Wednesday, March 23, 2022

అలా చేస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతాం

అలా చేస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతాం

Courtesy by : తొలివెలుగు మీడియా website

మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయడంపై బీజేపీని ఢిల్లీ ముఖ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తీవ్రంగా విమర్శించారు.

aravind kejriwal

మున్సిపల్ ఎన్నికలను సమయానికి నిర్వహించి అందులో గెలిచి చూపించాలని బీజేపీకి ఆయన సవాల్ విసిరారు. అలా చేస్తే రాజకీయాల నుంచి తమ పార్టీ తప్పుకుంటుందని అన్నారు.
ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనానికి సంబంధించిన బిల్లుకు కేంద్రం మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలను బీజేపీ సమయానికి నిర్వహించి, అందులో బీజేపీ గెలిచి సత్తా చూపిస్తే రాజకీయాల నుంచి మా పార్టీ తప్పుకుంటుంది’ అని ప్రకటించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ తనకు తాను గొప్పలు చెప్పుకుంటోందని, కానీ ఇప్పుడు ఒక చిన్న పార్టీకి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు.

ఎన్నికలను వాయిదావేయడం అంటే బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి త్యాగం చేసిన అమరవీరులను అవమానించడమే’ అని ట్వీట్ చేశారు

No comments:

Post a Comment