Wednesday, October 12, 2022

ఏటు తేలని హిజాబ్ వివాదం,బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జిలు.

ఏటు తేలని హిజాబ్ వివాదం,బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జిలు.

ఢిల్లీ:హిజాబ్ అంశంపై పరస్పర భిన్న తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు ధర్మాసనం. న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధూలియా వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. కర్నాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా జస్టిస్ సుధాన్షు ధులియా మాత్రం హైకోర్టు తీర్పును తోసిపుచ్చారు. భిన్న అభిప్రాయాలతో కూడిన తీర్పు నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి కేసు బదిలీ చేయాలని జడ్జీలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఫార్సు చేశారు.ఒక న్యాయమూర్తి హిజాబ్ నిషేధాన్ని సమర్థించగా, మరొకరు వ్యతిరేకించారు. తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సమర్థిస్తూ కర్నాటక హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీం ద్విసభ్య ధర్మాసంన దీనిపై ఎటూ తేల్చలేదు.ఇద్దరూ విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. దీంతో విస్తృత ధర్మాసనానికి ఈ కేసు విచారణ వెళ్లనుంది.

Ccourtesy by : Q న్యూస్ మీడియా 

No comments:

Post a Comment