Sunday, December 12, 2021

నువ్వు లేవు..నీ జ్ఞాపకాలున్నాయ్.. మేరా ఫౌజీ అమర్ రహే

నువ్వు లేవు..నీ జ్ఞాపకాలున్నాయ్.. మేరా ఫౌజీ అమర్ రహే

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పారా కమాండో లాన్స్ నాయక్ వివేక్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ప్రభుత్వ మరియు సైనిక లాంఛనాలతో చివరి వీడ్కోలు పలికారు. అతని తమ్ముడు సుమిత్ కుమార్ చితికి నిప్పంటించాడు.


వివేక్ కుమార్ భార్య ప్రియాంక పెళ్లి కూతురులా ముస్తాబై తన భర్తకు చివరి వీడ్కోలు పలికింది. నా సైనికుడా చిరకాలం జీవించు.. నీవు నా నుండి దూరమైనా నీ జ్ఞాపకాలు నా గుండెల్లో ఉంటాయని కన్నీరు పెట్టుకుంది. శ్మశానవాటిక వద్ద “మేరా ఫౌజీ అమేర్ రహే” అని మూడుసార్లు నినాదం చేసింది. దీంతో అక్కడ ఉన్న వారందరూ కంట నీరు పెట్టుకున్నారు.

No comments:

Post a Comment