Wednesday, February 9, 2022

ప్రధాని మోడీ పై టిఆర్ఎస్ పార్టీ ఎంపీల.... ప్రివిలేజ్ మోషన్.....!

*ప్రధాని మోడీ పై  టిఆర్ఎస్ పార్టీ ఎంపీల.... ప్రివిలేజ్ మోషన్.....!*

ఢిల్లీ : ప్రధాని మోదీపై టీఆర్ఎస్‌ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు అంశంలో ప్రధాని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.రాజ్యసభ సెక్రటరీకి టీఆర్ఎస్‌ ఎంపీలు నోటీసులు అందజేశారు. తెలంగాణని ప్రధాని మోదీ అవమానించారని టీఆర్‌ఎస్‌ ఎంపీలు పేర్కొన్నారు. మొన్న పార్లమెంటులో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాలపై చేసిన వ్యాఖ్యలపై అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు రెండూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి.

కాగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అత్యంత సిగ్గుచేటైన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. పార్లమెంటులో మైకులు బంద్‌ చేసి, పెప్పర్‌ స్ర్పేలు కొట్టి విభజన బిల్లును ఆమోదించారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము వ్యతిరేకించలేదని, కానీ.. ఏర్పాటు చేసే పద్ధతి అదేనా? అంటూ మోదీ నిలదీసిన విషయం తెలిసిందే.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment