Monday, March 28, 2022

దారుణ ఘటన.. బీజేపీకి సపోర్టు చేయడమే శాపమైంది..!

కుషీనగర్‌లోని రామ్​కోలా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కథ్ఘార్హీ గ్రామంలో బాబర్ అనే ముస్లిం యువకుడు మోదీకి వీరాభిమాని. ఈ క్రమంలో యూపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశాడు. ఇక ఈ ఎన్నికల్లో రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాబర్ సంతోషంగా స్వీట్లు పంచాడు.అయితే, ఇది చూసి సహించలేని ఇరుగు పొరుగు వారు బాబర్‌ను మార్చి 20న చుట్టుముట్టి చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన అతడిని కుటుంబసభ్యులు రామ్​కోలా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమించడం వల్ల లఖ్నోలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ బాబర్ చనిపోయాడు.

కాగా, బీజేపీకి సపోర్ట్ చేయవద్దని బాబర్‌ను పలుమార్లు అదే సామాజికవర్గానికి చెందిన వారు హెచ్చరించారు. చంపుతామని బెదిరించారు. అయితే ఈ బెదిరింపులపై గతంలో బాబార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని బాబర్ సోదరుడు అలాం అన్నారు. కలెక్టర్​ను కూడా కలిసిననట్లు పేర్కొన్నారు. బాబర్.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పీఎన్ పాఠక్​ కోసం ప్రచారం చేసినట్లు వివరించారు.

బాబర్ మరణ వార్త తెలిసిన అనంతరం పాఠక్​ అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.


No comments:

Post a Comment