Wednesday, March 2, 2022

పక్కా.. రాజకీయ కక్ష ఇది

పక్కా.. రాజకీయ కక్ష ఇది

Courtesy by : తొలివెలుగు మీడియా website 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర పన్నారంటూ సైబరాబాద్ పోలీసులు మహబూబ్ నగర్ యువకులపై ఫాల్స్ కేసు పెట్టారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈ కేసు వెనుక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు ఆఫిడవిట్ సమర్పించారని కొందరు వ్యక్తులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారని చెప్పారు డీకే అరుణ. మహబూబ్ నగర్ లో మంత్రి అవినీతి, కబ్జాలపై వారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అది తట్టుకోలేని వాళ్లపై కక్షగట్టి వారం కిందట మంత్రే కిడ్నాప్ చేయించారని ఆరోపించారు.
బాధితుల భార్యా, పిల్లలు తన దగ్గరకు వస్తే ఈ కిడ్నాప్ వ్యవహారంపై మాట్లాడానని చెప్పారు డీకే అరుణ. ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో పెట్టిన కేసని… మహబూబ్ నగర్ లో అరాచకం చేస్తున్న మంత్రి తనపై సానుభూతి తెచ్చుకునేందుకు హత్యకు కుట్ర అని కేసు పెట్టించుకున్నారని విమర్శించారు.
పట్టణ ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసన్న డీకే అరుణ.. సైబరాబాద్ సీపీ ప్రెస్ మీట్ చూసి అందరూ నవ్వుకుంటున్నారని అన్నారు. అవకాశం ఉన్న అన్ని విచారణ సంస్థలు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment