Tuesday, October 25, 2022

బంజారా హిల్స్ ఘటన తీవ్రంగా కలిచివేసింది.... చిరంజీవి

*బంజారా హిల్స్ ఘటన తీవ్రంగా కలిచివేసింది.... చిరంజీవి*

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో ఎల్‌కేజీ చదివే చిన్నారి(4)పై ఇటీవల జరిగిన అఘాయిత్యం ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి తెలిపారు.ఈమేరకు మంగళవారం ఆయన ట్విటర్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.''ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠిన శిక్షలు విధించడమే సరైన చర్య. శిక్షలు వేగవంతంగా విధించడంతో పాటు అన్ని విద్యాసంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యతగా భావిస్తున్నా'' అని చిరంజీవి ట్విటర్‌లో పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment