Friday, October 14, 2022

టీఆరెఎస్ కు బిగ్ షాక్....బీజేపీ లోకి బూర నర్సయ్య గౌడ్....?

*టీఆరెఎస్ కు బిగ్ షాక్....బీజేపీ లోకి బూర నర్సయ్య గౌడ్....?*

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది… టీఆర్ఎస్‌ కీలకంగా భావిస్తున్న మునుగోడు బైపోల్‌ సమయంలో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు మాజీ ఎంపీ, టీఆర్ఎస్‌ సీనియర్‌ నేత బూర నర్సయ్యగౌడ్..మునుగోడు ఉప ఎన్నికలో నిన్న టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఇవాళ ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు.. భారతీయ జనతా పార్టీలో చేరడానికే ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు.కాగా, 2014 ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన.. 2019ల్లో మరోసారి పోటీ చేసినా.. కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో.. ఆయన పేరు తెరపైకి వచ్చింది.. మునుగోడు టీఆర్ఎస్‌ టికెట్‌ను ఆశించారు బూర నర్సయ్యగౌడ్‌.. కానీ, ఆయనకు నిరాశ తప్పలేదు.. ప్రగతి భవన్‌కు పిలిపుంచుకుని మాట్లాడిన సీఎం కేసీఆర్‌… బీఆర్‌ఎస్‌లో మీ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పినట్టుగా.. ఆ తర్వాత మీడియాకు బూర నర్సయ్య గౌడ్‌ చెప్పిన విషయం తెలిసిందే.. కానీ, ఉన్నట్టుండి.. కారు పార్టీకి షాక్‌ ఇచ్చారు బూర.. ఇక, నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి తరుణ్ చుగ్‌ను భేటీ అయ్యారు బూర నర్సయ్య గౌడ్.. ఢిల్లీ వెళ్లిన ఆయన.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్టు తెలుస్తోంది.. అక్కడే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment