Sunday, March 13, 2022

టచ్ చేసి...... చూడు!

*టచ్ చేసి...... చూడు!*

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ ఏరియాకు నీళ్లు, కరెంటు కట్‌ చేస్తామంటూ అసెంబ్లీలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు.భారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించడం అత్యంత దుర్మార్గమని, ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యేనని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో పార్టీ నాయకులు రాజాసింగ్, డి.ప్రదీప్‌కుమార్‌ తదితరులతో కలిసి 'కశ్మీర్‌ ఫైల్స్‌'సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుtuభారత సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించడం అత్యంత దుర్మార్గమని, ఇది ముమ్మాటికీ దేశద్రోహ చర్యేనని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో పార్టీ నాయకులు రాజాసింగ్, డి.ప్రదీప్‌కుమార్‌ తదితరులతో కలిసి 'కశ్మీర్‌ ఫైల్స్‌'సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ
*ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి....*
పాతబస్తీలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన కరెంట్‌ బిల్లులను వసూలు చేయడం చేతగాని దద్దమ్మ.. కంటోన్మెంట్‌కు కరెంటు, నీళ్లు కట్‌ చేస్తామని చెప్పడం సిగ్గు చేటు. దేశాన్ని విచ్ఛి న్నం చేసేలా మాట్లాడుతున్న కేసీఆర్‌ కుటుం బం ముమ్మాటికీ దేశద్రోహులే. కంటోన్మెం ట్‌లో కరెంట్‌ కట్‌ చేస్తారా? అసలు కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటి? కంటోన్మెంట్‌లో భూములు కబ్జాలు చేయాలి.

ఫాంహౌస్‌లు కట్టుకోవాలి. పన్నులు పెంచాలి. నిధులు మళ్లించాలి. పేద ప్రజల రక్తం తాగాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లున్నరు. కంటోన్మెంట్‌ లో సైనికులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా నివాసం ఉంటారనే సోయి మర్చిపోయిండు. దేశంలో అన్ని ఉగ్రవాద సంస్థలకు నంబర్‌ వన్‌ టార్గెట్‌గా ఉన్న ప్రాంతమది. అక్కడే కరెంటు, నీళ్లు కట్‌ చేస్తరా? 'అని సంజయ్‌ ప్రశ్నించారు.

ఇలాగే దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ కుటుంబాన్ని ఉరికించి కొట్టడం ఖాయమని, వారు వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పా లని ఆయన డిమాండ్‌ చేశారు. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన వాస్తవ విషయాలను 'కశ్మీర్‌ ఫైల్స్‌'లో కళ్లకు కట్టినట్లు చూపించిన నిర్మాతలను అభినందిస్తున్నామని అన్నారు.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment