Saturday, January 29, 2022

దీపావళి సామాను తయారు చేసే వారి జీవితం ఇంత దారుణమా…?

దీపావళి సామాను తయారు చేసే వారి జీవితం ఇంత దారుణమా…? శివకాశీలోనే క్రాకర్స్ ఎందుకు తయారు చేస్తారు…?

దీపావళి రోజు బాంబులు అదే క్రాకర్స్ కాల్చడం అనేది మనకు చాలా సరదాగా ఉంటుంది. డబ్బులు పోసి కొనుక్కుని అగ్గి పుల్ల గీయడం ఎంతో సరదాగా ఉంటుంది. ఒక్క దీపావళికే కాదు… రాజకీయ నాయకుల ర్యాలీలకు, విజయోత్సవ కార్యక్రమాలకు, పుట్టిన రోజు వేడుకలకు, నూతన ఏడాదికి ఇలా ఏదోక రూపంలో కాలుస్తూనే ఉంటారు.

కాలుష్యం పెరిగేది పెరుగుతుంది, గీసే అగ్గి పుల్లలు ఏదోక కారణంతో గీస్తూ ఉంటాం. సరే గాని శివకాశీలోనే ఆ సామాగ్రి ఎందుకు తయారు చేస్తారు అనేది చాలా మందికి క్లారిటీ లేదు కదా…? దానికి పెద్ద కారణమే ఉందండీ. ఆ కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం.


శివకాశీలోని విరుదునగర్, కోవిల్పట్టి ప్రాంతాల్లో అవి తయారు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ ప్రాంతంలో ఏ పంట పండినా సరే దాదాపుగా వర్షాధారమే. మన రాయలసీమ మాదిరిగా ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఎండిన పొలాలు మాత్రమే ఉంటాయి. ఇక అక్కడి ప్రజలకు వ్యవసాయం వలన ఏ విధమైన ఉపయోగం లేదు. ఇక అక్కడి ప్రాంతం కూడా టపాకాయలు తయారు చేయడానికి అనువుగా ఉంటుంది.

ఎండ ఎక్కువగా ఉండటంతో సామాగ్రిని ఎండబెట్టడం కూడా సులువు. వర్షాలు చాలా తక్కువగా పడుతూ ఉంటాయి. ఇక అక్కడి కంపెనీలలో పని చేసే వారికి ఎక్కువగా ఏదోక రోగాలు వస్తూనే ఉంటాయి. ఊపిరితిత్తుల వ్యాధి లేదా క్షయవ్యాధితో చాలా మంది ప్రజలు బాధపడుతూ ఉంటారు. పేదరికం కారణంగా చాలా మంది అక్కడ పని చేయడానికి వెళ్తారు.

మన దగ్గరకు ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తారు కదా…? ఆ విధంగా అన్నట్టు. ఏదైనా పొరపాటు జరిగితే అంతే సంగతులు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పుట్టి పెరిగితే అక్కడ పని చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఇక అక్కడ వాళ్ళను చూస్తే మనకు క్రాకర్స్ కాల్చే సంతోషంగా కూడా ఉండదు. అంత దుర్భరమైన జీవితాలు అనుభవిస్తారు.


No comments:

Post a Comment