Wednesday, January 12, 2022

వికలాంగులతో బిక్షాటన చేయిస్తున్న ఫౌండేషన్స్ మూసి వేయాలి...వెంటనే అరెస్ట్ చేయాలి



వికలాంగులతో బిక్షాటన చేయిస్తున్న ఫౌండేషన్స్ మూసి వేయాలి

వెంటనే అరెస్ట్ చేయాలి

NPRD అడ్వర్యoలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

మేడ్చల్ జిల్లాలో ఫౌండేషన్ ఏర్పాటు చేసి వికలాంగులకు బిక్షాటన చేయిస్తున్న స్వయం కృషి వికలాంగుల ఫౌండేషన్, శ్రీ కృష్ణ ఫౌండేషన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 10/01/2022 న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం( కిసరా) ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం అడిషనల్ కలెక్టర్ నరసింహా రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
 ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకట్, ఏం అడివయ్య మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా పరిధిలో తనకు ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి బిక్షాటన చేయిస్తున్న పౌండేషన్ ల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
 స్వయంకృషి వికలాంగులు ఫౌండేషన్, శ్రీకృష్ణ పౌండేషన్లతో పాటు అనేక ఫౌండేషన్ వాళ్ళు వికలాంగులతో గ్రూపులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లో బిక్షాటన చేయిస్తున్నారు వచ్చినటువంటి డబ్బులు పౌండేషన్ యాజమాన్యాలు తీసుకుంటున్నారు ఉపాధి కల్పిస్తామని చెప్పి బిక్షాటన చేయించడం ఎంతవరకు సమంజసం. బోడుప్పల్, మేడిపల్లి , పిర్జాదిగూడ, నారపల్లి, బాలాజీ నగర్, నాచారంలతో పాటు ఎల్బీనగర్ హయత్నగర్ ప్రాంతాల్లో కూడా అనేక ఫౌండేషన్ లు ఉన్నాయి. స్వయం ఉపాధి వృత్తి శిక్షణ పేరుతో ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిఅమాయక వికలాంగులను మోసం చేసి బిక్షాటన చేయిస్తున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంసెక్షన్ 52 (ఏ) ,51 (3)(ఏ) ప్రకారం ఫౌండేషన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2016RPD సెక్షన్ 91 ప్రకారం వికలాంగులను ఉపయోగించుకొని లబ్ధి పొందడం చట్టరీత్యా నేరం అన్నారు. ఉన్నత చదువులు చదివిన వికలాంగులకు ఉపాధి చూపిస్తామని ఆశ చూపి దేవాలయాలు, రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ దగ్గర చౌరస్తాలోబిక్షాటన చేయిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని తెలిపారు వికలాంగులు బిక్షనట చేయగా వచ్చిన డబ్బులలో ఫౌండేషన్ యాజమాన్యాలు వాటాలు పంచుకుంటూ వికలాంగులు మోసం చేస్తున్నాయని అన్నారు హైదరాబాద్ నడిబొడ్డులోనే పౌండేషన్ల పేరుతో పెద్ద మాఫియా నడుస్తుందని అన్నారు ఫౌండేషన్ ముసుగులో దోపిడికి పాల్పడుతున్న యాజమాన్యాలను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఫౌండేషన్ పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు అధికారుల నిర్లక్ష్యం మూలంగా పౌండేషన్ యాజమాన్యాలు విచ్చలవిడిగా వికలాంగులకు చేయిస్తున్నారని వికలాంగులతో బిక్షాటన చేయించే హక్కు ఫౌండేషన్ అన్నారు ఫౌండేషన్ నిర్వాకంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వికలాంగులు చేస్తున్న ఫౌండేషన్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల రాష్ట్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు
   *వికలాంగులతో బిక్షాటన చేయిస్తున్న ఫౌండేషన్లపై కేసు నమోదు చేస్తాం* అదనపు కలెక్టర్ హామీ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  పరిధిలో వికలాంగులకు చేయిస్తున్న స్వయంకృషి వికలాంగులు ఫౌండేషన్ ,శ్రీకృష్ణ ఫౌండేషన్ లపై కేసు నమోదు చేస్తామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏ నరసింహారెడ్డి హామీ ఇచ్చారు. పోలీసులతో ఎంక్వైరీ చేయించి ఫౌండేషన్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు 
   ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షులు ఏ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చంద్రమోహన్, షాహిన్ బేగం, సహాయ కార్యదర్శి జే మల్లేష్ నాయకులు బుచ్చమ్మ, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

కే వెంకట్ జిల్లా కార్యదర్శి

No comments:

Post a Comment