Wednesday, February 2, 2022

ప్రత్యక్ష తరగతుల తో పాటు ఆన్ లైన్ భోధన కొనసాగించాలి.... టి. హైకోర్ట్*

*ప్రత్యక్ష తరగతుల తో పాటు ఆన్ లైన్ భోధన కొనసాగించాలి.... టి. హైకోర్ట్*

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని పేర్కొంది. సమ్మక్క జాతరలో కొవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని స్పష్టం చేసింది. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి హైకోర్టు తెలిపింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. ఈ అంశాలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం కరోనా పరిస్థితులపై విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది

*link Media ప్రజల పక్షం🖋️*

prajasankalpam1.blogspot.com 

No comments:

Post a Comment