Wednesday, December 8, 2021

లాన్స్‌నాయక్‌ సాయితేజ: హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తెలుగు సైనికుడు

లాన్స్‌నాయక్‌ సాయితేజ: హెలీకాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తెలుగు సైనికుడు

Courtesy by BBC తెలుగు మీడియా ట్విట్టర్ 

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్ బిపిన్‌ రావత్‌ చనిపోయారు.

బిపిన్‌ రావత్‌ భార్య మధులికతో పాటు మరో 11 మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది.

ఆ 11 మందిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయితేజ కూడా ఉన్నారు.

సాయితేజది చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం.

రక్షణ శాఖలో సాయితేజ లాన్స్‌నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

సీడీఎస్ బిపిన్‌ రావత్‌‌ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో సాయితేజ ఒకరు.

సాయితేజ్

ఫొటో సోర్స్,UGC

ఫొటో క్యాప్షన్,

సాయితేజ కుటుంబం

2013లో ఆర్మీలో జాయిన్ అయ్యారు సాయితేజ.

సాయితేజ సోదరుడు కూడా ఆర్మీలోనే ఉన్నారు.

సాయితేజ్‌కు భార్య శ్యామల (26), కుమారుడు మోక్షజ్ఞ (5) కుమార్తె దర్శిని (2) ఉన్నారు.

లాన్స్‌ నాయక్‌ సాయితేజ మృతిపై ఏపీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

No comments:

Post a Comment