Friday, February 4, 2022

బీజేపీ మాజీ ఎంపీ జగ్గారెడ్డి కన్నుమూత.......!

*బీజేపీ మాజీ ఎంపీ జగ్గారెడ్డి కన్నుమూత.......!*

హనుమకొండ: బీజేపీ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు.శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంలో ఆయనకు ఇబ్బందికలగడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.

జంగారెడ్డి పార్థివదేహానికి హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు పార్టీ కార్యకర్తలు నాయకులు నివాళులర్పిస్తారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చందుపట్ల జంగారెడ్డి మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.ఆయన స్వస్థలం హన్మకొండ. చందుపట్ల జంగారెడ్డి ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, హనుమకొండ ఎంపీగా గెలుపొదారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును ఓడించిన ఘనత జంగారెడ్డిది. 1984లో దేశ వ్యాప్తంగా బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉంటే అందులో ఒకరు జంగారెడ్డి. జంగారెడ్డి మృతిపట్ల బీజేపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

*link Media ప్రజల పక్షం🖋️* 

No comments:

Post a Comment