Monday, December 13, 2021

జేమ్స్‌ స్ట్రీట్‌ రైల్వే స్టేషన్‌కు 147 ఏండ్లు

జేమ్స్‌ స్ట్రీట్‌ రైల్వే స్టేషన్‌కు 147 ఏండ్లు

  • శిథిలమవుతున్న చరిత్ర ఆనవాళ్లు
  • పునరుద్ధరించాలని వేడుకోలు

దాదాపు 147 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్‌లో ఇప్పటికీ అప్పటి కట్టడాల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా పాత ప్రవేశ ద్వారం ఒకటి. దాన్ని ఆధునీకరించి కాఫీ షాపుగా చేయాలని వారసత్వ ప్రియులు కోరుతున్నారు. అప్పటి టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ సగం శిథిలమై ఇప్పటికీ కనిపిస్తుంది. 1951లో నిజాం స్టేట్‌ గ్యారెంటీడ్‌ రైల్వే (ఎన్‌ఎస్‌జీఆర్‌)ను సెంట్రల్‌ రైల్వేలో విలీనం చేశారు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర ఉన్న జేమ్స్‌ స్ట్రీట్‌ రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించాలి.. భావితరాలకు పదిలంగా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.. అని హైదరాబాద్‌ హెరిటేజ్‌ ప్రియులు కోరుతున్నారు.

No comments:

Post a Comment