Friday, March 25, 2022

తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు......డీజీపీ

*తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు......డీజీపీ*

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటుచేస్తున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సొసైటీ ద్వారా పోలీసు కుటుంబాలకు అవసరమైన సహాయం చేస్తామని అన్నారు.
పోలీసుల సంక్షేమం కోసమే వెల్ఫేర్‌ సొసైటీని ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. పోలీసుల్లో కొవిడ్‌ మృతుల కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. కాగా తెలంగాణలో సీసీ టీవీల నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తున్నట్టుకూడా డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment