Friday, July 30, 2021

ఈ ఇంకుడు గుంతకు నేటితో 23ఏళ్లు...

హైదరాబాద్ : 01/07/2021
ఈ ఇంకుడు గుంతకు నేటితో 23ఏళ్లు...
హైదరాబాద్: భూగర్భ జలాల పెంపునకు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇంకుడు గుంతకు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయని ఇంకుడుగుంతల సృష్టికర్త భోలక్‌పూర్‌ డివిజన్‌ పద్మశాలీకాలనీకి చెందిన బీహెచ్‌ఈఎల్‌ రిటైర్డ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.ఆంజనేయులు తెలిపారు. పద్మశాలీకాలనీలో 1998 జూలై 31న ఇంకుడుగుంతను మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డి ప్రారంభించారని తెలిపారు. నేడు తమ కాలనీలోని 500 కుటుంబాలలోని ప్రతి ఇంటి వద్ద ఇంకుడుగుంతలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. దీంతో తమ ప్రాంతంలో నీటి సమస్య తలెత్తలేదని, కేవలం 80 అడుగులలోపు బోర్లు వేస్తే నీరు వస్తుందని ఆంజనేయులు వివరించారు
Q న్యూస్ మీడియా సౌజన్యంతో 

No comments:

Post a Comment