Friday, March 25, 2022

రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ పై కేసు నమోదు చేసిన..... ఏసీబి

*రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ పై కేసు నమోదు చేసిన..... ఏసీబి*

రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ అర్షద్ అలీ పై అవినీతి నిరోధక శాఖ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.అర్షద్ అలీ కోటీ 87 లక్షల అక్రమ ఆస్తులు కలిగి వున్నారని అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. అధికారులు చేసిన తనిఖీల్లో లక్ష రూపాయల నగదు, కోటీ 28 లక్షల విలువైన స్థిరాస్తులు, 328 గ్రాముల బంగారం, 24 లక్షల విలువైన రెండు కార్లు, 5 లక్షల విలువైన రెండు బైక్‌లు, బ్యాంకులో 21 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవలే అర్షద్ అలీ లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment