Tuesday, January 4, 2022

కేసీఆర్‌, కేటీఆర్ పై ఫిర్యాదులు

కేసీఆర్‌, కేటీఆర్ పై ఫిర్యాదులు

ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ను ప‌లు కేసుల్లో అరెస్ట్ చేశారు. ఇంకోవైపు ఎంపీ అర‌వింద్ పైనా మూడు కేసులు పెట్టారు. ఇందులో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు కూడా రివ‌ర్స్ ఎటాక్ చేస్తున్నారు.

ఆమ‌ధ్య సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ల‌లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర‌వింద్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసుల‌కు వ‌రుస‌ ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రి కేటీఆర్ పైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కంప్ల‌యింట్ లో కోరుతున్నారు బీజేపీ నేత‌లు.

నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ నేత‌లు ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో ఈ ఫిర్యాదు చేశారు. ఇవే కాదు రాష్ట్ర‌మంతా ఇలా ఫిర్యాదులు చేయాల‌ని చూస్తున్నారు. త‌మ పార్టీ ముఖ్య నేత‌ల‌ను కేసుల‌తో వేధిస్తున్నార‌ని.. కేసీఆర్‌, కేటీఆర్ పై తాము కూడా అదే పంథాలో ముందుకెళ్తామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.


No comments:

Post a Comment