Wednesday, June 30, 2021

పరిశ్రమలు, ఐటీశాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : 01/07/2021

పరిశ్రమలు, ఐటీశాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో 
పరిశ్రమలు, ఐటీశాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతిపాదనలపైన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల వారీగా పరిశ్రమలు, ఐటీశాఖల విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా అండ్‌ లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు తెలిపాయని అధికారులు మంత్రికి వివరించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఆ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిత పెట్టుబడులను వివిధ జిల్లాలకు తరలించేలా ఆయా కంపెనీలను కోరాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇప్పటికే పలువురు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేశారని,  అటువంటి ప్రాంతాలకు ఈ పెట్టుబడులు తరలివెళ్లేలా  ప్రయత్నించాలని వివిధ శాఖల డైరెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు.

No comments:

Post a Comment