Sunday, July 4, 2021

*టీ, బిస్కెట్లకు రూ. 8 కొట్లా....? సు పరిపాలన వేదిక*

హైదరాబాద్ : 04/07/2021

*టీ, బిస్కెట్లకు  రూ. 8 కొట్లా....? సు పరిపాలన  వేదిక*

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రొటోకాల్‌ శాఖలో నిధుల దుర్వినియోగం జరిగిందని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి శనివారం గవర్నర్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ప్రముఖుల అధికార లేదా అనధికార పర్యటనల సందర్భంగా బస, భోజనం, రవాణా వంటి వ్యవహారాలను పర్యవేక్షించే ఈ శాఖ.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఫిర్యాదు చేశారు. బడ్జెట్‌ పద్దు 132 కింద ఇతర ఖర్చుల పేరిట సమావేశాల్లో టీ, బిస్కెట్ల కోసం ఏడాది కాలంలో రూ.8 కోట్లు ఖర్చు చేసినట్లు ఉందన్నారు. అంటే రోజుకు సుమారు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చూపెట్టారని పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ డైరెక్టర్‌కు ప్రభుత్వ వాహనాలున్నా ప్రముఖులు వచ్చినప్పుడు ఖరీదైన వాహనాలను అద్దె తీసుకున్నట్లు చూపుతున్నారన్నారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి కార్ల అద్దె కోసం బడ్జెట్‌ పద్దు 134 కింద రూ.8.9 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ రెండు పద్దుల్లో దుర్వినియోగం జరిగినట్లు అనుమానాలున్నాయని, విజిలెన్స్‌ లేదా ఏసీబీతో విచారణ జరిపించేలా ఆదేశించాలని లేఖలో కోరారు.

*link Media ప్రజల పక్షం🖋️*

prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment