Friday, October 14, 2022

ఓయు విద్యార్థుల పిటిషన్ పై.... హైకోర్టులో విచారణ

*ఓయు విద్యార్థుల పిటిషన్ పై.... హైకోర్టులో విచారణ*

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టళ్లలో విద్యుత్, మంచినీటి సరఫరా వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. పునరుద్ధరించకపోతే రేపు వర్సిటీ రిజిస్ట్రార్ హైకోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపింది.
ఓయూ హాస్టల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ''దసరా సెలవుల కోసం విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లి వచ్చేలోగా హాస్టళ్లలో విద్యుత్, మంచినీటి సరఫరా, మెస్ సుదపాయాన్ని నిలిపివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సెలవులను ఈనెల 26వ తేదీ వరకు పొడిగించారు. గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు హాస్టల్‌ వసతి లేకపోతే ఈనెల 27 నుంచి జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం కాలేరు'' అని విద్యార్థుల తరఫున న్యాయవాది సీహెచ్.రవికుమార్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం వర్సిటీ హాస్టళ్లలో వెంటనే విద్యుత్, మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment