Wednesday, December 8, 2021

కెప్టెన్ వరుణ్ సింగ్.. సాహసానికి మారుపేరు

కెప్టెన్ వరుణ్ సింగ్.. సాహసానికి మారుపేరు

తమిళనాడులోని జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటణలో త్రిదళాధిపతి బిపిన్ రావత్ సహా మొత్తం 13 మంది మరణించారు. అయితే, కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన తీవ్రగాయాలతో వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది.

ప్రమాదాలు తలెత్తినపుడు ఆయన సాహసోపేతంగా ఉండేవారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 2020లో ఏరియల్ ఎమర్జెన్సీ తలెత్తినప్పుడు చాలా సమయస్పూర్తిగా వ్యవహరించి ఎల్‌సీఏ తేజాస్ యుద్ధ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ‘శౌర్య చక్ర’ పురస్కారాన్ని వరుణ్ సింగ్ కు అందించింది.

No comments:

Post a Comment