Friday, October 14, 2022

ఢిల్లీలో సీయం కేసీఆర్... కాలక్షేపం

*ఢిల్లీలో సీయం కేసీఆర్... కాలక్షేపం*

*జాతీయ పార్టీ ప్రకటన తర్వాత*

*తొలిసారి దేశ రాజధానికి కానరాని హడావుడి..*

*కలవని ఇతర పార్టీల నాయకులు*

*పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనుల పరిశీలనతోనే సరి*
న్యూఢిల్లీ, : ''భారతదేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయడానికే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నా.. బీఆర్‌ఎ్‌సతో కలిసి ముందుకు సాగేందుకు దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముందుకువస్తున్నారు''..విజయదశమినాడు జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలివి! ఆ ప్రకటన తర్వాత తొలిసారి బుధవారం ఆయన ఢిల్లీకి వచ్చారు. కానీ 2 రోజులుగా ఆయన ఇక్కడ తన అధికారిక నివాసానికే పరిమితమయ్యారు!

ఈ 2 రోజుల్లో ఏ రాజకీయ పక్షానికి చెందిన నేతా ఆయన్ను కలవడానికి రాలేదు. ఢిల్లీలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించిన కేసీఆర్‌.. గురువారం ఆ పనులపై సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ డిజైన్ల మ్యాపును అధ్యయనం చేసి, వాస్తు ప్రకారం పలు మార్పు చేర్పులను సూచించినట్లు తెలిసింది.

అలాగే.. టీఆర్‌ఎస్‌ ఎంపీ సురేశ్‌ రెడ్డి గురువారం ఆయన్ను కలుసుకున్నారు. ఇంతకు మించి ఏ హడావుడీ కనిపించట్లేదు. ఎలాంటి రాజకీయ సందడీ లేదు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment