Saturday, December 18, 2021

ట్రాన్స్ జెండర్స్ తో ప్రీ క్రిస్మస్ వేడుకలు

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ మౌంట్ ఫోర్ట్ (MSI) లో ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరిగాయి.* ఈ వేడుకలు మౌంట్ ఫోర్ట్ డైరెక్టర్ బ్రదర్ వర్గీస్ గారి ఆధ్వర్యంలో గ్రేటర్గ హైదరాబాద్ లో ఉంటున్న ట్రాన్స్ జెండర్స్ ను అందరిని ఆహ్వానించి నిర్వహించడం అభినందనీయం. ఈ వేడుకలలో POW జాతీయ కన్వీనర్ సంధ్య, మానవహక్కుల వేదిక ఉభయ తెలుగు రాష్ట్రాల సలహాదారులు జీవన్ కుమార్ గారు,బాపట్ల కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.వక్తలు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ లకు సమాజం ఎలా చూస్తుంది వాటి పరిణామాలకు ఎవరు బాద్యులు అసలు సమాజం ఎందుకు వ్యతిరేకిస్తోంది దీనికి పరిష్కారమార్గాలు ఎలా ఉండాలి అని వారికి తెలియచేయడం జరిగింది. ప్రజా సంకల్పం చెప్పేది ఒక్కటే ట్రాన్స్ జెండర్స్ ను అందరు గౌరవించాలి.వారిని సమాజం చిన్న చూపు ఎందుకు చూస్తుంది ఆలా చూడకుండా ఉండాలి అంటే వారు కూడా ప్రజలను దౌర్జన్యంగా డబ్బులు అడగడం లేకుంటే భౌతిక దాడులకు పాల్పడడం మంచిది కాదు అని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ వేడుకలో మోటివేషనల్ స్పీకర్ సుభాషిణి క్రిస్మస్ విశేషాలను వివరించారు.

https://twitter.com/Praja_Snklpm/status/1472202462299705344?t=I_RuwJW6bVHAYGJG7ZJqDA&s=08
https://www.instagram.com/p/CXoHMi0PNtA/?utm_medium=share_sheet

No comments:

Post a Comment