Sunday, March 6, 2022

దొర రాజ్యంలో మరో న్యాయవాదిపై దాడి

దొర రాజ్యంలో మరో న్యాయవాదిపై దాడి


Courtesy by : తొలివెలుగు మీడియా website 

టీఆర్ఎస్ పాలనలో న్యాయవాదులకు సైతం రక్షణ లేకుండా పోయింది. వామనరావు దంపతులను నడిరోడ్డుపై హత్య చేసి చంపేసి ఏడాది అయినా ఇంకా ఆనాటి ఘటన కళ్లముందే మెదులుతుండగా.. ఈమధ్యే లేడీ లాయర్ పై కోర్టులోనే దాడి జరిగింది. తాజాగా మరో న్యాయవాదిపై దాడికి పాల్పడ్డారు టీఆర్ఎస్ నాయకులు.

వివరాల్లోకి వెళ్తే… రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రోడ్డు వెడల్పులో భాగం కొందరు ఇళ్లు కోల్పోయారు. అయితే.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన మహిళా బంధు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు అక్కడకు వెళ్లి ఎమ్మెల్యేను నిలదీశాయి.
తమ ఎమ్మెల్యేనే నిలదీస్తారా? అంటూ టీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయారు. బాధితులతోపాటు వచ్చిన న్యాయవాది మహేష్ పై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ముందే అతని ఫోన్ లాక్కొని దాడి చేశారు. మంచిరెడ్డి సైతం బాధిత మహిళలను దుర్భాషలాడారు.
ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు లాయర్ మహేష్. ఇటు ఎమ్మెల్యే, అతని అనుచరుల దౌర్జన్యంపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment