Sunday, December 12, 2021

ఇదేనా సెక్యులరిజం?

ఇదేనా సెక్యులరిజం?

హిందుత్వంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్ అయ్యారు ఎంఐఎం అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఒవైసీ. ఈ దేశం కేవలం హిందువులదే కాదని.. భారతీయులందరిద‌ని చెప్పారు.

రాజ‌స్థాన్ జైపూర్ లో కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ఈ దేశం హిందుత్వవాదులది కాదు హిందువులద‌ని అన్నారు. ప్ర‌స్తుతం దేశం హిందుత్వవాదుల చేతుల్లో ఉంద‌ని.. వారిని దించేసి మళ్లీ హిందువుకు అధికారం క‌ట్ట‌బెట్టాల‌ని చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు అస‌ద్‌.

హిందుత్వవాదం బలోపేతానికి ఎరువులేసి పెంచిన రాహుల్ గాంధీ…. ఇప్పుడు మెజారిటీవాదంతో పంట పండించాలని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు అస‌ద్‌. ఇప్పుడు హిందువును అధికారంలోకి తీసుకురావడమనేది సెక్యులరిజం అన్న ఎజెండాగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారా.. వహ్‌వా అంటూ పోస్ట్ చేశారు. భారత్ కేవలం ఒక్క హిందువులది మాత్రమే కాదన్న ఆయ‌న‌.. ఈ దేశం భార‌తీయులంద‌రిద‌ని చెప్పుకొచ్చారు

No comments:

Post a Comment