Friday, February 4, 2022

జడ్, కేటగిరి భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ....!

*జడ్, కేటగిరి  భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ....!*

న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనకు కేటాయించిన 'జడ్' కేటగిరీ భద్రతను తిరస్కరించారు.ఉత్తరప్రదేశ్‌లో అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆయనకు 'జడ్' కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. జడ్‌ కేటగిరీ కింద 22 మంది భద్రతా సిబ్బందితోపాటు ఒక ఎస్కార్ట్‌ వాహనాన్ని కేటాయించనుంది. వీరిలో నలుగురు నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉంటారు. అయితే కేంద్ర నిర్ణయాన్ని అసదుద్దీన్‌ తిరస్కరించారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ లోక్‌సభలో తనపై జరిగిన దాడి అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన జెడ్‌ కేటగిరి భద్రతను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. నేను చావుకు భయపడే వాడిని కాను. నాకు ప్రజలే రక్షకులు. నాపై దాడి చేసిన వారిపై ఉపా యాక్ట్‌ వర్తింపజేయాలి' అని అసదుద్దీన్‌ ఓవైసీ కోరారుఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై గురువారం ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్‌-ఘజియాబాద్‌ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.

*link Media ప్రజల పక్షం🖋️* 

No comments:

Post a Comment