Sunday, February 13, 2022

దమ్ముంటే నన్ను జైల్లో వేయండి..... సీయం కేసీఆర్!!

*దమ్ముంటే నన్ను జైల్లో వేయండి..... సీయం కేసీఆర్!*

హైదరాబాద్: దమ్ము ఉంటే తనను జైల్లో వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‎కు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. బండిసంజయ్‌నే జైల్లో వేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.జైలు అంటే దొంగలు భయమని.. తమకేం భయలేదన్నారు. మోడీ సర్కార్‌లో 33 మంది బ్యాంక్‌లను మోసం చేసి విదేశాల్లో తలదాచుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మోదీ ఆధ్వర్యంలో దేశం సాదించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఇందులో సగం కంటే ఎక్కువ మంది మోదీకి స్నేహితులేనని, గుజరాతిలేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ మాస్ట్ గో ఫ్రమ్ ది కంట్రీ నినాదం ఇప్పుడు అవసరమన్నారు. ''కనీస సంస్కారం లేని పార్టీ బీజేపీ. ప్రధాని మోదీ. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీకి ప్రజల్లో నమ్మకం ఉండేది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, రాష్ట్రాల్లో గెలవకపోయిన అధికారం చేలాయిస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ చేసిన రాజకీయాలపై చర్చ పెడదాం.'' అని సీఎం కేసీఆర్ అన్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment