Friday, January 14, 2022

స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్…. విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపు ?

స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్…. విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపు ?

తెలంగాణ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనితో విద్యా సంస్థలకు సెలవులను పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుగా ఇచ్చారు. 8వ తేదీ నుంచి 16 వరకు సెలవులు ఇచ్చారు. 17న విద్యా సంస్థలు ఓపెన్ కావాల్సి ఉంది.

కానీ కరోనా కేసులు పెరుగుతుండటం తో సెలవులు పెంచబోతున్నారట. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రభుత్వానికి ఇదే విషయం గురించి సూచించినట్లు తెలుస్తోంది.

ఇక ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపకుడదు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు సెలవులు కూడా 20వ తేదీ వరకు పొడిగిస్తారని తెలుస్తోంది.

No comments:

Post a Comment