Wednesday, March 2, 2022

సీపీ గారూ.. జనం నవ్వుతున్నారు

సీపీ గారూ.. జనం నవ్వుతున్నారు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందన్న సీపీ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి స్పందించారు. ఈ ఫాల్స్ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

సైబరాబాద్ సీపీ ప్రెస్ మీట్ చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు జితేందర్ రెడ్డి. సామాజిక బాధ్యతగా ఆర్టీఐ ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుల్ని బయట పెట్టిన యువకులపైనే హత్య కు కుట్ర అంటూ కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్నారు.

ఇదంతా రాజకీయ కుట్రతో పెట్టిన కేసని.. కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు చట్టాన్ని కాపాడుతారా? లేక టీఆర్ఎస్ పార్టీ చేసే అరాచకాలకు వంత పాడుతారా? అంటూ ప్రశ్నించారు.

ఏకంగా తన హత్యకు కుట్ర అని మంత్రి కేసు పెట్టించడం దారుణమన్నారు జితేందర్ రెడ్డి. ఇంత క్షుద్ర రాజకీయాలకు దిగజారుతారని తాను ఊహించలేదని.. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.

No comments:

Post a Comment