Tuesday, December 21, 2021

తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య..!

తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య..!

బంగారు తెలంగాణలో మరో రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. పండిన పంట చేతికందక.. అప్పులు తీర్చలేక మానసిక క్షోభ అనుభవించి తనువు చాలించాడు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన యాదయ్య అనే రైతుకు కొంత సొంత భూమి ఉంది. దాంతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. కానీ.. అకాల వర్షాలు అతడిని నిండా ముంచేశాయి.


వ్యవసాయం చేసేందుకు యాదయ్య రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు. వర్షానికి పంటంతా దెబ్బ తినడంతో.. కౌలు డబ్బులు చెల్లించలేక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్థాపంతో పురుగుల మందు తాగాడు యాదయ్య. ఇతనికి భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు.

No comments:

Post a Comment