Sunday, March 27, 2022

పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ … తండ్రి కూతురు మృతి

పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ … తండ్రి కూతురు మృతి

Courtesy by : తొలివెలుగు మీడియా website

తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వేలూరు జిల్లా అల్లాపురంలో ఎలక్ట్రిక్ స్కూటర్ పెలింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు మరణించారు.

మృతులను దురై వర్మ(49), మోహనా ప్రీతిలుగా పోలీసులు గుర్తించారు. దురై వర్మ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మోహనా ప్రీతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.

ఘటన వివరాల్లోకి వెళితే… తిరువణ్ణ మలైలో రెండు రోజుల క్రితం ఎలక్ట్రిక్ స్కూటర్ ను దురై వర్మ కొనుగోలు చేశారు. శుక్రవారం సాయంత్రం స్కూటర్ లో బ్యాటరీ డౌన్ అయింది.దీంతో స్కూటర్ కు దురై మళ్లీ చార్జింగ్ పెట్టారు. కొద్ది సేపటి తర్వాత ఛార్జింగ్ అయిందో లేదా చూద్దామని స్కూటర్ దగ్గరు తండ్రీ కూతురు వచ్చారు. ఇంతలో అకస్మాత్ముగా స్కూటర్ పేలిపోయింది.దీంతో సమీపంలో ఉన్న మరో రెండు బైకులకు నిప్పు అంటుకుంది. బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వారిద్దరూ బాత్ రూంలో దాక్కుకున్నారు.కానీ పెద్ద ఎత్తున పొగలు ఇళ్లంతా వ్యాపించాయి. దీంతో వారిద్దరూ ఊపిరాడక మరణించారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment