగ్స్‌ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట తెలంగాణలో డ్రగ్స్‌ అనే మాట వినపడకుండా చేయాలన్నారు. డ్రగ్స్‌ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్‌ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్లుండి ప్రగతిభవన్‌లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి, ఎక్సైజ్‌ మంత్రి, సీఎస్‌, డీజీపీ, డీజీలు, సీపీలు, ఎస్పీలు, ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com

Tuesday, January 25, 2022

దేశభక్తి ముందు వెన్ను విరిచే చలి చిన్నబోయింది..!

దేశభక్తి ముందు వెన్ను విరిచే చలి చిన్నబోయింది..!

దేశవ్యాప్తంగా గణతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి రాజ్యాంగం గొప్పతనాన్ని, రాజ్యాంగ నిర్మాత ఆదర్శాలను స్మరించుకున్నారు. అటు, సరిహద్దుల్లో సైనికులు కూడా అట్టహాసంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్నారు. దేశ భక్తి ముందు వెన్ను విరిచే చలిని లెక్క చేయలేదు జవాన్లు.

లద్దాఖ్​లో మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఐటీపీబీ భద్రతా దళాలు గణతంత్ర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వాహించాయి. 15 వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాయి. ఈ సందర్భంగా దేశం కోసం అమరులైన వీరులను సైనికులు గుర్తు చేసుకున్నారు.

అటు.. ఉత్తరాఖండ్ ఔలీలో కూడా ఐటీబీపీ దళాలు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వీరిని హిమవీరులుగా పిలుస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీలు ఉంటాయి. 11 వేల అడుగుల ఎత్తులో స్కేటింగ్ చేస్తూ ఈ వేడుకులు నిర్వహించుకున్నారు. వారు చేసే స్కేటింగ్ విన్యాసాలు కనులపండగగా అనిపిస్తుంది.

ఉత్తరాఖండ్​లోని కుర్మాగావ్ ప్రాంతంలో 12 వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఔరా అనిపించారు ఐటీబీపీ సైనికులు. హిమాచల్ ప్రదేశ్​లో అత్యంత ప్రతికూల వాతావరణంలో ఐటీబీపీ దళాలు రిపబ్లిక్ ఉత్సవాలు అంబరాన్ని అంటేలా నిర్వహించారు. 16 వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ప్రదర్శించారు. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను గుర్తు చేసుకున్నారు.

आईटीबीपी के हिमवीरों का राष्ट्र को नमन


Happy Republic Day from #Himveers of ITBP


From #Ladakh


#RepublicDay2022 

#RepublicDay 

#गणतंत्रदिवस https://t.co/bS1A8pnPlH


నల్లమల్ల బిడ్డకు అత్యుత్తమ పురస్కారం......! 12 మెట్ల దర్శనం మొగులయ్యకు 'పద్మశ్రీ' ప్రకటించిన కేంద్రం

*నల్లమల్ల బిడ్డకు  అత్యుత్తమ పురస్కారం......!*

*12 మెట్ల దర్శనం మొగులయ్యకు 'పద్మశ్రీ' ప్రకటించిన కేంద్రం*
*కళారంగంలో 'నల్లమల' బిడ్డకు అత్యున్నత* *పురస్కారం*
*జానపద పాటలే* *జీవనోపాధిగా మార్చుకున్న వైనం..*

*గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగిన 'కిన్నెర' ఖ్యాతి*
*2015లోఉగాది పురస్కారం*

ఆడా లేడు మియాసావ్‌..
ఈడా లేడు మియాసావ్‌..
పానిగంటి గుట్టలమీద పావురాల
గుండున్నదీ..
రాత్రి గాదు.. ఎలుగు గాదు.. వేగుచుక్క పొడువంగానే పుట్టిండాడు పులిబిడ్డ..'
అంటూ తన 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే.. అటుగా వెళ్తున్న వారి కాళ్లు అక్కడే ఆగిపోతాయి. మధురమైన సంగీతం, లయబద్ధమైన పాటకు కిన్నెరపై నాట్యమాడే చిలుకను చూస్తూ చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా మైమరచిపోవాల్సిందే. ఊయలలో పసిపాప నిదురపోయేటప్పుడు.. ఊడలమర్రి కింద ఊర్లో జనం సేద తీరేటప్పుడు.. వెన్నెల వాకిట్లో కురిసిన పల్లెగానం.. ఇప్పుడు నల్లమల నుంచి ఢిల్లీకి తాకింది. ప్రాచీన సంగీత వాయిద్యం 'కిన్నెర' కళాకారుడు దర్శనం మొగులయ్యను పద్మశ్రీ అవార్డు వరించింది. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది.
జులపాల జుట్టు, పంచెకట్టు, కోరమీసం.. భుజం మీద 12 మెట్ల వాయిద్యంతో ఆకట్టుకునే ఆహార్యంలో ఉండే దర్శనం మొగులయ్యది నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట. ఆయన పలికించే కిన్నెర సంగీతంతో పాటు ఆలపించే వీరగాథల్లో పౌరుషం ఉప్పొంగుతుంది. పురాతన కిన్నెర వాయిద్యం నుంచి వచ్చే సంగీతం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. జానపద గాథలైన పండుగ సాయన్న కథ, సీతమ్మ పర్ణశాల, దాదిమా ధర్మశాల, పానుగంటి మియాసాబ్, పిల్లా జాతర బోదం పిల్ల.. అంటూ పా టలు పాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. పానుగంటి మీరాసాబ్‌ కథ, ఎండమెట్ల ఫకీరయ్య, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ, పాలమూరు జానపద వీరుడు మియాసాబ్‌ గాథను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తాడు. పెద్దలను కొట్టి పేదలకు పంచే పండుగ సాయన్న వీరగాథ చిన్నా పెద్దా ఆసక్తిగా వింటారు. బలిసినోళ్లను దోచి పేదవారికి పంచి పెట్టి, పేదల పెళ్లిళ్లు చేసిన పండుగ సాయన్న కథను మొగులయ్య ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.

*link Media ప్రజల పక్షం🖋️* 

Land buyers ‘misguided’ by officials seek justice

Land buyers ‘misguided’ by officials seek justice

Several middle-class and upper middle-class people, who had invested their lifetime savings in lands to meet the educational or marriage expenses of their children, or to have a secure retired life in their old age, are finding themselves in the lurch now.

M.G. Rao, A. Ravinder Reddy and some others purchased about 80 acres of land at Ameenpur (survey No. 343 in 2005/06). The land, allotted to some freedom fighters, was allegedly sold to these persons after they met former MLA T. Jayaprakash Reddy, a Registration Department official Veerender and a government employee M. Rajender though middlemen. Before proceeding to pay the amount, the buyers had checked the records with the Revenue officials and on June 25, 2005, the then Mandal Revenue Officer of Patancheru issued an endorsement letter.

“The following two freedom fighters: Bollu Bhahraiah and S. Devaiah, who were allotted government land in survey No. 343/1 situated at Ameenpur village of Patancheru mandal were granted pattas under GO Ms No. 1743 of Revenue Department dated 28-08-1958 and GO Ms. No 1110 of Revenue Department dated 26-06-1960. Hence the land allotted is alienable,” was the endorsement certificate issued by the MRO of Patancheru. On getting this certificate, they approached the concerned department at the Collectorate and made a second enquiry on whether these lands could be purchased. The buyers are claiming that the officials informed them there will no problem in purchasing the land.

“We paid about ₹ 40 crore to Mr. Jayaprakash Reddy, Mr. Veerender and Mr. Rajender and got the land registered. When we tried to start work on the land, they asked us to stop work stating that there were some problems that were need to be sorted out and assured us that they would address them. Finally, the revenue officials are stating that the land registration is not tenable in the court of law and we are no longer owners of the land. We had lost heavily, please do us justice,” asked Mr. Ravinder Reddy and Mr. Rao.

In a related development, one Veeresham of Shankarapally village in Ranga Reddy district has alleged that about 200 acres of land at Eedulanagulapally village was purchased by MLA T Jayaprakash Reddy and others. A sale deed was signed, but cheques issued by Mr Jayaprakash Reddy were not honoured and a case was pending at the court.

ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజీత్ హత్య సూత్రధారి SDPIకి చెందిన మహ్మద్ హరూన్ అరెస్ట్ – భార్య కళ్లెదుటే సంజీత్ ను పొడిచి చంపిన గూండాలు

ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజీత్ హత్య సూత్రధారి SDPIకి చెందిన మహ్మద్ హరూన్ అరెస్ట్ – భార్య కళ్లెదుటే సంజీత్ ను పొడిచి చంపిన గూండాలు

ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజీత్ హత్యకేసులో ప్రధాన సూత్రధారి మహ్మద్ హరూన్ కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన హరూన్ స్వస్థలం కోజింజంపర సమీపంలోని అథిక్కోడ్.
27 ఏళ్ల సంజీత్ హత్యకు ప్లాన్ చేసింది ఇతడే అని విచారణలో తేలింది. ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ చేశారు. హత్యలో పాల్గొన్నావారిని ఎప్పుడో గుర్తించామని..పరారీలో ఉన్న హరూన్ ను ఇప్పుడు అరెస్ట్ చేశామని పాలక్కాడ్ జిల్లా పోలీసులు తెలిపారు. సంజిత్ ను హత్య చేసిన సుబైర్, సలామ్, ఇసాహక్ ను పోలీసులు 2021 నవంబర్లోనే అరెస్ట్ చేశారు.
హత్యచేశారు. సంజీత్ హత్య వెనక SDPI, ఇస్లామిస్ట్ ఔట్ ఫిట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పాత్ర ఉందని తేలింది. వారిలో సలామ్ కు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హత్యతో ప్రమేయం ఉన్న మరో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టపగలే తన కళ్లముందే భర్తను హత్య చేయడాన్ని చూసిన సంజీత్ భార్య అర్షిక …కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హంతకులలో ఎవరూ ముసుగు ధరించలేదని…వాళ్లని తాను గుర్తిస్తానని… సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గూండాలే నరికి చంపారని పలుమార్లు వాపోతూ చెప్పింది. స్వగ్రామం ఎల్లపుల్లి సమీపంలోనే ఉదయం తొమ్మిదన్నరకు ఎస్డీపీఐ గూండాలు భార్యను తీసుకుని మోటార్ బైక్ పై వెళ్తున్న సంజిత్ ను కత్తులతో పొడిచి పారిపోయారు. వెంటనే అక్కడివారు సంజిత్ ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. హత్యకు ఉపయోగించిన, రక్తపు మరకలున్న కత్తులను పోలీసులు అఫ్పుడే స్వాధీనం చేసుకున్నారు .
ఈ హత్యలో ఎస్‌డిపిఐ, పిఎఫ్‌ఐ ప్రమేయం ఉందని ఆర్ఎస్ఎస్, బీజేపీలు ముందు నుంచీ ఆరోపిస్తున్నయి. సీబీఐ విచారణ జరిపించాలంటూ పార్టీ బీజేపీ చీఫ్ సురేంద్రన్ ఢిల్లీలో కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేశారు.
గత ఐదేళ్లలో కేరళలో 10మంది ఆర్ఎస్ఎస్ – బీజేపీ కార్యకర్తలను ఇస్లామిస్టులు హత్య చేశారు. రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 50మందికి పైగా స్వయం సేవకులు హత్యకు గురయ్యారు. ప్రధాన దోషులను అరెస్ట్ చేయడంలో జాప్యంపై కేరళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిరసనలు కొనసాగిస్తున్న తరుణంలో కీలక నిందితుడు హరూన్ ను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ కేసులో అరెస్టైన మొత్తం నిందితుల సంఖ్య 10కి చేరింది.

----------=======----------=======---------=

@rashtrapatibhvn
@VPSecretariat
@CMOKerala
@KeralaGovernor
@BJP4Keralam
@Swamy39
@ramindesai
@DevikaRani81
What is going on in Kerala?? https://t.co/t5JpxUFxE0