Sunday, March 13, 2022

15 నుండి ఒక్క‌పూట బ‌డి..!

15 నుండి ఒక్క‌పూట బ‌డి..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

ఎండాకాలం రానే వ‌చ్చేసింది. ఎప్పుడు పాఠ‌శాల‌లకు సెల‌వులు ప్ర‌క‌టిస్తారా అని చిన్న పిల్ల‌లు ఎదురు చూస్తూ రోజులు లెక్క‌పెట్టుకుంటారు. స్కూల్స్ మూసేసే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో విద్యార్ధుల్లో ఆనందం హ‌ద్దులు దాటుతోంది.

ఈ నేప‌థ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులుంటాయి. కొన్ని ఉపాధ్యాయ సంఘాల వినతి నేపథ్యంలో గతంలో మాదిరిగానే ఒంటిపూట బడులు నడపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ క్రమంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ప్రతిపాదనలు పంపారు.

పదో తరగతి పరీక్షలు మే 20వ తేదీ వరకు జరగనున్నందున ఈ విద్యా సంవత్సరానికి అదే చివరి పనిదినం కానుంది. క‌రోనా నేప‌థ్యంలో పాఠ‌శాల‌లు లేట్ గా ప్రారంభం అయిన‌ప్ప‌టికీ.. స‌మానుకూలంగా విద్యార్ధుల‌కు సిల‌బ‌స్ పూర్తి చేసిన‌ట్టు స‌బితాఇంద్రారెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment