Sunday, October 30, 2022

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..... ఇక రాష్ట్రంలోకి సీబీఐ నో ఎంట్రీ.....!

*తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..... ఇక రాష్ట్రంలోకి సీబీఐ నో ఎంట్రీ.....!*

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది.గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 30న జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది.

ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీబీఐ కేసులు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment