Wednesday, December 8, 2021

శుక్రవారం బిపిన్ దంపతుల అంత్యక్రియలు

శుక్రవారం బిపిన్ దంపతుల అంత్యక్రియలు

చాపర్ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక అంత్యక్రియలు శుక్రవారం జరుగనున్నాయి. గురువారం సాయంత్రం ఆర్మీ విమానంలో పార్థివదేహాలను ఢిల్లీకి తరలిస్తారు అధికారులు.


శుక్రవారం ఢిల్లీలోని రావత్ నివాసంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నివాళులర్పించేందుకు ప్రముఖులు, ప్రజలకు అనుమతినిస్తారు. అనంతరం కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ స్మశానవాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు

No comments:

Post a Comment