Sunday, October 9, 2022

ఎవరెస్టు పై తెలుగు దేశం జెండా ఎగరవేసిన 80ఏళ్ల శివప్రసాద్....!

*ఎవరెస్టు పై తెలుగు దేశం జెండా ఎగరవేసిన 80ఏళ్ల శివప్రసాద్....!*

అమరావతి: దార్శనికుడు, రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించగలిగే నాయకుడైన చంద్రబాబును మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ గద్దెపై కూర్చోబెట్టాలని ఎవరెస్ట్‌ శిఖరాన్ని 5 వేల మీటర్ల వరకు అధిరోహించిన 80 ఏళ్ల వృద్ధుడు గింజుపల్లి శివప్రసాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఎవరెస్ట్‌పై ఆయన తెదేపా జెండాను ఎగరేశారు. 'యావన్మంది తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా మీ రాష్ట్రాన్ని, దేశాన్ని మరచిపోకండి. ప్రస్తుతం మీ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో, దయనీయ స్థితిలో ఉంది. అందరికీ చెప్పి.. చంద్రబాబును గద్దెపై కూర్చోబెట్టండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది' అని వీడియో సందేశం విడుదల చేశారు. 80 ఏళ్ల వయసులో ఎవరెస్ట్‌పై తెదేపా జెండా ఎగరేసిన శివప్రసాద్‌ను చంద్రబాబు అభినందించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment